-
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్
మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలుసు. సొంత భాషలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తమిళంలోనూ సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. ధనుష్ 'అసురన్' మూవీతో కోలీవుడ్కు పరిచయమైన మంజు.. ఆ తర్వాత అజిత్తోనూ నటించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ కొత్త మూవీలో యాక్ట్ చేస్తోంది. (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న మంజూ వారియర్.. గతంలో మలయాళ నటుడు దిలీప్ని పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు.. కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు మంజూ వారియర్ దగ్గరే ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్త గురించి మంజూ వారియర్కి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన ఈ హీరోయిన్.. 'ఆ ఒక్కటి అడగొద్దు' అని క్లారిటీ ఇచ్చేసింది. తన బిడ్డతో కలిసి తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈమె తమిళంలో పాటు మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) -
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. విజయ్ సేతుపతికి జోడీగా మలయాళ బ్యూటీ
మలయాళ నటి మంజు వారియర్కు కోలీవుడ్లోకి అవకాశాలు వరుస కడుతున్నాయి. మాలీవుడ్లో ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈ భామ అక్కడ ఒక సమస్యలో ఇరుక్కోవడంతో నటనకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది. ఇలా ధనుష్కు జంటగా అసురన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో మంజు వారియర్ ఇక్కడ మంచి మార్కెట్ వచ్చింది. ఆ తరువాత తుణివు తదితర చిత్రాల్లో నటించిన ఈమె తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170 చిత్రం కాగా రెండోది విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న విడుదలై 2. హాస్య నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. తొలి భాగంలో నటుడు సూరి పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు వెట్రిమారన్ రెండో భాగంలో విజయ్ సేతుపతి పాత్రను హైలైట్ చేసి షూటింగ్ను నిర్వహిస్తున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా నటి మంజు వారియర్ను ఎంపిక చేశారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా నటిస్తోంది. ఈ జంటకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. విడుదలై 2 చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్స్కు ఛాన్స్
నటుడు రజినీకాంత్ జైలర్ చిత్ర విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకల్లోనూ పాల్గొన్నారు. తర్వాత తన 170వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షనన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి జైభీమ్ చిత్రం టీజే. జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమని ఆయన ఇదివరకే తెలిపారు. ఇందులో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించటానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు) ఆ మధ్య దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో జైలు అధికారిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పనిచేసే నటీనటులు సాంకేతిక వర్గం గురించి రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వెల్లడిస్తున్నారు. అలా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా ఇందులో నటి దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్ నటించనున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా రజనీకాంత్ ముఖ్యపాత్రను పోషించిన లాల్ సలామ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడం గమనార్హం. -
పాన్ ఇండియాను టార్గెట్ చేసిన ఆర్య
కోలీవుడ్ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్ ఎక్స్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ప్లాన్లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్ కార్తీక్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్ కుమార్, నటి మంజూవారియర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!
సూపర్స్టార్ రజినీకాంత్ 'జైలర్' రిలీజ్కు రెడీగా ఉంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈసారి తలైవా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి అలా వదిలేస్తే.. రజినీ తర్వాత మూవీ కోసం భారీ సెటప్ సిద్ధమవుతోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్లానింగ్ అదీ చూస్తుంటే పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. స్టార్స్ ఎవరెవరు? రజినీకాంత్ గత కొన్నేళ్లుగా ఒకే మూసలో సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. 'జైలర్' మీద పెద్దగా అంచనాల్లేవు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి ఓ మూవీ చేయబోతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. అయితే ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నారట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) నిజమైతే మాత్రం! ప్రస్తుతానికి రూమర్ అయినప్పటికీ.. దాదాపు ఇదే నిజం కావొచ్చని తెలుస్తోంది. అయితే ఒక్క సినిమాలో ఇంతమంది అద్భుతమైన స్టార్స్ ఉన్నారనే విషయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరో రెండు వారాల్లో ప్రకటన రానుందని సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీ పోలీస్ గా కనిపిస్తారట. అందులో భాగంగా తాజాగా హెయిర్ కట్ చేయించుకుని లుక్ మార్చేశారు. నానికి లక్కీ ఛాన్స్? ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమైతే మాత్రం తెలుగు హీరో నాని లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. ఎందుకంటే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే నాని.. పాన్ ఇండియా ఆశలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు. మరి ఈ న్యూస్పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
ప్లాన్ మారింది.. స్టార్ హీరోయిన్ వచ్చింది!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వైర్సటైల్ నటుడు అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో అని మాత్రమే కాకుండా విలన్, సైడ్ క్యారెక్టర్స్, గెస్ట్ రోల్స్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతున్నాడు. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీలో వెబ్ సిరీసులు అన్నీ కవర్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) ఈ ఏడాది విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో 'విడుదలై-1' ఒకటి. కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ తీసిన మూవీ ఇది. ఇందులో సేతుపతి నటించాడు కాకపోతే ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు చాలారోజుల క్రితమే ప్రకటించారు. రెండో భాగాన్ని చాలావరకు షూట్ చేసిన వెట్రిమారన్.. ఇప్పుడు చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి మళ్లీ చిత్రీకరణ జరుపుతున్నాడట. సీక్వెల్లో విజయ్ సేతుపతికి జోడీని చేర్చారు. ఆ పాత్రని మలయాళ నటి మంజు వారియర్ చేస్తున్నారు. ఈ జంటకి సంబంధించిన సీన్స్ని చిరుమలై ప్రాంతంలో తీస్తున్నారు. త్వరలో థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. (ఇదీ చదవండి: వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!) -
బీఎండబ్ల్యూ అంటే... బ్యూటీఫుల్ మంజు వారియర్!
అందాల కథానాయిక మంజు వారియర్కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘నేను కూడా రైడర్ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్లో మంజు వారియర్కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది. -
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్పై సింగిల్గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
లగ్జరీ బైక్పై హీరోయిన్ సందడి, లుక్స్లో ఎక్కడా తగ్గేదెలే!
గత నెలలో టూ వీలర్ లైసెన్స్ టెస్టుకు హాజరై వార్తల్లో నిలిచిన మంజు వారియర్, తాజాగా రూ. 21 లక్షల బైక్ కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి. తునివు సినిమాలో అజిత్ సరసన నటించిన ఈ మలయాళీ భామ ఆయన స్ఫూర్తితోనే ఖరీదైన 'బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్' బైక్ కొనుకోలు చేసింది. ఈ విషయాన్ని మంజు వారియర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందులో బైక్ డెలివరీ తీసుకోవడం, రైడింగ్ చేయడం వంటి దృష్ట్యాలు చూడవచ్చు. బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్ బైక్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటి. అజిత్ వంటి సెలబ్రిటీలు ఈ బైక్ కొనుగోలు చేశారు. బహుశా ఇంతటి ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన మొదటి సినీ నటి మంజు వారియర్ కావచ్చు. ఇప్పటికే ఈమె వద్ద ల్యాండ్ రోవర్, మారుతి బాలెనొ కార్లతో పాటు మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బైక్స్ రూపొందించబడ్డాయి. ఈ బైక్ ట్విన్-సిలిండర్ 1254సిసి ఇంజన్ 134 బిహెచ్పి పవర్ 143 ఎన్ఎమ్ టార్క్ని జనరేట్ చేస్తుంది. ఇది 20 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది. డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ తనకు తానే సాటిగా ఉంటుంది. A tiny step of courage is always a good place ❤️ P.S : Got to go a looooong way before I become a good rider, so if you see me fumbling on the roads, please be patient with me 😊🙏 Thank you for being an inspiration to many like me #AK #AjithKumar sir ❤️🙏#bmw #gs1250 #bmwkochi pic.twitter.com/XoiB9vZUVO — Manju Warrier (@ManjuWarrier4) February 17, 2023 -
ఆడియెన్స్ మధ్యలో కూర్చొని సినిమాల చూడాలనుంది: హీరోయిన్
తమిళ సినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. మలయాళ నటి మంజు వారియర్ నాయకి. హెచ్.వినోద్ దర్శకత్వంలో జీ.సినివతో కలిసి బోణీకపూర్ నిర్మించారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రపొందిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈనెల 11వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా మంజు వారియర్ కేరళలో తుణివు చిత్రాన్ని విడుదలైన రోజునే థియేటర్లో ప్రేక్షకుల మధ్య తిలకించారట. ఈ సినిమాను తమిళ ప్రేక్షకుల మధ్య చూడాలని ఆశ పడుతున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాను మొదటిసారిగా కేరళలో ప్రేక్షకుల మధ్య థియేటర్లో తుణివు చూసి ఆనందించానని తెలిపారు. ప్రేక్షకులతో కలిసి చూడడం థ్రిల్లింగా ఫీలయ్యానని అంది. అదేవిధంగా తమిళ పేక్షకుల మధ్య చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఈ చిత్రంలో తొలిసారిగా యాక్షన్ హీరోయిన్గా నటించినట్లు చెప్పారు. ఇలాంటి చాలెంజింగ్ పాత్రలో నటించడానికి శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి పాత్రలో తాను నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని కేరళలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తుణివు చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 20వ తేదీ ఆమె చెన్నైకు రానున్నారు. అదే రోజున ఆమె నటించిన మలయాళం చిత్రం ఆయిషా తెరపైకి రానుంది. ఇందులో మంజు వారియర్ నటించిన పాత్ర తుణివు చిత్రంలోని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె తెలిపారు. కాగా స్వతహాగా భరతనాట్య కళాకారిని అయిన మంజు వారియర్ ఈ నెల 20న చెన్నైలో జరగనున్న సర్య అనే వేడుకలో రాదే శ్యామ్ నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. -
Thegimpu Review: ‘తెగింపు’ మూవీ రివ్యూ
టైటిల్: తెగింపు నటీనటులు: అజిత్, మంజు వారియర్, జాన్ కొక్కెన్, యోగి బాబు, సముద్రఖని, మహానది శంకర్ తదితరులు నిర్మాత : బోనీ కపూర్ దర్శకుడు: హెచ్.వినోద్ సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: నిరవ్ షా విడుదల తేది: జనవరి 11, 2022 కథేంటంటే.. బ్యాంకు దోపిడి ఇతివృత్తంగా ‘తెగింపు’సినిమా కథనం సాగుతుంది. విశాఖపట్నంలోని ‘యువర్ బ్యాంక్’లో రూ.1000 కోట్ల మాత్రమే నిల్వ ఉంచడానికి అనుమతి ఉండగా.. నిబంధనలకు విరుద్దంగా మరో 500 కోట్లను డిపాజిట్ చేస్తారు. ఆ 500 కోట్ల రూపాయలను కొట్టేయడానికి ఏసీపీ ప్రవీణ్(అజయ్) ప్లాన్ చేస్తాడు. అతని మనుషులు బ్యాంక్లోకి వెళ్లగా..అక్కడ అప్పటికే డార్క్ డెవిల్ చీఫ్(అజిత్) ఉంటాడు. అతను కూడా తన టీమ్తో కలిసి డబ్బును కొట్టేసేందుకు బ్యాంకుకు వస్తాడు. అతని టీమ్లో మొత్తం ఐదుగురు ఉంటారు. వారిలో రమణి(మంజు వారియర్) ఒకరు. ఆమె బయట ఉండి టెక్నాలజీ సాయంతో అజిత్కు అన్ని విషయాలు చేరవేస్తుంది. అసలు డార్క్ డెవిల్ గ్యాంగ్ యువర్ బ్యాంకుని ఎందుకు టార్గెట్ చేసింది? డబ్బులను కొట్టేయాలనే ప్లాన్ ఎవరిది? ఏసీపీ ప్రవీణ్ వెనుక ఉన్నదెవరు? బ్యాంకు యజమాని క్రిష్ (జాన్ కొక్కెన్) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్లోకి రూ.25000 కోట్ల రూపాయలు ఎలా వచ్చి చేరాయి? ఈ స్కామ్లో ఉన్నదెవరు? చివరకు అజిత్ టీమ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘తెగింపు’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. బ్యాంకు దోపిడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తెగింపు కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. బ్యాంకులను అడ్డం పెట్టుకొని కొంతమంది ఎలాంటి స్కామ్లు చేస్తున్నారనేది ఈ సినిమాలో చూపించారు. ఈ పాయింట్తో ఇటీవల మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కథనం వేరేలా సాగుతుంది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వినోద్. ఫస్టాఫ్లో కథ ఏమి ఉండదు కానీ.. ఒక్కో పాత్రని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడంతో అసలు బ్యాకింగ్ రాబరీ వెనక ఉన్నదెరనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. మొత్తం మూడు గ్యాంగ్లు బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేయడం.ఒక్కో గ్యాంగ్ వెనుక ఊహించని వ్యక్తులు ఉండడంతో కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఫస్టాఫ్లో కథ కంటే..ఫైటింగ్ సీన్సే ఎక్కువ. బ్యాంకులోకి వెళ్లడానికి పోలీసులు ప్లాన్ చేయడం..దానిని హీరో గ్యాంగ్ తిప్పికొట్టడం..ఇలానే సాగుతుంది. ఆ ఫైటింగ్ సీన్స్ చూస్తే విజయ్ ‘బీస్ట్’ సినిమా గుర్తొస్తుంది. అక్కడ హీరో షాపింగ్మాల్లో ఫైట్ చేస్తే..ఇక్కడ బ్యాంకులో చేస్తాడు. భారీ యాక్షన్ సీన్స్తో ఫస్టాఫ్ని కొంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.ఇక సెకండాఫ్లో కథ మాత్రం చాలా రోటీన్గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకు మైనస్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్గా ఉంటుంది. దర్శకుడు కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. అజిత్ సినిమాలు చాలా కాలంగా కేవలం హీరోయిజాన్ని, స్టంట్ లను నమ్ముకుని తీసేస్తున్నారు. ఈ ‘తెగింపు’ కూడా అలాంటిదే. అజిత్ వీరాభిమానులకు నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. అజిత్ ఎప్పటిలాగే యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేశాడు. తెరపై చాలా స్టైలీష్గా కనిపించాడు. మంజు వారియర్కి మంచి పాత్ర లభించింది. డార్క్ డెవిల్ టీమ్ మెంబర్గా ఆమె తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. యాక్షన్ సీస్స్లో అదరగొట్టేసింది. కమిషనర్ పాత్రలో సముద్రఖని ఒదిగిపోయాడు. కానీ అతని పాత్రకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నెగెటివ్ షేడ్ ఉన్న ఏసీపీ ప్రవీణ్గా అజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరనటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. జిబ్రాస్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అలాగే నిరవ్ షా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చాలా ప్లస్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఆ హీరో తుపాకీ కాల్చడం నేర్పించాడు : మంజు వారియర్
తమిళసినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దసరా, జీ సినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఇందులో అజిత్ సరసన మలయాళీ స్టార్ నటి మంజు వారియర్ తొలిసారిగా నటించారు. అదేవిధంగా ఈమె తమిళంలో నటించిన రెండవ చిత్రం ఇది. ఇంతకు ముందు ధనుష్తో కలిసి అసురన్ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా తుణివు చిత్రంలో నటించిన అనుభవాన్ని మంజు వారియర్ ఒక భేటీలో పేర్కొంటూ ఈ చిత్రం కొత్త అనుభవమని పేర్కొన్నారు. ఇంతకుముందు అసురన్ చిత్రంలో చేసిన ప్రాత్రకు.. తుణివు చిత్రంలోని క్యారెక్టర్కు పోలికే ఉండదన్నారు. ఇందులో యాక్షన్ హీరోయిన్గా నటించినట్లు చెప్పారు. కణ్మణి అనే యువతిగా ఒక చేతితో తుపాకీ కాల్చడం కష్టతరం కావడంతో హీరో అజిత్ నేర్పించారన్నారు. తాను ఇంతకుముందు అనేక చిత్రాల్లో నటించాను కానీ, యాక్షన్ పాత్రలో నటించడం ఇదే తొలిసారి అని చెప్పారు. అసురన్ చిత్రం తరువాత మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తుణివు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. కథ నచ్చడంతోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. అసురన్ చిత్రంలోని పచ్చయమ్మాళ్ పాత్రను ప్రేక్షకులు ఎలా ఆదరించారో ఈ చిత్రంలోని కణ్మణి పాత్రను కూడా అలాగే ప్రోత్సహిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. -
Manju Warrier: వాటిని ఎంజాయ్ చేస్తున్నా.. అభిమానానికి థ్యాంక్స్!
మాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి మంజువారియర్. ఈమె తమిళంలో అజిత్ సరసన నటిస్తున్న చిత్రం తుణివు. హెచ్ వినోద్ కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని జీసినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పొంగల్ సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్కు సన్నాహాలు చేస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు విడుదలై అజిత్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. అందులో ఒకటి కాసేదాన్ కడవులడా పల్లవితో సాగే పాట. ఈ పాటను సంగీత దర్శకుడు జిబ్రాన్తో కలిసి నటి మంజు వారియర్ పాడటం విశేషం. అయితే ఇటీవల విడుదలైన ఈ పాటలో నటి మంజువారియర్ సెట్ కాలేదని కోరస్లో కలిసిపోయిందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వాటిపై స్పందించిన ఆమె తుణివు చిత్రంలో తాను పాడిన పాటలో తన గొంతు బాగోలేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని.. తన పాటపై వారు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అని, తన గొంతు బాగోలేదని మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని, తాను వీడియో వెర్షన్ కోసమే పాడినట్లు పేర్కొన్నారు. ట్రోలింగ్స్ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు మంజువారియర్ పేర్కొన్నారు. -
స్టార్ హీరో అజిత్ సినిమా కోసం పాట పాడిన మంజూ వారియర్
తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తుణివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. నేర్కండ పారై్వ, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం తుణివు.. షూటింగ్ పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మంజు వారియర్ ఇందులో నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది. అదే విధంగా కోలీవుడ్లో వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది అదే విధంగా కోలీవుడ్లోనూ వారీసు, తుణివు చిత్రాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కారణం విజయ్, అజిత్ చిత్రాల మధ్య పోటీ ఉండడమే.గతంలో అజిత్ నటించిన వీరం, విజయ్ నటించిన జిల్లా చిత్రాలు ఒకేసారి విడుదలై రెండూ మం విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత ఇప్పటివరకు అలాంటి పోటీ పరిస్థితి రాలేదు. అలాంటిది ఎన్నాళ్లకు మళ్లీ ఈ ఇద్దరు స్టార్ చిత్రాలు మధ్య పోటీ తప్పడం లేదు. అజిత్ నటిస్తున్న తుణివు చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. దీంతో అజిత్ గానీ.. ఆయన అభివనులు గానీ.. ఎలాంటి టెన్షన్ పడటం లేదు.తమ అభిమాన నటుడు చిత్రానికే అధిక థియేటర్లు.. లభిస్తాయనే ధీమాతో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తుణివు చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ను ఆ చిత్ర హీరోయిన్ మంజు వారియర్ వెల్లడించారు. ఈ చిత్రం కోసం ఆమె ఒక పాట పాడిందన్నదే ఆ అప్డేట్. ఈ విషయాన్ని ఆమె సంగీత దర్శకుడు జిబ్రాన్తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్త తెలియజేశారు. Thrilled to have sung for @GhibranOfficial !!! Happy to be part of a very interesting song in #Thunivu! Waiting for you all to hear it! ❤️#ajithkumar #AK #hvinoth pic.twitter.com/G934UX79sg — Manju Warrier (@ManjuWarrier4) November 26, 2022 -
స్టార్ హీరోయిన్ను వేధింపులకు గురి చేసిన డైరెక్టర్ అరెస్ట్
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ను వేధింపులకు గురి చేసిన కేసులో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివకాల్లోకి వెళితే.. సనల్ కుమార్ దర్శకత్వంలో మంజు వారియర్ కయాట్టం అనే సినిమాలో నటించింది. అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా సనల్ కుమార్ అదే పనిగా తనకు మెసేజ్లు పంపిస్తూ వేధింపులకు గురిచేరాడని హీరోయిన్ ఆరోపించింది. పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చికోకుండా వేధింపులు గురి చేస్తున్నాడంటూ మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. ప్రస్తుతం ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. కాగా కేరళ ప్రభుత్వం నుంచి సనల్ కుమార్ అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. అలాంటి డైరెక్టర్ ఇలాంటి నీచమైన పనులు చేయడం ఏంటని నెటిజన్లు సనల్కుమార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. -
4 భాషల్లో మంజు వారియర్ సినిమా రీమేక్
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఇటీవల నటించిన చిత్రం ప్రతీ పూవన్కోజి. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడం,హిందీ భాషల్లో రీమేక్ చేయనున్నారు. హిందీలో ప్రతీ పూవన్కోజి సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన హిందీ రీమేక్ హక్కులను ఇప్పటికే బోనీ కపూర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అదే విధంగా తెలుగు, తమిళ్, కన్నడలో కూడా వివిధ ప్రొడక్షన్ హౌజ్లు రీమేక్ హక్కులను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. చదవండి: ఆర్చ... అదరహా కథ రచయిత ఉన్ని ఆర్ రచించిన ‘సంకడం’ కథా ఆధారంగా ఈ సినిమాను రోషన్ ఆండ్సూస్ డైరెక్ట్ చేశారు. ప్రతీ పూవన్కోజి సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించడమే కాకుండా విలన్గా కూడా నటించారు. ఇది నటుడిగా రోషన్ తొలి సినిమా. కాగా వస్త్ర దుకాణంలో సేల్స్ వుమన్ పాత్ర పోషించిన మంజు వారియర్ ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. .మాధురి పాత్రలో లీనమై తనను బస్సులో వేధించిన ఓ గ్యాంగ్పై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథాంశం. ప్రస్తుతం మంజు వారియర్ మోహన్లాల్ నటిస్తున్న మరక్కమ్ సినిమాలో కనిపించనున్నారు. చదవండి: డ్యాన్సర్పై కొరియోగ్రాఫర్ అనుచిత ప్రవర్తన.. -
ఆర్చ... అదరహా
మోహన్లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ మలయాళ మూవీ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మోహన్లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్. ఆమె క్యారెక్టర్ లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్చ లుక్ ఆదరహా అంటోంది మాలీవుడ్. ఈ ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
జోడీ కుదిరిందా?
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్, మంజువారియర్ నటించిన సూపర్హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని డి.సురేష్బాబు, కళైపులి యస్. థాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకు తెలుగు రీమేక్లో ప్రియమణిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల ప్రియమణిని సంప్రదించారని టాక్. మరి.. వెంకీ, ప్రియమణి జోడి కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే 2016లో ‘మన ఊరి రామాయణం’లో కనిపించిన తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం దివంగత నటి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో రూపొందుతోన్న ‘తలైవి’లో శశికళ పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు ప్రియమణి. -
దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఫిర్యాదు మేరకు దర్శకుడు శ్రీకుమార్ మీనన్పై కేసు నమోదైంది. మంజు వారియర్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత.. ఐపీసీ 509 సెక్షన్తో పాటు వివిధ సెక్షన్ల కింద శ్రీకుమార్పై కేసు నమోదు చేసినట్లు కేరళ డీజీపీ లోక్నాథ్ బెహరా తెలిపారు. త్రిసూర్ ఈస్ట్ పోలీసు స్టేషనులో కేసు నమోదైందని... ఈ మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. కాగా తన భర్త, నటుడు దిలీప్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం మంజు వారియర్ కెరీర్ నెమ్మదించింది. ఈ నేపథ్యంలో తాను దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్, అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా శ్రీకుమార్ ఆమె కెరీర్కు బ్రేక్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వివిధ సినిమాలకు పనిచేశారు. అయితే కొన్ని రోజుల క్రితం వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. శ్రీకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒడియన్ సినిమాలో మంజు వారియర్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ సమయంలో శ్రీకుమార్ తనను అసభ్యంగా దూషించాడని.. తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లగొడతానని... ఆ తర్వాత చంపేస్తానని శ్రీకుమార్ బెదిరించాడని ఆమె ఆరోపించారు. అదే విధంగా సోషల్ మీడియాలో తన గురించి అసత్యాలు ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తమిళ స్టార్హీరో ధనుష్ సరసన మంజు వారియర్ హీరోయిన్గా నటించిన ‘అసురన్’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా కేసు విషయంపై స్పందించిన శ్రీకుమార్ కఠిన సమయాల్లో తోడుగా ఉండి.. మంజు వారియర్కు అండగా నిలిచానని.. అయినా ఆమె తనపై ఫిర్యాదు చేయడం బాధాకరం అన్నాడు. తనపై కేసు నమోదైన విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నానని.. పోలీసులకు సహకరిస్తానని తెలిపాడు. ఇక మంజు వారియర్ భర్త దిలీప్పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రముఖ మలయాళ హీరోయిన్ను అపహరించి.. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. -
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్
మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ కుదేలయ్యింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడుతుండటం, రోడ్లు కొట్టుకుపోతుండటం వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలయాళ హీరోయిన్ మంజు వారియర్తో పాటు చిత్ర బృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నారు. దాదాపు 30 మంది ఉన్న ఈ బృందం చట్రూ కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అవార్డు విన్నింగ్ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ నిమిత్తం వీరంతా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అయితే భారీ వరదల మూలానా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు కొట్టుకుపోవడంతో మంజు, ఇతర సభ్యులు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. దీని గురించి మంజు వారియర్ సోదరుడు మధు మాట్లాడుతూ.. ‘సనల్ కుమార్, మంజు, ఇతర చిత్ర బృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకుపోయారు. దీన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ఆదేశాల మేరకు అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ప్రస్తుతం అక్కడ టెలిఫోన్, సెల్ఫోన్ లైన్స్ ఏం పని చేయడం లేదు. సోమవారం రాత్రి నా సోదరి నాకు శాటిలైట్ ఫోన్ నుంచి కాల్ చేసింది. తామంతా క్షేమంగానే ఉన్నామని చెప్పింది. కానీ సరిపడా ఆహారం లేదు. కేవలం ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే ఆహారం ఉంది. తక్షణమే తమకు సాయం అందేలా చూడమని కోరింది. ఈ విషయాన్ని మంత్రి వి మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీని గురించి హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సంప్రదింపులు జరుపుతున్నాను అన్నారు’ అని తెలిపాడు. -
అసురుడు
పాత్రల్లోకి ఇట్టే మారిపోయే నటుల్లో తమిళ నటుడు ధనుష్ ఒకరు. లేటెస్ట్గా వయసు మళ్లిన వ్యక్తిగా మారిపోయారు. ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అసురన్’. వెట్రీమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల్లా డబుల్ యాక్షన్ చేస్తున్నారు ధనుష్. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్గా కనిపిస్తున్నారు. తమిళ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ధనుష్ కొత్త స్టిల్ను రిలీజ్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. -
ఇంకొక్కడున్నాడు
సినిమా ముఖ్యంగా తమిళ సినిమా వైవిధ్యాన్ని వెతుక్కుంటూ పోతోందని చెప్పవచ్చు. కథానాయకులు, దర్శకులు కొత్తదనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్ వైవిధ్యానికి చిరునామా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన చిత్రాల్లో ఇతర చిత్రాలకు భిన్నంగా పాత్రలు చోటు చేసుకుంటాయి. నటులను అందుకు తగ్గట్టుగానే మార్చేస్తారు. వెట్రిమారన్ ఇంతకు ముందు తెరకెక్కించిన ఆడుగళం, పొల్లాదవన్, వడచెన్నై లాంటి చిత్రాలను గమనిస్తే ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మూడు చిత్రాల్లోనూ ధనుషే కథానాయకుడు. అందులో ఆయన పోషించిన పాత్రలు ఒకదానికి ఒకటి పోలికే ఉండదు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అసురన్. ఇందులో ధనుష్కు జంటగా మలయాళ నటి మంజువారియర్ నటించడం మరో విశేషం. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది తాజా సమాచారం. అదే విధంగా ఇందులో ఆయన గెటప్ చూస్తుంటే రైతుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అసురన్ చిత్రంలో ధనుష్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇందులో 45 ఏళ్ల తండ్రి పాత్ర కొంచెం సేపే ఉన్నా దాని ప్రభావం కథపై చాలానే ఉంటుందని చెప్పారు. అదే విధంగా తండ్రీ కొడుకులుగా ధనుష్ చూపిస్తున్న వైవిధ్యభరిత నటన అందరినీ ఆకర్షిస్తుందని దర్శకుడు అన్నారు. ఇందులో ఒక కొండ ప్రాంతంలో జరిగే సన్నివేశాన్ని దాదాపు 6 గంటల పాటు చిత్రీకరించాం. అయినా ఎలాంటి అసహనం చెందకుండా ధనుష్ నటించారని దర్శకుడు వెట్రిమారన్ తెలిపారు. ధనుష్ ఈ చిత్రంతో పాటు దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఇందులోనూ ఆయన ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. ఇలా ఒకే సారి రెండు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న నటుడు ఈయనే అవుతారేమో. -
కోలీవుడ్ ఎంట్రీ
మాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న మంజు వారియర్ ఇప్పుడు కోలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుశ్ హీరోగా ‘అసురన్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు మంజు వారియర్ను తీసుకున్నారు టీమ్. ఈ నెల 26న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ‘‘మా సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం ఎవర్గ్రీన్ మంజు వారియర్ను తీసుకున్నాం. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. అద్భుతమైన ప్రతిభాశాలి అయిన ఆమె నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని ధనుశ్ పేర్కొన్నారు. -
ధనుష్కు జోడీగా సీనియర్ హీరోయిన్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం అసురన్. ఇటీవల మారి 2తో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ధనుష్ అసురన్ సినిమాలో డిఫరెంట్ లుక్లో అలరించనున్నాడు. ధనుష్ హీరోగా వడా చెన్నై సిరీస్ను తెరకెక్కిస్తున్న వెట్రీ మారన్ ఈసినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో ధనుష్కు జోడిగా ఓ సీనియర్ నటి కనిపించనుందట. వెక్కై నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్గా నటించనుంది. సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న మంజు.. తనకన్నా చిన్నవాడైన ధనుష్కు జోడిగా నటిస్తుండటం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు.
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఆ ముసలోడికి ఏం రోగం..కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
బీసీలను ఆదరించడంలో సీఎం జగన్ ముందుంటారు: కొడాలి నాని
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
మత్స్యకారులకు గుడ్ న్యూస్
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement