-
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడగా.. వికెట్కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం లాహోర్ ఖలందర్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(59 బంతుల్లో 82, 9 ఫోర్లు,3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. చివరిలో సుల్తాన్స్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్లతో 34 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. 19 ఓవర్ వేసిన లహోర్ పేసర్ జమాన్ ఖాన్కు ఇఫ్తి భాయ్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ ఓవర్లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్ను ముగించేశాడు. డగౌట్ నుంచి ఇఫ్తికర్ విధ్వంసం చూసిన రిజ్వాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గతంలో కూడా ఇఫ్తికర్ పాక్ జట్టుకు ఎన్నో సంచలన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లాహోర్ బ్యాటర్లలో వండర్ డస్సెన్(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముల్తాన్ బౌలర్లలో మహ్మద్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. అఫ్రిది, ఉసామా మీర్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: AFG vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్ IFTI MANIA 🤯 Enough said...#HBLPSL9 | #KhulKeKhel | #MSvLQ pic.twitter.com/uXqkWv2btV — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2024 -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్లో బరిలోకి దిగనుంది. ఇక పాక్తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
Aus Vs Pak: ఐదు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. పాక్ ఆలౌట్
Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్ను జోష్ హాజిల్వుడ్ డకౌట్ చేసి పెవిలియన్కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు. అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు. తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మహ్మద్ హఫీజ్ను వదలట్లేదు.. మొన్న అలా.. ఇప్పుడిలా సెటైర్!
Australia vs Pakistan, 3rd Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ను ఐస్లాండ్ క్రికెట్ మరోసారి ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్ కూడా హఫీజ్ను ఇబ్బంది పెడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన షాన్ మసూద్ బృందం.. తొలి రెండింటిలో ఓడిపోయింది. పెర్త్లో ఏకంగా 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. మెల్బోర్న్ టెస్టులో పోరాడగలిగింది. అయితే, ఈ మ్యాచ్లో మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరుపై పాక్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిజ్వాన్ అవుటైన తీరుపై రచ్చ ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకినట్లుగా కనిపించడంతో అతడు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కాన్ఫిడెంట్గా ఉన్న కమిన్స్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. పాకిస్తాన్ కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, అంపైర్ల తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ పాక్ మాజీ క్రికెటర్, జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మెల్బోర్న్లో తాము ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చామంటూ ప్రత్యర్థి జట్టు ఆట తీరును విమర్శించాడు. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు ఆసీస్ ఎయిర్లైన్స్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐస్లాండ్ క్రికెట్ హఫీజ్పై సెటైరికల్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ అత్యంత ప్రతిభావంతమైన జట్టు అయినందుకే.. ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 16 టెస్టులు ఓడిపోయిందా అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. తాజాగా సిడ్నీ టెస్టు కోసం.. మహ్మద్ హఫీజ్ తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో మరోసారి ట్రోల్ చేసింది. ‘‘అయ్యో అందరూ ప్రతిభావంతులే ఉన్న జట్టు అది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ కూడా అతడిని వదిలేసి వెళ్లిందా?’’ అని సెటైర్ వేసింది. సిరీస్ సమర్పయామి.. ఆఖరి టెస్టులో ఆఫ్రిది లేకుండానే కాగా ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకున్న పాకిస్తాన్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఈ టెస్టుకు ఎంపిక చేసిన పాక్ జట్టులో షాహిన్ ఆఫ్రిదికి చోటు దక్కలేదు. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అతడికి విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లాల్సి ఉండగా.. మహ్మద్ హఫీజ్ ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ All that talent, and now even the Aussie airlines are out to get him! https://t.co/gtF1rXqOit — Iceland Cricket (@icelandcricket) January 1, 2024 -
తప్పిదారి షాహిన్ కెప్టెన్ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు!
పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్ మసూద్ను కెప్టెన్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్ నాయకత్వంలో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టు.. తదుపరి షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్గా నిలిపాయి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్ రిజ్వాన్ను ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘రిజ్వాన్ను పాక్ టీ20 కెప్టెన్గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్ వా Shahid Afridi praised Muhammad Rizwan and said that Rizwan should have been captain of T20 but Shaheen became it by mistake.#Rizwan #PakistanCricket pic.twitter.com/TSECe93ZPM — Ahtasham Riaz 🇵🇰 (@AhtashamRiaz_) December 30, 2023 -
Aus Vs Pak: రిజ్వాన్ అవుటా? నాటౌటా?.. వీడియో వైరల్
Australia vs Pakistan, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరు నెట్టింట చర్చకు దారితీసింది. ఈ అంశంపై క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర విరుద్ధ కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. బాక్సింగ్ డే టెస్టులో పాకిస్తాన్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా మంగళవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న షాన్ మసూద్ బృందం.. ఆతిథ్య ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, కంగారూ బౌలర్ల ధాటికి తాళలేక 264 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్ను ముగించింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. మరో 262 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దీంతో పాక్ విజయ లక్ష్యం 317గా మారింది. అయితే, టార్గెట్ ఛేదనకై బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చార్లు ఆసీస్ పేసర్లు. ఓపెనర్లు.. అబ్దుల్లా షఫీక్ను 4 పరుగుల వద్ద స్టార్క్ పెవిలియన్కు పంపగా.. 12 పరుగులతో ఆడుతున్న ఇమామ్ ఉల్ హక్ను కమిన్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్ 60 పరుగులు చేసి అవుట్ కాగా.. బాబర్ ఆజం 41, సౌద్ షకీల్ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. రిజ్వాన్పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ ఈ క్రమంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ను ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మరోసారి దెబ్బకొట్టాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 61వ ఓవర్ వేసిన కమిన్స్ బౌలింగ్లో బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకి కీపర్ చేతుల్లో పడినట్లు కనిపించింది. రివ్యూకు వెళ్లిన కమిన్స్ దీంతో కమిన్స్ గట్టిగా అప్పీలు చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కమిన్స్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని చాలెంజ్ తీస్తూ డీఆర్ఎస్కు వెళ్లాడు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్.. నిశితంగా పరిశీలించిన తర్వాత.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేసి.. రిజ్వాన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. రిజ్వాన్ తనకు అన్యాయం జరిగిందన్నట్లుగా మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్ వద్దకు దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిజ్వాన్ అవుటా? నాటౌటా? అంటూ చర్చలు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంపైర్ను ఒత్తిడిలోకి నెట్టి తమకు అనుకూలంగా ఫలితం వచ్చేలా చేశారని.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రిజ్వాన్ను నాటౌట్గా ప్రకటించాల్సిందని పాక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. బంతి బ్యాటర్ గ్లోవ్స్ను తాకి కీపర్ చేతుల్లో పడితే నిబంధనల ప్రకారం అవుట్ ఇవ్వడం సరైందేనని.. ఇక్కడ రిస్ట్బ్యాండ్ కూడా గ్లోవ్ను అంటి ఉందనే విషయాన్ని గమనించాలని హితవు పలుకుతున్నారు. కాగా రిజ్వాన్(35 పరుగులు) రూపంలో కమిన్స్ 250వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 79 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ను మరోసారి ఆతిథ్య ఆసీస్కు సమర్పించుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు బుధవారం నుంచి మొదలుకానుంది. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా! Wicket 250 for Pat Cummins! 🎉 The third umpire decided the ball flicked Mohammad Rizwan's sweatband on the way through. #MilestoneMoment | @nrmainsurance | #AUSvPAK pic.twitter.com/vTuDL5DmNB — cricket.com.au (@cricketcomau) December 29, 2023 -
Aus vs Pak 2nd Test: సర్ఫరాజ్ అహ్మద్పై వేటు.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
Aus vs Pak Boxing Day Test Squads: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైన పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పడింది. అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ను తుదిజట్టులోకి తీసుకుంది పాక్ మేనేజ్మెంట్. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత షాన్ మసూద్ పాకిస్తాన్ టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. వచ్చీరాగానే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అతడికి కఠిన సవాలు ఎదురైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో కంగారూ జట్టు చేతిలో పాక్ ఘోర పరభవాన్ని చవిచూసింది. ఏకంగా 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో పాక్ ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 89 పరుగులకే జట్టు ఆలౌట్ కావడంతో భారీ తేడాతో ఓటమి తప్పలేదు. మిగతా వాళ్లు తొలి ఇన్నింగ్స్లో కాస్త ఫర్వాలేదనిపించినా సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం నిరాశపరిచాడు. మొత్తంగా ఏడు (3,4) పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆసీస్తో రెండో టెస్టుకు సర్ఫరాజ్ను తప్పించిన యాజమాన్యం అతడి స్థానాన్ని స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్తో భర్తీ చేసేంది. ఈ విషయం గురించి కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం కావాలి. రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. నొమన్ అలీ, ఖుర్రం షెహజాద్ గాయపడటంతో జట్టుకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టు ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్లోనూ బరిలోకి దిగనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాక్తో రెండో టెస్టు ఆడనున్నట్లు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. ఈ జట్టులో చోటు ఆశించి భంగపడిన వెటరన్ పేసర్ స్కాట్ బోలాండ్కు తగిన సమయంలో అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా కమిన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్. పాకిస్తాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్, సాజిద్ ఖాన్. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
పాక్ జట్టేమీ నేపాల్కు వెళ్లడం లేదు.. వాళ్లకు రెస్ట్ ఎందుకు?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై జనవరి 12 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్ ద్వారానే పాక్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్లు అతడి నాయకత్వంలో తొలిసారి మైదానంలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ సెలక్షన్ కమిటీ కన్సల్టెంట్, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్కు వింత ప్రశ్న ఎదురైంది. స్థానిక టీవీ చానెల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో యాంకర్.. ‘‘సీనియర్లు బాబర్ ఆజం, రిజ్వాన్లకు న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతినివ్వవచ్చు కదా?’’ అని అక్మల్ను అడిగారు. ఇందుకు అతడు బదులిస్తూ.. ‘‘సెలక్షన్ కమిటీలోని సభ్యులు కానీ.. మేనేజ్మెంట్గానీ న్యూజిలాండ్ సిరీస్లో బాబర్, రిజ్వాన్లకు రెస్ట్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే పాక్ జట్టు వెళ్తోంది న్యూజిలాండ్కు.. నేపాల్కు కాదు. అలాంటి పటిష్ట జట్టుతో పోటీపడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినివ్వడం ఏమిటి? అసలు ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తారా?’’ అంటూ కమ్రాన్ అక్మల్ కౌంటర్ వేశాడు. ఇక షాన్ మసూద్ కెప్టెన్సీ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘కెప్టెన్గా లేదంటే కోచింగ్ సిబ్బందిగా కొత్తగా నియమితులైన వాళ్లకు.. తమను తాము నిరూపించుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే వారి పనితీరును అంచనా వేసే అవకాశం ఉంటుంది’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం అనంతరం పాక్ కెప్టెన్గా బాబర్ ఆజం వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లు అయ్యారు. ఈ క్రమంలో మసూద్ సారథ్యంలో తొలిసారి ఆసీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ తొలి టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఇక డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ముగించుకుని తదుపరి న్యూజిలాండ్కు పయనం కానుంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు పాకిస్తాన్ జట్టు షాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్. చదవండి: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం? -
ఇదొక పిచ్చి నిర్ణయం.. పాకిస్తాన్ క్రికెట్పై విమర్శలు
పెర్త్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి టెస్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్కు చోటు దక్కపోవడం అందరని ఆశ్యర్యపరిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందే ఒక్కరోజు ముందే తుది జట్టును ప్రకటించిన క్రికెట్ పాకిస్తాన్.. రిజ్వాన్కు ఛాన్స్ ఇవ్వలేదు. అతడి స్ధానంలో మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్కు జట్టు మేనెజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో పాక్ జట్టు మేనెజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరికాదని మాజీలు సైతం మేనెజ్మెంట్ను దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో పాక్ తరపున రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా వన్డే వరల్డ్కప్లో కూడా రిజ్వాన్ తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. కాగా ఈ మ్యాచ్తో పాకిస్తాన్ యువ ఆటగాళ్లు ఖుర్రం షాజాద్, అమీర్ జమాల్ టెస్టు అరంగేట్రం చేశారు. ఆసీస్తో తొలి టెస్ట్కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ -
రిజ్వాన్ను బ్యాట్తో కొట్టబోయిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో తీవ్ర నిరాశపరిచిన పాకిస్తాన్ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఆసీస్ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించింది. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో తమ టెస్టు కొత్త కెప్టెన్గా షాన్ మసూద్ను పీసీబీ ఎంపిక చేసింది. ఆసీస్ సిరీస్తో పాకిస్తాన్ కెప్టెన్గా షాన్ మసూద్ ప్రయాణం ప్రారంభం కానుంది. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ కీలక సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇప్పటినుంచే తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టేసింది. లాహోర్లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో పాక్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. రిజ్వాన్ను బ్యాట్తో కొట్టబోయిన బాబర్.. పాకిస్తాన్ ప్రాక్టీస్ క్యాంప్లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను మాజీ కెప్టెన్ బాబర్ ఆజం సరదగా బ్యాట్తో కొట్టబోయాడు. ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఓవర్ పూర్తి అయిందని బాబర్ క్రీజును వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వికెట్ల వెనుక ఉన్న రిజ్వాన్ స్టంప్స్ను పడగొట్టి రనౌట్కు అప్పీల్ చేశాడు. ఇది చూసిన బాబర్ సరదగా తన బ్యాట్తో రిజ్వాన్ను కొట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో రిజ్వాన్ నవ్వుతూ ముందుకు పరిగెత్తాడు. బాబర్ కూడా తన వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా మిగితా ఆటగాళ్లూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Babar 😭😭 pic.twitter.com/OnLIv1t4A7 — Hassan (@HassanAbbasian) November 25, 2023 -
టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్.. పీసీబీతో కూడా చెప్పాను!
Pakistan Cricket Captains: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ల మార్పుపై మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. టీ20 కెప్టెన్గా షాహిన్ షా ఆఫ్రిది నియామకంలో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు. తన అల్లుడి కోసం ఎలాంటి లాబీయింగ్ చేయలేదని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. షాహిన్ కెప్టెన్ కావాలని కోరుకోలేదు ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. టెస్టు పగ్గాలను షాన్ మసూద్కు అప్పగించింది. ఈ క్రమంలో టీ20 సారథిగా షాహిద్ నియామకంలో మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రమేయం ఉందనే వదంతులు వ్యాపించాయి. తన అల్లుడి కోసం ఆఫ్రిది పీసీబీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆఫ్రిది.. ‘‘నేను అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చను. షాహిద్తో నాకున్న బంధుత్వం కారణంగా ఇలాంటి మాటలు వినిపిస్తాయని నాకు తెలుసు. ఒకవేళ నేను లాబీయింగ్ చేసే వాడినే అయితే.. పీసీబీ చైర్మన్ను ఎందుకు విమర్శిస్తాను? నేను ఏ రోజూ కూడా షాహిన్ను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేయలేదు. మహ్మద్ రిజ్వాన్తో బాబర్ ఆజం నిజానికి అతడు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలనే కోరుకున్నా. అయితే, షాహిన్ను సారథిగా నియమించాలన్నది పూర్తిగా పీసీబీ చైర్మన్, మహ్మద్ హఫీజ్ నిర్ణయం. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్ బాబర్ ఆజంనే కెప్టెన్గా కొనసాగించాలని పీసీబీ చైర్మన్తో గతంలో చెప్పాను. ఒకవేళ అతడు తప్పుకోవాలని భావిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్ను కెప్టెన్గా చేయాలని.. టెస్టుల్లో మాత్రం బాబర్నే కొనసాగించాలని పీసీబీకి చెప్పాను’’ అని సామా టీవీ షోలో పేర్కొన్నాడు. కాగా షాహిద్ ఆఫ్రిది పెద్ద కుమార్తె అన్షాను షాహిన్ వివాహమాడిన విషయం తెలిసిందే. చదవండి: CWC 2023: ద్రవిడ్తో కలిసి పిచ్ పరిశీలించిన రోహిత్! క్యూరేటర్ చెప్పిందిదే! -
పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్కతా వేదికగా ఇంగ్లండ్ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్తో పాటు ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
కోహ్లి ఆరోజే సెంచరీ చేయాలి.. 50వ శతకం కూడా పూర్తి చేసుకోవాలి: రిజ్వాన్
ICC WC 2023- Virat Kohli- Mohammad Rizwan: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. తన సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ కూడా సాధ్యంకాని రీతిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైం రికార్డుకు చేరవవుతున్నాడు. వన్డేల్లో గనుక ఈ రన్మెషీన్ మరో రెండు శతకాలు బాదితే సచిన్ను వెనక్కి నెడతాడు కూడా! ఇక వరల్డ్కప్-2023లోనే విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాలని అభిమానులు ఆశపడుతున్నారు. పుట్టినరోజున సచిన్ రికార్డు సమం చేసి.. ఆ తర్వాత దానిని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్కతాలో బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు ఇండియా టుడేతో మాట్లాడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగా.. ఆరోజే తను 49వ సెంచరీ చేయాలి ‘‘నవంబరు 5న తన బర్త్డేనా? మంచిది.. నిజానికి నాకు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు.. అయినా.. తనకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విరాట్ తన బర్త్డే నాడే 49వ వన్డే సెంచరీ సాధించాలి. అంతేకాదు ఈ వరల్డ్కప్లోనే 50వ శతకం కూడా పూర్తి చేసుకోవాలి’’ అని ఆకాంక్షించాడు. విరాట్ కోహ్లికి ఆ సత్తా ఉందని రిజ్వాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా నవంబరు 5న కోహ్లి బర్త్డే అన్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆరోజే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లి తన కెరీర్లో అరుదైన ఘనత సాధించాలని రిజ్వాన్ కోరుకోవడం విశేషం. ఈడెన్ గార్డెన్స్లో ప్రత్యేక ఏర్పాట్లు.. విరాట్ కోహ్లి పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు క్యాబ్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా 70 వేల మాస్కులు ‘‘విరాట్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఐసీసీ నుంచి మాకు అనుమతి వస్తుందనే అనుకుంటున్నాం. స్టేడియానికి వచ్చే ప్రతి అభిమాని కోహ్లి మాస్కులు ధరించేందుకు వీలుగా 70 వేల మాస్కులు పంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో కంటే ముందు టీమిండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది. అంతకంటే ముందే సెంచరీ కావాలి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్లోనే కోహ్లి సెంచరీ కొడితే.. బర్త్డేన మరో శతకం బాది సచిన్ రికార్డు(49 సెంచరీలు) బద్దలు కొడితే ఇంకా బాగుంటుందని కింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అప్పుడు ద్రవిడ్ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు: షోయబ్ మాలిక్ -
రిజ్వాన్, దక్షిణాఫ్రికా బౌలర్ మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్ కీలక మ్యాచ్లో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పవర్ప్లే లోపే ఓపెనర్లు షఫీక్, ఇమామ్ ఉల్-హాక్ వికెట్లను పాక్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్లో పాక్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ మార్కో జానెసన్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఇమామ్ ఉల్-హాక్ ఔటైన తర్వాత మహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. అయితే జానెసన్ బౌలింగ్లో తన ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి రిజ్వాన్ తప్పించుకున్నాడు. రిటర్న్ క్యాచ్ను అందుకోవడంలో జానెసన్ విఫలమయ్యాడు. ఆ తర్వాతి బంతిని రిజ్వాన్ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో జానెసన్ రిజ్వాన్ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు. అందుకు బదులుగా రిజ్వాన్ నీ పని చూసుకో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం, ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో 27 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్కు హార్దిక్ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా.. Heated conversation between Marco Jansen and Mohammed Rizwan...!!#SAvsPAK #PAKvSA #kykyurdu #พรหมลิขิตep4 #ธี่หยด #crymua #bbcqt #ENGvsSL #Maine pic.twitter.com/JzJguEp0eq — Oxygen X (@imOxYo18) October 27, 2023 -
మహ్మద్ రిజ్వాన్ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్..
వన్డే ప్రపంచకప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చెలాయించింది. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాక్ను భారత్ చిత్తు చేసింది. దీంతో వరుసగా 8వసారి వన్డే వరల్డ్ కప్ ఈవెంట్లో పాకిస్తాన్ను భారత్ మట్టికరిపించింది. అయితే దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ చూడ్డానికి సుమారు లక్షా 30 వేల మంది ప్రేక్షకుల తరలిరాగా.. వారిలో అత్యధికులు భారతీయులే. స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలతో నిండిపోయింది. మొదట పాక్ వికెట్లు పడినప్పుడు, తర్వాత భారత బ్యాటింగ్లో రోహిత్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నప్పడు అభిమానుల హర్ష ధ్వనులతో స్టేడియం దద్దరిల్లపోయింది కాగా ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను అభిమానులు ఓ ఆటాడేసుకున్నారు. 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న రిజ్వాన్ను.. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ క్రమంలో రిజ్వాన్ డ్రెసింగ్ రూమ్కు వెళ్తుండగా కొంతమంది అభిమానులు టీమిండియాకు సపోర్ట్గా నినాదాలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రిజ్వాన్ మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది నెటిజన్లు 2017లో పాకిస్తాన్ అభిమానులు కూడా ఈ విధంగానే చేశారని గుర్తు చేస్తున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం భారత జట్టు డ్రెసింగ్ రూమ్కు వెళ్తుండగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వీడియోలు షేర్ చేస్తున్నారు. ఆ సమయంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీకి పాక్ అభిమానులకు చిన్నపాటి వాగ్వదం కూడా జరిగినట్లు తెలుపుతున్నారు. అదే విధంగా 1999లో ఓ ద్వైపాక్షిక సిరీస్లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ సందర్భంగా కూడా కొంతమంది ఫ్యాన్స్ పాక్ జట్టుకు మద్దతుగా స్టాండింగ్ ఓవిషేన్ ఇచ్చిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కానీ ఈసారి మాత్రం భారత ఫ్యాన్స్ పాక్ క్రికెటర్లను టార్గెట్ చేశారని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: CWC 2023: పాక్ను చిత్తు చేసిన భారత్.. రోహిత్ సేనను అభినందించిన నరేంద్ర మోదీ I have a clear point of view in this matter. If @iMRizwanPak can pray namaaz in front of a huge crowd so why doesn't a crowd chant "Jai shree Ram " if he is religious so why not be a crowd can ? #indvspak2023 #Rizwan #RohitSharma𓃵 #Ahmedabad "DIL DIL PAKISTAN pic.twitter.com/TtyzNH1cPN — jay shah (parody) (@jay_shahbcci) October 14, 2023 -
Ind Vs Pak: రిజ్వాన్ ‘ఓవరాక్షన్’కు కోహ్లి రియాక్షన్ అదిరింది! ఇంకెంత సేపు..
ICC WC 2023- Ind vs Pak- #Virat Kohli: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త ఓవర్ చేశాడు. వచ్చీ రాగానే భారత ఫీల్డర్లకు విసుగు తెప్పించాడు. మరి.. ఇలాంటివి చేస్తే రన్మెషీన్ విరాట్ కోహ్లి ఊరుకుంటాడా? ఎవరైనా ఏదైనా ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కింగ్కు అలవాటు కదా! ఈసారి కూడా అదే పని చేశాడు. సిరాజ్ మొదలుపెట్టాడు అసలు విషయమేమిటంటే.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ పవర్ ప్లే ముగిసేలోపే తొలి వికెట్ కోల్పోయింది. ఎనిమిదో ఓవర్లో మహ్మద్ సిరాజ్.. అబ్దుల్లా షఫీక్(20)ను అవుట్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో.. 13వ ఓవర్లో హార్దిక్ పాండ్యా మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పనిపట్టాడు. దీంతో పాక్ రెండో వికెట్ కోల్పోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అతడి స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. వెయిట్ చేయించిన రిజ్వాన్ అయితే, క్రీజులోకి వచ్చిన రిజ్వాన్.. బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి టైమ్ తీసుకున్నాడు. బౌలర్ హార్దిక్ పాండ్యాతో పాటు ఫీల్డర్లను కూడా వెయిట్ చేయించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ... ‘‘ఇంకెంత సేపు’’ అన్నట్లు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అంపైర్కు ఈ విషయం గురించి చెప్పాడు. ఇంకెంత సేపు.. ‘టైమ్’ చూసుకున్న కోహ్లి ఇక కోహ్లి సైతం రిజ్వాన్ తీరుతో ఫ్రస్ట్రేషన్కు గురయ్యాడు. చేతి గడియారంలో టైమ్ చూసుకున్నట్లుగా ఫోజు పెట్టి .. ‘‘ఏంటో ఈ ఓవరాక్షన్.. ఇంకెంత సేపు వెయిట్ చేయాలి’’ అన్నట్లుగా యాక్ట్ చేశాడు. రిజ్వాన్ చేష్టలకు అదే రీతిలో బదులిచ్చాడు. ఫన్నీ మీమ్స్తో నెటిజన్ల సందడి ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజ్వాన్ను ఉద్దేశించి టీమిండియా అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. ‘‘రెడీ అవుతున్న భార్య ఎప్పుడొస్తుందా అని భర్త ఎదురు చూస్తున్నట్లుగా ఉంది కదా.. రిజ్వాన్ యాక్షన్కు కోహ్లి రియాక్షన్ అదిరింది.. 12.4వ ఓవర్లో బంతిని తన్నిన విధానం ఉంది చూడండి సూపర్’’ అంటూ రిజ్వాన్పై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. బాబర్ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో కాగా మోతేరా స్టేడియంలో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్తాన్ను 191 పరుగులకే కట్టడి చేశారు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించిన బాబర్ ఆజం(50)- రిజ్వాన్(49) జోడీని సిరాజ్ విడదీయడం(బాబర్ను బౌల్డ్ చేసి)తో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్లో కోహ్లి 16 పరుగులకే అవుట్ కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. చదవండి: వరల్డ్కప్లో శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్కు గాయం Husband waiting for his wife to get ready. pic.twitter.com/ApvHMgg87j — DJay (@djaywalebabu) October 14, 2023 ye to kapne laga 🤣🤣🤣🤣 pic.twitter.com/lic0shOW26 — Piyush (@piyushmaybe) October 14, 2023 pic.twitter.com/64IjUmfN9a — Out Of Context Cricket (@GemsOfCricket) October 14, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: రిజ్వాన్ వివాదస్పద ట్వీట్! ఆటను వదిలి ఇతర అంశాల్లోకి!
WC 2023 Pak Vs SL: పాకిస్తాన్ వికెట్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వివాదాస్పద ట్వీట్తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఆటతో సంబంధంలోని విషయంలో తలదూర్చి నెటిజన్ల చేతికి చిక్కాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో రిజ్వాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో లంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(113)తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి పాకిస్తాన్కు రికార్డు విజయం అందించాడు. 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో చెలరేగి.. 131 పరుగులతో రాణించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. అజేయ ఇన్నింగ్స్తో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎక్స్ వేదికగా రిజ్వాన్ చేసిన పోస్టు విమర్శలకు కారణమైంది. గాజాలో ఉన్న నా సోదర, సోదరీమణుల కోసం ‘‘జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇది సమిష్టి విజయం. అబ్దుల్లా షఫీక్, హసన్ అలీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వాళ్ల వల్లే గెలుపు సులువైంది. హైదరాబాద్ ప్రజలకు మేము రుణపడి ఉంటాం. మీ ఆతిథ్యానికి.. మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు’’ అని రిజ్వాన్ రాసుకొచ్చాడు. అయితే, పోస్ట్ ఆరంభంలో.. ‘‘ఇది గాజాలో ఉన్న మా సోదర, సోదరీమణుల కోసం’’ అంటూ ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని షేర్ చేయడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నువ్వు ఎవరికి సపోర్టు? ‘‘నువ్వు గాజా ప్రజలకు సపోర్టు చేస్తున్నావా? లేదంటే.. హమాస్ మిలిటెంట్లకు మద్దతు ప్రకటిస్తున్నావా? చర్యకు ప్రతి చర్య ఉంటుందనే విషయం తెలియదా?’’ అంటూ కొంతమంది ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో.. ‘‘నీ సెంచరీ గాజా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది. కనీసం ఈ మ్యాచ్ను చూసే స్థితిలో కూడా లేరు అక్కడి వాళ్లు. అయినా వరల్డ్కప్ లాంటి ఐసీసీ ఈవెంట్ ఆడుతున్నపుడు రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే.. నీ మ్యాచ్ ఫీజులు, రెమ్యునరేషన్లు గాజా ప్రజల కోసం విరాళంగా ఇవ్వు’’ అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రతిసారి ఆటలోకి ఇలాంటివి లాగడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. కాగా గాజాలో తిష్టవేసిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడికి దిగడంతో యుద్ధానికి తెరలేచింది. పరస్పర దాడుల నేపథ్యంలో ఇటు గాజా.. అటు ఇజ్రాయెల్లో కలిపి మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. చదవండి: నవీన్ ఉల్ హక్ రనౌట్ మిస్.. రాహుల్పై కోహ్లి సీరియస్! వీడియో వైరల్ -
CWC 2023: కోహ్లి-రాహుల్, రిజ్వాన్-షఫీక్.. ఎవరి భాగస్వామ్యం గొప్పది..?
ప్రస్తుత ప్రపంచకప్లో పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పలు ఆసక్తికర మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదటిది భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో ఆసక్తికర మ్యాచ్ ఏదంటే.. పాకిస్తాన్, శ్రీలంక మధ్య హైదరాబాద్లో నిన్న జరిగిన మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో పాక్ సైతం అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి చారిత్రక విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఓ కామన్ థింగ్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లి-కేఎల్ రాహుల్.. మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్లు నెలకొల్పిన మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రెండు భాగస్వామ్యాల్లో ఏది గొప్పది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భారత అభిమానులు సహా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్-రాహుల్ పార్ట్నర్షిప్కు ఓటేస్తుంటే, పాక్ ఫ్యాన్స్ మాత్రం రిజ్వాన్-షఫీక్ భాగస్వామ్యం గొప్పదని డప్పుకొట్టుకుంటున్నారు. ఇరు భాగస్వామ్యాలపై ఓ లుక్కేస్తే.. ఆసీస్తో మ్యాచ్లో భారత్ స్వల్ప లక్ష్య ఛేదనలో (200 పరుగులు) 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. విరాట్ (85)-రాహుల్ (97 నాటౌట్) జోడీ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను గెలిపించింది. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. లంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్ను రిజ్వాన్ (131 నాటౌట్)-షఫీక్ (113) జోడీ 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు పార్ట్నర్షిప్స్లో నలుగురు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పరుగులు సాధించి, తమతమ జట్లను గెలిపించారు. రెండు సందర్భాల్లో వారు ఒక్కో పరుగు పేరుస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయాలకు దోహదపడ్డారు. వాస్తవానికి ఈ రెంటిని ఒకదానితో ఒకటి పోల్చలేని పరిస్థితి. ఇరు భాగస్వామ్యాలు తీవ్రమైన ఒత్తిడిలో నెలకొల్పివనే. దేని ప్రత్యేకత దానికుంది. దీన్ని అంశంగా తీసుకుని డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఈ రెంటిలో గొప్ప భాగస్వామ్యం ఏదని చెప్పాల్సి వస్తే మాత్రం మెజార్టీ శాతం అభిప్రాయంతో వెళ్లాల్సి ఉంటుంది. గత మ్యాచ్ల విషయాలను పక్కన పెడితే.. భారత్-పాక్లు అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత టోర్నీలో ఇరు జట్ల ప్రదర్శనను చూసిన తర్వాత ఈ మ్యాచ్పై మరింత హైప్ పెరిగింది. దీనికి ముందు భారత్ ఇవాళ (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. న్యూఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. ప్రపంచకప్ హిస్టరీలో..!
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: నెదర్లాండ్స్తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన పాక్ బ్యాటర్ల జోడీలో నాలుగో స్థానంలో నిలిచారు. అదే విధంగా.. వన్డే వరల్డ్కప్ అరంగేట్రంలోనే ఒకే మ్యాచ్లో యాభైకి పైగా పరుగులు సాధించిన బ్యాటర్లుగా చరిత్రకెక్కారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్తో ఆడుతోంది. అర్ధ శతకాలతో ఆదుకున్నారు అయితే, పసికూనే కదా అని డచ్ జట్టును తక్కువగా అంచనా వేసిన బాబర్ ఆజం బృందానికి ఆరంభంలోనే షాక్ తగిలింది. హైదరాబాద్లో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ అద్భుత ఆట తీరుతో పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అర్ధ శతకాలతో చెలరేగి నాలుగో వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జోడీగా రికార్డు సాధించారు. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అంతకు ముందు.. 1983లో నాటింగ్హాంలో న్యూజిలాండ్తో మ్యాచ్లో ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్ 147* పరుగులు, అదే టోర్నీలో లీడ్స్ మ్యాచ్లో షాహిద్ మహబూబ్తో కలిసి ఇమ్రాన్ ఖాన్ 144.. 2019లో బర్మింగ్హాంలో బాబర్ ఆజం- హ్యారిస్ సొహైల్ 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక వరల్డ్కప్ డెబ్యుటెంట్స్ ఒకే మ్యాచ్లో ఫిఫ్టీ ప్లస్ సాధించిన పాక్ ఆటగాళ్ల జాబితాలో మజీద్ ఖాన్(65), ఆసిఫ్ ఇక్బాల్(53)(1975లో ఆస్ట్రేలియా మీద), మిస్బా ఉల్హక్(65), ఉమర్ అక్మల్(71)- (2011లో కెన్యా మీద) తర్వాతి స్థానాల్లో రిజ్వాన్(65), సౌద్ షకీల్(68)-(2023లో హైదరాబాద్లో) నిలిచారు. చదవండి: పాకిస్తాన్కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్ -
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
World Cup 2023: న్యూజిలాండ్తో మ్యాచ్.. పాక్ భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్కప్ వార్మప్ గేమ్లో పాక్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో ఫెర్గూసన్ పొదుపుగా బౌల్ చేయడంతో పాక్ 345 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ ఓవర్లో పాక్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ కోల్పోయింది. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
World Cup 2023: న్యూజిలాండ్తో మ్యాచ్.. సెంచరీతో కదంతొక్కిన రిజ్వాన్
పాక్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. వరల్డ్కప్ 2023 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. రిజ్వాన్తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా రాణించాడు. బాబర్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్లతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 257/4గా ఉంది. సౌద్ షకీల్ (36), అఘా సల్మాన్ (10) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
WC: దిగొచ్చిన పీసీబీ.. ఆటగాళ్లే ఆస్తులు! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్
Pakistan announces landmark central contracts: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో చారిత్రాత్మక నిర్ణయంతో కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. మెన్స్ టీమ్లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో ఆటగాళ్లకు మిలియన్ యూఎస్ డాలర్ల మేర రెవెన్యూ సమకూరనుంది. అయితే.. ఓ కండిషన్ ఇక ఈ ఏడాది జూలై 1 నుంచే ఒప్పందం అమల్లోకి వస్తుందని.. అయితే, 12 నెలలకొకసారి క్రికెటర్ ప్రదర్శనపై సమీక్ష ఆధారంగానే చెల్లింపులు ఉంటాయని పీసీబీ స్పష్టం చేసింది. ఈ చరిత్రాత్మక ఒప్పందంలో భాగమయ్యేందుకు అత్యధికంగా 25 మంది క్రికెటర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు బుధవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెటర్ల కాంట్రాక్టును మెర్జ్ చేసినట్లు పీసీబీ తెలిపింది. సెలక్షన్ విషయంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదే విధంగా నెలవారీ ఆదాయంతో పాటు టెస్టు మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల ఫీజును 50 శాతానికి, వన్డేలు ఆడేవాళ్ల ఫీజును 25 శాతం, టీ20లు ఆడేవాళ్లకు 12.5 ఫీజును పెంచనున్నట్లు వెల్లడించింది. మరో రెండు టీ20లీగ్లలో అంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పాక్ ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్తో పాటు మరో రెండు ఇతర టీ20 లీగ్లు ఆడేందుకు పీసీబీ అనుమతినిచ్చింది. పీసీబీ తమ డిమాండ్లను అంగీకరించిన నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం స్పందిస్తూ.. ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లతో చర్చలు కొలిక్కి వచ్చాయని.. ఇలాంటి డీల్ కుదరడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ నిజమైన ఆస్తులు ఆటగాళ్లేనని.. వాళ్లు ఆర్థికంగా కూడా బలంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. పీసీబీ తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం.. కేటగిరీ-ఏ: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ షా ఆఫ్రిదిలకు 202 శాతం హైక్($15,500). కేటగిరీ-బి: ఫఖర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, నసీం షా, షాదాబ్ ఖాన్లకు 144 శాతం హైక్($10,000). కేటగిరీ- సి: ఇమాద్ వసీం, అబ్దుల్లా షఫిక్లకు 135 శాతం హైక్$6,000) కేటగిరీ- డి: ఫాహిం ఆష్రఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఇహసానుల్లా, మహ్మద్ హ్యారిస్, మహ్మద్ వసీం జూనియర్, సయీమ్ ఆయుబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షానవాజ్ దహాని, షాన్ మసూద్, ఉసామా మిర్, జమాన్ ఖాన్లకు 127 శాతం హైక్($1,700) హైదరాబాద్లో పాక్ జట్టు కాగా పీసీబీతో తాజా ఒప్పందంతో బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ వంటి టాప్ ప్లేయర్లకు నెలకు 15,600 అమెరికా డాలర్ల మేర(భారత కరెన్సీలో దాదాపు పన్నెండు లక్షల తొంభై ఏడువేలు) సాలరీ లభించనుంది. ఇదిలా ఉంటే.. పీసీబీ ప్రకటన నేపథ్యంలో బుధవారం రాత్రే పాక్ క్రికెట్ జట్టు భారత్కు చేరుకోవడం విశేషం. హైదరాబాద్లో మ్యాచ్ల నేపథ్యంలో ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్గా మార్కరమ్ A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK — Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023 Ready to roar: @RealHa55an begins the World Cup preparations 🏃☄️#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/4RWGWr4GLR — Pakistan Cricket (@TheRealPCB) September 28, 2023 -
బాబర్, రిజ్వాన్ అర్ధశతకాలు.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన పాక్
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (86 బంతుల్లో 60; 4 ఫోర్లు, సిక్స్), మహ్మద్ రిజ్వాన్ (79 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 110 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజ్లో ఉన్న దశలో పాక్ భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే 22 పరుగుల వ్యవధిలోకి వీరిద్దరూ ఔట్ కావడంతో పాక్ ఢీలా పడిపోయి, తక్కున స్కోర్కే పరిమితమైంది. ఆఖర్లో అఘా సల్మాన్ (33 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మహ్మద్ నవాజ్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడటంతో పాక్ 250 పరుగుల మార్కు దాటింది. పాక్ ఇన్నింగ్స్లో ఫకర్ జమాన్ 27, ఇమామ్ ఉల్ హాక్ 13, సౌద్ షకీల్ 9, షాదాబ్ ఖాన్ 3, ఫహీమ్ అష్రాఫ్ 2, షాహీన్ అఫ్రిది 2 నాటౌట్ పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్భదిన్ నైబ్, ఫరీద్ మాలిక్ తలో 2 వికెట్లు.. ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రెహ్మన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి రెండు వన్డేలు గెలిచి, ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. పాక్ ఈ మ్యాచ్లోనూ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Mothers day 2024 మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
లండన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న మీనా
పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్'
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
నా ప్రాణాలు పోయిన పర్లేదు..రిగ్గింగ్ జరిగితే ఊరుకోను
ఓటు హక్కు వినియోగించుకున్న తండ్రి కొడుకులు
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
ఓటు వేసిన YSRCP నేతలు
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
తప్పక చదవండి
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement