-
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో యశస్వి జైస్వాల్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్లో శనివారం జరిగిన మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
Asia Cup 2023- India vs Pakistan- Virat Kohli Century: దాయాది పాకిస్తాన్తో మ్యాచ్ అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్కప్-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్కు తన అద్భుత ఇన్నింగ్స్తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా కోహ్లి ఇక తాజాగా మరోసారి పాక్పై అదిరిపోయే బ్యాటింగ్తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్-2023 సూపర్ -4 మ్యాచ్లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి ఇన్నింగ్స్లో ఏకంగా 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు.. ప్రపంచంలో తొలి బ్యాటర్గా ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో 47వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ను కోహ్లి అధిగమించాడు. చెలరేగిన బ్యాటర్లు.. టీమిండియా భారీ స్కోరు ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్లో రిజర్వ్ డే అయిన సోమవారం టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి అజేయ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకు ముందు ఆదివారం ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుబ్మన్ గిల్(58) అర్ధ శతకాలు సాధించారు. కాగా కొలంబోలో జరగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. వన్డేల్లో 13 వేల పరుగులు చేసేందుకు.. ఎవరికి ఎన్ని ఇన్నింగ్స్ అవసరమయ్యాయంటే? 1. విరాట్ కోహ్లి- 267 2. సచిన్ టెండుల్కర్- 321 3. రిక్కీ పాంటింగ్- 341 4. కుమార్ సంగక్కర- 363 5. సనత్ జయసూర్య- 416. చదవండి: రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్ 💯 NUMBER 4️⃣7️⃣ King @imVkohli, take a bow! 🙌😍 Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO — Star Sports (@StarSportsIndia) September 11, 2023 -
వాళ్లు మమ్మల్ని అవుట్ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా..
IPL 2023 RR vs RCB: ‘‘ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ మరీ చెత్తగా ఉంది. మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. ప్రత్యర్థిని 171 పరుగులకు కట్టడి చేశారు. ఇలాంటి పిచ్ మీద ఈ టార్గెట్ సులువుగానే ఛేదించవచ్చు. అయితే, పవర్ ప్లేలోనే మా వాళ్లు తడబడ్డారు. పరుగులు రాబట్టాలన్న తొందరలో వికెట్లు పారేసుకున్నారు’’ అని రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర అన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ పరాజయం పాలైంది. 59 పరుగులకే ఆలౌట్ అయి 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సంజూ శాంసన్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పుడే ఆట ముగిసిపోయింది ఈ నేపథ్యంలో సంగక్కర మాట్లాడుతూ.. ‘‘భాగస్వామ్యాలు నమోదు చేయాలని మా వాళ్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ.. పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయాం. అప్పుడే మా ఆట దాదాపుగా ముగిసిపోయింది. సంజూ తరచుగా ఈరోజు ఆడినటువంటి షాట్ ఆడుతూ ఉంటాడు. కానీ అన్నిసార్లూ రోజులు మనవి కావు. అతడు దూకుడైన ఆటగాడు. జట్టును గెలిపించాలనే తపనతో ఆడతాడు. అయితే, టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పవర్ ప్లేలో సగం వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. వాళ్లు అవుట్ చేయలేదు.. మా అంతట మేమే నిజానికి ఆర్సీబీ బౌలర్లు మమ్మల్ని అవుట్ చేసినట్లు అనిపించలేదు. మాకు మేమే అవుటైనట్లు కనిపించింది. ఈ ఓటమి ఎవరో ఒకరు బాధ్యులు కారు. బ్యాటింగ్ విభాగం మొత్తం ఈరోజు విఫలమైంది’’ అని విచారం వ్యక్తం చేశాడు. తదుపరి పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తామని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఆర్సీబీతో ఆదివారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా.. సంజూ శాంసన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జోరూట్ 10, తర్వాతి స్థానాల్లో వచ్చిన పడిక్కల్ 4, షిమ్రన్ హెట్మెయిర్ 35, ధ్రువ్ జురెల్ 1, అశ్విన్ 0, ఆడం జంపా 2, సందీప్ శర్మ 0, కేఎమ్ ఆసిఫ్ 0 పూర్తిగా విఫలమయ్యారు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్రౌండర్పై వివాదాస్పద వ్యాఖ్యలు 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్లో అదరగొట్టాడు'
ఐపీఎల్-2022లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్తాన్ రాయల్స్ ఫైనల్కు చేరింది. కాగా రాజస్తాన్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెడ్ మెక్కాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో జోస్ బట్లర్ అదగరగొట్టగా.. బౌలింగ్లో మెక్కాయ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చిన మెక్కాయ్ మూడు కీలక వికెట్ల పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్కు ముందు మెక్కాయ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ విషయం గురించి మెక్కాయ్కు సమాచారం అందింది. అయినప్పటికీ ఓ వైపు బాధను దిగమింగుతూ మెక్కాయ్ అత్యుత్తమంగా రాణించాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంగక్కర తెలిపాడు. "మెక్కాయ్ తల్లి క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముందు అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మెక్కాయ్ అద్భుతంగా రాణించాడు. కాగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది అని"సంగక్కర పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' -
'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ నిరోషన్ డిక్వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement