-
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై పోటీ చేస్తున్నారు. హిమాచల్లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
Lok Sabha Elections 2024: మండిలో కంగన రోడ్ షో
సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్ప్రదేశ్లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే. -
నా నామినేషన్ తట్టుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు: కంగనా
హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి బీజేపీ తమ లోక్సభ అభ్యర్థిగా కంగనా రనౌత్ను ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా ఈ బాలీవుడ్ నటి పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి నటి కౌంటర్ ఇవ్వడం, ఈసీ నోటీసులు.. వంటి పరిణామాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కంగనా మండిలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. మండిలో తన నామినేషన్ను జీర్ణించుకోలేక కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి నామినేషన్ వేసిన తరువాత చాలా సంతోషించినట్లు తెలిపారు. తిరిగి సొంత ప్రదేశానికి రావడాన్ని ఎవరూ సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిందువల్లో శక్తిని నిర్మూలించడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మండిలో ప్రతి ఏడాది మహాశివరాత్రి నాడు అతిపెద్ద మేళా నిర్వహిస్తారని, అలాంటి ప్రాంత మహిళలపై కాంగ్రెస్ నేతలు అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మండికి రిషి మాండవ్య పేరు పెట్టారని, ఋషి పరాశరుడు తపస్సులో కూర్చున్న రిషి మాండవ్య పేరు పెట్టారని, అంతటి పవిత్ర ప్రదేశం మండి అని పేర్కొన్నారు. చౌకబారు నేతల నుంచి ఇంతకన్నా మనం ఏం ఆశించగలమని కంగనా ప్రశ్నించారు. #WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha seat, actor Kangana Ranaut says, "... Congress could not accept my nomination from Mandi. They started doing cheap politics. Their leader Rahul Gandhi talks about destroying the 'shakti' in Hindus. Their spokesperson… pic.twitter.com/D53fySekCz — ANI (@ANI) March 29, 2024 -
కంగనా రనౌత్పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
‘కంగన’కు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాలో బాలీవుడ్ నటి కంగనారనౌత్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనకు కాషాయ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంగన గతంలో ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టు ఒకటి తాజాగా వైరల్గా మారింది. పేదరికం, సమస్యలు, నేరాలు లేని హిమాచల్ప్రదేశ్ నుంచి తాను పోటీ చేయబోనని, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సమస్యలున్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని గతంలో ఎక్స్లో చేసిన పోస్టులో కంగన తెలిపింది. అక్కడి సమస్యలను పరిష్కరించి రాజకీయ రంగంలోనూ రాణి అవుతానని పేర్కొంది. అయితే తాజాగా ఆదివారం (మార్చ్ 24) బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిమాచల్లోని మండి నుంచి కంగనకు పార్టీ టికెట్ దక్కింది. మండి నుంచి బీజేపీ ఎంపీ టికెటివ్వడంపై కంగన స్పందించింది. ఇది తాను గౌరవంగా భావిస్తున్నానని, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాజాగా ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. మండి నుంచి పోటీ చేయనన్న పాత ట్వీట్ను చూపిస్తూ తాజా ప్రకటనపై కంగనను సోషల్మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా, బీజేపీ ఐదో జాబితాలో కంగనతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు బీజేపీ ఎంపీ టికెట్లు దక్కాయి. Just two years back when somebody said you will fight elections from mandi.. you said u want a state with complexities u can work on and won't fight from mandi now u are eating ur own words 😭 pic.twitter.com/GVJt91faFE — ح (@hmmbly) March 24, 2024 ఇదీ చదవండి.. వరుణ్కు మొండిచెయ్యి.. జితిన్కు పట్టం -
ఐఐటీ మండీలో ర్యాగింగ్ ఘటన
న్యూఢిల్లీ/మండీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మండీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్లను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరో 62 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్స్ సస్పెన్షన్కు గురయ్యారు. ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించారు. 20 నుంచి 60 గంటలపాటు సమాజసేవ చేయాలని ఆదేశించినట్లు ఐఐటీ–మండీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ముగ్గురు విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లతోపాటు 10 మంది విద్యార్థులను తరగతి గదులు, వసతి గృహాల నుంచి డిసెంబర్దాకా సస్పెండ్ చేశారు. బీ.టెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని ఇటీవల కాలేజీలో నిర్వహించారు. ‘ఈ ఘటనలో 72 మంది సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కేరళలో మండి బిర్యానీ తిని యువతి మృతి.. వారంలో రెండో ఘటన
కేరళలోని కొట్టాయంలో ఇటీవల(డిసెంబర్ 29) ఓ ఈవెంట్లో ఆహారం తిని నర్సు అస్వస్థతకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించినట్లు వార్తలు వినిపించాయి. ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని 20 ఏళ్ల యువతి మృతిచెందింది. ఈ ఘటన కూడా ఫుడ్ పాయిజనింగ్కు సంబంధించి అనుమానాస్పద కేసుగా అనుమానిస్తున్నారు. వివరాలు.. కాసర్గోడ్ సమీపంలోని పెరుంబళకు ఎందిన అంజు శ్రీ పార్వతి డెసెంబర్ 31న రొమేనియా అనే రెస్టారెంట్ల నుంచి మండి బిర్యానీ (కుజిమంతి/కుళిమంతి) ఆర్డర్ చేసుకుంది. బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలంతో బాలిక తీసుకున్న ఆహారం, ఆమెకు అందించిన చికిత్సపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్కు గురైన హోటళ్ల లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ) కింద రద్దు చేస్తామని తెలిపారు. చదవండి: Video: బాప్రే..! డ్రెస్ బటన్లలో కొకైన్.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ -
మళ్లీ బీజేపీ వైపే హిమాచల్ ఓటర్లు
మండి: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో మాదిరిగా మళ్లీ బీజేపీకే అధికారమివ్వాలని హిమాచల్ ఓటర్లు నిశ్చయించుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి చెందిన బీజేపీ యువజన విభాగం కార్యకర్తలనుద్దేశించి ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అననుకూల వాతావరణం కారణంగా మండిలోని పడ్డల్ మైదాన్లో భారతీయ జనతా యువమోర్చా ఏర్పాటు చేసిన ‘యువ విజయ్ సంకల్ప్ ర్యాలీ’కి హెలికాప్టర్ ద్వారా చేరుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆయన ఆన్లైన్లోనే ప్రసంగించారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చాలన్న సంప్రదాయాన్ని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఓటర్లు పక్కనబెట్టారని ఆయన చెప్పారు. అదేవిధంగా, బీజేపీ పాలన, అభివృద్ధి పనులను చూసి హిమాచల్ ఓటర్లు, యువత కూడా మరోసారి బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ యువత ప్రాతినిథ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఫార్మా హబ్గా రూపుదాలుస్తోందని, డ్రోన్ విధానం రూపకల్పనలో ముందుందని చెప్పారు. -
తినాలంటే జైలుకి పోవాల్సిందే (ఫోటోలు)
-
జైలు భోజనం ఎప్పుడైనా రుచి చూశారా?.. ఈ ఫొటోలు చూస్తే వెళ్లకుండా ఉండరేమో.!
నిజామాబాద్ : కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త థీమ్లతో తమ బిజినెస్లను ప్రారంభిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నూతనంగా ఓ మండీ హోటల్ను ప్రారంభించారు. నిర్వాహకులు జైలు థీమ్తో ఈ హోటల్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇనుప చువ్వలతో కూడిన గదులు, బొమ్మ తుపాకులు, బేడీలు ఏర్పాటు చేశారు. అలాగే ఆహారం సప్లయ్ చేసే వారికి ఖైదీ దుస్తులును ఏర్పాటు చేశారు. మండీలోకి వెళ్లగానే ముందుగా ఒక పోలీస్, మరో పక్క ఖైదీ దుస్తులతో స్వాగత ప్రతిమలను ఏర్పాటు చేశారు. జైలు గదుల్లా ఏర్పాటు చేసి అందులో ఆహార ప్రియులకు వడ్డిస్తున్నారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ మండీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. -
నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’
సాక్షి, పహాడీషరీఫ్: నగర వాసులను నోరూరిస్తోంది మండీ బిర్యానీ. ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ బిర్యానీని ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జల్పల్లి, ఎర్రకుంట, షాయిన్నగర్, పహాడీషరీఫ్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ మండీ హోటల్స్(మతామ్) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్ భాషలో మండీ అంటే బిర్యానీ అని, మతామ్ అంటే హోటల్ అని అర్థం. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు. చదవండి: మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ ! పౌష్టిక విలువలు పుష్కలం మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు.ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి: బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత సాధారణంగా హోటల్కు వెళ్లి ఎవరి ప్లేట్లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్గా వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి తినడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ హోటళ్లన్నీ అరబ్ స్టైల్ను అనుసరిస్తున్నాయి. ఏ మతామ్లోకి వెళ్లినా ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు. మండీ తయారు చేసే విధానం.. మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్/చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు. ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసేందుకు అరబ్ దేశానికి చెందిన వంట మాస్టర్లనే వినియోగిస్తున్నారు. ప్రధాన రోహదారుల్లో వెలుస్తున్న హోటళ్లు ఎర్రకుంట ప్రధాన రహదారికిరువైపులా వెలిసిన మతామ్లతో ఆ రహదారిని ప్రస్తుతం మండీ రోడ్డుగా పిలుస్తున్నారు. ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మొదలుకొని షాహిన్నగర్ హైవే హోటల్ వరకు దాదాపు 30 మండీ మతామ్లు వెలిశాయటే ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. -
Bypolls 2021 Results: జాతీయ స్థాయిలో కమలానికి షాక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటుకు గురైంది. పేలవమైన ప్రదర్శనతో కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత వీరభద్రసింగ్ సింగ్ సతీమణి ప్రతిభాసింగ్ మండీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. మండీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. గత ఎన్నికల్లో మండీలో దాదాపు 4,05,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రతిభాసింగ్.. కార్గిల్ యుద్ధవీరుడు, బీజేపీ అభ్యర్థి, బ్రిగేడియర్ ఖుషాల్ ఠాకూర్ను ఓడించారు. 7,490 ఓట్ల మెజారిటీతో ప్రతిభాసింగ్ విజయం సాధించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో గెలిచి కాంగ్రెస్ తన సత్తా చాటింది. దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతం, మధ్యప్రదేశ్లోని ఖండ్వా లోక్సభ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. దాద్రానగర్ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేష్ గవిట్పై శివసేన మహిళా అభ్యర్థి కలాబెన్ దేల్కర్ విజయం సాధించారు. గతంలో గెలిచిన ఖండ్వా లోక్సభ స్థానాన్ని బీజేపీ కాపాడుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్నారాయణ్ సింగ్ పూర్ణీపై బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ విజయం సాధించారు. ఈయన 82వేల మెజారిటీతో గెలిచారు. ఇక హిమాచల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హిమాచల్లో ఉప ఎన్నికలు జరిగిన ఫతేపూర్, అర్కీల్లో గతంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఈసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. గతంలో బీజేపీ ఖాతాలో ఉన్న జబ్బల్–కోత్ఖాయ్ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ మహిళా అభ్యర్థి నీలం సెరాయిక్కు కేవలం 2,644 ఓట్లు పడ్డాయి. వచ్చే ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి తాజా ఫలితాలు శరాఘాతంలా తగిలాయి. పశ్చిమ బెంగాల్లో దీదీ హవా పశ్చిమ బెంగాల్లో దిన్హటా, గోసాబా, శాంతిపూర్, ఖర్దాహ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటినీ అధికార తృణమూల్ కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో తమ సీట్ల సంఖ్యను 215కు పెంచుకుంది. ఈ నాలుగు స్థానాల్లో కలిపి మొత్తంగా తృణమూల్కు 75.02 శాతం ఓట్లు పడగా బీజేపీకి కేవలం 14.48 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఏడాది మార్చి–ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఇప్పుడు 15 శాతంలోపునకు పడిపోవడం గమనార్హం. దిన్హటాలో బీజేపీ అభ్యర్థి అశోక్ మండల్పై టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ ఏకంగా 1,64,089 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మొండల్ బీజేపీ అభ్యర్థిపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు. దిన్హటా, గోసాబా, ఖర్దాహ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రజలు ఉమ్మడిగా ఎలా ఓడిస్తారో ఈ ఫలితాలు చూస్తే తెలుస్తుందని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో చెరొకటి కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో గెలిచాయి. సిండ్గీ స్థానం నుంచి బరిలో నిల్చిన కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ మనగులిని బీజేపీ అభ్యర్థి రమేశ్ భూషనూర్ మట్టికరిపించారు. హంగల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్ కంటే అధికంగా ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానె విజయం సాధించారు. ఈ రెండు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను జేడీ(ఎస్) బరిలో నిలిపినా వారు కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. హింగల్లో ఓటమి.. రాష్ట్ర కొత్త సీఎం బొమ్మైకి కాస్త ఇబ్బందికరంగా మార్చింది. తన నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే హంగల్ ఉంది. మధ్యప్రదేశ్లో రెండు ఇటు, ఒకటి అటు రాష్ట్రంలో 3 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, ఒక స్థానంలో బీజేపీ ఓడి కాంగ్రెస్కు అప్పజెప్పింది. ఈసారి జోబాట్(ఎస్సీ), పృథ్వీపూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, గతంలో గెలిచిన రాయ్గావ్(ఎస్టీ)లో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కల్పనా వర్మ గెలిచారు. అస్సాంలో అన్నీ బీజేపీ కూటమికే అస్సాంలో ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కూటమి పార్టీలు తమ వశం చేసుకున్నాయి. భవానీపూర్, మరియానీ, తోరా స్థానాల్లో బీజేపీ గెలిచింది. గోసాయ్గావ్, తముల్పూర్లలో యూపీపీఎల్ విజయఢంకా మోగించింది. ఐదు స్థానాల్లో పోలైన మొత్తం ఓట్లలో 54 శాతం బీజేపీ, యూపీపీఎల్లకే పడ్డాయి. ► మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ కూటమి మొత్తం మూడు సీట్లనూ కైవసం చేసుకుంది. రాజబాలా, మేరింగ్కెంగ్ లలో ఎన్పీపీ గెలవగా, మాఫ్లాంగ్ ఈ కూటమిలోని యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో పడింది. ► బిహార్లో రెండు చోట్లా జేడీ(యూ) అభ్యర్థులే విజయబావుటా ఎగరేశారు. కుషేశ్వర్ ఆస్తాన్(ఎస్సీ) స్థానం నుంచి అమన్ భూషణ్ హజారీ, తారాపూర్ నుంచి రాజీవ్ కుమార్ సింగ్లు గెలిచారు. ► రాజస్తాన్లో అధికార కాంగ్రెస్ ఒక స్థానాన్ని కాపాడుకోవడంతోపాటు మరో సీటు గెల్చుకుంది. ఈసారి ధరియావాద్, వల్లభ్నగర్ల్లో కాంగ్రెస్ గెలిచింది. ► మహారాష్ట్రలోని నాందేఢ్ జిల్లాలోని దెగ్లూ్లర్(ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జితేశ్ రావ్సాహెబ్ గెలిచారు. ► హరియాణా రాష్ట్రంలోని ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఇండియన్ నేషనల్ లోక్దళ్ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా విజయం సాధించారు. ► మిజోరంలో తురియల్ స్థానంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) అభ్యర్థి లాల్దాంగ్లియానా గెలిచారు. ► ఆంధ్రప్రదేశ్లోని బద్వేలు(ఎస్సీ) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 90,533 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి పి.సురేశ్ ఓటమిని చవిచూశారు. ► తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23,855 ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరకుగాను 1,72,000వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. 2020-21లో రైతులకు 75వేల కోట్ల రూపాయలు కేటాయించామని.. దీని వల్ల 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇక ఈ ఏడాది రైతు రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 40వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా మరో 1000 మండీలను ఈనామ్తో అనుసంధానిస్తమన్నారు. అస్సాం, బెంగాల్లో పని చేస్తున్న టీ కార్మికుల కోసం1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. -
బీజేపీ వాడుకుని వదిలేసింది: సుఖ్రామ్
‘‘హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి రావడానికి బీజేపీ నన్ను వాడుకుని వదిలేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో నాదే కీలక పాత్ర,’’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్రామ్ వాపోయారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 93 ఏళ్ల నేత మీడియాతో మాట్లాడుతూ, ‘‘ మళ్లీ కాంగ్రెస్లో చేరడం తప్పో ఒప్పో నాకు తెలియదు. కాని, ఇవి నాకు చివరి ఎన్నికలు. జీవితకాలం గడిపిన పార్టీలో ఉండగానే కన్నుమూయాలనుకుంటున్నాను,’’ అని ఆయన చెప్పారు. తన మనవడు, మండీ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్రయ్ శర్మ తరఫున ఆయన ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసిన సుఖ్రామ్పై 1998లో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అరెస్టయి కొంత కాలం జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ తనను అవమానించిందని ఆయన అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ నా కుటుంబాన్ని బాగా ఉపయోగించుకుంది. విజయం సాధించాక నా కొడుకు అనిల్ శర్మకు మంత్రి పదవి ఇచ్చినా తగిన విలువ ఇవ్వలేదు. ఆశ్రయ్కు మండీ బీజేపీ టికెట్ కోసం ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ను కలవాలనుకున్నాను. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఆశ్రయ్కు బీజేపీ సభ్యత్వం కూడా లేనప్పుడు అతనికి టికెట్ ఎలా ఇస్తామని సీఎం సహా బీజేపీ నేతలు ప్రశ్నించడంతో బీజేపీతో చెడిపోయింది. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించకున్నాను. నా మనవడి రాజకీయ భవిష్యత్తు కోసం నేను కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్రసింగ్ను క్షమాపణ కూడా కోరాను. నేను పెట్టిన ప్రాంతీయపార్టీ హిమాచల్ వికాస్ కాంగ్రెస్ (హెచ్వీసీ) వల్ల 1998 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే వీరభద్రకు నాపై కోపం ఉండొచ్చు,’’ అని సుఖ్రామ్ వివరించారు. అయితే, తన మనవడు ఆశ్రయ్ను వీరభద్ర ఆశీర్వదించారని, అతని కోసం మనస్పూర్తిగా ప్రచా రం చేస్తున్నారని ఆయన తెలిపారు. వయసు తొమ్మిది పదులు దాటినా ఆయన శారీరకంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. హిమాచల్లోని 4 లోక్సభ సీట్లకు మే 19న పోలింగ్ జరుగుతుంది. -
‘ఇది కుటుంబ విషయం.. వదిలేయండి’
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండగా.. కొడుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే కొడుకు తరఫున తాను ప్రచారం చేయనంటున్నారు హిమాచల్ బీజేపీ మంత్రి అనిల్ శర్మ. మాజీ కాంగ్రెస్ నాయకుడు సుఖ్రామ్.. ఆయన కుమారుడు అనిల్ శర్మ 2017, అక్టోబర్లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ శర్మ మండి శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీజేపీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చింది. అయితే అనిల్ శర్మ తండ్రి సుఖ్రామ్, కుమారుడు ఆశ్రయ్ శర్మ ఈ ఏడాది మార్చి 25న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆశ్రయ్ శర్మకు మండి పార్లమెంట్ టికెట్ను కేటాయించింది. ఈ విషయం గురించి అనిల్ శర్మ మాట్లాడుతూ.. ‘మా తండ్రి, కుమారుడు తిరిగి కాంగ్రెస్లో చేరారు. అంతేకాక ఆశ్రయ్కు కాంగ్రెస్ పార్టీ మండి నియోజకవర్గం టికెట్ను కూడా కేటాయించింది. ఈ విషయం గురించి నేను అధిష్టానంతో కూడా చర్చించాను. మండిలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయలేనని చెప్పాను. పార్టీ నా అభ్యర్థనను మన్నించింది. అలా అని నా కొడుకు తరఫున కూడా ప్రచారం చేయన’ని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సట్టి మాట్లాడుతూ.. ‘ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయం. మీడియా ఎందుకు దీని వెనకే పరుగులు తీస్తుందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ మండి పడ్డారు. మరో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ తరఫున మండి నియోజకవర్గంలో తప్ప ఎక్కడైనా ప్రచారం చేస్తానని స్పష్టం చేయడం గమనార్హం. -
ఈ పేరు వింటే లొట్టలు వేస్తుంటారు
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): మండీ.. ఈ పేరు వింటేనే నగరవాసులు లొట్టలు వేస్తుంటారు. ఈ వంటకం సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. పాతబస్తీ కేంద్రంగా విస్తరించిన క్రేజ్.. ఇటీవలి కాలంలో మరింత పుంజుకుంది. మటన్లో సహజసిద్ధంగా ఉత్పతన్నమయ్యే ద్రవాలు లేదా జ్యూసెస్తోటే బిర్యానీ రైస్ అన్నం ఉడకడం ద్వారా దీనికో ప్రత్యేకమైన రుచి, పరిమళం అబ్బుతుంది. అందుకే దీని రుచి చూసినవారు ఆ రుచిని ఇక దేనితోనూ పోల్చలేరు. ఒకేసారి కనీసం ఇద్దరు నుంచి అరడజను మంది దాకా తినేందుకు అవకాశం ఉండడం దీనిలో మరో విశేషం. మటన్, చికెన్, ఫిష్ మూడు వెరైటీల్లోనూ మండీ సర్వ్ చేస్తున్నారు. నవతరానికి కూడా బాగా దగ్గరైన ఈ వంటకం... ఓల్డ్సిటీలోని బార్కస్లో పుట్టి... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాలన్నింట్లోని రెస్టారెంట్లు దీనికి ప్రత్యేకంగా మెనూలో స్థానం కల్పించక తప్పని పరిస్థితి తెచ్చింది. ఇక పూర్తిగా మండీ పేరు మీదే ఏర్పాటవుతున్న రెస్టారెంట్లు, కేఫ్లకు కూడా నగరంలో కొదవలేదు. దీని ధర రూ.250 నుంచి రూ.600 దాకా ఉంటుంది. కొన్ని చోట్ల వెరైటీని బట్టి ఇంకా ఎక్కువ కూడా చెల్లించాలి. మండీకి పేరొందిన కొన్ని రెస్టారెంట్లు: గచ్చిబౌలి, మాదాపూర్లోని ఎమ్ఎమ్ ట్రీ, ఫైవ్ 6, మండీ ఎట్ 36, హిమాయత్నగర్లో మండిలీషియస్. -
హిమచల్ప్రదేశ్ మండిలో అగ్నిప్రమాదం
-
స్కూల్ బస్సు ప్రమాదం: 25 మందికి గాయాలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఓ స్కూలు బస్సు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ఘటనలో 25 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. సుందర్నగర్ సబ్డివిజన్ పరిధి దేహర్లోని వివేకానంద పబ్లిక్ స్కూలుకు చెందిన బస్సు సంలోగ్ గ్రామం వైపు నుంచి ఉదయం విద్యార్థులతో బయలుదేరింది. మార్గమధ్యంలో ముందున్న బస్సును ఓవర్ టేక్ చేసేందుకు డ్రైవర్ యత్నించగా అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి బస్సు పైభాగం రెండుగా చీలిపోయింది. దీంతో సమీపంలోని గ్రామస్తులు అక్కడికి చేరుకుని పిల్లలందరినీ బయటకు తీశారు. గాయపడిన చిన్నారులను సుందర్నగర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారకి ఉచిత వైద్య చికిత్సతోపాటు తీవ్రంగా గాయపడిన ఆరుగురు చిన్నారులకు రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం సాయం ప్రకటించింది. అయితే, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. -
ఆ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం
షిమ్లా: ఆరుగురు అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలు బియాస్ నదిలో కొట్టుకు పోయి మృతిచెందిన దుర్ఘట పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పరిహారంలో డ్యామ్ బోర్డు 60శాతం, కాలేజీ యాజమాన్యం 30 శాతం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం10 శాతం ఇవ్వాలి. అంతేకాకుండా 7.5 శాతం వడ్డీ కూడా అదనంగా కలుపుకొని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 2014 జూన్ 8న వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. -
'ఎలాగైనా నా కొడుకు మృతదేహాన్ని అప్పగించండి'
మండి: 'నా కొడుకును అప్పగించండి' అంటూ ఐసా హుస్సేన్ అనే మహిళ హిమాచల్ ప్రదేశ్ అధికారులతో మొరపెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడి శవాన్ని వెతికి తీసుకురావాలని.. నా కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని మీడియా ఏజెన్సీతో ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్ధుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కుమారుడు మంచి ఈతగాడు.. నదిలో ఎలా కొట్టుకుపోయాడో అర్ధం కావడం లేదని మరో విద్యార్ధి తండ్రి బీవీ సుబ్బారావు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దుర్ఘటనలో మరణించిన విద్యార్ధులందరూ తెలివైన వారేనని సుబ్బారావు అన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా మృత దేహాల వెలికితీతకు గజ ఈతగాళ్లపై ఆధారపడి ఉండటం చాలా దారుణమన్నారు. నీటిలోపల ఉండే వాటిని తేలికగా గుర్తు పట్టేందుకు ఎన్నో సాధనాలున్నాయన్నారు. -
దేవాశీష్ బోస్ మృతదేహం లభ్యం
మండి (హిమాచల్ప్రదేశ్): బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు బాగ్అంబర్పేట సీఈకాలనీకి చెందిన దేవాశీష్ బోస్ గా గుర్తించారు. బోస్ తండ్రి రాబిన్బోస్ నిన్ననే సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మరణవార్త తెలియడంతో బోస్ తల్లి నిర్మల భోరున విలపించారు. దీంతో ఇప్పటివరకు మృతదేహాలు వెలికితీసినట్టయింది. ఇంకా 19 మంది ఆచూకీ చేయాల్సివుంది. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిన్న నలుగురు మృతదేహాలు వెలికితీశారు. సోమవారం అర్థరాత్రి ఈ మృతదేహాలను హైదరాబాద్ కు తరలించారు. ఈ నలుగురు అల్వాల్కు చెందిన దుర్గాదాస్ కుమార్తె గంపల ఐశ్వర్య, కూకట్పల్లికి చెందిన రాధాకృష్ణ కుమార్తె అప్పనబోట్ల లక్ష్మిగాయత్రి, చర్లపల్లికి చెందిన సూర్యకుమార్ కుమార్తె ఆకుల విజేత, నల్గొండ జిల్లా బిక్యాతాండాకు చెందిన శేఖర్నాయక్ కుమారుడు బానోతు రాంబాబుగా గుర్తించారు. -
ప్రమాదం కానే కాదు.. నిర్లక్ష్యమే: కవిత
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటన నిర్లక్ష్యమే కారణమని నిజమాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నేత కే. కవిత ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మండీ ఘటన ప్రమాదం వల్ల జరిగింది కాదు.. నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకుందని కవిత అన్నారు. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేక పోవడం, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడమే వల్లనే రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు మృత్యువాత పడ్డారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కవిత సంతాపం వ్యక్తం చేశారు. హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టింది. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ అప్పటివరకు ఉల్లాసంగా ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. -
తెలుగు విద్యార్థుల విహారయాత్రలో విషాదం
మండి: తెలుగు విద్యార్థుల విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి 48 విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి విహార యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో మండి వద్ద బియాస్ నదిలో కొంతమంది విద్యార్థుల కొట్టుపోయారు. విద్యార్థులు నదిలో ఫోటోలు దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ల్యార్జీ డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో ఈ దారుణం సంభవించింది. నది ప్రవాహానికి గల్లంతైన వారి సంఖ్య 20 నుంచి 24 వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరంతా హైదరాబాద్ లో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.ఈనెల 3న విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులంతా ఇనిస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లో రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరిలో 18 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. నది ప్రవాహానికి కొట్టుకుపోయిన వారిలో కొంతమంది ఫ్యాకల్టీలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనను నిర్ధారించిన హిమాచల్ ప్రదేశ్ డీజీపీ గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించామన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే హిమాచల్ప్రదేశ్ వెళ్లాలని హోంమంత్రి నాయినిని ఆదేశించారు. దీంతో హోంమంత్రి నాయినితో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారుల బృందం రేపు హిమాచల్ప్రదేశ్కు వెళ్లనున్నారు. కాగా, హిమాచల్ప్రదేశ్ సీఎస్తో తెలంగాణ సీఎస్ రాజీ వ్ శర్మ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఘటన వివరాలను కొంతమంది విద్యార్థులు సాక్షి టీవీకి తెలియపరిచారు.' నా కళ్లముందు నా స్నేహితులు కొట్టుకుపోయారు.ఫోటోలు దిగుతుండగా ప్రమాదం జరిగింది. విపరీతమైన నీటి ప్రవాహానికి నా తోటి విద్యార్థులు కొట్టుకుపోయారు'అని మౌనిక అనే విద్యార్థిని సాక్షికి ఫోన్లో వివరాలను తెలుపుతూ కన్నీటి పర్యంతమైంది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement