-
గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై మాజీ కెప్టెన్ క్రిష్టమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. తమకు ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేకపోయినా వారికి వరుస అవకాశాలు ఇస్తోందంటూ మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసేందుకు.. అర్హత కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టడం ద్వంద్వనీతికి నిదర్శనం అంటూ బీసీసీఐ విధానాలను విమర్శించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది.ఐర్లాండ్తో జూన్ 5 నాటి మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.శుబ్మన్ గిల్ అసలు ఫామ్లోనే లేడుఇందులో ఓపెనర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చోటు దక్కించుకోగా.. శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘‘శుబ్మన్ గిల్ అసలు ఫామ్లోనే లేడు.అయినా అతడికి జట్టులో స్థానం కల్పించారు. నిజానికి రుతురాజ్ గైక్వాడ్కు టీమ్లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 17 ఇన్నింగ్స్లో 500 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద సెంచరీ చేశాడు.కానీ సెలక్టర్లకు శుబ్మన్ గిల్ మాత్రమే కనిపిస్తాడు. వరుసగా విఫలమైనా అతడికే ఛాన్సులు ఇస్తారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వరుస వైఫల్యాలు జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయలేవు.తమకు నచ్చిన ఆటగాళ్లకేసెలక్షన్ విషయంలో ఫేవరిటిజం ఉంది. తమకు నచ్చిన ఆటగాళ్లకే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు’’ అంటూ తూర్పారబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ చీకి చిక్కా వేదికగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్లో కలిపి 509 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు.మరోవైపు.. శుబ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా, ఆటగాడిగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 320 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చిక్కా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. వెంటనే డకౌటయ్యాడు! వీడియో “Gill playing ahead of Rutu baffles me. Be is out of form and Rutu has had a better t20i career than gill. Gill will keep failing and he ll keep getting chances, he has favouritism of the selectors, this is just too much of favouritism” Krishnamachari Srikanth in his YT vid pic.twitter.com/PJmeiihxVx— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) May 1, 2024 -
'కోహ్లిని అలా చూసి చాలా బాధపడ్డా.. 11 మంది బ్యాటర్లతో ఆడాలి'
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు దుమ్ములేపినప్పటికి .. బౌలర్లు మాత్రం మరోసారి చేతులెత్తేశారు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా ఆర్సీబీ బౌలర్లు బౌలింగ్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ను సాధించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్లపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్ చాలా దారుణంగా ఉందని శ్రీకాంత్ సీరియస్ అయ్యాడు. "ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్ వంటి సీనియర్ బౌలర్లు కూడా పూర్తిగా తేలిపోయారు. నిన్నటి మ్యాచ్లో విల్ జాక్స్ మినహా మిగితా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీకి నేను ఇచ్చే సలహా ఒక్కటే. రాబోయో మ్యాచ్ల్లో ఆర్సీబీ 11 మంది బ్యాటర్లతో ఆడాలి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ రెండు ఓవర్లు, ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ 4 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అదే విధంగా విరాట్ కోహ్లి కూడా బౌలింగ్ చేయాలి. నిన్నటి మ్యాచ్లో కోహ్లి 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే అన్ని పరుగులు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే కోహ్లి ఒక మంచి బౌలర్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు స్టేడియం బయటకు బంతులను కొడుతుంటే కోహ్లి ముఖం వాడిపోయింది. కోహ్లిని అలా చూసిన నేను చాలా బాధపడ్డాను. బ్యాటింగ్ చేసే సమయంలో కూడా కోహ్లి చాలా కోపంగా ఉన్నాడు. అందుకు కారణం ఆర్సీబీ బౌలర్లే" అని తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు. -
సెంచరీ కోసం స్వార్ధం.. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముంది..?
బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతమైన సెంచరీ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ చేసినప్పటికీ విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోహ్లి సెంచరీ మార్కును చేరుకునే క్రమంలో స్ట్రయిక్ రొటేట్ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, కోహ్లి సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్బొరో కూడా సహకరించాడని (వైడ్ ఇవ్వకుండా) కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో కోహ్లికి టీమిండియా మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బాసటగా నిలిచాడు. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముందని కోహ్లిని ట్రోల్ చేస్తున్న వారిని ప్రశ్నించాడు. క్రికెట్ పరిజ్ఞానం లేని వాళ్లే ఈ విషయంలో కోహ్లిని నిందిస్తారని అన్నాడు. మామూలుగా సెంచరీ చేయడమంటేనే విశేషం. అలాంటిది వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలో, అందులోనూ ఛేదనలో మూడంకెల స్కోర్ను చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. What is wrong in what virat did? I question ppl who don't understand cricket,note it is a huge deal to score A century in a world cup,@imVkohli deserves this & much more! kudos to a team man like @klrahul who deserved it against Aus in Chennai ! Enjoy when u still can #INDvsBAN — Kris Srikkanth (@KrisSrikkanth) October 19, 2023 అలాంటప్పుడు కోహ్లి చేసింది తప్పెలా అవుతుందని నిలదీశాడు. వాస్తవానికి కోహ్లి సాధించిన దాని గురించి పొగడాల్సింది పోయి, విమర్శలు చేయడమేంటని ప్రశ్నించాడు. ఛేదనలో ఒత్తిడికి లోనుకాకుండా, సహనం కోల్పోకుండా చివరివరకు బ్యాటింగ్ చేసినప్పుడు సెంచరీ మార్కును చేరాలనుకోవడంలో తప్పేమీ లేదని అన్నాడు. కోహ్లి ఈ సెంచరీకి వందకు వంద శాతం అర్హుడని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లి స్వార్ధపరుడని విమర్శిస్తున్న జనాలు.. కొన్ని మ్యాచ్ల పాటు అతను సెంచరీ చేయకపోతే దుమ్మెత్తిపోయరా అని ప్రశ్నించాడు. ఇక అంపైర్ వైడ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం (కోహ్లి 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు) అనేది అతని పరిధిలోని అంశమని, దీనికి కోహ్లి సెంచరీని ముడిపెట్టడం సమంజసం కాదని ట్విటర్ వేదికగా కోహ్లిని విమర్శిస్తున్న వారికి చురకలు పెట్టాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
‘భారీ విజయాలపై ఇంగ్లండ్ దృష్టి పెట్టాలి.. లేదంటే కష్టమే'
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మరో విజయంపై కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్తో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంగ్లండ్ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. "డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు ఆదివారం అఫ్గానిస్తాన్తో పెద్దగా సవాలైతే ఎదురుకాదు. ఢిల్లీలో అఫ్గాన్ స్పిన్నర్లకు పిచ్ నుంచి సానుకూలత లేకపోతే మ్యాచ్ ఏకపక్షమయ్యే ఫలితంలో ఏ మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మ్యాచ్కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పొచ్చు. అయితే గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్ బరిలోకి దిగేందుకు, ఫామ్ను అందిపుచ్చుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్కు ఈ స్టార్ ఆల్రౌండర్ ఫిట్నెస్ ఎంతో కీలకం. ఏడాది క్రితం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ ఇంగ్లండ్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్ లో పునరాగమనం చేశాడు. 50 ఓవర్ల మ్యాచ్లో అతను ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడని ఇదివరకు ఎన్నో సార్లు రుజువు చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆ్రస్టేలియా చిత్తుగా ఓడటం ఇంగ్లండ్ సహా సెమీస్ బరిలో ఉంటామనుకున్న మిగతా జట్ల ఉత్సాహంపై నీళ్లుచల్లింది. ఎందుకంటే ఇంగ్లండ్ కూడా న్యూజిలాండ్ చేతిలో అలాంటి పరాజయాన్నే చవిచూసింది. ఇలాంటి అత్యల్ప స్కోర్ల మ్యాచ్లతో నాకౌట్ దశ చేరేందుకు చివరికొచ్చేసరికి రన్రేట్ కీలకమవుతుంది. కాబట్టి సెమీస్లో ఎవరూ ఖాయమని అనుకోవడానికి లేదు. అయితే ఇంగ్లండ్... అఫ్గాన్ తదితర జట్లపై భారీ విజయాలపై దృష్టి పెడితే మంచిది. ఢిల్లీ లాంటి పిచ్పై ఇంగ్లండ్ బ్యా టర్లు చెలరేగేందుకు చక్కని అవకాశం కలి్పస్తుంది. చదవండి: విలియమ్సన్కు గాయం: మూడు మ్యాచ్లకు దూరం -
'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్కప్ సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే'
వన్డే వరల్డ్కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంచుకున్నాడు. భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. "రాబోయే ఏడు వారాలు క్రికెట్ అభిమానులకు అన్ని రకాల వినోదం ఉండబోతుంది. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ భారత్కు తిరిగి వస్తోంది. సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడతాయి. లీగ్ దశ ముగిశాక ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు నాకౌట్ దశ సెమీఫైనల్కు చేరుకుంటాయని అంచనా. మాజీ విజేత భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్లను కచ్చితమైన టైటిల్ ఫేవరెట్స్గా పరిగణిస్తాను. భారత బ్యాటర్లతోపాటు బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. చివరి నిమిషంలో గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ జట్టులోకి రావడం భారత్కు మరింత మేలు చేసే విషయం. ఇక ఇంగ్లండ్ దూకుడైన ఆటతో తమకంటూ ప్రత్యేక బ్రాండ్ను సృష్టించుకుంది. బెన్ స్టోక్స్ కూడా అందుబాటులోకి రావడంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా మారింది. బౌలింగ్లోనూ కెప్టెన్ జోస్ బట్లర్కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పెద్ద టోరీ్నల్లో, కీలక సమయాల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటు. అందుకే ఆ జట్టు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో సీజన్ల నుంచి ఐపీఎల్ ఆడటంద్వారా చాలా మంది ఆ్రస్టేలియా ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రదర్శన ఆస్ట్రేలియాకు కీలకం కానుంది. ప్రపంచకప్లో అత్యంత నిలకడమైన జట్లలో ఒకటిగా న్యూజిలాండ్కు పేరుంది. కేన్ విలియమ్సన్ రూపంలో ఆ జట్టులో సూపర్స్టార్ ఉన్నా... మిగతా ఆటగాళ్లు కూడా చివరి వరకు పోరాడేందుకు వెనుకాడరు. ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ లేకపోవడం ఆ జట్టుకు లోటుగా ఉన్నా అతడి లేని లోటును భర్తీ చేసే ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో చాలా మంది ఉన్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచకప్కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన న్యూజిలాండ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement