అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నేతల పెత్తనం
నిజామాబాద్నాగారం: అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నాయకుల పెత్తనంతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. టోర్నీలను, ఎంపికలను పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం క్రీడలకు సంబంధించిన అసోసియేషన్ ఇంటర్నేషనల్, జాతీయస్థాయి క్రీడాకారులకే ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్లో మాత్రం రాజకీయ నాయకులదే పైచేయి. క్రీడాకారులకు ఏ రోజు కూడా శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. టోర్నీలు, ఎంపికల పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని ఎంట్రీ ఫీజులు, బహుమతులు, సర్టిఫికెట్లు అంటూ డబ్బులు దండుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అథ్లెటిక్స్లో రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్, తదితర వాటిలో సాధన చేస్తేనే ఇతర క్రీడల్లో నైపుణ్యం వస్తుంది. అలాంటి అథ్లెటిక్స్లో రాజకీయ నాయకుల ప్రమేయంతో క్రీడాకారులకు అన్యాయం జరుగుతోంది.
నిబంధనలు తూచ్
జిల్లాలో బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ లాంటి క్రీడా సంఘాల్లో అధ్యక్ష, కార్యదర్శిలు సీనియర్ క్రీడాకారులు ఉండడంతో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. అథ్లెటిక్స్లో ఇప్పటి వరకు ఏ ఒక్క క్రీడాకారుడు కూడా జాతీయ స్థాయిలో పతకం తీసుకరాలేకపోయారు. క్రీడలను నాశనం చేయడానికే రాజకీయ నాయకుల ప్రాతినిథ్యం పెరుగుతుందంటున్నారు. క్రీడా సంఘాలకు సీనియర్ క్రీడాకారులు, పతకాలు సాధించిన వారు అధ్యక్ష, కార్యదర్శిలతో పాటు సభ్యులుగా ఉంటే క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది.
సంఘాల్లో రాజకీయ నేతలు ఉండొద్దు
క్రీడాకారులకు న్యాయం జరగాలన్నా, శిక్షణ ఇ వ్వాలన్నా క్రీడా సంఘాల్లో సీనియర్ క్రీడాకారు లు, పతకాలు సాధించిన వారే అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులుగా ఉండాలి. రాజకీయ నాయకు ల ప్రమేయం వల్ల అన్యాయం జరుగుతుంది. కొ న్ని క్రీడా సంఘాలు టోర్నీలు, ఎంపికలు, సర్టిఫికే ట్లు, బహుమతులు అంటూ డబ్బులు దండుకొని తీరని అన్యాయం చేస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారుల కు న్యాయం చేయడానికి కృషి చేయాలి.
– సయ్యద్ ఖైసర్,
అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్టుస్టేడియాలు కూల్చేసినా మౌనమే..జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజీవ్గాంధి స్టేడియాన్ని రూ.3 కోట్లతో నిర్మించారు. అభివృద్ధి చేయాల్సి ఉన్నా అథ్లెటిక్స్, ఇతర సంఘాలు పట్టించుకోలేదు. స్టేడియాన్ని కూల్చివేసే సమయంలో కూడా అడ్డుకోలేదు. పాత కలెక్టరేట్ మైదానాన్ని తరలించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసినా ప్రస్తుతం ఉన్న సంఘాలు పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు క్రీడా సంఘాల్లో పేరు కోసం వచ్చి క్రీడాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కనీసం ఇప్పటి వరకు సింథటిక్ ట్రాక్ లేదు. రాజకీయ నాయకుల వల్లే అన్యాయం జరుగుతుందని అథ్లెటిక్ సీనియర్ క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. క్రీడాకారుల జీవితాలతో
ఆడుకుంటున్నారు
టోర్నీ, ఎంపికలను వ్యాపారంగా
మార్చేస్తున్న వైనం
నిబంధనలు గాలికి..