-
వరుస సభలు.. ప్రచార హోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ రాజకీయ పార్టీల పోరుగల్లుగా మారింది. నామినేషన్ల ఘట్టం 25న ముగియనుండగా.. అప్పుడే పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతల ప్రచార సభలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన అగ్రనేతలు.. అభ్యర్థుల గెలు పు కోసం సర్వశక్తులొడ్డేందుకు రోడ్షోలు, బహిరంగ సభల షెడ్యూల్లను ప్రకటించారు. ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా ఓవైపు అభ్యర్థులు నిత్యం నియోజకవర్గాల్లో అలుపెరగకుండా తిరుగుతుండగా.. మరోవైపు జోష్ పెంచేందుకు అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల నుంచే మొదలైన ప్రచారం... ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ మరుసటి రోజు నుంచే అగ్రనేతల ప్రచార సభలు మొదలయ్యాయి. 19న మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి వరంగల్లో ఎన్నికల శంఖారావం పూరించారు. బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతల షెడ్యూల్ కూడా మానుకోటలో ఖరారయ్యింది. మే 1న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానుకోటలో రోడ్షో నిర్వహించనున్నారని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ తరఫున కేంద్రమంత్రి అమిత్షా పాల్గొననున్నట్లు వెల్లడించారు. అలాగే వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఎం.సుధీర్కుమార్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు (మంగళవారం) వరంగల్లో పర్యటించనున్నారు. ఆ మరుసటి రోజు, ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరఫున ప్రచారం చేసేందుకు వరంగల్కు రానున్నారు. 28న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్షాలు బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ గెలుపు కోసం రోడ్షో, సభలు నిర్వహించనున్నట్లు పార్టీవర్గాలు ప్రకటించాయి. కాగా 25న నామినేషన్ల పర్వం ముగియనుండగా 29న ఉపసంహరణ అనంతరం గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత సుమారు 14 రోజులు ప్రచారం నిర్వహించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు, బీజేపీ తరఫున పీఎం నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్షా, అశ్విన్ వైష్ణవ్, సీఎం ఆదిత్యనాథ్ యోగి తదితరులు, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, తదితరులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారని ఆయా పార్టీలు ప్రకటించాయి. నేడు వరంగల్కు కేటీఆర్.. షెడ్యూల్ ఇదీ.. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మంగళవారం వరంగల్లో పర్యటించనున్నారు. అలంపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4.30 గంటలకు సుబేదారి పరిధిలోని ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల మైదానానికి చేరుకోనున్న కేటీఆర్.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో హంటర్రోడ్డులోని డి–కన్వెన్షన్కు వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉర్సుగుట్టలోని నాని గార్డెన్స్లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పాల్గొని.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు వెళ్తారు. అగ్రనేతల ఆగమనం.. ఊపందుకున్న ప్రచారం ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలు.. నేడు వరంగల్లో కేటీఆర్ సభ.. రేపు సీఎం రేవంత్ రెడ్డి రాక మరోవైపు బీజేపీ కేంద్రమంత్రులు.. పోటాపోటీగా అగ్రనేతల సభలునామినేషన్ల సందడి దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు మహబూబాబాద్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ దాఖలు.. తొలిసెట్ సమర్పించిన సుధీర్ కుమార్, కడియం కావ్య – వివరాలు 8లోu -
సమస్యలకు సత్వర పరిష్కారం
భూపాలపల్లి: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 36 దరకాస్తులను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలిపిన అక్షయ తల్లితండ్రులు.. చిన్నారి అక్షయకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని కలెక్టర్ భవేష్మిశ్రా హామీ ఇచ్చినందుకు చి న్నారి తల్లితండ్రులు సోమవారం కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.కలెక్టర్ భవేష్మిశ్రా -
విద్యార్థులు లక్ష్యం ఎంచుకోవాలి
మొగుళ్లపల్లి: విద్యార్థులు వేసవి సెలవులను మంచి అవకాశంగా భావించి లక్ష్యం నిర్ణయించుకుని ముందుకు సాగాలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ భద్రయ్య అన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయపాల్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాలుగోరోజు.. 14మంది నామినేషన్ సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్, జనగామ నరేశ్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, దాగం సుధారాణి, జాడి ప్రేమ్సాగర్, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్కుమార్, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జాబ్మేళాకు విశేష స్పందన భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చినట్లు కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్, ప్రిన్సిపాల్ ఎలుగూరి హరికృష్ణ అధ్యక్షతన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో జెన్ ప్యాక్ట్ కంపెనీ, హెచ్ఆర్ శ్యామ్ సన్ మెగా జాబ్ మేళాలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్మేళాకు 153మంది అభ్యర్థులు హాజరు కాగా జెన్ ఫ్యాక్ట్ కంపెనీ హెచ్ఆర్ 46మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా వచ్చిన ఉద్యోగాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు మొగిలి, రాజశేఖర్, నరేష్, ప్రవీణ్, ఆనంద్, ఉదయలక్ష్మి, మమత, రాజు, రంజిత్ పాల్గొన్నారు. పనుల పరిశీలన రేగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకోసం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులను చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ చిట్యాల: మండలకేంద్రానికి చెందిన చింతల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మృతుడి కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు చింతల రమేష్, పువ్వాటి హరికృష్ణ, గురుకుంట్ల కిరణ్, కొడెల రాయమల్లు, ఉప్పుల కిరణ్, కొత్త శ్రీనివాస్, తణుకు మధు ఉన్నారు. -
నీడ మాటున.. నిధులు మాయం
భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలకు నీడ కల్పించేందుకు వెచ్చిస్తున్న ప్రజాధనం షేడ్నెట్ల పాలవుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతూ పనికిరాకుండా పోతున్నాయి. తరచూ కొత్త వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో ప్రభుత్వ నర్సరీలు ఏర్పాటుచేసి సుమారుగా 26లక్షల మొక్కులను పెంచుతున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీల్లో 10వేల నుంచి 20వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. వేసవిలోనూ మొక్కల పెంపకం చేపడుతుండటంతో నీడ అవసరం ఉంటుంది. ఇందుకు షేడ్నెట్ (నీడకోసం పరదా)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి పంచాయతీ నిధులను కేటాయిస్తున్నారు. ప్రతి నర్సరీకి రెండు నుంచి నాలుగు వరకు షేడ్నెట్ల అవసరం ఉంటుంది. ఒక్కో నెట్కు రూ.3వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన రెండు షేడ్ నెట్లకు రూ.6వేలు, నాలుగు నెట్లకు రూ.12వేలు ఖర్చువుతుంది. ఏటా రూ.15 లక్షల నుంచి 20లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. చిరిగిపోతూ.. కొనుగోలు చేస్తున్న షేడ్నెట్లు చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతున్నాయి. ఒక్కసారి చిరిగితే పనికిరాకుండా పోతున్నాయి. గతేడాది కొనుగోలు చేసినవి అప్పుడే పాడైపోయాయి. మొక్కల రక్షణకు మళ్లీ వీటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. ఏటా నిధులు వెచ్చించే బదులు శాశ్వత ప్రాతిపదికన ఒకేసారి నాణ్యమైన నెట్లను గానీ ప్రత్యామ్నాయ పరికరాలను గానీ కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ నర్సరీల నిర్వాహకులు నీడకోసం ఏర్పాటు చేసుకునే విధంగా పంచాయతీల్లో నాణ్యమైనవి ఏర్పాటు చేసుకుంటే ఏటా కొనుగోలు చేసే అవసరం లేకుండా ఖర్చునూ తగ్గించుకోవచ్చంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు. రూ.6వేలతో ఏర్పాటు.. మండలంలోని గొర్లవీడు నర్సరీలో ఏటా 10వేల మొక్కలు పెంచుతున్నారు. ఎండ వేడిమికి మొలకలు, మొక్కలు ఎండిపోతుండటంతో ఇటీవల పంచాయతీ నిధులు రూ.6వేలతో షెడ్నెట్ ఏర్పాటు చేశారు. ఏటా షేడ్నెట్ ఏర్పాటు చేయడంతో రూ.6వేల వరకు ఖర్చవుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతూ అవి పనికి రాకుండా పోతున్నాయి.షేడ్నెట్లకు జిల్లాలో ఏటా రూ.15లక్షలకు పైగా ఖర్చు నిధులు మంజూరుచేయని డీఆర్డీఏ గ్రామ పంచాయతీ నిధుల నుంచే కొనుగోలుపంచాయతీలపై అదనపు భారం.. హరితహారం కార్యక్రమం ప్రారంభం నుంచి 2021 సంవత్సరం వరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మొక్కల విత్తనాలు నాటే కార్యక్రమం ప్రారంభం నుంచి మొక్కలు నాటే వరకు ఉపాధి హమీ పథకంలో చేపట్టేవారు. మూడేళ్ల నుంచి కొంత పరిమితికి మాత్రమే విత్తనాలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. నాటుతున్న విత్తనాలు మొలుకెత్తి సంరక్షించే బాధ్యతలను మరిచారు. వేసవితాపంలో మొక్కలకు రక్షణ కల్పించేందుకు షెడ్నెట్లకు రావాల్సిన నెట్లను పంపిణీ చేయడం లేదు. దీంతో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పంచాయతీ నిధులను వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రతి ఏడాది రూ.10వేల వరకు అదనపు ఖర్చు వస్తుంది. -
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024కాళోజీ సెంటర్: ‘35 ఏళ్ల తర్వాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మహిళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలి’ అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్యకు తన నామినేషన్ సెట్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం కావ్య మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా మహిళా ఓటర్లున్నారని, గతంలో మహిళల సమస్యల పరిష్కారానికి పని చేశానన్నారు. విద్య, ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యమిస్తాన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న సమస్యలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ అప్ గ్రేడ్ లెదర్ పార్క్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎడ్యుకేషన్, ఐటీ హబ్గా అండర్ డ్రెయినేజీ వ్యవస్థను తీర్చిదిద్దడానికి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు వారి మాటలు నమ్మకుండా తన గెలుపు కోసం అందరు సహకరించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావ్య కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య మాట్లాడుతూ.. కులాల పేరుతో మతాల పేరుతో నిరుద్యోగులు, రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ అన్నారు. 120 రోజుల తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిందలు మోపుతూ 10 ఏళ్ల పాలనలో అన్ని రకాలుగా ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. అన్ని రకాల ప్రజలకు మేలు జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీనియర్ నాయకుడు ఈవీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ/కాళోజీ సెంటర్: బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ 50 వేల మెజార్టీతో విజయం సాధిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా హనుమకొండ బాల సముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఏకశిల పార్కు వరకు భారీ ర్యాలీ తీశారు. ఈర్యాలీని ఉద్దేశించి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. తాను సర్వే చేయించానని, రంగంలోకి దిగకముందే 50 వేల మెజార్టీతో గెలస్తున్నామని, ప్రచారం చేపడితే మెజార్టీ మరింత పెరుగుతుందన్నారు. పార్టీ పరంగా లాభం పొంది బయటకు వెళ్లిన నాయకులను తిరిగి చేర్చుకునేది లేదని, ఈవిషయంపై పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్ద మాట తీసుకున్నానన్నారు. తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, వారికి ఎలాంటి ఆధారాలు దొరకడం లేదన్నారు. కడియం శ్రీహరికి తానే రాజకీయ జీవితమిచ్చానన్నారు. రేవంత్రెడ్డి బ్రోకర్ అయితే కడియం శ్రీహరి మోసకారి అని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసి బిడ్డకు టికెట్ ఇప్పించి వంచించిన మోసగాడు కడియం శ్రీహరి అని ధ్వజమెత్తారు. శ్రీహరిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. తాను స్థానికున్నే అని, కడియం కావ్య గుంటూరుకు చెందిన వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు, వినయ్భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలను విస్మరించిందని పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ గల్లంతవుతుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మానుకోట పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి అజ్మీరా సీతారాం నాయక్ను గెలిపించాలని కోరారు. సీతారాం నాయక్ నామినేషన్ సమర్పించిన నేపథ్యంలో సోమవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా ప్రత్యేక హెలికాప్టర్లో మానుకోట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపానికి చేరుకున్నారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సభ నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను మోదీ సర్కార్ పరిష్కరించిందన్నారు. మోదీ అంటే గ్యారంటీ అని, ప్రజలు ఆలోచన చేస్తున్నారని, దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. ఆదివాసీ, గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని, ఉద్యోగం, రాజకీయం ఇతర రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సీతారాంను ఎంపీగా గెలిపిస్తే మానుకోటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో జిల్లా యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశాభివృద్ధి కోసం మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్, మాజీ రాజ్యసభ, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ కడియం కావ్య, చిత్రంలో సాంబయ్య, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న ఎర్రబెల్లి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, వినయ్భాస్కర్, రాజయ్య న్యూస్రీల్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ను గెలిపించాలి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు -
నేడు గోదారి హారతి
కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో (నేడు)మంగళవారం పౌర్ణమి సందర్భంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ ఏ.మారుతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 5.30గంటలకు గోదావరి వద్ద హారతి పూజా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు. నేడు హనుమాన్ జయంతి పూజలు.. హనుమాన్ జయంతి సందర్భంగా కాళేశ్వరం దేవస్థానం పరిధిలోని గుండం చెరువు కట్టమీద శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9.30గంటలకు ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ మారుతి తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. -
న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి
భూపాలపల్లి అర్బన్: జంగేడు శివారులో అక్రమంగా భూములను కబ్జాచేసి పట్టాలు చేసుకున్న వారిని తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మండలంలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతులు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జంగేడు శివారులోని 1630, 1631, 1632, 1647 సర్వే నంబర్లలోని 14మంది రైతులకు చెందిన 40 ఎకరాల వ్యవసాయ భూమిని మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ కొత్త హరిబాబు, అతని అనుచరులు బొంతల సతీష్, మేనం రాజేందర్, మాడ ప్రతాప్రెడ్డి, వారి బంధువుల పేర్లమీద అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. కొత్త హరిబాబు బెదిరించి 23మంది రైతులతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకొని భూమిని అక్రమంగా లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని రైతులు ఉడత రాయమల్లు, రాయలింగు, స్వరూప, జోరు కొమురయ్య, రాజు, లక్ష్మి, భూమయ్య, పెద్ద సమ్మయ్య కోరారు. -
వెలగని సెంట్రల్ లైటింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. హనుమాన్ దేవాలయం నుంచి గణపురం మండలం చెల్పూర్ వరకు 10 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లలో కొన్ని లైట్లు పనిచేయడం లేదు. చెడిపోయిన లైట్లకు మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సైతం లైట్లు వెలగకపోవడంలో చీకట్లు అలుముకుంటున్నాయి. మున్సిపాలిటీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. -
వేటగాళ్ల బైండోవర్
పలిమెల: కామన్పల్లి గ్రామంలో అటవీ జంతువుల కోసం ఉచ్చులు, విద్యుత్ తీగలను అమర్చుతున్న ఆరుగురు వేటగాళ్లను గుర్తించి పలిమెల ఎస్సై తమాషారెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించి రూ.లక్ష పూచీకత్తుపై తహసీల్దార్ హేమ ఎదుట శుక్రవారం బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై తమాషారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో కూంబింగ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అటవీ సంరక్షణ కోసం విధి నిర్వహణలో అటవీ అధికారులు రాత్రింబవళ్లు అడవిలో తిరుగుతుంటారన్నారు. ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చడం ద్వారా పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కావొద్దు కాళేశ్వరం: యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సీఐ రాజేశ్వర్రావు, ఎస్సై భవానీసేన్ అన్నారు. కాళేశ్వరం పోలీస్స్టేషన్లో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. గంజాయి, మత్తుకు అలవాటు పడి జీవితాలు అంధకారం చేసుకోవద్దన్నారు. గంజాయి, మత్తుపదార్థాలకు అలవాటు పడివ వారి గురించి పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. యువత మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారి నడవడికను కనిపెడుతూ ఉండాలని చెప్పారు. మొబైల్స్ వాడకంతో యువత మంచికి కాకుండా చెడుకు ఎక్కువగా మక్కువ చూపిస్తుందన్నారు. అలాంటి వారిని ఇంట్లో ఎప్పడికప్పుడు గమనించాలని చెప్పారు. వారివెంట పోలీసులు ఉన్నారు. బాలుడిపై కుక్క దాడి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మెట్పల్లిలో బాలునిపై కుక్క దాడి చేసింది. పిట్టల శ్రీనివాస్–రమ దంపుతుల కుమారుడు మనివిత్(4) శుక్రవారం రోడ్డుపై ఉండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో బాలుడి కంటి కింద తీవ్రంగా గాయమైంది. కాళేశ్వరంలోని ఆస్పత్రికి ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడు క్షమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి రూరల్: జిల్లాలో గుర్తింపుపొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ, దివ్యాంగ, మైనారిటీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంసెట్ శిక్షణ అందించేందుకు కార్పొరేట్ కళాశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారిని సునీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్లో ఈనెల 27వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలతో పాటు కళాశాల డాక్యుమెంట్ వివరాలను జతచేసి కలెక్టరేట్లోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో అందించాలని కోరారు. వివరాలకు 99088 43340 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఎండ వేడికి చేపల మృతి కాటారం: చెరువులో నీటి సమృద్ధి తక్కువ అవడం.. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. కాటారం మండలం చింతకాని ఊరుచెరువులో ఎండవేడికి శు క్రవారం వేలాది చేపలు చనిపోయాయి. చెరు వు ఆయకట్టులో రైతులు పంట పొలాలు సాగుచేయగా.. చెరువు నుంచి సాగునీటిని సరఫరా చేసుకుంటున్నారు. దీంతో చెరువులో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఎండలు అధికమవడంతో వేడికి చెరువులోని చేపలు శుక్రవారం పెద్దఎత్తున మృతిచెందాయి. చెరువులో ఉన్న అతి తక్కువ నీటిపై చేపలు చనిపోయి తేలియాడుతూ ఉండటం పలువురిని కలిచివేసింది. -
జనజీవన స్రవంతిలో కలవండి
ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్సీ ఏ సెక్షన్ కమాండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్ సంజు, రెండో సీఆర్సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోనిలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ములుగు జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో డీడీ రూపంగా ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాంగ్మూలం ఇచ్చారన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని సూచించారు. ఎస్పీ వెంట 39వ బెటాలియన్ కమాండెంట్ రాజేష్ తివారి, ములుగు డీఎస్పీ రవీందర్ ఉన్నారు. ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ప్రజల్లో ఎన్నికలపై అవగాహాన కల్పిస్తూ సీఆర్పీఎఫ్ బలగాలతో జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవస రం లేదన్నారు. ఓటు హక్కు అనేది ఎన్నికల ప్రక్రియపై సానుకూల సందేశం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐలు మేకల రంజిత్కుమార్, శంకర్, ఆర్ఐ ఆపరేషన్స్ సంతోష్, ఎస్సైలు రాజు, కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య రావొద్దు
భూపాలపల్లి: తాగునీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య నివారణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతిపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే మూడు నెలల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఫలితంగా నీటి నిల్వలు అడుగంటిపోయే అవకాశం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా నీరు సరఫరా చేసే క్రమంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తినా, పైపులు పగిలిపోవడం, గేట్ వాల్వ్ లీకేజీలు జరగడం లాంటివి జరిగినా వెంటనే గుర్తించి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితి జఠిలం కాకముందే జాగ్రత్తలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. హరితహారం మొక్కలు, గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై అన్ని విషయాలు తెలిసి ఉండాలన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను జాప్యం చేయకుండా పాఠశాలల పునః ప్రారంభం వరకు పూర్తి చేయాలన్నారు. 271 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉండగా.. 209 పాఠశాలలకు ఇంజినీరింగ్ అధికారులు అందచేసిన ప్రతిపాదనల మేరకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని చెప్పారు. మిగిలిన 62 పాఠశాలల ప్రతిపాదనలు శనివారం వరకు అందజేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఆయా పాఠశాలల హెచ్ఎంలు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల పనులు త్వరగా పూర్తిచేయాలి కలెక్టర్ భవేష్మిశ్రా -
ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి
భూపాలపల్లి: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా నమోదు చేయాలని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ధీరజ్ సింగా అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకు రాగా ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారాలను టీంల ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అన్ని టీంలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచామన్నారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎఫ్ఎస్టీ, అకౌంటింగ్ టీం అధికారులు విధుల నిర్వహణపై అవగాహన కార్యక్రమం చేపట్టి, నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించామని తెలిపారు. వ్యయ పరిశీలకుడు ధీరజ్ సింగా మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎంసీఎంసీ ద్వారా చెల్లింపు వార్తలు (పెయిడ్ న్యూస్) ప్రకటనలకు, కరపత్రాలు, పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి వ్యయాలను నమోదు చేయాలని చెప్పారు. దినపత్రికలలో వచ్చే పెయిడ్ న్యూస్పై ఎంసీఎంసీ కమిటీ ద్వారా ప్రతీరోజు దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ధీరజ్ సింగా -
No Headline
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కొరుకంటి చందర్తో కలిసి రెండుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.. ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల, నేతకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్తో కలిసి ఒకసెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులతో కలిసి మరోసెట్ అందజేశారు. వీరుకాకుండా బీఆర్ఎస్ తరఫున కొంకటి లింగమూర్తి ఒకసెట్ నామినేషన్ వేశారు. వీరితో ఇప్పటివరకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. పెద్దపల్లిలో సాదాసీదాగా నామినేషన్ వేసిన కొప్పుల, వంశీ అగ్రనేతల ఆధ్వర్యంలో మరోసెట్ వేయనున్న అభ్యర్థులు ఇప్పటివరకు ఏడుగురు నామినేషన్.. -
బహుముఖ ప్రజ్ఞాశాలి రామయ్య
ములుగు రూరల్: మండలంలోని అబ్బాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కందాల రామయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. కందాల రామయ్య ఇటీవల ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ(మనోవిజ్ఞాన శాస్త్రం) పట్టా పొందగా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అబ్బాపూర్ పాఠశాలలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాశాఖలో రామయ్య రిసోర్స్ పర్సన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రణాళికల రూపకల్పనలో సేవలు అందించారన్నారు. రామయ్య పీహెచ్డీ పట్టా పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ జయదేవ్, గణిత పోరం జిల్లా అధ్యక్షుడు ఎళ్ల మధుసూదన్, డీసీఈబీ సహాయ కార్యదర్శి విక్రమ్ రాజ్, ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ పాల్గొన్నారు. -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు.8లోu -
14 పోలింగ్ కేంద్రాల మార్పు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను అధికారులు మార్చారు. గతంలో గ్రామాలు, కాలనీలకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో మార్పులు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించగా అనుమతులు రావడంలో నూతన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 317 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 14 కేంద్రాలను మార్చినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 16, 24, 31 పోలింగ్ బూత్లను సంఘమిత్ర డిగ్రీ కళాశాలకు తరలించారు. పవిత్ర కళాశాలలోని 26, 27, 28 పోలింగ్ బూత్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, మైన్రెస్క్ స్టేషన్లోని 33వ బూత్ను జంగేడు కేజీబీవీకి, సీఈఆర్ క్లబ్లోని 35, 36 బూత్లను కృష్ణకాలనీ ప్రభుత్వ పాఠఽశాలకు, జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 54వ బూత్ను సెగ్గంపల్లి అంగన్వాడీ కేంద్రానికి, చిట్యాల మండలకేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలోని 164, 166 బూత్లను పక్కనే ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకు, గణపురం మండలంలోని కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 140 బూత్ను అప్పయ్యపల్లి ప్రాథమిక పాఠశాలకు, టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలోని 96 బూత్ను బండపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మార్చారు. నూతనంగా ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం పోలింగ్ కేంద్రాలకు నంబర్లు ఏర్పాటు చేశారు.ఓటర్లుకు అందుబాటులో కేంద్రాలు -
మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి: లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాల్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవేష్మిశ్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిందన్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా ఉల్లంఘన జరిగితే నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే సీ–విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు 24 గంటల పాటు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు జారీ చేస్తామన్నారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని తెలిపారు. సువిధ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు, ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని తెలిపారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించవద్దని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణకు నియమించిన టీంలు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు. చెక్పోస్ట్ల వద్ద పటిష్ట నిఘా ఉండాలని, వాహనాలు తనిఖీ చేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి మే 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే మూడు ఎఫ్ఎస్టీ టీంలను ఏర్పాటుచేసి మద్యం, నగదు, ఇతరత్రా వస్తువులు, రాజకీయ పార్టీల సమావేశాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ సీజ్ చేసిన డబ్బును ఇతరత్రా వస్తువులను గ్రీవెన్స్ కమిటీ టీం ద్వారా ఆధారాలను పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ జరగడమే లక్ష్యమని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు ఫ్రీ అండ్ ఫేర్ ఓటింగ్ లక్ష్యం కలెక్టర్ భవేష్మిశ్రా -
నల్లా నీటిని పొదుపుగా వాడుకోవాలి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణ ప్రజలు నల్లా నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటిని వృథా చేయవద్దని, నీరు సరిపోయిన తర్వాత నల్లాలను కట్టి వేయాలన్నారు. నల్లాలకు మోటర్స్ పెట్టకూడదన్నారు. నిర్లక్ష్యం వహించి మోటర్లు పెడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి జోలికెళ్తే రౌడీషీట్ కాటారం: గంజాయి, మారక ద్రవ్యాల జోలికి వెళ్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. గంజాయి కేసుల్లో నిందితులకు మండలకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి విక్ర యం, సేవించడం, రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్నారు. గంజాయిపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. గంజాయి నిర్మూలన ప్రతి ఒక్క రి బాధ్యతగా భావించి పోలీసులకు సమాచా రం అందించాలని డీఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఎస్సైలు అభినవ్, నరేష్ పాల్గొన్నారు. మహాసభను విజయవంతం చేయాలి భూపాలపల్లి అర్బన్: ఈ నెల 21వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న ఐఎన్టీయూసీ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య తెలిపారు. యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని కార్మికులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రాజేందర్, వేణుగోపాల్, రఘుపతిరెడ్డి, అశోక్, సంపత్రావు, సమ్మిరెడ్డి పాల్గొన్నారు. గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని వివిధ గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు దాసరి జనార్దన్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 5వ గనిలో మ్యాన్రైడింగ్ సరిగా పని చేయడం లేదన్నారు. 150 కుర్చీలు ఉండాల్సి ఉండగా.. కేవలం 20 కుర్చీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. క్యాంటీన్లో సమయపాలన పాటించడం లేదని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఎండ తీవ్రత పెరిగినప్పటికీ చల్లటి తాగునీటికి అందించడం లేదని ఆరోపించారు. ప్రశ్నించిన కార్మికులను సస్పెండ్ చేస్తూ చార్జీిషీట్లు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్రెడ్డి, శ్రీనివాస్, కలికొటి లింగయ్య, రాళ్లబండి బాబు, శ్రీధర్ పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలివెంకటాపురం(కె): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల పరిధిలోని ఆలుబాక, వెంకటా పురం ఎస్టీ బాలుర వసతి గృహాలను, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాల్లో ఉన్న బాత్ రూమ్లు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం వి ద్యార్థుల హాజరు పట్టిక, రికార్డులను తనిఖీ చేశా రు. స్టోర్ రూమ్లో ఉన్న స్టాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో మరమ్మతులకు గురైన బాత్రూమ్లు, విద్యుత్ మరమ్మతులు పనులు చేయించాలన్నారు. -
మోడికుంటను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు
వాజేడు: మోడికుంట ప్రాజెక్టును పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని పూసూరు రిసార్ట్స్లో పార్టీ నాయకులు దావూద్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాజేడు మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో మంజూరైన మోడికుంట ప్రాజెక్టును పూర్తి చేస్తే సాగు, తాగు నీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే సాగునీరు కీలకమన్నారు. 2006 నుంచి మోడికుంట ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేయించి అనుమతులు లేవని కాలయాపన చేసిందని ఆరోపించారు. 2016లో అనుమతులు వచ్చినప్పటికీ ప్రజల అభిప్రాయ సేకరణ చేసి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తలేదన్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే 36 గ్రామాలకు తాగునీరు, 25 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి రావు, భీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, వాసు, చిట్టిబాబు, శ్రీను, రాములు, ఆగిరెడ్డి, రాజేష్, చిరంజీవి, చిన్నా పాల్గొన్నారు. -
పాలిటిక్స్ షురూ..
సాక్షి, వరంగల్ : ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మానుకోటలో సీఎం ప్రచారసభలో పాల్గొననున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డు, మహబూ బాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్డు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజే పీ, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రచారం చేసేలా ఆ పార్టీ షెడ్యూల్ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేత ల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్ వేదిక కానుంది. రెండు రోజుల్లో నామినేషన్లు.. తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరికొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడి సభాస్థలిని పరిశీలించారు. వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే.. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు. నామినేషన్ సెంటర్వద్ద భారీ బందోబస్తు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వరంగల్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం నామినేషన్ సెంటర్లోని ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం ఉమ్మడి జిల్లాలో మొదలైన రాజకీయ వేడి వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గెలుపుపై దృష్టి 24న హనుమకొండలో కాంగ్రెస్ సభ నిర్వహణకు కసరత్తు అదేబాటలో ప్రచారానికి బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతల ప్లాన్ నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తంపై అభ్యర్థుల ఆరానేడు మానుకోటకు సీఎం ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్న రేవంత్ సాక్షి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. ఆరు గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరిశీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఉదయమే నామినేషన్ వేయనున్నారు. -
సూర్య ప్ర‘తాపం’
భూపాలపల్లి అర్బన్: ఎండలు భగభగమంటున్నాయి.. సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో గురువారం ఉష్ణోగ్రత 45 డిగ్రీల చేరువలోకి చేరింది. ఎండ వేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పని ప్రదేశాల్లో కార్మికులు, కర్షకులు ఇబ్బంది పడుతుండగా, పిల్లలు, వృద్ధులు ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్య ప్రతాపంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏప్రిల్ నెల ఆరంభం నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు అప్రమత్తత స్థాయికి చేరగా, గురువారం మాత్రం హెచ్చరిక స్థాయి (ఆరెంజ్ నుంచి రెడ్) చేరువకు చేరింది. జిల్లా అంతటా 41.8 నుంచి 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా మల్హర్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న విద్యుత్ వినియోగం.. ఎండలు పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. భూపాలపల్లి విద్యుత్ సర్కిల్ ఆపరేషన్ పరిధిలో ప్రస్తుతం నిత్యం విద్యుత్ కోటా 2.25 మిలియన్ యూనిట్లు కాగా.. గత వారం రోజుల నుంచి 2.35 మిలియన్ యూనిట్లకు పైగా వినియోగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అధికారులు సబ్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించారు. ఇబ్బంది పడుతున్న రైతులు, కార్మికులు.. యాసంగి పనులు చివరి దశలో ఉన్న తరుణంలో ఎండ తీవ్రతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల వరి, మిర్చి, మొక్కజొన్న కోతలు, వాటిని ఆరబెట్టడం, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమై ఉన్నారు. ఎండలో పనులకు వెళ్లటానికి కొందరు కూలీలు వెనుకడుగు వేసున్నారు. పలు ప్రాంతాల్లో పని వేళలను మార్చుకున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. కూలీలను రైతులు ట్రాక్టర్లు, ఆటోల్లో చేలకు తీసుకువెళ్లి తిరిగి తీసుకొస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు, సింగరేణి ఓపెన్కాస్ట్ గనులు, కేటీపీపీలో పనిచేసే కార్మికులు, హమాలీలు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. దుకాణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఉంటుండగా, మధ్యాహ్నం వెలవెలబోతున్నాయి. భూపాలపల్లి పట్టణంలో పలు వీధులు పగటి పూట కర్వ్యూను తలపిస్తున్నాయి.మండలం ప్రాంతం ఉష్ణోగ్రత మల్హర్ తాడిచర్ల 44.9 గణపురం చెల్పూరు 44.8 చిట్యాల చిట్యాల 44.7 మల్హర్ కొయ్యూరు 44.5 రేగొండ రేగొండ 44.4 కాటారం కాటారం 44.1 కొత్తపల్లిగోరి కొత్తపల్లిగోరి 43.8 మహదేవపూర్ కాళేశ్వరం 43.5 పలిమెల సర్వాయిపేట 43.3 మహాముత్తారం మహాముత్తారం 43.3 మల్హర్ మల్లారం 43.1 మహదేవపూర్ పెద్దంపేట 42.9 భూపాలపల్లి భూపాలపల్లి 42.8 మహదేవపూర్ మహదేవపూర్ 42.8 మొగుళ్లపల్లి మొగుళ్లపల్లి 42.8 కాటారం రేగులగూడెం 42.6 టేకుమట్ల టేకుమట్ల 41.8జిల్లావ్యాప్తంగా మండుతున్న ఎండలు గరిష్ట స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు మల్హర్లో అత్యధికంగా 44.9 డిగ్రీలు నమోదు వడగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు -
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండతో పాటు వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసమే.. ● కాంగ్రెస్ నాయకుడు గుడాల శ్రీనివాస్ కాటారం (మహదేవపూర్): ప్రతీ ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశ్యంతో కొంత కాలంగా వ్యాయామం, యోగాపై తన వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నానని.. అందులో భాగంగానే పోలీసులకు సైతం అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు మహదేవపూర్ కాంగ్రెస్ నాయకుడు, జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 15న మహదేవపూర్ పోలీస్స్టేషన్లో శ్రీనివాస్ నృత్యం చేసిన ఘటన వైరల్ కాగా అదేరోజు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్రెడ్డి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనిపై గురువారం గుడాల శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా సంజాయిషీ ఇచ్చారు. 30 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ మంచి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. కరోనా బాధితులు గుండుపోటుతో మృతిచెందడం తనను బాధించిందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులను అడిగి పలు సలహాలు తీసుకున్నానని చెప్పారు. ఆ విషయాలను నలుగురికి చెపుతూ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 15న ఉదయం వాకింగ్కు వెళ్లి వస్తూ ఇంటి సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులు పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు. గిట్టని వారు కొందరు దురుద్దేశంతో అబద్దపు మాటలు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ ఆరో పించారు. తన సంజాయిషీతో సంతృప్తి చెందకపోతే కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యులు తీసుకోబోయే చర్యలను గౌరవిస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు. సీతారామచంద్రస్వామి ఆలయంలో హోమంఏటూరునాగారం: మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ఉదయం నిత్యారాధన, హోమం, బలిహరణ కార్యక్రమాన్ని వేదపండితులు ముక్కాముల వెంకటనారాయణశర్మ, యల్లాప్రగడ మణికంటిశర్మ, నాగేశ్వర్రావుశర్మ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సదస్యము, ఆరగింపు, పల్లకిసేవ కార్యక్రమాలు జరిపించారు. ఐదు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా పుష్పయాగం(నాగబెల్లి) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు నాగేశ్వర్రావుశర్మ తెలిపారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి: లోక్సభ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూప కల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ పలు సూచనలు, సలహాలు అందించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం, ఓటరు స్లిప్ల పంపిణీ తదితర పనులను నిబంధనల మేరకు చేస్తున్నట్లు వెల్లడించారు.స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి టేకుమట్ల: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ మల్లేష్యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కేంద్ర పోలీస్ బలగాలతో ప్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకై నా ఓటు వేసుకోవచ్చని, సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై గోగికారి ప్రసాద్, కానిస్టేబుళ్ళు, టీఎస్ఎస్పీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. కాళేశ్వరంలో మద్యం దుకాణాలు బంద్కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మొదటి విడతలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 19న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాష్ట్రకు సరిహద్దులోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని రెండు మద్యం దుకాణాలను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కాటారం సీఐ నరేందర్ ఆధ్వర్యంలో బంద్ చేసి సీల్ వేశారు. మళ్లీ 19న పోలింగ్ ముగిసిన తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అక్కడి పోలీసులు ముందస్తుగా పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సరిహద్దులోని మద్యం దుకాణాలు బంద్ చేసినట్లు తెలిసింది. జిల్లాలోని కాళేశ్వరంలో మాత్రమే మద్యం దుకాణాలు బంద్ పాటించనున్నాయి. కాంగ్రెస్ నాయకుడికి షోకాజ్ నోటీస్కాటారం(మహదేవపూర్): మహదేవపూర్ పోలీస్స్టేషన్లో నృత్యం చేసిన సంఘటనలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహదేవపూర్ జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత ప్రకాశ్రెడ్డి ఈ నెల 15న షోకాజ్ నోటీస్ జారీ చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ నెల 15న గుడాల శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ పాటకు నృత్యం చేయగా ఆ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. యోగా, వ్యాయామం ప్రాముఖ్యత పోలీసులకు తెలియజేయడంలో భాగంగా ఇలా నృత్యం చేసినట్లు శ్రీనివాస్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ కిరణ్ఖరే అదే రోజు విచారణ చేపట్టి ఎస్సైతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ఇదే క్రమంలో నృత్యం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో వైరల్ కావడంతో స్పందించిన కాంగ్రెస్ జిల్లా కమిటీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శ్రీనివాస్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బాధ్యతాయుతమైన కాంగ్రెస్ కా ర్యకర్తగా ఉండి ఇలాంటి వాటికి పాల్పడటం సరికాదని నోటీస్లో పేర్కొంది. నోటీస్ జారీ అంశం మండలంలో చర్చనీయంగా మారింది. -
నేటినుంచి లోక్సభ నామినేషన్ల స్వీకరణ
ఖిలా వరంగల్: లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. అదేరోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 25వ తేదీ వరకు దాఖలుకు అవకాశం ఉంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను వరంగల్ జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. సెలవులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ కలెక్టరేట్లో, మహబూబాబాద్ స్థానానికి సంబంధించి మహబూబాబాద్ కలెక్టరేట్లో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నిబంధనలు.. ● ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దా ఖలు చేయొచ్చు. ● అభ్యర్థి వెంట నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలోని ఎవరైనా ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ● రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులకు 10మంది ఓటర్లు ప్రతిపాదించాలి. ● పోటీ చేసే అభ్యర్థులు వేరే లోక్సభ సెగ్మెంట్కు చెందిన వారైతే తప్పసరి వారి అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చు. ● సంబంధిత బ్యాంకు ఖాతా లావాదేవీల ఆధారంగానే అభ్యర్థులు వ్యయాన్ని లెక్కిస్తారు. ● నామినేషన్ పత్రంలోని పార్ట్–3ఏ లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపర్చాలి. ● ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగానే అనుమతి పొందాలి. ● కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల విషయంలో సెక్షన్ 127–ఏ సూచనలు పాటించాలి. ● ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు సువిధ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. సమన్వయంతో పనిచేయాలి – ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల నోడల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరెట్ నుంచి పార్లమెంట్ నియోజక పరిధిలోని 7అసెంబ్లీ సెగ్మెంట్లలోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, జిల్లా నోడల్ అధికారులతో వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీ క్ష నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చేసే అభ్యర్థుల వాహనాల అనుమతులకు సువిధ ద్వారా రిటర్నింగ్ అధికారి పరిధిలో మంజూరు చేయాలని, సభలు, సమావేశాలకు సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు లేదా ఎన్నికల అధికారుల స్థాయిలో మంజూరు చేయాలన్నారు. ఎస్ఎస్టీలు గురువారం ఉదయం నుంచి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు సకాలంలో రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ ఫారం 12 స్వీకరణ, అత్యవసర సర్వీసెస్, వృద్ధులు, దివ్యాంగుల హోం ఓటింగ్ ఈ నెల 25లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్కేంద్రంలో వీల్ చైర్లతోపాటు వలంటీర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పొరపాట్లు జరగొద్దు.. నామినేషన్లు స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మాక్ (ట్రయల్) నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓలు శ్రీనివాస్, వైవీ గణేష్, డీఎస్ వెంకన్న, రోహిత్ సింగ్, నారాయణ, వెంకటేష్, సీదం దత్తు, మంగీలాల్, జిల్లా నోడల్ అధికారులు రామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సభలు, వాహనాల ప్రచారం అనుమతులతోపాటు పలు అంశాలపై సమీక్ష -
శ్రీరాముడి పాలన ఆదర్శనీయం
కాటారం: శ్రీరాముడి పాలన ప్రతీఒక్కరికి ఆదర్శనీయమని, వారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండలం ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో శ్రీధర్బాబు పాల్గొన్నారు. ముందుగా మంత్రి ధన్వాడలోని తన స్వగృహంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీ సీతారామలక్ష్మణ, అంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం తలంబ్రాల బియ్యం, పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. వైభోపేతంగా జరిగిన ఈ కల్యాణ వేడుకలను మంత్రి గ్రామస్తులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, మంథని నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సీతారాములను కోరుకున్నట్లు తెలిపారు. రాముడిని ఆదర్శంగా తీసుకొని అందరం ముందుకు కదలాలని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్లిన మహోత్తముడు రాముడన్నారు. రాబోయే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి పంటలు బాగా పండి రైతుల కష్టాలు తొలగడానికి త్వరలో యాగ నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని పురోహితులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ఎంపీటీసీ జాడి మహేశ్వరీ, యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, నాయకులు చిటూరి మహేశ్, కొట్టె ప్రభాకర్, చీమల రాజు, పురోహితులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
Advertisement