-
సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
ఎన్నికల్లో సింపతి పొందేందుకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లారని అయ్యారని బీజేపీ న్యూఢిల్లీ లోక్సభ అభ్యర్ధి బన్సూరీ స్వరాజ్ అన్నారు.కేజ్రీవాల్ తన వ్యూహంలో భాగంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన తొమ్మిది సమన్లపై స్పందించ లేదన్నారు. కాబట్టే దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్ను కస్టోడియల్ ఇంటరాగేషన్కు తీసుకెళ్లాయని అన్నారు.ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాల్ని కైవసం చేసేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బీజేపీ గెలుపు గుర్రాల్ని బరిలోకి దించింది. కాగా, బన్సూరీ స్వరాజ్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆప్- కాంగ్రెస్ ఒప్పందంలో భాగంగా అదే స్థానం నుంచి ఆప్ నేత సోమనాథ్ భారతి పోటీ చేస్తున్నారు. -
జూన్ 4 తర్వాత జరిగేది ఇదే.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్4 లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం డూబ్లికేట్ ఎన్సీపీ, డూబ్లికేట్ శివసేన తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.నార్త్ మహరాష్ట్ర నందూర్బర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై సెటైర్లు వేశారు.ఓ పెద్దాయన 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు.నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులోనకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్ పవర్, ఎక్నాథ్ షిండ్తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కుఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్ పవార్ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. -
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
కోల్కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
ఒడిశాలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్పూర్ లోక్సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్లో రోడ్షో, మే 11న బొలంగీర్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్పూర్, కోరాపుట్లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్ ద్వయం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర్యటనలు చేయనున్నారు. -
అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
ఉత్తర్ ప్రదేశ్ అమోథీ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమోథీ నియోజక వర్గం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల వారసత్వమని అభివర్ణించారు. ముసాఫిర్ఖానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ శర్మ తనని తాను రాహుల్ గాంధీ కుటుంబానికి సేవకునిగా పేర్కొన్న ఆయన.. అమోథీ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అమానత్ (సందర్భాన్ని బట్టి ఆస్తి, సందప) అని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు దానిని తిరిగి ఇచ్చేస్తానని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని అమోథీ నియోజకర్గం కాంగ్రెస్ కంచుకోట. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి కిషోరి లాల్ శర్మ.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కుటుంబం అమోథీని రాజకీయాల పరంగా చూడలేదు. వారు తమ సొంత ఇల్లులా, కుటుంబంగా భావించారు. 1983 నుండి ఈ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నాను. చివరి నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అందుకే నేను గాంధీ కుటుంబానికి సేవకుడిగా, అమోథీ నియోజవర్గానికి సేవకునికిగా భావిస్తున్నారు. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని పేర్కొన్నారు. -
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
Lok Sabha Election 2024: 14న ప్రధాని మోదీ నామినేషన్
వారణాసి: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అజయ్ రాయ్ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాదిలో ఓటమి భయంతో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. భాగ్ రాహుల్ భాగ్, రాహుల్ భాగ్ ఇదే ట్రెండ్ అవుతోంది. రాహుల్ గాంధీ మీరు ప్రధాని మోదీని చూసి బయపడొద్దని చమత్కరించారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లాడు అతడిని ప్రోత్సహించాలి. కానీ ప్రజలు అతనిని తిరస్కరించారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేయాలనే రాహుల్ నిర్ణయం వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ద్రోహం చేశారని బీజేపీ నేత ఆరోపించారు. వాయనాడ్ ఓటమి భయంతో అమేథీకి బదులు రాయ్బరేలీ (ఎన్నికల్లో పోటీ చేసేందుకు) వచ్చారని దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్కొన్నారు.కాగా, గత రెండు దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
హైదరాబాద్, సాక్షి : మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ తమపై, తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్పై చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు(బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. నిషేధ సమయంలో ఎలాంటి రోడ్షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పుర్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్ ప్రతాలు అందించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీలు నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, అప్నాదల్ నేత, కేబినెట్ మంత్రి అశిష్ పటేల్లు ఆమె వెంట ఉన్నారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలపైబీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.వరుణ్ గాంధీకి నో టికెట్వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్ లోక్సభ టికెట్ను బీజేపీ నిరాకరించింది. జితిన్ ప్రసాదకు అప్పగించింది.2009 లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. -
రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ, అమోథీ లోక్సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి (సీఈసీ) తెరదించింది.24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాలుగు లోక్సభ స్థానాల అభ్యర్ధులను ప్రకటించింది.అయితే లోక్సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం ఉండడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసిన లోక్సభ స్థానాల అభ్యర్ధుల్లో గుర్గావ్ నియోజకవర్గం నుంచి రాజ్ బబ్బర్, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా నియోజకవర్గం నుండి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ,హమీర్పూర్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ రైజాదాను పోటీకి దించింది. ముంబై నార్త్ నుంచి భూషణ్ పాటిల్ను ఖరారు చేసింది.హమీర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచారు. అనురాగ్ ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव 2024 के लिए हरियाणा, हिमाचल प्रदेश और महाराष्ट्र के कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/ys7tVzC61y— Congress (@INCIndia) April 30, 2024 -
ఓపిక నశించింది.. అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట అమేథీ లోక్సభ అభ్యర్ధి ఎవరనేది స్పష్టత రాలేదు. అయితే అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసి విసిగిపోయిన కార్యకర్తలు అమేథీ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యలయం బయట అభ్యర్ధిని ప్రకటించాలని ప్లకార్డ్లతో నిరసన చేపట్టారు. అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్మృతి ఇరానీ 4,68,514 ఓట్లు సాధించగా, రాహుల్ గాంధీ 4,13,394 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈ సారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేయలేదు. అమోథీ, వయనాడ్ ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరూ పోటీ చేస్తారని, అమేఠీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని ఇలా రకరకాలుగా కాంగ్రెస్ వర్గాల నుంచి లీకులు కొనసాగుతున్నాయి.మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతుండగా.. సహనం కోల్పోయిన కార్యకర్తలు తమ లోక్సభ స్థానానికి అభ్యర్ధిని ప్రకటించాలని ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది. -
ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
లోక్సభ ఎన్నికల పోలింగ్ తరుణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ హోమంత్రి రాంనివాస్ రావత్ బీజేపీలో చేరడం చర్చాంశనీయంగా మారింది.ఆరుసార్లు ఎమ్మెల్యేగామధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ రాహుల్గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు వెయ్యి మంది మద్దతుదారులతో బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. రావత్ విజయపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో ఒకరు.బీజేపీలోకి కమల్ నాథ్ సన్నిహితుడు కాగా,ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్కు అత్యంత సన్నిహితుడు, అమర్వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారునామినేషన్ ఉపసంహరణ.. ఆపై బీజేపీలోకి జంప్మధ్యప్రదేశ్ ఇండోర్లో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 29న ఇండోర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కాగా, బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ నేత అక్షయ్ కాంతి బామ్ను రంగంలోకి దించింది. అనూహ్యంత్ అక్షయ్ కాంతి బామ్ బీజేపీ చెంతకు చేరడం మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. -
ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఎన్నికల ప్రచారానికి గైర్హాజరు కావడంపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. రాఘవ్ చద్దా కంటి శస్త్ర చికిత్స కోసం యూకేలో ఉన్నారని తెలిపారు. రాఘవ్ కళ్లకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందేందుకు యూకే వెళ్లారు. సమస్య తీవ్రమైనదని, సకాలంలో చికిత్స అందించకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉందని రాఘవ్ చద్దా తన చెప్పారంటూ భరద్వాజ్ వెల్లడించారు.రాఘవ్ చద్దా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కోలుకున్న వెంటనే ఆయన ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. చికిత్స కోసం భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నాటి నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్ధులకు మద్దతుగా సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయడంతో పాటు ఇతర పరిణామాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందిస్తూ వస్తున్నారు. -
ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
దివంగత సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరుణంలో శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు. శివపాల్ యాదవ్కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్ యాదవ్ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెయిన్పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్ స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. -
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
ప్రతిపక్ష ఇండియా కూటమి బయపడుతోందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలపై బీహార్ రాష్ట్రీయ జనతాదళ నేత, రాష్ట్ర మాజీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు.‘లోక్సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు షాకింగ్ ఫలితాలు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో మేం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాము. స్వాగతిస్తున్నాము. ప్రధానమంత్రి బీహార్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. కానీ ఏదీ అమలు చేయలేదు’అని తేజస్వీ యాదవ్ అన్నారు.ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఒక్కో సంవత్సరం ప్రాతిపదికన ప్రధాన మంత్రులను ఎన్నోవాలని చూస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలపై అమిత్ షా స్పందించారు.దేశం నడపాల్సిన మార్గం ఇది కాదని, మూడు దశాబ్దాలకు పైగా అస్థిర ప్రభుత్వాలు అధికారంతో దేశం ఇప్పటికే చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లించిందని అన్నారు. ‘ఈ దేశం మూడు దశాబ్దాలుగా అస్థిరతకు మూల్యం చెల్లించింది. అస్థిర ప్రభుత్వాలు మూడు దశాబ్దాలు నడిచాయి. అయితే గత 10 ఏళ్లలో దేశానికి బలమైన నాయకత్వం వచ్చింది. రాజకీయ సుస్థిరత మాత్రమే కాదు, విధానాల్లోనూ స్థిరంగా ఉంది’ అని స్పష్టం చేశారు.ఇండియా కూటమి అలా కాదు.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఒక ఏడాది శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం ప్రధానులు బాధ్యతలు చేపడతారు. అప్పటికి ఇంకా సమయం ఉంటే రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని ఎద్దేవా చేశారు. దేశాన్ని నడిపించే విధానం ఇది కాదు’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీ జర్మన్ నియంత హిట్లర్ మంత్రి జోసెఫ్ గోబెల్స్ను స్ఫూర్తిగా తీసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.లోక్సభ ఎన్నికలపై ఓ ఛానల్ ఇంటర్వ్యూ జైరాం రమేష్ మాట్లాడూత.. రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోదీ ప్రచార విలువల గురించి జోసెఫ్ గోబెల్స్ గురించి చదివి, ఆయన నుండి ప్రేరణ పొంది ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు.‘మీరు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి, దానిని పునరావృతం చేస్తూ ఉంటే, చివరికి ప్రజలు దానిని విశ్వసిస్తారు’ అని గోబెల్స్ పేర్కొన్నారని జైరాం గుర్తు చేశారు.ప్రైవేటు ఆస్తులను సర్వే చేసి, స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో బెదిరిస్తున్నదని మోదీ చేసిన వ్యాఖ్యలపై జైరాం మాట్లాడుతూ.. మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేసినంత కాలం సత్యం నశించి పోతుందని అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ న్యాయ పత్రంలో వారసత్వపు పన్ను గురించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ బీజేపీ మాత్రం వారసత్వపు పన్ను గురించి మరోలా ప్రచారం చేస్తోందని జైరాం రమేష్ ధ్వజమెత్తారు. -
స్మృతి ఇరానీ నామినేషన్.. అమోథీ బరిలో రాహుల్, ప్రియాంక
ఉత్తర్ప్రదేశ్లో అత్యంత కీలకమైన అమేథీ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..అమోథీ ఎంపీగా బాధత్యలు నిర్వహించిన ఐదేళ్ల కాలంలో తాను పీఎం ఆవాస్ యోజన పథకం కింద సుమారు 1,14,000 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. 1.5లక్షల కుటుంబాలకు ఎలక్ట్రసిటీ కనెక్షన్లు, 4 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఈ సారి ఎన్నికల్లోనూ తాను విజయం సాధిస్తామని స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయోమయంలో కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కంచుకోట అమోథీలో మరోసారి విజయ బావుటా ఎగురవేయాలని అధికార పార్టీ బీజేపీ భావిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాత్రం ఆ స్థానంలో స్మృతి ఇరానీకి ధీటైన అభ్యర్ధిని నిలబెట్టేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమోథీ బరిలో రాహుల్, ప్రియాంకఇప్పటికే పలు మార్లు అమోథీలో కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై తీవ్ర కసరత్తు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్ధులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,రాబర్ట్ వాద్రాలేనంటూ ప్రచారం జరుగుతోంది.. కానీ ఓ కొలిక్కి రాలేదు. ఈ తరుణంలో ఏప్రిల్ 26 తర్వాత కాంగ్రెస్ కమిటీ భేటీలో అమోథీ, రాయబరేలీ స్థానాల్లో అభ్యర్ధుల ఖరారు చేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో అయా స్థానాల అభ్యర్ధులు ఎవరనేది క్లారిటీ ఇవ్వనుంది -
‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది. -
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
దొందూ.. దొందే, సీపీఐ.. కాంగ్రెస్పై దీదీ విమర్శలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.మాల్దా జిల్లా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోందని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ పోరాటం చేస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత భారత కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.‘బెంగాల్లో కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు. ఇక్కడ సీపీఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. రెండూ బీజేపీతో చేతులు కలిపినట్లు, మీరు (ఓటర్లు) కాంగ్రెస్ లేదా సీపీఐ(ఎం)కి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించుకోవడం, మోదీకి సహాయం చేయడం ఆ రెండు పార్టీల లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని’ దీదీ ఆరోపించారు.పశ్చిమ బెంగాల్లోని కాంగ్రెస్, సీపీఐ నాయకులు బీజేపీ స్వరంతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలనను నడుపుతున్న టీఎంసీ విధానాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.దేశంలో ప్రతిపక్షాల కూటమి బలంగా ఉంది. దానికి ఇండియా కూటమి అని పేరు పెట్టింది నేనే. కానీ బెంగాల్లో కూటమి ఉనికిలో లేదు. దాని రాష్ట్ర నాయకులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీదీ మండిపడ్డారు. -
లోక్సభ ఎన్నికల తరుణంలో.. సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లోక్సభ ఎన్నికల తరుణంలో సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగలింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోకి చెందిన కీలక నేతలు బీజేపీ చేరారు.సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జై చౌబే, బలరామ్ యాదవ్, జగత్ జైస్వాల్ సహా పలువురు నేతలు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, పలువురు జిల్లా అధ్యక్షులు ఈరోజు బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీపై ప్రజలకు చేరువైంది. ఆయన నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం కృషి చేస్తాం. అందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పాఠక్ అన్నారు. -
మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా
గత ప్రభుత్వంలో నేరస్తులు సురక్షితంగా ఉండేవారు. కానీ పరిస్థితులు మారాయి. బీజేపీ ప్రభుత్వంలో నేరస్తులు లొంగిపోవాలని చూస్తున్నారు. లేదంటే వారి ప్రాణాల్ని తృణ ప్రాయంగా వదిలేసుకుంటున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బరేలీలో జరిగిన బహిరంగ ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఇది మన (బీజేపీ) ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వ రక్షణలో ఉన్న మాఫియా ఇప్పుడు లొంగిపోవాలని చూస్తుందని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ మాఫియాలు, నేరగాళ్ల పట్ల సానుభూతి చూపుతోందని సీఎం యోగి ఆరోపించారు .జీవితం అంతా రాష్ట్ర సేవలో, అయోధ్య సేవలో గడిపిన కళ్యాణ్ సింగ్ మరణంపై సమాజ్ వాదీ పార్టీ సంతాపం తెలపకపోవడంపై సీఎం యోగి మండిపడ్డారు. కానీ, ఆయన మరణంతో సమాజ్వాదీ పార్టీ ప్రజలు మొసలి కన్నీరు కారుస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రాముడు, అయోధ్య రామ మందిరంపై అవాకులు చెవాకులు పేల్చారు. ఇప్పడు ఆ పార్టీలు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటాయో.. అధికారం లేని ఆ పార్టీలు అలాగే గిలగిల కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.లోక్సభలో అత్యధికంగా 80 మంది ఎంపీలతో ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల మొదటి దశకు ఏప్రిల్ 19న ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించగా, మరో ఎనిమిది నియోజకవర్గాలకు రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న ముగిసింది. ఆ తర్వాత మే 7, మే 13 ,మే 20, మే 23, జూన్ 1 తేదీల్లో ఐదు, ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. వరుసగా మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. -
కూటమికి బీఎస్పీ పోటు!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలోనూ ఇదే పరిస్థితి! లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం 2004 19 5.33 2009 21 6.17 2014 0 4.19 2019 10 3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్దళ్తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్లో 7, ఛత్తీస్గఢ్లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
జూన్ 4న దేశం గెలుస్తుంది: ప్రధాని మోదీ
అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్
ఎన్నికల బహిష్కరణపై విచారణ
నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి
గ్రామాన్ని అభివృద్ధి చేయకుంటే ఓటెయ్యం
మాతోనే రామాలయ అభివృద్ధి
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
విస్తృత తనిఖీలు చేపట్టాలి
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement