-
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ఊహించని షాక్
బెంగళూరు: లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదైంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలో సంచనలంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్పై సిట్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (బీ) (ఎన్), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ప్రజ్వల్ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్పై నమోదైన రెండో కేసు.ఇదిలా ఉండగా.. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. Karnataka government's special investigation team (SIT) filed a rape case against Janata Dal (Secular)'s Hassan MP #PrajwalRevanna. This is the second #FIR against Prajwal Revanna, who is also the grandson of JDS chief and former PM HD Deve Gowda.The FIR against JDS' (cont) pic.twitter.com/A6tKUIFsYu— News Daily 24 (@nd24_news) May 3, 2024 ఈ నేపథ్యంలో ప్రజ్వల్ ట్విట్టర్ వేదికగా‘సిట్ ముందు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ఒక పోస్టు చేశాడు. కాగా, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై అత్యాచారం కేసు కూడా నమోదు చేసింది.ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తేలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్.. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయారు. ఈ క్రమంలో మరోవైపు అతడి పాస్పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్ను భారత్కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రజ్వల్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
Rahul Gandhi: 400 మంది మహిళలపై అఘాయిత్యం
శివమొగ్గ/రాయ్చూర్: కర్ణాటకలో 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ అంటూ జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, రాయ్చూర్ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈ సెక్స్ కుంభకోణం గురించి మోదీకి ముందే తెలుసు. తలచుకుంటే సెకన్లలో ప్రజ్వల్ను అరెస్ట్చేసేవారు. సీబీఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అయినా కావాలనే పారిపోనిచ్చారు. ప్రజ్వల్ను మోదీ రక్షించాల్సిన అవసరమేంటి? ప్రజ్వల్ కోసం ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన గత్యంతరమేంటి?’’ అని మోదీని రాహుల్ నిలదీశారు. కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు ‘‘అధికారం, కూటమి కోసం ప్రజ్వల్ను కాపాడుతున్నారని కర్ణాటక మహిళలు గ్రహించారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని, హోం మంత్రి ప్రజ్వల్ను రక్షిస్తున్నారు. ఇదే మాకు, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య ఉన్న తేడా. అధికారం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. ఘటన తర్వాత కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు. రాష్ట్రంలో పాల్గొనాల్సిన అన్ని సమావేశాలు, ర్యాలీలను మోదీ రద్దుచేసుకున్నారు’’ అని అన్నారు. ‘‘ బాధితుల్లో మైనర్లూ ఉన్నారు. అంతా తెల్సి కేంద్ర హోం మంత్రి అమిత్షా మౌనంగా ఉన్నారు. నిజంగా ఇది నేరం. ఆయనపై కేసు నమోదుచేయాలి. రేపిస్ట్కు మద్దతుగా ఓట్లు అడిగినందుకు దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్లకు మోదీ క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్ చేసింది తెల్సి కూడా మీ ఓట్లను మోదీ అడిగారని కర్ణాటక మహిళలు గ్రహించాలి. బీజేపీ నేతలకు ప్రజ్వల్ రేపిస్ట్ అని ముందే తెలుసు. అయినాసరే ఆయనకు మద్దతు పలికి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు’’ అని ఆరోపించారు. సమానత్వం కోరితే నక్సలైట్లు అంటున్నారు ‘‘సమానత్వం కోరితే వారిని బీజేపీ చీఫ్ నడ్డా నక్సలైట్ అంటున్నారు. దళితులు, వెనుకబడిన వాళ్లు, గిరిజనులు సమానత్వం కావాలంటున్నారు. అంతమాత్రాన వారంతా నక్సలైట్లు అయిపోతారా? ఇలా మాట్లాడిన నడ్డా వెంటనే తన పార్టీ చీఫ్ పదవికి రాజీనామాచేయాలి. నడ్డా వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్చేశారు. -
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్లపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణనకు వేగవంతం చేసింది. గురువారం ప్రజ్వల్పై సిట్ బృందం.. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయన కనిపించిన వెంటనే అరెస్ట్ చేసే విధంగా సిట్ వారెంట్ జారీ చేసింది. దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్ అవుట్ సర్క్యులర్ ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ విమానాశ్రయం, ఓడరేవు, సరిహద్దు చెక్పోస్ట్ కనిపిస్తే.. నిర్బంధించాలని తెలిపింది. కాగా హసన్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ సంబంధించినవిగా కొన్ని అసభ్యకర వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులపై పలువురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్తో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. ‘సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ప్రజ్వల్ను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్ సెక్స్ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్ స్కాండల్ను దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్ వీడియోలు హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.ప్రజ్వల్ లోక్సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్, బెంగళూరుల్లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్డ్రైవ్ బయటికి రావడంతో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. -
స్పెయిన్ వరుడు, కర్ణాటక వధువు
కర్ణాటక: మనసుపడితే మూడుముళ్ల పండుగకు జాతిభేదాలతో పనేముంది. కొన్నిసార్లు దేశ సరిహద్దులు కూడా దాటి జంటలు ఒక్కటవుతాయి. ఇదే కోవలో స్పెయిన్ యువకుడు, మండ్య యువతి ప్రేమ బంధాన్ని పెళ్లితో సుస్థిరం చేసుకున్నారు. వివరాలు.. జిల్లాలోని కేఆర్ పేటె పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి రవీంద్రనాథ కుమార్తె దీక్షిత కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్లో యోగా టీచర్గా పనిచేస్తోంది. స్పెయిన్లోని బార్సిలోనాకు చెందిన జాన్ వైడల్ ఆశ్రమానికి వస్తుండేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ మొగ్గ తొడిగింది. పెద్దలకు చెప్పగా రెండు కుటుంబాలు పెళ్లికి సమ్మతించారు. దీంతో మంగళవారం కెఆర్ పేటెలోనే సంప్రదాయ రీతిలో వివాహ వేడుక జరిగింది. వరుని తల్లిదండ్రులు, తోబుట్టువులు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement