-
నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి ఓవర్లో ‘భయపెట్టిన’ ఉనాద్కట్! వీడియో
ఆఖరి ఓవర్.. మ్యాచ్ గెలవాలంటే ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి.. ఇదీ సమీకరణం.. ఇంతలో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు బౌలర్.. విజయావకాశం మీకే అన్నట్లుగా.. మొదటి బంతికే సిక్సర్.. ఆ తర్వాత వైడ్.. మళ్లీ వైడ్.. ఇప్పుడు గెలుపు సమీకరణం ఐదు బంతుల్లో 21 పరుగులు... ఫీల్డర్ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్.. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు... ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులు... ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు.. మిగిలినవి ఆఖరి రెండు బంతులు.. ఇందులో మొదటిది వైడ్... రెండో బంతికి ఒక్క పరుగు.. ఇప్పటిదాకా డ్రామా నడిపించిన బ్యాటర్ కథ అప్పుడే ముగిసిపోవాల్సింది.. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అతడు బతికిపోయాడు. గెలవడానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి.. ఏమో మళ్లీ వైడ్ బాల్స్ పడతాయేమోనన్న ఉత్కంఠ.. కానీ ఈసారి అలా జరుగలేదు.. ఆఖరి బంతికి సిక్స్ బాదడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెండు పరుగుల తేడాతో ప్రత్యర్థి విజయం సాధించింది. A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 ఓడిపోతామేమో.. భయపెట్టిన ఉనాద్కట్.. ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ పోరులో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. ఆఖరి ఓవర్లో రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. జయదేవ్ ఉనాద్కట్ చేతికి బంతినివ్వగా.. పంజాబ్ బ్యాటర్ అశుతోశ్ శర్మ వరుసగా.. 6, వైడ్, వైడ్, 6, 2, 2, వైడ్, 1.. ఇలా 20 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శశాంక్ సింగ్ సిక్స్ బాది స్కోరుకు మరో ఆరు పరుగులు జత చేశాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి ఓసారి క్యాచ్ జారవిడిచాడు. ఇలా సన్రైజర్స్ బౌలర్, ఫీల్డర్ తప్పిదాలు చేసినా ఆఖరికి విజయం వారినే వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్లో హైదరాబాద్ జట్టు ఖాతాలో మూడో గెలుపు చేరింది. అదరగొట్టిన నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ కాగా ముల్లన్పూర్లో మంగళవారం జరిగిన పంజాబ్- సన్రైజర్స్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్ స్కోరు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన పంజాబ్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్తో పాటు ఒక వికెట్ తీసిన నితీశ్ రెడ్డిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక అభిమానులకు అసలైన టీ20 మజా అందించిన పంజాబ్- సన్రైజర్స్ ఆఖరి ఓవర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. So close, yet so far for Shashank and #PBKS 💔#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/F51V0OzroY — JioCinema (@JioCinema) April 9, 2024 -
IPL 2024 SRH VS MI: ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు.. కామన్గా ఒకే ఆటగాడు..!
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేసిన సన్రైజర్స్.. లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ను నమోదు చేసిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ ఈ రికార్డును నెలకొల్పే క్రమంలో ఆర్సీబీ పేరిట ఉండిన పాత రికార్డును బద్దలు కొట్టింది. 11 ఏళ్ల కిందట 2013 సీజన్లో ఆర్సీబీ.. పూణే వారియర్స్పై చేసిన 263 పరుగులే నిన్నటి మ్యాచ్కు ముందు వరకు ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్గా ఉండింది. ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు నమోదైన సందర్భాల్లో ఓ ఆటగాడు కామన్గా ఉండటం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సన్రైజర్స్ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ 2013లో ఆర్సీబీతో.. ప్రస్తుతం సన్రైజర్స్లో ఉన్నాడు. ఈ విషయం గురించి తెలిసి నెటిజన్లు ఉనద్కత్ను లక్కీ లెగ్గా పరిగణిస్తున్నారు. భారీ స్కోర్లు నమోదు కావాలంటే ఉనద్కత్ ఉండాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. రెండు మ్యాచ్ల్లో ఉనద్కత్ ప్రత్యర్దులపై రెండేసి వికెట్లు పడగొట్టాడు. Jaydev Unadkat is the only player who has been part of two of the highest totals in IPL history. 📸: IPL/BCCI pic.twitter.com/y0sU753Ovc — CricTracker (@Cricketracker) March 28, 2024 ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో సన్రైజర్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్రైజర్స్కు దడ పుట్టించారు. -
యానిమల్ ఓ బిగ్ డిజాస్టర్.. మండిపడ్డ టీమిండియా ఫాస్ట్ బౌలర్!
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్బస్టర్గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. (ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?) అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు. (ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..) -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214, సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
చిరు పై పోసాని సంచలన కామెంట్స్
Ragini Dwivedi: వైట్ అవుట్ ఫిట్ తో రాగిణి ద్వివేది అందాలు (ఫొటోలు)
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement