-
స్టార్ హీరోయిన్పై నెటిజన్స్ ఆగ్రహం.. ఎందుకంటే?
బాలీవుడ్ భామ కాజోల్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అజయ్ దేవగణ్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం దో పట్టి అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ రెస్టారెంట్కు వెళ్లిన కాజోల్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలసుకుందాం.ఇటీవల ముంబయి జుహూలోని ఓ రెస్టారెంట్కు కాజోల్ తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్లింది. అదే సమయంలో ఆమెకు వీరాభిమాని అయిన హోటల్ వెయిటర్ కాజోల్ను చూశాడు. ఆమె వద్ద నుంచి బిల్ తీసుకునే సమయంలో భావోద్వాగానికి గురయ్యాడు. తన అభిమాన నటిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.అయితే అతని తీరుపై కాజోల్ మండిపడింది. నాటకాలు ఆపి.. ముందు బిల్ తీస్కో అంటూ ర్యాష్గా మాట్లాడింది. అంతే కాకుండా ఇలాంటి వారిని వెయిటర్గా నియమించడంపై ఏకంగా మేనేజర్కు ఫిర్యాదు చేసింది. దీంతో కాజోల్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిమాని అయినందుకు కనీసం అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయారంటూ మండిపడుతున్నారు. కాజోల్ తీరుపై వెయిటర్ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
Rani Mukerji-Kajol: అక్కా-చెల్లెలు ఇద్దరు స్టార్ హీరోయిన్లే..కొన్నేళ్లుగా మాటల్లేవు, కారణం ఇదేనట!
రాణీ ముఖర్జీ, కాజోల్ బాలీవుడ్ ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వరుసకు వీరిద్దరు అక్కా-చెల్లెలు అవుతారు. ఇప్పుడంటే కాజోల్, రాణీముఖర్జీ చాలా క్లోజ్గా ఉంటున్నారు కానీ.. కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలిసి ఒకే సినిమాలో(కరణ్ జోహార్ మొదటి చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై') నటించినా మాట్లాడుకోలేదట. దానికి గల కారణాన్ని తాజాగా రాణీ ముఖర్జీ వెల్లడించింది. అపార్దం చేసుకోవడం వల్లే తాము కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నామని చెప్పింది. ‘ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు సహజం. విభేదాలకు ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే విడిపోతారు. అలాంటిదే మా(కాజోల్, రాణీ ముఖర్జీ) ఫ్యామిలీలో జరిగింది. మా ఇరు కుటుంబాలు విడిపోవడానికి కారణమే లేదు. అపార్దం చేసుకోవడం వల్లే మేము కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా రెండు కుటుంబాలు కలిశాయి. ఏదో ఒక సందర్భంలో అందరం కలుస్తూనే ఉంటాం’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. కాజోల్ కంటే ఆమె చెల్లి తనిషా ముఖర్జీ తనకు బాగా క్లోజ్ అని రాణీ ముఖర్జీ గతంలో చెప్పింది. ’చిన్నప్పుడు అందరం కలిసే ఆడుకునేవాళ్లం. తనిషా, నేను ఒక జట్టు అయితే.. మా సోదరుడు, కాజోల్ మరో గ్యాంగ్. మా సీక్రెట్స్ ఏవి వారితో షేర్ చేసుకునే వాళ్లం కాదు. కాజోల్ మాత్రం ఎక్కువగా మా సోదరులతోనే ఉండేది. చిన్నప్పుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. -
సముద్ర తీరంలో రకుల్.. బ్లూ డ్రెస్లో ఉప్పెన భామ!
►సముద్ర తీరంలో రకుల్ పోజులు ►బ్లూ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి ►న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కేజీఎఫ్ హీరో యశ్ ►ఫ్యామిలీతో హీరోయిన్ కాజోల్ న్యూ ఇయర్ ట్రీట్ ►భర్తతో కలిసి కత్రినా కైఫ్ చిల్ ►జైపూర్లో మాళవిక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ►న్యూ ఇయర్ వైబ్స్తో బుట్టబొమ్మ లుక్స్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Yash (@thenameisyash) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఆనంద్ పండిట్ 60వ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
చలో కోల్కత్తా
ప్రేక్షకులను భయపెడతా అంటున్నారు బాలీవుడ్ నటి కాజోల్. ఆమె ప్రధాన పాత్రధారిగా విశాల్ ఫురియా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని బాలీవుడ్ సమాచారం. పూర్తి స్థాయి హారర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయని, జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేలా విశాల్ ప్లాన్ చేశారని టాక్. తొలి షెడ్యూల్ కోల్కతాలో మొదలవుతుందట. నెల రోజులకు పైగా అక్కడి లొకేషన్స్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన చేశారట యూనిట్. ఇక ఈ సినిమాను కాజోల్ భర్త, దర్శక–నటుడు, నిర్మాత అజయ్ దేవగన్ నిర్మించనున్నారని బాలీవుడ్ భోగట్టా. -
బాలీవుడ్లో హిట్ హీరోయిన్ కాజోల్ దేవగన్ నయా లుక్స్ (ఫోటోలు)
-
స్టార్స్ను భయపెడుతోన్న డీప్ ఫేక్.. తాజాగా మరో స్టార్ హీరోయిన్!
ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ సైతం డీప్ ఫేక్ బారిన పడింది. టైగర్-3 చిత్రంలోని ఓ సీన్ను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె తన దుస్తులు మార్చుకుంటున్నట్లుగా వీడియోను రూపొందించారు. ఇది కూడా డీప్ఫేక్ సాయంతోనే ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో ఉన్నది కాజోల్ కాదని..ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్దని ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ బూమ్ వెల్లడించింది. ఈ వీడియో ఈ ఏడాది జూన్ 5న పోస్ట్ చేశారని తెలిపింది. అయితే మనదేశంలో టిక్ టాక్పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రష్మిక మందన్నా వీడియో వైరల్ కావడంతో.. ఈ డీప్ఫేక్ వీడియో తాజాగా బయటకొచ్చింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియో గతంలో టిక్టాక్లో అప్లోడ్ చేశారని బూమ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఈ వీడియోనూ ఎవరు సృష్టించారో మాత్రం తెలియరాలేదు. అయితే గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
Nysa Devgan Latest Photos: కాజోల్ కూతుర్ని చూశారా? హీరోయిన్ కన్నా తక్కువేం కాదు (ఫోటోలు)
-
కాజోల్తో మొదటి సినిమా.. కానీ ఆ హీరో జీవితంలో అంతులేని విషాదం!
కమల్ సదానా ఈ పేరు చాలామందికి తెలియదు. కమల్ తన నటన జీవితాన్ని స్టార్ హీరోయిన్ కాజోల్తో కలిసి ప్రారంభించాడు. బెఖుడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారానే కాజోల్ కూడా అరంగేట్రం చేసింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో కమల్కు బాలీవుడ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ అనుకోకుండా జరిగిన విషాదం అతన్ని మానసికంగా దెబ్బతీసింది. ఊహించని పరిణామాలతో ఒక్కసారిగా తన కెరీర్ ముగిసినంత పనైంది. ఇంతకీ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఏమిటా విషాదం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!) బర్త్ డే రోజే విషాదం తఖ్దీర్, ఏక్ సే బద్కర్ ఏక్, యాకీన్ వంటి చిత్రాలు నిర్మించిన దర్శకుడు బ్రిజ్ సదానాకు కమల్ జన్మించారు. బ్రిజ్ 1960- 70లో బాలీవుడ్లో విజయవంతమైన డైరెక్టర్గా పేరు సంపాదించారు. 1980ల మధ్య నాటికి ఆయన సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఆ తర్వాత 1990లో కమల్ 20వ పుట్టినరోజున బ్రిజ్, అతని భార్య సయీదా ఖాన్ మధ్య గొడవ జరిగింది. బర్త్ డే వేడుకకు ఏర్పాట్లు చేసుండగానే కమల్ సదానాకు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దీంత వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా.. తన తండ్రి ఆవేశంతో తల్లి, సోదరినీ చంపి.. తాను కూడా పిస్టల్తో కాల్చుకున్నాడు. ఆ సమయంలో కమల్ బర్త్డే పార్టికీ వచ్చిన స్నేహితులు వారందరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తీవ్ర విషాదంతో కమల్ సదానా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. అయితే ఆ సమయంలో బ్రిజ్ మద్యం తాగినట్లు శవపరీక్షలో వెల్లడైంది. కమల్ సదానా సినిమా కెరీర్ కమల్ 2000లో విడుదలైన కాళీ టోపీ లాల్ రుమాల్ తర్వాత సినిమాలకు విరామం తీసుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత 2005లో తన దర్శకత్వం వహించిన కర్కాష్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా టీవీ షో కసమ్లో సహాయక పాత్రను కూడా పోషించాడు. 2007లో తన తండ్రి నిర్మించిన చిత్రానికి రీమేక్గా విక్టోరియా నంబర్ 203ని తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా బాగా ఆడలేదు. నోరా ఫతేహి బాలీవుడ్ అరంగేట్రం చేసిన రోర్ చిత్రానికి కూడా కమల్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత 2022లో విడుదలైన సలామ్ వెంకీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా 30 ఏళ్లకు మళ్లీ కాజోల్త కలిసి తెరపై కనిపించారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించారు. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజోల్తో మొదటి సినిమా చేసిన కమల్.. ఆ తర్వాత కెరీర్లో ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చూస్తే అభినందించాల్సిందే. (ఇది చదవండి: నా రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) -
కాజోల్ కొత్త 'మిస్టరీ' మొదలైంది
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, కృతీసనన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దో పత్తీ’. మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకి శశాంకా చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. కృతీసనన్ , కాజోల్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శశాంక. ఈ సినిమాను రచయిత కనికా థిల్లాన్ , కృతీసనన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు 2015లో షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘దిల్వాలే’ చిత్రంలో కాజోల్, కృతీసనన్ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘దో పత్తీ’ కోసం ఈ ఇద్దరూ సెట్స్లో జాయిన్ అవుతున్నారు. -
రెడ్ డ్రెస్లో అదితి పోజులు.. వీకెండ్ మూడ్లో బుట్టబొమ్మ!
►యషిక ఆనంద్ హాట్ లుక్స్! ►రెడ్ డ్రెస్లో ఆదితిశంకర్ పోజులు! ►జిమ్లో కసరత్తులు చేస్తోన్న ప్రగతి! ►కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న కాజోల్! ►వీకెండ్ మూడ్లో బుట్టబొమ్మ! View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
కాజోల్కు ఏమైంది?.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కాజోల్ ఇటీవలే ది ట్రయల్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో లాయర్ పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటోంది. ది గుడ్ వైఫ్ అనే అమెకరిన్ సిరీస్కు రీమేక్గా తెరకెక్కించారు అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ను పెళ్లాడిన భామ.. ఇటీవలే 49వ పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా కాజోల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్! ) ఆమె మోచేతికి కర్ర (ఎల్బో క్రచ్) సాయంతో నడుస్తూ వీడియో కనిపించింది. కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాజోల్కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. వీడియోలో గమనిస్తే కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అంతే కాకుండా గాయంతోనే షూటింగ్కు వెళుతున్నట్లు సమాచారం. కాగా.. కాజోల్ మిస్టరీ థ్రిల్లర్ దో పట్టిలో కృతి సనన్తో కలిసి నటించనుంది. ఈ ప్రాజెక్ట్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆ హీరోయిన్కి క్షమాపణలు చెప్పిన రానా) View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
మృతదేహం వెలికితీసి పోస్టుమార్టంతో.. అసలు నిజాలు..!
వరంగల్: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని బొక్కలగడ్డ ఈద్గాలో బుధవారం ఉదయం గత నెల 12న పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం హనుమకొండ గుడిబండల్ ప్రాంతానికి చెందిన షహనజ్కు ఇద్దరు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు. పెద్ద కుమార్తె కాజోల్ (20)వీణాబజార్లో ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. కాజోల్ అంబాల గ్రామానికి చెందిన అబ్బాస్తో ఆరు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పెండ్లి విషయంలో కాజల్, అబ్బాస్కు గొడవలు జరిగాయి. ఇదిలా ఉండగా అనారోగ్య కారణాల రీత్యా గత నెల 12న కాజోల్ను ఎంజీఎంలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే రోజు రాత్రి అబ్బాస్ బొక్కలగడ్డ ఈద్గాలో కాజోల్ మృతదేహం పూడ్చిపెట్టాడు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి షహనజ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి హనుమకొండ తహసీల్దార్ సమక్షంలో కేఎంసీ ఫోరెన్సిక్ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. -
కాజోల్ సరదా వ్యాఖ్యలు.. షారుక్ ఫ్యాన్స్ ఫైర్
బాలీవుడ్లో కాజోల్, షారుక్ ఖాన్లది హిట్ పెయిర్. ‘దిల్వాలే దుల్హనియా లేజాయెంగే, బాజీఘర్, దిల్వాలేతో పాటు మరో నాలుగు చిత్రాల్లోనూ విరిద్దరు జంటగా నటించారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక పలు చిత్రాల్లో కలిసి నటించడం కారణంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ షారుక్- కాజోల్ స్నేహితులుగానే ఉన్నారు. ఆ చనువు కారణంగానే కాజోల్ సరదాగా చేసిన వ్యాఖ్యులు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. ఆమెపై షారుక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఇటీవల కాలోజ్ నటించిన ‘ది ట్రయల్’ మూవీ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చిత్రబృందంతో కలిసి మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా షారుక్ ఖాన్ గురించి అడగ్గా..‘షారుక్, నేను మంచి స్నేహితులం. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే ఇప్పటికీ వదులుకోను. మళ్లీ ఆయనతో ఒక రొమాటిక్ సాంగ్ చేయాలని ఉంది’ అని కాజోల్ అన్నారు. ఒకవేళ షారుక్ ఎదురుపడితే ఆయన్ని అడిగే ఒకే ఒక విషయం ఏంటని ప్రశ్నించగా.. ‘పఠాన్’ సినిమా నిజమైన కలెక్షన్స్ ఎంతో చెప్పమంటాను’అని నవ్వుతూ బదులిచ్చింది. ఆమె సరదాగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదం అయ్యాయి. మా హీరో సినిమాకు వచ్చిన రూ.1000 కోట్ల కలెక్షన్స్ నిజమైనవి కావా? అబద్దం చెప్పాల్సిన అవసరం మా హీరోకి ఏముంది? అని షారుక్ ఫ్యాన్స్ కాజోల్ని ట్రోల్ చేస్తుంది. అయితే మరికొంతమంది మాత్రం ఇలా సరదాగా అన్న వ్యాఖ్యలను తప్పుపట్టడం సరికాదని అంటున్నారు. -
'మనకు అలాంటి వారే ఉన్నారు.. హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్'
కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తాజాగా కాజోల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యల వివాదానికి దారితీశాయి. (ఇది చదవండి: మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్కు షాకిచ్చిన నెటిజన్!) ఇంతకీ ఆమె ఏమన్నారంటే? ప్రస్తుతం కాజోల్ ‘ది ట్రైల్ ప్రాజెక్ట్లో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మహిళా సాధికారిత గురించి మాట్లాడారు. మనదేశంలో మార్పు చాలా నెమ్మదిగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన సంప్రదాయాలు, ఆలోచన విధానాలే. ఇదే మన విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతే కాకుండా మన విద్యావ్యవస్థపై సరైన అవగాహన లేని రాజకీయ నాయకులు ఉన్నారు. మనల్ని పాలించే చాలామంది నేతలకు విద్యా విధానంపై అవగాహన లేదని అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల కాజోల్ వివరణ కూడా ఇచ్చింది. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేసింది. నేను కేవలం విద్య, దాని ప్రాముఖ్యత గురించి మాత్రమే ఒక పాయింట్ అవుట్ చేసి మాట్లాడాను. ఇందులో నా ఉద్దేశ్యం రాజకీయ నాయకులను కించపరచడం కాదు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే కొంతమంది గొప్ప నాయకులు కూడా మనకు ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ను ప్రేమ వివాహం చేసుకుంది. (ఇది చదవండి: 'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!) I was merely making a point about education and its importance. My intention was not to demean any political leaders, we have some great leaders who are guiding the country on the right path. — Kajol (@itsKajolD) July 8, 2023 -
కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్తో ఎంట్రీ ఇచ్చేసింది!
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ సరసన సీతగా కనిపించిన నటి కృతి సనన్ బిజినెస్ విమెన్గా కొత్త అవతారమెత్తింది. త్వరలోనే ప్రొడ్యూసర్గా మారనుందంటూ సోషల్ మీడియాలో వార్తలను నిజం చేస్తూ తన ప్రాజెక్ట్ వివరాలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పేరును బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ సందడి మొదలైంది. (డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!) నిర్మాతగా అడుగుపెట్టిన కృతి సనన్ నిర్మాణ సంస్థ బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ను సోషల్ మీడియాలో ఆవిష్కరించింది. అలాగే నిర్మాతగా తన తొలి ప్రాజెక్ట్ ‘దో పట్టి’ అని ప్రకటించింది. ఇందుకోసం ముగ్గరు స్ట్రాంగ్, స్ఫూర్తిదాయకమైన, అపారమైన ప్రతిభావంతులైన మహిళలతో జత కట్టినట్టు వెల్లడించింది కృతి. ప్రొడక్షన్ హౌస్ లోగో రీల్తోపాటు, బాలీవుడ్ నటి కాజోల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా ధిల్లాన్, రిచిక కపూర్తో ఉన్న పిక్ను షేర్ చేసింది. ‘దో పట్టి’ మిస్టరీ థ్రిల్లర్గా రాబోతోందట. అంతేకాదు కృతి ఎనిమిదేళ్ల విరామం తర్వాత దిల్వాలేలో, రోహిత్ శెట్టి, కాజోల్తో తిరిగి కలుస్తున్నట్టు కూడా పేర్కొంది. కృతి నిర్మాణ రంగంలోకి ప్రవేశించడమే కాకుండా రచయిత్రి కనికా ధిల్లాన్కి తొలి వెంచర్గా నెటిఫ్లిక్స్ను ఎంచుకున్నట్టు తెలిపింది. (అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్) 9 సంవత్సరాల డ్రీమ్ సాకారంలో బేబీ స్టెప్స్ వేసాను, నేర్చుకున్నాను, యాక్టర్గా ఎదిగాను! ఫిల్మ్ మేకింగ్లోని ప్రతి బిట్ను, ప్రతీ అంశాన్ని లైక్ చేశా.. ఇపుడు నా కిష్టమైన, నచ్చిన ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి,మరింత తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.ఈ మ్యాజికల్ జర్నీని ప్రారంభించేందుకు రడీగా ఉన్నానంటూ తన సోదరి నూపర్ సనన్కి ట్యాగ్ చేస్తూ నిండు హృదయంతో, బిగ్ డ్రీంకి స్వాగతం అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్తో పాటు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపించారు. వరుణ్ ధావన్, హ్యూమా ఖురేషి, శోభితా ధూళిపాళ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కృతికి కంగ్రాట్స్ చెప్పారు. కాగా కృతి సనన్ టైగర్ ష్రాఫ్తో కలిసి సబ్బీర్ ఖాన్ హీరోపంతి (2014)లో బాలీవుడ్లోకి ప్రవేశించింది.బరేలీ కి బర్ఫీ, మిమీ వంటి మూవీల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్కమింగ్మూవీస్ విషయానికి వస్తే టబు , కరీనా కపూర్లతో కలిసి ‘ది క్రూ’, టైగర్ ష్రాఫ్తో కలిసి ‘గణపతి పార్ట్-1 లో నటిస్తోంది. View this post on Instagram Shared post on Time -
బ్లాక్ శారీలో సొగసులు ఒలకబోస్తున్న బాలీవుడ్ నటి కాజోల్ (ఫోటోలు)
-
'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)
టైటిల్: లస్ట్ స్టోరీస్ 2 నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ ఎడిటర్: సన్యుక్త కజా ఓటీటీ: నెట్ఫ్లిక్స్ విడుదల తేదీ: 29 జూన్ 2023 ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) కథేంటి? ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది. మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు. 'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు. (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) 'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. 'టిల్చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరెలా చేశారు? మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
'అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నా'.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. షాకింగ్ నిర్ణయం! అయితే తాజాగా కాజోల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించింది బాలీవుడ్ భామ. 'నా జీవితంలో చాలా కష్టమైన పరీక్షను ఎదుర్కొబోతున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇన్స్టాలో తన ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చేసిన పోస్ట్ మాత్రమే తన ఖాతాలో కనిపిస్తోంది. కాగా.. కాజోల్కు దాదాపు 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో కారణాలు వెల్లడించలేదు. (ఇది చదవండి: పంచ్ ప్రసాద్కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో) ప్రచారం కోసమేనా? కానీ కొంతమంది ఫ్యాన్స్ ఆమె రాబోయే వెబ్ సిరీస్ 'ది గుడ్ వైఫ్' కోసం ఇదంతా ప్రచార వ్యూహమని భావిస్తున్నారు. 'ది గుడ్ వైఫ్ - ప్యార్, కానూన్, ధోకా' సిరీస్లో కాజోల్ లాయర్ పాత్రను పోషించింది. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానుంది. కాగా.. 2016లో అమెరికాలో తెరకెక్కించిన ఈ సిరీస్లో జూలియానా మార్గులీస్ ప్రధాన పాత్రలో నటించారు. కాజోల్కు మద్దతు అయితే కాజోల్ నిర్ణయం పట్ల నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం మీకు మంచి చేస్తుందని భావిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ మీ జీవితంలో ఎదురైన కష్టతరమైన పరీక్ష నుంచి త్వరలో బయటపడాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో నెటిజన్స్ కాజోల్కు మద్దతుగా నిలుస్తున్నారు. మీ నిర్ణయంతో ఇకపై మీ అందమైన పోస్టులను కోల్పోతామని కొందరు ఫీలవుతుండగా.. మీరు ఇన్ స్టాలో ఉన్నా, లేకున్నా, ఎప్పటికీ మీ మీద ప్రేమ, అభిమానం అలాగే ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్) కాగా.. కాజోల్ త్వరలోనే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెటిఫ్లిక్స్లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ వెబ్ సిరీస్లో మిల్కీ బ్యూటీ తమన్నా, మృణాల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ, తిలోత్తమా షోమే నటించారు. ఈనెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్కు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్తో దారుణ ట్రోల్స్కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అత్యంత చెత్త ఫ్యాషన్తో దారుణంగా ట్రోల్స్కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్షీట్, కర్టెన్ క్లాత్ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
తెల్లగా కనిపించేందుకు సర్జరీ చేసుకున్న కాజోల్?
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే అభినయం మాత్రమే కాదు, అందం కూడా ఉండాలి, ఉన్న అందాన్ని కాపాడుకోవాలి. అందుకోసం తారలు పడే తిప్పలు చెప్పనలవి కాదు. కడుపు మాడ్చుకుంటూ డైటింగ్లు, చెమటలు వచ్చేలా జిమ్లో కసరత్తులు సరేసరి.. కొందరు ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా ఆ మధ్య సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో కాజోల్ స్పందించింది. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నన్ను చాలామాటలన్నారు. నల్లగా ఉంది, బండగా ఉంది. ఎప్పుడూ కళ్లద్దాలు పెట్టుకునే ఉంటుందని విమర్శించారు. అవేమీ నేను పట్టించుకోలేదు. నా గురించి విమర్శించేవాళ్ల కంటే నేను స్మార్ట్, బెటర్ అనే అనుకున్నాను. నేను నాలా ఉండాలనే నిశ్చయించుకున్నాను. అందం కోసం, తెల్లగా మారడం కోసం ఎటువంటి సర్జరీ చేయించుకోలేదు. కేవలం ఎండకు దూరంగా ఉన్నాను. గతంలో పదేళ్లు ఎండలోనే పనిచేయాల్సి రావడంతో స్కిన్ ట్యాన్ అయి నల్లగా అయ్యాను. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఎండలోకి వెళ్లకపోవడంతో చర్మం ట్యాన్ అవడం లేదు. అందుకే తెల్లగా కనిపిస్తున్నాను. అంతే తప్ప తెల్లగా కనిపించేందుకు ఏ సర్జరీ చేయించుకోలేదు' అని చెప్పుకొచ్చింది కాజోల్. కాగా కాజోల్ 17 ఏళ్ల వయసులోనే సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. 1992లో వచ్చిన బేఖుడి చిత్రంతో ఆమె వెండితెరపై అరంగేట్రం చేసింది. బాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 'ద గుడ్ వైఫ్' వెబ్ సిరీస్తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. -
అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్
కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ను ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. అయితే గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడిన కాజోల్ వారి ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అజయ్ను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని కాజోల్ తెలిపింది. కాజోల్ మాట్లాడూతూ..'నేను అతన్ని హల్ చల్ మూవీ సెట్స్లో కలిశాను. అది మా షూటింగ్లో మొదటి రోజు. నిర్మాత నా దగ్గరకు వచ్చి అక్కడున్న వ్యక్తి హీరో అని చెప్పాడు. అతను ఒక మూలకు కుర్చీలో కూర్చున్నాడు. నేను అతన్ని చూసి 'నిజమా? అతనేనా హీరో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. అజయ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి అని గ్రహించా. ఆ తర్వాత మేం ఫ్రెండ్స్ అయ్యాం' అని అన్నారు. కాగా.. వీరిద్దరు నటించిన హల్చల్ 1995లో థియేటర్లలో విడుదలైంది. కాగా.. అజయ్ దేవగన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భోలా బాక్సాఫీస్ విజయంతో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనగరాజ్ చిత్రం తమిళ హిట్ మూవీని కైతిని హిందీ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అజయ్తో పాటు టబు, గజరాజ్ రావు, దీపక్ డోబ్రియాల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. -
అదిరిపోయే లుక్తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్
బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరించింది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై కొంతమంది నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కాజోల్ తాజాగా ముంబయిలో తన భర్త నటించిన చిత్రం 'భోలా' ప్రీమియర్ షోకు హాజరైంది. (ఇది చదవండి: కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్) ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు డిఫరెంట్ లుక్లో కనిపించింది. ఆమె వెంట కొడుకు యుగ్, తల్లి తనూజ, భర్త అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కాజోల్ డ్రెస్పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరైతే కాజోల్ మరింత అందంగా కనిపిస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది ఆమె లుక్, నడకపై ట్రోల్స్ చేశారు. ఆమె దుస్తులతో పాటు నడక మరింత విచిత్రంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా కాజోల్ ప్రస్తుతం గర్భవతినా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే గతంలోనూ కాజోల్ ముఖానికి సర్జరీ చేయించుకున్నారని ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. #Kajol ♥️#jdreturnz pic.twitter.com/2vzI0SzcX8 — JDReturnz (@JdReturnz) March 30, 2023 -
ఆ చిత్రం చూసే అమ్మాయిలతో మాట్లాడటం నేర్చుకున్నా: రణ్బీర్
దర్శక-నిర్మాత యశ్ రాజ్ చొప్రా స్మృత్యంజలిగా నెటిఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ సిరీస్ను రిలీజ్చేస్తోంది. ‘ది రొమాంటిక్స్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరిని రేపు(ఫిబ్రవరి 14న) వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్తో యశ్ చొప్రాతో ఉన్న అనుబంధం, ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు లవ్స్టోరి చిత్రాలపై వారి అభిప్రాయలను సేకరించింది నెట్ఫ్లిక్స్. ఈ సందర్భంగా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను ఉద్దేశిస్తూ ‘ది రొమాంటిక్స్’లో షారుక్ ఖాన్, కాజోల్ ఈ మూవీ విశేషాలను పంచుకోగా.. ఆయుష్మాన్ ఖురానా, రణ్బీర్ కపూర్ ఈ మూవీ తమని ఎంతగా ప్రభావితం చేసిందో తెలిపారు. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే ఈ సందర్భంగా బాలీవుడ్ లవర్ బాయ్ రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘దిల్వాలే దుల్హనియా లేజాయంగే(DDLJ) మా తరానికి నిర్వచనంగా నిలిచింది. ఈ సినిమా చూసినప్పుడు నేను పొందిన అనుభూతి మాట్లల్లో చెప్పలేను. డిడిఎల్జే నాపై ఎంతో ప్రభావం చూపింది. ఎంతగా అంటే ఈ సినిమా చూశాకే నా తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాను. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలో తెలిసింది. అలాగే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా ఈ సినిమా చూసే నేర్చుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ డాక్యుమెంటరీ సిరీస్ని ఆస్కార్, ఎమ్మీ అవార్డుల నామినీ స్మృతి ముంద్రా నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. చదవండి: ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
- Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
- Lok Sabha Election 2024: సెన్స్క్స్ డౌట్!
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
Advertisement