-
● ఎండలు పెరగడంతో ఎండుతున్న వాగులు, కుంటలు ● అడవిలో దాహార్తి తీర్చేందుకు నీటి వనరులు ఏర్పాటు ● జన్నారం డివిజన్లో 42చోట్ల సాసర్వెల్లు
మరో రెండు నెలలుఏప్రిల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనున్నందున నీటి సమస్య రాకుండా అధికారులు దృష్టి సారిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తడంతో సీసీ సాసర్వెల్లు ఏర్పాటు చేసి నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మరో రెండు నెలల వరకు ఇదే సమస్య ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోకి పశువులు వెళ్లకుండా కట్టడి చేయడం వల్ల సాసర్వెల్లో నీరు వన్యప్రాణులు స్వేచ్ఛగా తాగుతున్నాయని తెలిపారు. వర్షాలు కురిసే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ చేస్తాంఏప్రిల్, మే రెండు మాసాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాసర్వెల్ ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని పోయిస్తున్నాం. శబ్దానికి వన్యప్రాణులు బెదిరిపోయే అవకాశం ఉన్నందున ఎక్కువగా సాసర్వెల్ లేకుండా చూస్తున్నాం. అవసరమైతేనే ఏర్పాటు చేస్తున్నాం. నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – హఫీజొద్దీన్, రేంజ్ అధికారిజన్నారం: ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండడంతో మనుషులతోపాటు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. వాగులు, వంకలు, ఊట కుంట లు, చెలిమెలు, చెక్డ్యాంలు ఎండిపోతున్నాయి. దీంతో కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణులకు తాగునీటి ఏర్పడకుండా అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. అడవిలో నీరు లభించకపోతే జంతువులు దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, జనా వాసాల వైపు పరుగులు తీస్తూ ప్రాణాల మీదకు తె చ్చుకునే ప్రమాదం ఉంది. దీంతో అటవీ శాఖ అ ధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర తీ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి నుంచే ఎండల తీవ్రత పెరిగినందున అడవిలోని నీటికుంటలు, చెలిమెలు, కుంటలు ఎండుతున్నాయి. దీనికి తోడు కడెం ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల ఊటలు లేక ఇబ్బంది ఏర్పడుతోంది. జంతువుల ఆవాసాల్లోనే.. కవ్వాల్ టైగర్జోన్లో 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏ రియా ఉంది. కోర్ ఏరియాలో వన్యప్రాణులు ఆవా సాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చు క్కల దుప్పులు, సాంబార్లు, నీలుగాయిలు, అడవి పందులు, కొండగొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు ఉ న్నాయి. అత్యధికంగా చుక్కల దుప్పులు, అడవి పందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య రెట్టింపు అయిన ట్లు అధికారులు చెబుతున్నారు. జంతువులు సాధారణంగా ఆ హార అన్వేషణ కోసం నాలుగు కిలోమీటర్ల పరిధిలో తిరుగుతాయి. వీటికి సరిపడా నీటి వనరులున్నా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం నీటికుంటలు, చెలిమెలు, వాగులు ఎండిపోతున్నాయి. జంతువుల ఆవాసాల్లోనే నీటి ఎద్దడి రాకుండా అధి కారులు చొరవ తీసుకుంటున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో నీటి వనరు జన్నారం డివిజన్లో ప్రతీ రెండు కిలోమీటర్ల దూ రంలో ఒక నీటి వనరు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు కిలోమీటర్ల దూరంలో సో లార్పంపు లేదా ర్యాంపు వెల్ లేదా నీటికుంట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు కిలోమీటర్ల దూ రంలో నీటివనరు లేని ప్రాంతంలో సాసర్వెల్లు ఏర్పాటు చేశారు. జన్నారం అటవీ డివిజన్లో 40 బీట్లలో 42 చోట్ల సాసర్వెల్లు ఏర్పాటు చేసి గ్రా మ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు పోయిస్తున్నారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్గార్డులు పర్యవేక్షిస్తూ నీరు అయిపోగానే నింపుతున్నారు.సాసర్వెల్లో నీరుజన్నారం అటవీ డివిజన్లో 40 అటవీ బీట్లు ఉన్నాయి. వీటి పరిధిలో నీటికుంటలు సోలార్పంపులతో నింపుతున్నారు. ఎండల తీవ్రతకు కుంటల్లో నీరు ఇంకిపోతుండడం, సోలార్ పంపుల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండడం వల్ల అధికారులు సాసర్వెల్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తున్నారు. సహజసిద్ధంగా సోలార్పంపులు, ర్యాంపువెల్లు, చెలిమెలు, వాగుల ద్వారా నీరందించాలని అటవీ అధికారులు ప్రయత్నించినా ఎండల తీవ్రతతో సఫలం కాలేకపోతున్నారు. -
సాదాసీదాగా ‘కొప్పుల’, వంశీ నామినేషన్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్లో రిట ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కో రుకంటి చందర్తో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నే తకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్తో కలి సి నామినేషన్ వేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మరో సెట్ అందజేశారు. వీరుకా కుండా బీఆర్ఎస్ తరఫున డమ్మీ అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి ఒకసెట్ నామినేషన్ వేశారు. దీంతో ఇ ప్పటివరకు నామినేషన్లు వేసిన వారి సంఖ్య ఏడుకు చేరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్ నామినేషన్కు సిద్ధమవుతున్నారు. కొందరు అభ్యర్థులను ‘సాక్షి’ పలుకరించగా.. ప్రాజెక్టులు తీసుకొస్తా మా తాత అడుగుజాడల్లో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలే దు. నేను, మా నాన్న సక్సెస్ఫుల్ వ్యాపారులం. ఆ అనుభవంతో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడే పుట్టిన ఇక్కడే పుట్టి, పెరిగిన. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటా. ఇక్కడే చస్తా. సింగరేణిలో 26ఏళ్లు కార్మికుడిగా పనిచేసిన. ఎక్కడి నుంచో వచ్చేవారిని కాకుండా ఉద్యమాల నుంచి వచ్చిన నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. మాయమాటల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. – కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ అభ్యర్థి అగ్రనేతల ఆధ్వర్యంలో మరో సెట్ వేయనున్న అభ్యర్థులు ఇప్పటివరకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ దాఖలు -
ముగిసిన ఐదో తరగతి వార్షిక పరీక్షలు
బెల్లంపల్లి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలు శుక్రవారం ముగిశాయి. బెల్లంపల్లిలోని సంక్షేమ బాలుర గురుకుల విద్యాల యం, సంక్షేమ బాలికల గురుకుల విద్యాల యం, కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల వి ద్యాయాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష ముగిసే సమయానికి చేరుకున్నారు. సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్ర త్యేక సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఇళ్ల వద్ద పిల్ల లు కాలక్షేపం చేస్తూనే సెల్ఫోన్లకు ఆకర్శితులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. తర్వాత ఆటోలు, టాటా ఏస్ వాహనాలు, కార్లలో విద్యార్థుల వస్తు సామగ్రి, ట్రంక్ పెట్టెలతో ఇంటిబాట పట్టారు. -
అభ్యర్థిని మార్చుతారా?
● ‘కమలం’ పార్టీలో విస్తృతంగా చర్చ ● 24న నామినేషన్ వేస్తానంటున్న ‘గోమాసే’సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి చేరిన గోమాసే శ్రీనివాస్కు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థిని మారుస్తారని అటు కేడర్లోనూ ఇటు ప్రజల్లో చర్చకు రావడంతో మార్పు ఉంటుందా..? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గోమాసే శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు పార్టీ బీఫాం తనకే అనే నమ్మకంతోనే ప్రచారం చేస్తున్నారు. అంతేకాక నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 24న భారీ ఏర్పాట్లతో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థి మార్పు అనే ప్రచారం ‘గోమాసే’ అనుచర వర్గాలను కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు హైదరాబాద్కు వెళ్లి రాష్ట్ర పెద్దలను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. జిల్లాలో రెండు వర్గాలు ఉండడంతో కొందరు ‘గోమాసే’నే కొనసాగించాలని కోరినట్లు సమాచారం. ఈ సమయంలో అభ్యర్థిని మార్చితే ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలుస్తోంది. అయితే ‘గోమాసే’ అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొందరు ఇదే అవకాశంగా మార్చాలని పట్టుబడుతున్నట్లుగా పార్టీ నాయకులే చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ప్రత్యర్థులే ఈ అనవసర ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. వెంకటేనేశ్ నేత ప్రయత్నాలు పెద్దపల్లి తాజామాజీ ఎంపీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన లేదు. అయినప్పటికీ ఆయన సన్నిహితులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరితే టికెట్ ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుత అభ్యర్థిని మార్చితే తమకు కూడా అవకాశం కల్పించాలని జిల్లా నుంచి ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారితోపాటు ప్రజాదరణ, పార్టీలో కలుపుకుపోయే వారికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ‘కమలం’ పార్టీలో అభ్యర్థి మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు అధిష్టానం, ఇటు జిల్లా నాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో చివరకు బీఫాం ఎవరి చేతిదక్కుతుందో వేచి చూడాల్సి ఉంది. -
రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
నస్పూర్: ఈ నెల 21న జిల్లా స్థాయి బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నస్పూర్ పట్టణంలోని కుమార్ గన్నర్స్ అకాడమీలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాదం రవీందర్, బోయిని రాజ్కుమార్ తెలిపా రు. అర్హులైన యువతీ, యువకులు ఒరిజినల్ ఆధార్కార్డు, జనన ధ్రువపత్రం, మెడికల్ సర్టిఫికేట్, రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. -
‘బీజేపీ వైపు ప్రజల చూపు’
భీమారం: పార్లమెంటు ఎన్నికల్లో పట్టం కట్టేందుకు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అ న్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి లోక్సభ బీ జేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశం మోదీ నాయకత్వంలో ఎంతో ఆభివృద్ధి చెందుతోందని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మూడు నెలలు దాటినా కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి కన్వీనర్ వెంకటేశ్వర్గౌడ్, మండల ఇంచార్జిలు ఆలం బాపు, వైద్య శ్రీధర్, మండల కమిటీ అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూమ్కు చేరిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు
బెల్లంపల్లి: పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధి బెల్లంపల్లి బజార్ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్రూంకు ఎన్నికల సామగ్రి శుక్రవారం రాత్రి చేరింది. బెల్లంపల్లి నియోజకవర్గ సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ పర్యవేక్షణలో కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను తరలించారు. జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక డీజీటీ వ్యాన్లో పోలీసు బందోబస్తు మధ్య పార్లమెంటు ఎన్నికల్లో వినియోగించే 283 కంట్రోల్ యూనిట్లు, 283 బ్యాలెట్ యూనిట్లు, 315 వీవీ ప్యాట్లను రవాణా చేశారు. స్ట్రాంగ్ రూమ్కు చేరిన ఆయా ఎన్నికల సామగ్రి లెక్కలు సరి చూసుకుని ఎన్నికల అధికారులు, రాజకీయ పక్షాల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ ఎస్హెచ్ఓ ఎన్.దేవయ్య, ఎస్సైలు రమేష్, సురేష్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం?
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. మరోవైపు ఉన్న కాస్త సర్కారు భూమి కబ్జాకు గురవుతోంది. మంచిర్యాలలో డంపింగ్యార్డు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల భవన నిర్మాణాలకు భూమి లేక పక్క మండలాల్లో నిర్మించాల్సి వస్తోంది. ఎన్నికల వేళ అధికారులు బిజీగా ఉండడంతో అక్కడక్కడ మిగిలి ఉన్న కొంత ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. మంచిర్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు రంగంపేట్ ఆండాళమ్మ కాలనీలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు కొందరు ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టారు. డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి ట్యాంకును నిర్మించిన చోటు సమీపంలో ఎకరానికి పైగా ప్రభుత్వ భూమిని చదును చేశారు. స్థానికుల అభ్యంతరంతో ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచినా.. తెరవెనుక దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెనుక భాగంలోనూ ఉన్న ప్రభుత్వ భూమిలో షెడ్లు వేసుకునేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించారు. ఆండాళమ్మ కాలనీలో ఇళ్ల కోసం కేటాయించిన భూమి కాకుండా మిగిలిన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. విలువైన భూమి కావడంతోనే.. మంచిర్యాల మున్సిపాలిటీలోని రంగంపేట్, ఆండాళమ్మ కాలనీలోని సర్వే నంబర్ 131లో 38.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలోనే ప్రభుత్వం 20 ఎకరాల్లో ఆండాళమ్మ కాలనీ ఏర్పాటు చేసి పేదలకు ప్లాట్లుగా అప్పగించింది. 5 ఎకరాల భూ మి దర్గా కోసం, 8 గుంటలను ఏసీసీ పైపులైన్కు, మరో 2 గుంటలు ముస్లింల చిల్లా నిర్మాణానికి అ ప్పగించారు. 1.25 ఎకరాలు, 25 గుంటల భూమి పేదలకు అసైన్ చేశారు. మిగిలిన భూమి కబ్జాకు కొన్నేళ్లుగా పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆండాళమ్మ కాలనీ గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు కొందరు ప్రయత్నించగా కాలనీవాసులు కలెక్టర్కు 2021లోనే ఫిర్యాదు చేశారు. దీంతో రెవె న్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా తే ల్చగా, కాలనీవాసులకు, కబ్జాలో ఉన్న వారికి మ ధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతోంది. కొందరు కాలనీకి చెందిన వారిని మచ్చిక చేసుకున్న తరువాతనే ప్రభుత్వ భూమిలో ఇటీవల ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 8వ వా ర్డులోనే పాతమంచిర్యాల సాయిబాబ గుడిని ఆనుకుని ఉన్న రహదారి కోసం కేటాయించిన భూమి కబ్జాకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రు. దీనిని ఆనుకుని ఉన్న పలు వెంచర్ల యజమానులు 40 అడుగుల వెడల్పు బాటను కొద్దికొద్దిగా కబ్జా చేసి, వారి వెంచర్లలో కలుపుకునే యత్నాలు చేస్తున్నారు. పాతమంచి ర్యాల, ఆండాళమ్మ కాలనీలో ప్రస్తు తం కబ్జాకు ప్రయత్నించే భూముల విలువ దాదాపు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రక్షించేలా రెవెన్యూ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మంచిర్యాల తహసీల్దార్ రమేశ్ను సంప్రదించగా.. 131 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి, అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. భూమిని చదును చేసిన వైనం దారినీ వదలని రియల్ వ్యాపారులు -
గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేపట్టాలి
జైపూర్: గ్రామాల్లో నిరంతరం పారిశుధ్య, పరిశుభ్రత పనులు చేపట్టాలని, రోడ్లపై ఎక్కడా ప్లాస్టిక్, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని రామారావుపే ట, ఇందారం గ్రామాలను తనిఖీ చేశారు. రోడ్లు, మురికికాల్వలు పరిశీలించారు. ప్రతీరోజు పంచా యతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ చెత్త సేకరించాల ని, మురికాల్వలు, రోడ్లు శుభ్రం చేయించాలని తెలి పారు. అనంతరం నర్సరీలను పరిశీలించి మొక్కల కు ఉదయం, సాయంత్రం నీరందించాలని సూచించారు. రామారావుపేటలో వర్మీ కంపోస్టు షెడ్డును సందర్శించి కంపోస్ట్ ఎరువు తయారీపై సూచనలు చేశారు. కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని, ఎరువులను నర్సరీ, పల్లెప్రకృతి వనంలో మొక్కలకు ఉపయోగించాలని తెలిపారు. అనంతరం కాలనీల్లో మిషన్ భగీరథ, బోర్వెల్ మోటార్లు పరిశీలించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. ఎంపీవో అనిల్కుమార్, పంచాయితీకార్యదర్శులు సురేశ్, సుమన్ ఉన్నారు. కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే ‘కొక్కిరాల’పై కేసు మంచిర్యాలక్రైం: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపా రు. ఈ నెల 17న స్థానిక పాత మంచిర్యాలలో నిర్వహించిన శ్రీరామనవమి కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధికి రూ.లక్ష విరాళంగా అందజేయడంతో పాటు ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చినట్లు ఎన్నిక ల సంఘం నియమించిన బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు తెలిపారు. -
మూడురోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి
కాగజ్నగర్ రూరల్: అనారో గ్యంతో మూడురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరు మృతి చెందారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్ర కారం.. పట్టణంలోని చారి గాం రోడ్డుకు చెందిన ఆశ కా ర్యకర్త అఫ్సానా భాను (40) పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ మూడురోజుల క్రితం మృతిచెందింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె భర్త అశ్రఫ్ (45)కు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించగా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, సరైన చికిత్స అందక శుక్రవారం మృతిచెందాడు. మూడురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరు అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గుండ్లగూబకు విద్యుద్ఘాతం.. సరఫరాలో అంతరాయం వేమనపల్లి: గుడ్లగూబ విద్యుద్ఘాతానికి గురై మృతి చెందగా మండల కేంద్రంలో విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. గురువారం రాత్రిపూట గుడ్లగూబ ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభంపై వాలింది. పక్కనే ఉన్న మరో విద్యుత్ తీగకు తగలడంతో విద్యుద్ఘాతమై స్తంభంపైనే ఉండిపోయింది. మండల కేంద్రానికి తెల్లవారుజాము వరకు లోఓల్టే జీ, హైఓల్టేజీ అంతరాయం కలిగింది. గ్రా మంలోని కూలర్లు, ఫ్యాన్లు, రెండు ఫ్రిజ్లు చెడిపోయాయి. సరఫరా నిలిచిపోయి పలువురు ఉక్కపోతతో సతమతం అయ్యారు. తెల్లవారుజామున రో డ్డు వెంట వెళ్తున్న పాదచారులు గమనించి విష యం సబ్స్టేషన్కు చేరవేశారు. స్తంభంపై ఉన్న గుడ్లగూబను తీసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నియామకం పాతమంచిర్యాల: మాలమహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శిగా కొప్పుల రాజారాంను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు ముత్యమాల పుల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన పనిముట్లు అందించాలి
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్యశ్రీరాంపూర్: గనుల్లో పనిచేసే కార్మికులకు యాజ మాన్యం నాణ్యమైన పనిముట్లను అందించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఎస్ఆర్పీ 1గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులతో మాట్లాడారు. నాసిరకమైన పనిముట్ల పరికరాలను సరఫరా చేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను నడిపించి కార్మికులపై పనిభారం పెంచుతున్నారని, అలాంటి వాటిని తీసేయాలని, ఆ యంత్రాల్లో వాడే ఆయిల్ కూడా నాసిరకంగా ఉండడం వల్ల ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సింగరేణిలో ఏ డివిజన్లో లేని విధంగా శ్రీరాంపూర్లో ఎన్నికల కోడ్ పేరుతో కేటగిరీ పదోన్నతులను ఆపేయడం అన్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూని యన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచీ కార్యదర్శి బాజీసైదా, ఫిట్ కార్యదర్శి, దాడి రాజయ్య మైనింగ్ స్టాఫ్ నాయకులు మారుపెల్లి బాబు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, నాయకులు కామెర వేణు, అనంతరెడ్డి, శంకర్, శ్రీనివాస్, అక్బర్ పాల్గొన్నారు. -
● ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు ● ఎట్టకేలకు అమరులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ● నేడు అమరవీరుల సంస్మరణ దినం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు
33 ఏళ్లుగా నివాళులకు దూరం నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం పాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా అమరులకు నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. ఈ క్రమంలో 2004 అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన నాయకులతోపాటు అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు అదేరోజున నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూపం వద్ద ఏప్రిల్ 20న నివాళులు అర్పించేందుకు రెండు గంటల సమయం ఇచ్చింది. దీంతో ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి నివాళులర్పిస్తున్నారు. అసలేం జరిగింది. స్వాతంత్య్రం వచ్చి అప్పటికీ మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పిపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సభప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు గిరిజనులు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే పోలీసుపై దాడి చేయగా ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మంది వరకు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. పోలీసు బందోబస్తు.. సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు 100మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.రెండోసారి స్మారక స్తూపం నిర్మాణంఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్లతో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపం నిర్మించింది. ఎట్టకేలకు స్మృతి వనం, ఇళ్ల స్థలాలు నాడు హక్కుల కోసం పోరాడిన ఆది వాసీలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీ సులతో దాడి చేయించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు గాయాలపాలయ్యారు. అయితే బాధిత కుటుంబాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం అమరుల కుటుంబాలను గుర్తించిన ఎంపీ సోయం బాపూరావు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్ శాఖలో ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. హక్కు పత్రాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చదిద్దేందుకు రూ.97 లక్షలు కేటాయించారు. -
రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి
కాసిపేట: అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు రక్షణతో కలిసి కట్టుగా పనిచేస్తూ ప్రమాద రహిత ఉత్పత్తిని సాధించాలని మందమర్రి ఏరియా జీఎం మనోహర్ తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట 2గనిని సందర్శించారు. అధికారులతో కలిసి గనిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మ్యాన్రైడింగ్ పనులను పరిశీలించారు. గనిలో పని స్థలాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. త్వరలో మ్యాన్రైడింగ్ ప్రారంభంతో కార్మికుల ప్రధాన సమస్య తీరనుందని, ఉత్పత్తిపై దృష్టి సారించి లక్ష్యం చేరేలా అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణాధికారి రవీందర్, కెకె గ్రూప్ ఏజెంట్ రాందాసు, గ్రూప్ ఇంజనీర్ రాంప్రసాద్, గని మేనేజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఐఎన్టీయూసీ మహాసభ వాల్ పోస్టర్ల విడుదల
శ్రీరాంపూర్: ఈ నెల 21న గోదావరిఖనిలో నిర్వహించనున్న ఐఎన్టీయూసీ జాతీయ మహాసభ వాల్ పోస్టర్లను శుక్రవారం నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో యూనియన్ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ప్రసాద్ ఆవిష్కరించారు. కార్మికుల సమస్యలు, యూనియన్ నిర్మాణంపై చర్చించి పలు తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఏరియాల నుంచి యూనియన్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు యూనియన్ నాయకులు ఆర్కే 6 గనిపై మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించి కార్మికులను సభలకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, కేంద్ర కమిటీ నాయకులు భీంరావు, గరిగే స్వామి, కలవేని శ్యాం, తిరుపతి రాజు, నాయకులు వెంగళ కుమారస్వామి, నీలం సదయ్య, అశోక్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో మాజీ సర్పంచులు, ఎంపీటీసీల చేరిక
చెన్నూర్: చెన్నూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం రాత్రి కోటపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలతోపాటు 200 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోటు రాంరెడ్డి, మాజీ సర్పంచ్ గొడిసెల బాపురెడ్డి, హిమవంతరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
వైన్షాపుల వద్ద మందుబాబుల వీరంగం
కౌటాల: మండల కేంద్రంలోని శ్రీవైష్ణవి, శ్రీబాలజీ వైన్షాపుల వద్ద శుక్రవారం రాత్రి ఇద్దరు మందుబాబులు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో మద్యం దుకాణాల పక్కనే ఉన్న ఇంటి ఆవరణలో మూత్రవిసర్జన చేశారు. దీంతో ఇంటి యజమాని మందుబాబులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మందుబాబులిద్దరు కర్రతో ఇంటి యజమాని పసాల వినోద్పై దాడి చేయగా అతడి వీపు, చేతిపై గాయాలయ్యాయి. దీంతో మందుబాబులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. జనావాసాల మధ్య, పాఠశాల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడంలేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి జనావాసాల మధ్య నుంచి వైన్షాపులను తొలగించాలని కోరారు. -
పర్యావరణానికి పాటుపడాలి
బెల్లంపల్లి: పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మందమర్రి ఏరియా శాంతిఖని గ్రూప్ఆఫ్ మైన్స్ ఏజెంట్ ఆర్.విజయప్రసాద్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ప ర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప ర్యావరణ పరిరక్షణలో భాగంగా గని ఆవరణ లో షాప్ట్ నుంచి ఫ్యాన్ హౌజ్ వరకు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కా ర్మికులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా శక్తిని, నీటిని ఆదా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఇంజినీర్ బసవరాజు, గ ని మేనేజర్ సంజయ్కుమార్సిన్హా, ఫిట్ ఇంజి నీర్ రాంబాబు, బీఎం ఇంచార్జీ ముస్తాఫా, వెంటిలేషన్ అధికారి పూర్ణచందర్, గని సంక్షేమ అధికారి సత్యనారాయణ, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ దాసరి తిరుపతిగౌడ్ పాల్గొన్నారు. -
టీబీజీకేఎస్లోకి సురేందర్రెడ్డి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ మాజీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. శుక్రవారం ఆయన పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో యూనియన్ కండువా కప్పుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేయడం లేదని నాయకత్వం అప్పట్లో ప్రకటించడంతో ఐఎన్టీయూసీలో చేరారు. ఐఎన్టీయూసీలో నాయకత్వం నచ్చకపోవడం, టీబీజీకేఎస్ నుంచి ఆహ్వానం రావడంతో తిరిగి మాతృ సంఘంలో చేరినట్లు ఆయన తెలిపారు. శ్రీరాంపూర్ నుంచి ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో టీబీజీకేఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి, శ్రీరాంపూర్ బ్రాంచీ నాయకులు పాల్గొన్నారు. హోరాహోరీగా ఫుట్బాల్ పోటీలురెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్లోని భీమన్న స్టేడియంలో నిర్వహిస్తున్న వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 11జట్లు పోటీలకు హాజరు కాగా అన్ని జట్ల క్రీడాకారులు అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. నాక్ అవుట్ పద్ధతిలో మ్యాచ్లు కొనసాగుతున్నాయి. 11 జట్లలో నుంచి కామారెడ్డి, హైదరాబాద్, సోమగూడెం, బెబిన్ హైదరాబాద్ క్లబ్ జట్లు సెమీ ఫైనల్ పోటీలకు ఎంపికై నట్లు నిర్వహకులు తెలిపారు. శనివారం భీమన్న స్టేడియంలో సెమీ ఫైనల్తో పాటు ఫైనల్ పోటీలు నిర్వహించేందుకు ఏరియా అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు ఫైనల్ పోటీలను పూర్తి చేసి అనంతరం విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేయనున్నుట్లు నిర్వహకులు తెలిపారు. -
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
నస్పూర్: తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ స్టేట్ ఫస్ట్ లెవెల్ హ్యాండ్బాల్ ప్రీమియర్ లీగ్–2024 వాల్ పోస్టర్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల శ్రీధర్ ఆవిష్కరించారు. శుక్రవారం పట్టణ పరిధిలోని సాధన ఎక్స్లెన్సియో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని సాధన ఎక్స్లెన్సియా పాఠశాలలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాస్, కోశాధికారి వెంకటేశ్, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ మారయ్య తదితరులు పాల్గొన్నారు. -
కారు బోల్తాపడి ఇద్దరికి గాయాలు
జైపూర్: మండల కేంద్ర సమీపంలోని నర్సీ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మంచిర్యాలకు చెందిన యోగేశ్వ ర్ చెన్నూర్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శుక్రవారం కారులో చెన్నూర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న క్రమంలో నర్సీ సమీపంలో అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి పల్టీకొట్టింది. దీంతో ఇందులో ఉన్న యోగేశ్వర్తోపాటు మరోవ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రైలుకింద పడి మహిళ ఆత్మహత్య మంచిర్యాలక్రైం: రైలుకింద పడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన కట్ట పారిజాతం(55) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్య బాగు కాలేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల, పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పారిజాతం భర్త పరిపూర్ణచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి అదృశ్యం మంచిర్యాలక్రైం: స్థానిక ప్ర భుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై లక్ష్మణ్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్కు చెందిన తగరం చిరంజీవి అనారోగ్యం కారణంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 15న చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 17న తెల్ల వారుజామున బయటకు వెళ్లిపోయాడు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఆచూకీ లభించలేదు. చిరంజీవి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అసభ్యకర పోస్టుపై కేసు రామకృష్ణాపూర్: సోషల్మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి రాజేష్పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా ఎవరూ పోస్టులు చేయొద్దని, ఎన్నికల నేపథ్యంలో సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. చికిత్స పొందుతూ యువకుడి మృతివాంకిడి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన బూరం శ్రీకాంత్(24) రెండేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితమే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ ఈ నెల 13న పురుగుల మందు తాగాడు. ఏడురోజుల పాటు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. కాగా, ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై సాగర్ తెలిపారు. -
పాఠశాలలో డీఈవో తనిఖీ
భీమారం: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో యాదయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఏరోజు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం అదేరోజు చేయాలని ఆదేశించారు. ఈ నెల 23న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రతిభను తెలియజేయాలని పేర్కొన్నారు. పరీక్ష పేపర్లను ఎట్టిపరిస్థితుల్లో లీక్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విక్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
No Headline
ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏటా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని పరిస్థితి. నాడు పూర్తిగా పోలీసు నిఘాలోనే స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2015లో తొలిసారిగా ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో వందల మంది ఆదివాసీలు వచ్చి అమరులకు నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కలెక్టర్, ఎస్పీకి పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు విన్నవించారు. ఈ మేరకు రెండు గంటలపాటు అనుమతి ఇచ్చారు. నాటి నుంచి ఆదివాసీలు సంప్రదాయ పూజలతో నివాళులర్పిస్తూనే ఉన్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. స్తూపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఐఎన్టీయూసీ సభ్యత్వ నమోదు
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్లోని ఎస్సార్పీ 3 గనిలో ఐఎన్టీయూసీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు మాట్లాడుతూ కార్మికులకు ఐఎన్టీయూసీ అనేక హక్కులు సాధించిన చరిత్ర ఉందన్నారు. ఈ నెల 21న గోదావరిఖనిలో సెంట్రల్ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్కే 7 గనిలో యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు భీంరావు, గరిగే స్వామి, ఫిట్ సెక్రెటరీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఎస్సార్పీ 3 గనిలో యూనియన్ బ్రాంచీ కార్యదర్శి ఫిట్స్ సెక్రెటరీలు శ్రీను, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
23 నుంచి సదరం శిబిరాలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 23నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధి కారి కిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదరం సర్టిఫికేట్ కాలపరిమితి ముగిసిన, రెన్యువల్, నూతనంగా సర్టిఫికేట్ కోసం మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత తేదీల్లో సదరం శిబిరానికి హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 23న కంటి చూపు(30), 24న శారీరక దివ్యాంగులు–ఆర్థో(50), 25న మానసిక దివ్యాంగులు(50), 26న మూగ, చెవుడు(50) బాధితులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 20న ఉదయం 8 గంటలకు స్లాట్ ఓపెన్ చేస్తారని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆటో బోల్తా..ఒకరికి గాయాలుఆసిఫాబాద్రూరల్: మండలంలోని బూర్గుడ స మీపంలో రాష్ట్రీయ రహదారిపై అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. మండలంలోని అప్పపల్లి గ్రామానికి చెందిన ఆటో ఆసిఫాబాద్ నుంచి అప్పపల్లికి వెళ్తుండగా బూర్గుడ సమీపంలో అడ్డువచ్చిన ఎద్దును ఢీకొని ఆటో బోల్తా పడింది. చునర్కర్ విక్రుకు గాయాలు కాగా 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సీఎం రేవంత్రెడ్డికి రైతుల పోస్టుకార్డులు
చెన్నూర్: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పోస్టుకార్డులు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని, రైతు భరోసా ద్వారా రూ.10 వేలు కాకుండా రూ.15 వేలు ఇవ్వాలని తెలిపారు. రూ.2 లక్షల రైతు రుణామాఫీ వెంటనే చేయాలని, రైతు కూలీలకు రూ.12 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. రైతులు పోస్టుకార్డుల ఉద్యమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్రెడ్డి, ఎంపీపీ మంత్రి బాపు, జెడ్పీటీసీ మోతె తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు బుర్ర రాకేశ్, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement