-
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్ను బౌలింగ్ ఎటాక్లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్తో ఆపే లోపే స్టంప్స్ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.pic.twitter.com/MIWgJ4WWbZ— Saksham Nagar (@SAKSHAMNAGAR90) April 28, 2024 -
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్ను బౌలింగ్ ఎటాక్లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్తో ఆపే లోపే స్టంప్స్ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.<blockquote class="twitter-tweet"><p lang="zxx" dir="ltr"><a href="https://t.co/MIWgJ4WWbZ">pic.twitter.com/MIWgJ4WWbZ</a></p>&mdash; Saksham Nagar (@SAKSHAMNAGAR90) <a href="https://twitter.com/SAKSHAMNAGAR90/status/1784551354158969025?ref_src=twsrc%5Etfw">April 28, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
అతడు బాగా అలిసిపోయాడు.. కొన్ని మ్యాచ్లకు రెస్ట్ ఇవ్వండి: భజ్జీ
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ నుంచే సిరాజ్ దారుణంగా విఫలమవుతున్నాడు. వికెట్లు విషయం పక్కన పెడితే రన్స్ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సైతం సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. ముంబైతో మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 37 పరుగులిచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఈ హైదరాబాదీ 57. 25 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వాలని ఆర్సీబీ మెనెజ్మెంట్ను భజ్జీ సూచించాడు. "మహ్మద్ సిరాజ్ మానసికంగా, ఫిజికల్గా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. సిరాజ్ ఐపీఎల్కు ముందు ఇంగ్లండ్తో నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడాడు. నేనే ఆర్సీబీ మేనేజ్మెంట్లో భాగమైతే అతడికి రెండు మ్యాచ్లకు విశ్రాంతి ఇస్తాను. ఏమి జరుగుతుందో తను ఆర్ధం చేసుకోవడానికి అతడికి ఆ సమయం ఉపయోగపడుతోంది. సిరాజ్ అద్బుతమైన బౌలర్ అని మనకు తెలుసు. ఫార్మాట్తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతడి స్పెషల్. కచ్చితంగా ముంబైతో మ్యాచ్ అతడికి పీడ కలవంటింది. కానీ సిరాజ్కు రెస్ట్ ఇస్తే అద్భుతంగా కమ్బ్యాక్ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. గతంలో నేను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ ‘హిట్’ షోకు తెలుగు క్రికెటర్లు రెడీ!
ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతుండగా.. విశాఖకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్కు.. విశాఖకు చెందిన కోన శ్రీకర్ భరత్ కోల్కతా నైట్రైడర్స్కు.. హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ రియాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. హైదరాబాద్కే చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్కు.. హైదరాబాద్కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్ కింగ్స్కు ఎంపికయ్యారు. తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తెలుగు వారియర్స్కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్ ఐపీఎల్లో ఆడుతున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ తెలుగు సత్తా చూపేందుకు 💥 మన స్టార్స్ వచ్చేస్తున్నారు 🤩 మరి వీరిలో ఈ సీజన్ ఎవరు మెరిపిస్తారు? చూడండి#TATAIPL | Chennai v Bengaluru | 5 PM నుండి మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/E4CW9z7aMj — StarSportsTelugu (@StarSportsTel) March 22, 2024 ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్ (మధ్యప్రదేశ్) ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనుండగా.. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్ త్యాగరాజన్ (బెంగళూరు) పంజాబ్ కింగ్స్కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ 17వ ఎడిషన్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
మహమ్మద్ సిరాజ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
సిరాజ్ను ఉతికారేసిన ఇంగ్లండ్ ఓపెనర్.. రోహిత్ రియాక్షన్ వైరల్!
రాంఛీ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఓ వైపు అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చేరుగుతుంటే.. సిరాజ్ మాత్రం దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్ మియా ఏకంగా 43 పరుగులిచ్చాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే సిరాజ్కు చుక్కలు చూపించాడు. 7 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో క్రాలే వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఏంటి సిరాజ్ భయ్యా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ కాస్త తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో ఇంగ్లండ్ టాపర్డర్ను కుప్పకూల్చాడు. Crawley just Shaming Siraj like in T20 Mode.. Bazball Mode is on... 4️⃣4️⃣4️⃣6️⃣ To siraj...#BobbiAlthoff #bobbiAlthoffleak #INDvENG pic.twitter.com/wEtPPgpg3a — Muhammad Asim (@MrAsim_31) February 23, 2024 -
సిరాజ్ కళ్లు చెదిరే యార్కర్.. దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్
రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. పోప్, బెన్ ఫోక్స్, రెహన్ అహ్మద్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. ముఖ్యంగా రెహాన్ అహ్మద్ను సిరాజ్ ఔట్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అహ్మద్ను అద్బుతమైన యార్కర్తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 70వ ఓవర్లో ఐదో బంతిని యార్కర్గా సంధించాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన యార్కర్కు అహ్మద్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అహ్మద్ బ్యాట్తో అడ్డుకునే లోపే బంతి ఆఫ్ స్టంప్ను గిరాటు వేసింది. ఇది చూసిన అహ్మద్కు దెబ్బకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 319 పరుగుల వద్ద ముగించింది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసింది. చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్ ఖాన్ను ముంచేశాడు.. రోహిత్కు నచ్చలేదు! 𝗔𝗹𝗹 𝘁𝗮𝗿𝗴𝗲𝘁𝘀 🎯𝗱𝗲𝘀𝘁𝗿𝗼𝘆𝗲𝗱 🚀☝️ Siraj wraps up the England innings with finesse 🔥👏#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/WOO1DRVDHE — JioCinema (@JioCinema) February 17, 2024 -
లంచ్ తర్వాత పూనకం... 29 పరుగుల వ్యవధిలోనే ఖేల్ ఖతం!
India vs England, 3rd Test Day 3: ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టు మూడో రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భోజన విరామ సమయం తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా 1-1తో సమంగా ఉన్న టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసి.. టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. #TeamIndia snag wickets for dessert 🍰 right after Lunch! 👌#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/AsabZXcy6S — JioCinema (@JioCinema) February 17, 2024 ఈ క్రమంలో శనివారం ఆట ఆరంభం నుంచే ఇంగ్లండ్ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు విజయవంతమయ్యారు. దెబ్బకు తొలి సెషన్లోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ లంచ్కు ముందు 290/5 స్కోరు వద్ద నిలిచింది. అయితే, భోజనం చేసి మళ్లీ మైదానంలో దిగిన తర్వాత కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో 319 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుస విరామాల్లో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ రెండు, జడేజా రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ మూడో రోజు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అశ్విన్ లేకుండానే పది మంది యాక్టివ్ (బౌలింగ్, బ్యాటింగ్) ప్లేయర్లతో టీమిండియా బరిలోకి దిగింది. మూడో రోజు ఇంగ్లండ్ వికెట్ల పతనం ఇలా.. ►39.5వ ఓవర్: బుమ్రా బౌలింగ్లో- యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి జో రూట్(18) అవుట్ ►40.4వ ఓవర్: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో- జానీ బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ(0). ►50.1వ ఓవర్: కుల్దీప్ బౌలింగ్లో సెంచరీ వీరుడు బెన్ డకెట్(151) ఇన్నింగ్స్కు తెర లంచ్ తర్వాత.. ►65: జడేజా బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ అవుట్(41) ►65.1: సిరాజ్ బౌలింగ్లో రోహిత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బెన్ ఫోక్స్(13) ►69.5: సిరాజ్ బౌలింగ్లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6) ►70.2: జడేజా బౌలింగ్లో టామ్ హార్లే స్టంపౌట్(9) ►71.1: సిరాజ్ బౌలింగ్లో ఆండర్సన్ క్లీన్బౌల్డ్(1). తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్ ఖాన్ను ముంచేశాడు.. రోహిత్కు నచ్చలేదు! 𝗔𝗹𝗹 𝘁𝗮𝗿𝗴𝗲𝘁𝘀 🎯𝗱𝗲𝘀𝘁𝗿𝗼𝘆𝗲𝗱 🚀☝️ Siraj wraps up the England innings with finesse 🔥👏#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/WOO1DRVDHE — JioCinema (@JioCinema) February 17, 2024 -
IND vs ENG: రెండో టెస్టులో సిరాజ్కు నో ఛాన్స్! కారణమిదే
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ దూరమయ్యాడు. వర్క్లోడ్ కారణంగా రెండో టెస్టుకు సిరాజ్కు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతడి స్ధానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చాడు. "వైజాగ్లో ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టు నుంచి సిరాజ్ను జట్టు మేనెజ్మెంట్ రిలీజ్ చేసింది. ఇటీవలి కాలంలో అతడు నిర్విరామంగా క్రికెట్ ఆడుతుండడంతో విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్మెంట్ భావించింది. రాజ్కోట్లో జరిగే మూడో టెస్టుకు సిరాజ్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడు. అదే విధంగా అవేష్ ఖాన్ తిరిగి జట్టుతో కలిశాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సిరాజ్ విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఇక వైజాగ్ టెస్టుతో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అదే విధంగా కుల్దీప్ యాదవ్ ఛానాళ్ల తర్వాత టెస్టు క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ చదవండి: IND vs ENG: ఏంటి రోహిత్ ఇది..? యువ స్పిన్నర్ ట్రాప్లో చిక్కుకున్న హిట్మ్యాన్! వీడియో వైరల్ -
Ind vs Eng: ‘సిరాజ్ను తప్పించి.. అతడి స్థానంలో..’
India vs England, 2nd Test - Visakhapatnam: ఇంగ్లండ్తో రెండో టెస్టు భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విశాఖపట్నం మ్యాచ్లో పేసర్ మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ ముగ్గురూ రాణించారు ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తరఫున ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆకట్టుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన స్పిన్ నైపుణ్యాలతో సత్తా చాటాడు. వీరితో పాటు మరో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం రాణించాడు. మొత్తంగా అశూ ఆరు వికెట్లు తీయగా.. జడేజా 89 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ 61 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. లోకల్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు మొదటి టెస్టులో కేవలం పదకొండు ఓవర్లు బౌల్ చేసిన ఈ హైదరాబాదీ స్టార్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. రెండో టెస్టులో సిరాజ్ అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు.. ‘‘జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే సరిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండో టెస్టుకు టీమిండియా సన్నద్ధం కావడంలో నేను మరో కోణంలో ఆలోచిస్తున్నా. జట్టులో అవసరమా? టెస్టు మొత్తంలో సిరాజ్ను కేవలం ఏడెనిమిది ఓవర్ల పాటే బౌలింగ్ చేయించాలనుకుంటే జట్టులో ఉంచడం ఎందుకు? తుదిజట్టులో కుల్దీప్ యాదవ్ కంటే అక్షర్ పటేల్కు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం అతడి బ్యాటింగ్ స్కిల్స్ అని రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడు. మరి సిరాజ్ సేవలను ఉపయోగించుకోనపుడు అతడి స్థానంలో ప్యూర్ బ్యాటర్ను తీసుకోవాలి. అదనపు బ్యాటర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అనవసరంగా ఎవరూ జట్టులో ఉన్నారన్న భావన కలగదు’’ అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. కాగా తొలి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. నిజానికి వాళ్లు(బుమ్రా, సిరాజ్) మ్యాచ్ను ఐదో రోజు వరకు తీసుకువస్తారని భావించాం’’ అంటూ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే! తాడోపేడో తేల్చుకో.. -
కోహ్లి నామస్మరణతో మార్మోగుతున్న ఉప్పల్ స్టేడియం
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు రెండో సెషన్ (32.5 ఓవర్లు) సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 121/4గా ఉంది. జాక్ క్రాలే (20), బెన్ డకెట్ (35), ఓలీ పోప్ (1), జానీ బెయిర్స్టో (37) ఔట్ కాగా.. జో రూట్ (26), బెన్ స్టోక్స్ (0) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, రవి జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. Hyderabad crowd cheering "Kohli, Kohli, Kohli". 🐐 - Fans are missing Kohli in the first Test. pic.twitter.com/WFcdR6OxOQ — Johns. (@CricCrazyJohns) January 25, 2024 కాగా, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లి ఆడకపోయినా అతని నామస్మరణతో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోతుంది. తమ ఆరాధ్య క్రికెటర్ను స్మరించుకుంటూ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ముఖ్యంగా యువత అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. కోహ్లి ఫోటోలను పట్టుకుని ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కావడంతో స్టేడియంలో జనాలు పలచగా కనిపించినా.. అక్కడున్న వారు మాత్రం కోహ్లి పేరును జపిస్తూ మ్యాచ్ను చూస్తున్నారు. ఓ పక్క భారత బౌలర్లు వికెట్లు తీస్తున్నా ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. లోకల్ బాయ్ సిరాజ్ అద్బుతమైన క్యాచ్ పట్టినప్పుడు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది. కోహ్లికి అచ్చొచ్చిన ఉప్పల్.. డబుల్తో చెలరేగిన రన్ మెషీన్ 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్లో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్ను దెబ్బ కొట్టారు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
బజ్బాల్ ఆడితే మాకే మంచిది.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ఖతం చేస్తాం: సిరాజ్
భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా గురువారం(జనవరి 25) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ అయితే మ్యాచ్కు ఒక రోజే ముందే తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. అనూహ్యంగా ఇంగ్లీష్ జట్టు కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్తో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. స్పీడ్ స్టార్ మార్క్ వుడ్కు తుది జట్టులో ఇంగ్లండ్ మేనెజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఇక మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి ఉపఖండ పరిస్థితులలో బాజ్బాల్ విధానాన్ని ఎంచుకుంటే ఇంగ్లీష్ జట్టుకు కష్టాలు తప్పవు అని సిరాజ్ హెచ్చరించాడు. "ఒక వేళ ఇంగ్లండ్ భారత పరిస్థితుల్లో బజ్బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుంది. ఉపఖండంలో ఉన్న పిచ్లపై ప్రతి బంతిని బాదడం కుదరదు. బంతి కొన్నిసార్లు ఎక్కువగా టర్న్ అవుతోంది. మరి కొన్ని సార్లు స్ట్రైట్గా వస్తోంది. కాబట్టి ఇంగ్లండ్ బజ్ బాల్ ఆడితే మాకే మంచిది. ఎందుకంటే మ్యాచ్ త్వరగా ముగుస్తుందని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. -
హిందీలో మాట్లాడిన సిరాజ్.. ట్రాన్స్లేటర్గా మారిన బుమ్రా! వీడియో వైరల్
మహ్మద్ సిరాజ్.. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లతో అదరగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్ కీలకమైన మార్క్రమ్ వికెట్ పడగొట్టాడు. ఓవరాల్గా 7 వికెట్లు సాధించిన సిరాజ్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో సిరాజ్కు ట్రాన్స్లేటర్గా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే బుమ్రా ఆంగ్లంలోకి అనువాదించాడు. సిరాజ్ మాట్లడుతూ.. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సలహాల వల్లే మెరుగైన ప్రదర్శన చేయగలిగానని చెప్పుకొచ్చాడు. 'బుమ్రా బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత పిచ్ ఎలా ఉందో నాకు తెలియజేశాడు. ఇటువంటి వికెట్పై ఏ లెంగ్త్తో బౌలింగ్ వేయాలన్నది నాకు సలహా ఇచ్చాడు. అందుకు తగ్గట్టు నా లెంగ్త్ను సెట్ చేసుకున్నాను. నేను మరి ఎక్కువగా ఆలోచించలేదు. ఒకే లెంగ్త్లో స్ధిరంగా బౌలింగ్ చేస్తే చాలు వికెట్లు పొందవచ్చు అని భావించాను. మరో ఎండ్లో బుమ్రా బౌలింగ్ చేస్తుంటే.. అతడితో కలిసి స్పెల్ను పంచుకోవడం చాలా బాగుంటుందని" సిరాజ్ పేర్కొన్నాడు. దీన్ని బుమ్రా ఇంగ్లీష్లోకి ట్రాన్సెలెట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND Vs SA: 'టైమ్ వేస్ట్'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు Siraj praised Bumrah during the presentation in his answer in Hindi and gave him credit. Bumrah of course edited that part out in the English translation. Of course. — Vishal Misra (@vishalmisra) January 4, 2024 -
T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!?
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త! ఈ మేటి బ్యాటర్లు ఇద్దరూ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు ‘విరాహిత్’ ద్వయం అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్మెషీన్ విరాట్ కోహ్లి టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రోహిత్ గైర్హాజరీలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పలు సందర్భాల్లో సారథులుగా జట్టును ముందుండి నడిపించారు. అదే విధంగా.. రోహిత్- కోహ్లి ఏడాదికి పైగా టీ20ల సెలక్షన్కు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. పలు మ్యాచ్లలో వీరిద్దరు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి లేకుండా పాండ్యా కెప్టెన్సీలోని యువ జట్టుతోనే టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ఆడనుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా గాయాల కారణంగా ఆటకు దూరం కావడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. వరల్డ్కప్నకు ముందు కేవలం అఫ్గనిస్తాన్తో సిరీస్ మాత్రమే మిగిలి ఉండటం.. సదరు సిరీస్కు పాండ్యా, సూర్య అందుబాటులోకి రాకుంటే కెప్టెన్ ఎవరన్న ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీ20 రీఎంట్రీ గురించి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరు అఫ్గన్తో సిరీస్ సెలక్షన్కు అందుబాటులో ఉంటామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజే ముగిసిపోవడంతో ‘విరాహిత్’ ద్వయానికి కాస్త విశ్రాంతి కూడా లభించడం సానుకూలాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టును శుక్రవారమే ఫైనల్ చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ఆడటం దాదాపుగా ఖాయమైపోగా.. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు మాత్రం మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. అయితే, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. ఏడాది కాలంగా టీమిండియా తరఫున టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ ద్వారా రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్లో టచ్లోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్-2024 కంటే ముందు వాళ్లిద్దరు ఐపీఎల్-2024లో భాగం కానున్నారు. చదవండి: Ind vs SA: సచిన్కు కూడా సాధ్యం కాలేదు.. భారత తొలి క్రికెటర్గా బుమ్రా రికార్డు -
Ind vs SA: సచిన్కు కూడా సాధ్యం కాలేదు: భారత తొలి క్రికెటర్గా బుమ్రా రికార్డు
Ind Vs SA 2nd Test- Records List: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో సంచలన విజయంతో కొత్త ఏడాదిని ప్రారంభించింది టీమిండియా. అంతేకాదు కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ గెలిచిన ఆసియా తొలి జట్టుగానూ చరిత్ర సృష్టించింది. సెంచూరియన్లో జరిగిన తొలి మ్యాచ్ను ఆతిథ్య జట్టు మూడు రోజుల్లో ముగిస్తే.. పర్యాటక భారత జట్టు రెండో టెస్టును ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరకపోయినా.. 1-1తో డ్రాగా ముగించి సౌతాఫ్రికాతో ట్రోఫీని పంచుకుంది. తొలి భారతీయ క్రికెటర్గా బుమ్రా ఈ నేపథ్యంలో కేప్టౌన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సౌతాఫ్రికా స్టార్ డీన్ ఎల్గర్తో కలిసి జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తద్వారా.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్లో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ క్రికెటర్గా బుమ్రా గుర్తింపు పొందాడు. సఫారీ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా తొలి టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చాడు. సఫారీ గడ్డపై బుమ్రా- సిరాజ్ జోడీ చరిత్ర.. ఇక పేసర్ల అద్భుత బౌలింగ్ కారణంగానే టీమిండియా కేప్టౌన్లో విజయఢంకా మోగించిందన్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగి 55 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించగా.. రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్, బుమ్రా సౌతాఫ్రికాలో అరుదైన రికార్డు సృష్టించారు. సఫారీ గడ్డపై ఒక టెస్టు మ్యాచ్లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు (సిరాజ్, బుమ్రా) రెండు ఇన్నింగ్స్లలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో ఓవరాల్గా రెండోసారి మాత్రమే. 2014లో ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన టెస్టులో భువనేశ్వర్ కుమార్ (తొలి ఇన్నింగ్స్లో 6/82), ఇషాంత్ శర్మ (రెండో ఇన్నింగ్స్లో 7/74) తొలిసారి ఈ ఘనత సాధించారు. సౌతాఫ్రికాపై టీమిండియా విజయం నేపథ్యంలో నమోదైన మరిన్ని రికార్డులు ఇవే ►642: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టులో ఫలితం రావడానికి వచ్చిన బంతులు (107 ఓవర్లు). తక్కువ బంతుల పరంగా, ఓవర్ల పరంగా టెస్టు క్రికెట్లో ఫలితం వచ్చిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డు పుస్తకాల్లో ఎక్కింది. 1932లో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్లో 656 బంతుల్లో ఫలితం వచ్చింది. ఇది మూడోసారి మాత్రమే ►3: రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టులో భారత జట్టు నెగ్గడం ఇది మూడోసారి. గతంలో భారత జట్టు అఫ్గానిస్తాన్పై (బెంగళూరులో–2018), ఇంగ్లండ్పై (అహ్మదాబాద్లో–2021) ఈ ఘనత సాధించింది. ఓవరాల్గా ఇప్పటి వరకు 25 టెస్టుల్లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చింది. ►1: కేప్టౌన్లో భారత జట్టు టెస్టులో నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఈ వేదికపై భారత్ ఆరు టెస్టులు ఆడి రెండింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగింటిలో ఓడింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు రెండోసారి బ్యాటింగ్ చేసి టెస్టులో గెలవడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ భారత్ నెగ్గిన నాలుగు టెస్టుల్లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ►5: దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య (జోహనెస్బర్గ్లో–2, డర్బన్లో–1, సెంచూరియన్లో–1, కేప్టౌన్లో–1). దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ మొత్తం 25 టెస్టుల ఆడగా ... ఐదు టెస్టుల్లో విజయం సాధించింది. 13 టెస్టుల్లో ఓడిపోయింది. ఏడింటిని ‘డ్రా’ చేసుకుంది. నాలుగో కెప్టెన్గా రోహిత్ శర్మ ►4: రాహుల్ ద్రవిడ్ (2006), ధోని (2010), కోహ్లి (2018, 2021) తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టుకు టెస్టులో విజయాన్ని అందించిన నాలుగో కెప్టెన్గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. ►2: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ను ‘డ్రా’గా ముగించడం భారత జట్టుకిది రెండోసారి. ధోని సారథ్యంలో 2010–2011లో మూడు టెస్టుల సిరీస్ను భారత్ 1–1తో సమంగా ముగించింది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా 1–1తో ‘డ్రా’గా ముగించింది. ►4: కేప్టౌన్లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చిన టెస్టులు. 1889, 1896లో దక్షిణాఫ్రికా–ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు టెస్టులు... 2005లో దక్షిణాఫ్రికా–జింబాబ్వే జట్ల మధ్య ఒక టెస్టు రెండు రోజుల్లోనే ముగిశాయి. చదవండి: కంగ్రాట్స్ టీమిండియా.. అతడు మాత్రం భయపెట్టాడు! బుమ్రా కూడా -
చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్ ముగింపు
తగ్గేదేలే... సినిమా డైలాగ్లా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు! తొలి టెస్టును ఆతిథ్య జట్టు మూడు రోజుల్లోనే ముగిస్తే... రెండో టెస్టును టీమిండియా రెండు రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ ‘భారత్ సొంతగడ్డపై పులి... విదేశాల్లో పిల్లి’ అని నిట్టూర్చారు. ఇప్పుడదే విమర్శకులు ‘ఔరా’ అని విస్తుపోయేలా మన పేస్ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్టౌన్లో కేక పెట్టింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కేప్టౌన్: క్రికెట్నే శ్వాసించే భారత అభిమానులకు ఈ కొత్త సంవత్సరం కిక్ ఇచ్చే గిఫ్ట్ను టీమిండియా ఇచ్చింది. ఆఖరి రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీస్ను సాధికారంగా ముగించింది. గత డిసెంబర్లో టి20 సిరీస్తో ఈ పర్యటన మొదలైంది. టి20 సిరీస్ను 1–1తో సమం చేసుకున్న టీమిండియా... వన్డే సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. తాజాగా టెస్టు సిరీస్ను 1–1తో సమంగా ముగించింది. తద్వారా ఏ ఒక్క సిరీస్లోనూ తగ్గలేదు సరికదా... పైపెచ్చు వన్డేలతో ఒకమెట్టుపైనే నిలిచింది. అలా మొదలై... ఇలా కుదేలైంది! తొలిరోజే 23 వికెట్లతో ఆసక్తికర పేస్ డ్రామాకు తెరలేపిన మ్యాచ్... రెండో రోజు అదే పేస్ పదునుకు తెరపడేలా చేసింది. ఓవర్నైట్ స్కోరు 62/3తో గురువారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఇంత తక్కువ జట్టు స్కోరులోనూ మార్క్రమ్ (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ హైలైట్ కాగా... తొలి ఇన్నింగ్స్ను సిరాజ్ కూల్చితే... రెండో ఇన్నింగ్స్లో ఆ పని బుమ్రా (6/61) చేశాడు. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల భారత్ లక్ష్యం 79 పరుగులతో మరింత చిన్నదైంది. దీన్ని టీమిండియా 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో చకచకా ఛేదించింది. ఒకడి పోరాటం... మరొకడి పేస్ ప్రతాపం టెస్టుల్లో ఆటంటే ఐదు రోజులు. నాలుగు ఇన్నింగ్స్లు... 15 సెషన్లు... 450 ఓవర్లు... 40 వికెట్లు... అంటే అందదూ (బ్యాటింగ్) డబుల్ యాక్షన్ చేయాల్సిందే! అన్ని రోజులు శ్రమించినా... ప్రతి సెషన్లోనూ చెమటోడ్చినా చాలా టెస్టుల్లో (డ్రాలతో) ఫలితమే రాదు! కేప్టౌన్లో మాత్రం పేస్ పదునుకు, భారత్ పట్టుదలకు ఒక వంతు (ఐదు సెషన్లలోపే)లోనే, రెండు రోజులు పూర్తవకముందే భారత్ జయభేరి మోగించింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా ఓవర్నైట్ బ్యాటర్ మార్క్రమ్ వన్డేను తలపించే ఆటతీరుతో చకచకా పరుగులు సాధించాడు. మరోవైపు బుమ్రా... బెడింగ్హమ్ (11), కైల్ వెరిన్ (9)లను పడగొట్టడంలో సఫలమయ్యాడు. దీని వల్ల జట్టు స్కోరు వంద పరుగుల్లోపే సగం (85/5) వికెట్లను కోల్పోగా, మార్క్రమ్ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. పిచ్ సంగతి, బుమ్రా పేస్ నిప్పులు వెంటనే అర్థమైపోవడంతో మార్క్రమ్ ధనాధన్ బౌండరీలతో సెంచరీ సాధించాడు. కానీ ఈలోపే బుమ్రా కూడా జాన్సెన్ (11), కేశవ్ మహరాజ్ (3) వికెట్లను చేజిక్కించుకున్నాడు. మార్క్రమ్ పోరాటానికి సిరాజ్ బౌలింగ్లో చుక్కెదురవగా... మిగతా టెయిలెండర్లు లంచ్లోపే అవుటయ్యారు. ఇక రెండో సెషన్లో లక్ష్యఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో క్రీజులోకి దిగిన వారంతా వేగంగా బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 28; 6 ఫోర్లు), గిల్ (11 బంతుల్లో 10; 2 ఫోర్లు), కోహ్లి (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) అవుట్కాగా, కెపె్టన్ రోహిత్ (16 నాటౌట్; 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (4 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా ముగించారు. సిరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించగా... ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని ఎల్గర్, బుమ్రా సంయుక్తంగా గెల్చుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 153 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 106; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగమ్ (సి) రాహుల్ (బి) బుమ్రా 11; వెరిన్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 9; జాన్సెన్ (సి అండ్ బి) బుమ్రా 11; కేశవ్ మహరాజ్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 3; రబడ (సి) రోహిత్ శర్మ (బి) ప్రసిధ్ కృష్ణ 2; బర్గర్ (నాటౌట్) 6; ఎన్గిడి (సి) యశస్వి (బి) బుమ్రా 8; ఎక్స్ట్రాలు 6; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 176. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45, 4–66, 5–85, 6–103, 7–111, 8–162, 9–162, 10–176. బౌలింగ్: బుమ్రా 13.5–0–61–6, సిరాజ్ 9–3–31–1, ముకేశ్ కుమార్ 10–2–56–2, ప్రసిధ్ కృష్ణ 4–1–27–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్టబ్స్ (బి) బర్గర్ 28; రోహిత్ శర్మ (నాటౌట్) 16; శుబ్మన్ గిల్ (బి) రబడ 10; కోహ్లి (సి) వెరిన్ (బి) జాన్సెన్ 12; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 10; మొత్తం (12 ఓవర్లలో మూడు వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–44, 2–57, 3–75. బౌలింగ్: రబడ 6–0–33–1, బర్గర్ 4–0–29–1, జాన్సెన్ 2–0–15–1. -
Ind vs SA: రెండ్రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర
South Africa vs India, 2nd Test- India won by 7 wkts: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయఢంకా మోగించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. కాగా సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ గెలవాలనే సంకల్పంతో రోహిత్ సేన సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. బాక్సింగ్ డే టెస్టులో ఘోర పరాజయం ఈ క్రమంలో సెంచూరియన్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అనూహ్య రీతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. దీంతో సిరీస్ గెలవాలన్న ఆశలు అడియాసలు కాగా.. కనీసం డ్రా చేసుకుంటే చాలనే స్థితికి వచ్చింది టీమిండియా. ఇలాంటి దశలో బుధవారం కేప్టౌన్లో రెండో టెస్టు ఆరంభించింది. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. సీమర్లకు స్వర్గధామంగా భావించే న్యూలాండ్స్ పిచ్ మీద తొలి రోజే సఫారీల ఆట కట్టించింది. టీమిండియా పేసర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు కూల్చారు. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 తొలి రోజే ఆధిక్యంలోకి టీమిండియా ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(39), శుబ్మన్ గిల్(36), విరాట్ కోహ్లి(46) మెరుగైన ఇన్నింగ్స్ కారణంగా 153 పరుగులు చేయగలిగింది. తద్వారా 98 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓ చెత్త రికార్డు కూడా.. బుమ్రా ‘ఆరే’యడంతో అయితే, 153 పరుగుల వద్దే వరుసగా ఆరు వికెట్లు కోల్పోయి ఓ చెత్త రికార్డు కూడా నమోదు చేసింది. ఈ క్రమంలో మళ్లీ బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను బుమ్రా కోలుకోలేని దెబ్బకొట్టాడు. వరుస విరామాల్లో ఐదు వికెట్లు కూల్చి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. సెంచరీ హీరో మార్క్రమ్ రూపంలో సిరాజ్ కీలక వికెట్ దక్కించుకోగా.. ముకేశ్ కుమార్కు రెండు, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి. దీంతో 176 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి ఆసియా జట్టుగా చరిత్ర ఈ నేపథ్యంలో 79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 12 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ సమం చేసుకోవడమే గాక.. కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 28, శుబ్మన్ గిల్ 10, విరాట్ కోహ్లి 12 పరుగులు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 17, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. మహ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: కేఎల్ రాహుల్ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్గా.. -
రాహుల్ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్గా..
Ind vs SA 2nd Test- Fastest Test hundreds for South Africa: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు.. కేప్టౌన్లో తొలి రోజే ఏకంగా 23 వికెట్లు.. భారత పేసర్ల ధాటికి తొలుత 55 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... ఆ తర్వాత టీమిండియా 153 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా బుధవారం నాటి మొదటి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. అప్పటికి ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 51 బంతులు ఎదుర్కొని 36 పరుగులు, ఐదో నంబర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ ఆరు బంతులు ఆడి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు దక్కించుకోగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మళ్లీ బౌలింగ్కు దిగిన టీమిండియా పేసర్లలో ముకేశ్ కుమార్ రెండు, బుమ్రా ఒక వికెట్ తీశారు. తద్వారా పేసర్లకు న్యూలాండ్స్ పిచ్ స్వర్గధామం అన్న విషయం మరోసారి నిరూపితమైంది. తొలి రోజే బ్యాటర్లుకు చుక్కలు చూపిస్తూ ఏకంగా 23 వికెట్ల ప్రదర్శనకు వేదికైన ఇలాంటి అత్యంత కఠినమైన పిచ్పై సెంచరీని ఊహించగలమా!? అది కూడా అత్యంత వేగవంతమైన శతకం!! ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 రెండో రోజు ఆట సందర్భంగా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్. గురువారం 63/3 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ప్రొటిస్ జట్టు.. బుమ్రా ధాటికి వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మార్క్రమ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. రాహుల్ జారవిడిచిన క్యాచ్ వల్ల సెంచరీ భారత పేసర్లకు కొరకరాని కొయ్యగా మారిన అతడు 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో.. బుమ్రా బౌలింగ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్ చేయడంతో లైఫ్ పొందాడు. ఈ క్రమంలో 99 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని మార్క్రమ్ చరిత్రకెక్కాడు. కేప్టౌన్ గడ్డపై తొలి సఫారీ బ్యాటర్గా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా శతకం బాదిన ఆరో బ్యాటర్గా మార్క్రమ్ నిలిచాడు. అదే విధంగా కేప్టౌన్లో ఈ ఘనత సాధించిన తొలి ప్రొటిస్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా సెంచరీలు చేసింది వీరే ►ఏబీ డివిలియర్స్(75 బంతుల్లో)- ఇండియా మీద- 2010 సెంచూరియన్ మ్యాచ్లో.. ►హషీం ఆమ్లా(87 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 2012 పెర్త్ మ్యాచ్లో.. ►డెనిస్ లిండ్సే(95 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 1966 జొహన్నస్బర్గ్ మ్యాచ్లో ►జాంటీ రోడ్స్(95 బంతుల్లో)- వెస్టిండీస్ మీద- 1999 సెంచూరియన్ మ్యాచ్లో ►షాన్ పొలాక్(95 బంతుల్లో)- శ్రీలంక మీద- 2001 సెంచూరియన్ మ్యాచ్లో ►ఐడెన్ మార్క్రమ్(99 బంతుల్లో)- ఇండియా మీద- 2024 కేప్టౌన్ మ్యాచ్లో.. ఇక మార్క్రమ్ 106 పరుగుల స్కోరు వద్ద ఉన్న సమయంలో సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత కగిసో రబడ(2), లుంగి ఎంగిడి(8) అవుట్ కావడంతో సౌతాఫ్రికా 176 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించి 78 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 79 పరుగులు చేయాలి. రెండో రోజు ఆటలో బుమ్రా ఆరు వికెట్లు దక్కించుకోవడం విశేషం. KL Rahul dropped a regulation catch of Aiden Markram (73) #KLRahul #INDvsSA #SAvsIND pic.twitter.com/V0ACuF5puD — Outofaukaat (@outofaukaat) January 4, 2024 -
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్టౌన్లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే ఇలా: సిరాజ్
Ind vs SA 2nd Test- Siraj Comments: కేప్టౌన్ టెస్టులో తొలి రోజే ‘సిక్సర్’తో సంచలనం సృష్టించాడు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ ముకేశ్ కుమార్తో కలిసి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. టెస్టుల్లో తొలిసారి తన అత్యుత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశాడు. కీలక వికెట్లు పడగొట్టిన సిరాజ్ మొత్తంగా తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(2), కెప్టెన్ డీన్ ఎల్గర్(4), టోనీ డీ జోర్జీ(2) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్న సిరాజ్ మియా.. డేవిడ్ బెడింగ్హాం(12), కైలీ వెరెనె(15), మార్కో జాన్సెన్(0)ల వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్(3), నండ్రీ బర్గర్(4)లను పెవిలియన్కు పంపగా.. ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3), కగిసో రబడ(5) వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా పేసర్ల దెబ్బకు 55 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య సౌతాఫ్రికా. ఆధిక్యంలో రోహిత్ సేన ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 153 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మళ్లీ బ్యాటింగ్కు దిగగా.. ఆట ముగిసే సరికి 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. అస్సలు ఊహించలేదు ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఆట ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మహ్మద్ సిరాజ్కు.. ‘‘ఒకేరోజు రెండుసార్లు బౌలింగ్ చేయాల్సి వస్తుందని ఊహించారా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలా జరగుతుందని మీరైనా ఊహించారా? లేదు కదా.. మేము కూడా అంతే. క్రికెట్లో ఇవన్నీ సహజమే. ఒకేరోజు మంచి, చెత్త ఇన్నింగ్స్ చూశారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన అత్యుత్తమ ప్రదర్శనలో సీనియర్ బుమ్రా, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు కూడా భాగం ఉందని సిరాజ్ తెలిపాడు. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది ‘‘ఓవైపు సీనియర్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటే.. మరోవైపు వికెట్ కీపర్ సరైన లెంగ్త్ గురించి సలహాలు ఇస్తూ ఉంటే.. బౌలర్ పని మరింత సులువు అవుతుంది. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. మన బౌలింగ్లో బ్యాటర్ 4-5 బౌండరీలు బాదినపుడు ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలన్న విషయంపై సీనియర్ల సలహాలు కచ్చితంగా పనిచేస్తాయి’’ అని బుమ్రా, రాహుల్లపై 29 ఏళ్ల సిరాజ్ ప్రశంసలు కురిపించాడు. ఇక రెండో రోజు ఏం జరుగుతుందో ఊహించలేమన్న ఈ రైటార్మ్ పేసర్.. వీలైనంత తక్కువ స్కోరుకు సౌతాఫ్రికాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఇప్పటికీ టీమిండియా ఆధిక్యంలోనే ఉంది కాబట్టి రెండో రోజు సానుకూల ఫలితం రాబట్టగలమనే నమ్మకం ఉందని సిరాజ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తొలిరోజే న్యూల్యాండ్స్ పిచ్ నుంచి ఇంత సహకారం లభిస్తుందని అనుకోలేదని, 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదన్నాడు. చదవండి: IND vs SA: బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా W W W W W W 🙌🏻 Wreaking 🔥 ft. Mohammed Siuuuraajjj! Watch all his 6️⃣ scalps 👆🏻 Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/t7bT3pCRLl — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
Ind Vs SA 2nd Test: సిరాజ్ 6తో మొదలై 23తో ముగిసె...
ఒకే రోజు 23 వికెట్లు... ఎన్ని మలుపులు... ఎన్ని అనూహ్యాలు... భారత్ టాస్ ఓడగానే వెనుకబడిపోయినట్లు అనిపించింది...కానీ మొహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ ఆటను మార్చేసింది...అతని పదునైన అవుట్స్వింగర్లను తట్టుకోలేక దక్షిణాఫ్రికా కుప్పకూలింది... పునరాగమనం తర్వాత అతి తక్కువ స్కోరుకు ఆలౌటైంది...అనంతరం భారత్ వేగంగా పరుగులు సాధించి ముందంజ వేసింది...ఆధిక్యం దాదాపు వందకు చేరింది... కానీ ఇంతలో మరో అడ్డంకి ...ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు చేజార్చుకొని టీమిండియా కాస్త డీలాపడింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మళ్లీ మన బౌలింగ్ చెలరేగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. మొత్తంగా చూస్తే మొదటి రోజు మనదే పైచేయి కాగా...రెండో రోజు సఫారీలను కట్టడి చేస్తే టెస్టు భారత్ ఖాతాలో చేరినట్లే! కేప్టౌన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులతో సాగి టెస్టు క్రికెట్ మజాను పంచింది. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొహమ్మద్ సిరాజ్ (6/15) తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 34.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (46), రోహిత్ (39), శుబ్మన్ గిల్ (36) మినహా అంతా విఫలమయ్యారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ‘సున్నా’కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. టపటపా... మ్యాచ్కు ముందు రోజు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో పేస్ బౌలర్లకు పిచ్ అద్భుతంగా అనుకూలించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. సిరాజ్ తన రెండో ఓవర్ రెండో బంతికి మార్క్రమ్ (0)ను అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. గత మ్యాచ్ స్టార్, కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్ (2) కూడా సిరాజ్ బంతికే బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. స్టబ్స్ (3)ను వెనక్కి పంపి బుమ్రా కూడా జత కలిశాడు. జోర్జి (2)ని కూడా పెవిలియన్ పంపించిన సిరాజ్, ఆ తర్వాత ఒకే ఓవర్లో బెడింగామ్ (12), జాన్సెన్ (0)ల పని పట్టి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాతి చివరి 4 వికెట్లు తీసేందుకు భారత్కు ఎక్కువ సమయం పట్టలేదు. అదే వరుస... యశస్వి జైస్వాల్ (0) ఆరంభంలోనే వెనుదిరిగినా రోహిత్, గిల్ కలిసి చకచకా పరుగులు రాబట్టారు. దాంతో పదో ఓవర్లోనే భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలోనే పెవిలియన్కు పంపించిన బర్గర్...శ్రేయస్ (0)ను కూడా అవుట్ చేశాడు. అయితే కోహ్లి చక్కటి షాట్లతో స్కోరును వేగంగా నడిపించాడు. మరో వైపు బాగా ఇబ్బంది పడిన రాహుల్ (8) తాను ఎదుర్కొన్న 22వ బంతికి గానీ తొలి పరుగు తీయలేకపోయాడు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద నిలిచింది. అయితే తర్వాతి 11 బంతులు భారత్ను బాగా దెబ్బ తీశాయి. ఈ 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోవడంతో అదే స్కోరు వద్ద టీమ్ ఆలౌట్ అయింది. స్కోరు వివరాలు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 2; ఎల్గర్ (బి) సిరాజ్ 4; జోర్జి (సి) రాహుల్ (బి) సిరాజ్ 2; స్టబ్స్ (సి) రోహిత్ (బి) బుమ్రా 3; బెడింగామ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 12; వెరీన్ (సి) గిల్ (బి) సిరాజ్ 15; జాన్సెన్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; మహరాజ్ (సి) బుమ్రా (బి) ముకేశ్ 3; రబాడ (సి) శ్రేయస్ (బి) ముకేశ్ 5; బర్గర్ (సి) యశస్వి (బి) బుమ్రా 4; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (23.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–11, 4–15, 5–34, 6–34, 7–45, 8–46, 9–55, 10–55. బౌలింగ్: బుమ్రా 8–1–25–2, సిరాజ్ 9–3–15–6, ప్రసిధ్ 4–1–10–0, ముకేశ్ 2.2–2–0–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బి) రబడ 0; రోహిత్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 39; గిల్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 36; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) రబడ 46; శ్రేయస్ (సి) వెరీన్ (బి) బర్గర్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) ఎన్గిడి 8; జడేజా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; బుమ్రా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; సిరాజ్ (రనౌట్) 0; ప్రసిధ్ (సి) మార్క్రమ్ (బి) రబడ 0; ముకేశ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 24; మొత్తం (34.5 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–105, 4–110, 5–153, 6–153, 7–153, 8–153, 9–153, 10–153. బౌలింగ్: రబడ 11.5–2–38–3, ఎన్గిడి 6–1–30–3, బర్గర్ 8–2–42–3, జాన్సెన్ 9–2–29–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (నాటౌట్) 36; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగ్హామ్ (నాటౌట్) 7; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45. బౌలింగ్: బుమ్రా 6–0–25–1, సిరాజ్ 5–2–11–0, ముకేశ్ 6–2–25–2. -
అప్పుడు సెంచరీ మిస్: టెస్టుల్లో కీలక మైలురాయి అందుకున్న గిల్
South Africa vs India, 2nd Test - Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన కెరీర్లో మరో కీలక మైలురాయి చేరుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత పేసర్లు కేప్టౌన్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పేసర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్ మీద నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో తొలిసారిగా ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఆదిలోనే జైస్వాల్ అవుట్ అయితే, ప్రొటిస్ పేసర్ కగిసో రబడ.. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ డకౌట్గా వెనుదిరగగా.. అతడి స్థానంలో వచ్చిన శుబ్మన్ గిల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జతయ్యాడు. ఇక గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన కనబరిచిన హిట్మ్యాన్ కేప్టౌన్లో మాత్రం బౌండరీలు బాదుతూ దూకుడుగా ఆడుతున్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి 37 బంతుల్లో 38 పరుగులతో జోరుమీదున్నాడు. #RohitSharma is up & about! Three 4️⃣s to get going in this #TeamIndia innings. Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/kuZAOIHJJH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 1000 పరుగులు పూర్తి చేసుకున్న గిల్ మరోవైపు.. అతడి తోడుగా మరో ఎండ్లో సహకారం అందిస్తున్న వన్డౌన్ బ్యాటర్ గిల్.. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో నండ్రే బర్గర్ వేసిన నాలుగో బంతికి రెండు పరుగులు తీసి వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా తన టెస్టు కెరీర్లో 36వ ఇన్నింగ్స్లో ఘనత ఈ మైలురాయిని అందుకున్నాడు. మెల్బోర్న్లో 2020 నాటి ఆస్ట్రేలియా మ్యాచ్తో శుబ్మన్ గిల్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 45, 35 (నాటౌట్) పరుగులు చేశాడు గిల్. అప్పుడు సెంచరీ మిస్ అదే విధంగా మరో మ్యాచ్లో గాబా స్టేడియంలో 91 పరుగులు సాధించి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. గిల్ కెరీర్లో ఇప్పటి వరకు టెస్టుల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు సాధించాడు. అయితే, విదేశీ గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంద పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో రెండు, రెండో ఇన్నింగ్స్లో 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో పది ఓవర్లు ముగిసే సరికి ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు: అందుకే అనామక జట్టును పంపుతున్నాం! -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత పేస్ బౌలింగ్ త్రయం (సిరాజ్, బుమ్రా, ముకేశ్ కుమార్) ఉగ్రరూపం దాల్చింది. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా సిరాజ్ (9-3-15-6) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. సిరాజ్కు జతగా ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) కూడా విజృంభించడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్కు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. టెస్ట్ల్లో భారత్పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డుల్లోకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్ సింగ్ (5/13) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్ ఠాకూర్ (7/61) టాప్లో ఉండగా.. హర్బజన్ సింగ్ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడంతో కేప్టౌన్ సైతం రికార్డుల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 36 సందర్భాల్లో ఆయా జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ కాగా.. అత్యధిక సందర్బాల్లో (7) కేప్టౌన్లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్టౌన్ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్ మైదానంలో చేశాయి. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్రమ్ 2, కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4, టోనీ జార్జీ 2, ట్రిస్టన్ స్టబ్స్ 3, మార్కో జన్సెన్ 0, కేశవ్ మహారాజ్ 3, రబాడ 5, నండ్రే బర్గర్ 4 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అన్స్టాపబుల్ సిరాజ్: అద్భుత ప్రదర్శన.. టెస్టుల్లో ఇదే తొలిసారి
South Africa vs India, 2nd Test: కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్ములేపాడు. ఆరంభంలోనే ప్రొటిస్ ఓపెనర్లను పెవిలియన్కు పంపి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. తొలుత ఐడెన్ మార్క్రమ్(2)ను అవుట్ చేసిన ఈ హైదరాబాదీ స్పీడ్స్టర్.. అనంతరం కెప్టెన్ డీన్ ఎల్గర్ రూపంలో బిగ్ వికెట్ పడగొట్టాడు. కీలక వికెట్ కూల్చి.. పతనానికి నాంది పలికి గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అద్భుత రీతిలో ఎల్గర్ను బౌల్డ్ చేశాడు. అవుట్సైడ్ ఆఫ్ దిశగా సిరాజ్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన ఎల్గర్(4) షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసి వికెట్ పారేసుకున్నాడు. తాను అవుటైన తీరును నమ్మలేక నిరాశగా మైదానాన్ని వీడాడు. కాగా గత మ్యాచ్లో అద్భుత సెంచరీతో రాణించిన డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు భారీ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్లో తెంబా బవుమా స్థానంలో.. అది కూడా తన కెరీర్లో ఆడుతున్న ఆఖరి టెస్టులో కెప్టెన్గా బరిలోకి దిగిన అతడిని సిరాజ్ ఇలా కోలుకోలేని దెబ్బకొట్టాడు. Knocked ‘em overrrr! _ ‘ | | /#MohammedSiraj has every reason to celebrate, as he cleverly sets up #DeanElgar and gets the big fish! 💥 Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/EGX6XxZsSu — Star Sports (@StarSportsIndia) January 3, 2024 సిరాజ్ దెబ్బకు టాపార్డర్ కకావికలం దీంతో ఆరంభంలోనే సౌతాఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేయగా.. టోనీ డీ జోర్జీ(2) రూపంలో సిరాజ్ మళ్లీ తన వికెట్ల ఖాతా తిరిగి తెరిచాడు. ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్ మొత్తం కలిపి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక జోర్జీ వికెట్ తీసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. 15.2 ఓవర్ వద్ద డేవిడ్ బెడింగ్హాం(12), అదే ఓవర్లో ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) వికెట్లు కూడా పడగొట్టాడు. తద్వారా కేప్టౌన్ టెస్టులో ఐదు వికెట్ హాల్ నమోదు చేశాడు. టెస్టుల్లో తొలి 6 వికెట్ హాల్ అంతటితో సిరాజ్ విధ్వంసం ఆగిపోలేదు. 17.5 ఓవర్ వద్ద వెరెనె(15) రూపంలో ఆరో వికెట్ దక్కించుకున్నాడు ఈ ఫాస్ట్బౌలర్. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున తన మొదటి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటికే ఆసియా కప్-2023 ఫైనల్ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్లో ఆరు వికెట్లు తీసి వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఇక సిరాజ్ తర్వాత వికెట్లు పడగొట్టే బాధ్యత తీసుకున్న ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3)ను అవుట్ చేయగా.. బుమ్రా.. నండ్రీ బర్గర్(4)ను పెవిలియన్కు పంపాడు. ఇక 23.2 ఓవర్ వద్ద కగిసో రబడ(5)ను పెవిలియన్కు పంపి ముకేశ్ కుమార్ సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇలా భారత పేసర్ల ధాటికి సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్పై సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! Pacy wickets with bounce on offer! Pitches in #SouthAfrica pose a different challenge, but former #TeamIndia batting coach #SanjayBangar delivers a masterclass on how best to deal with this test. Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/FYPOC19Kfn — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
హృదయం ముక్కలైంది.. సిరాజ్ పోస్ట్ వైరల్! అతడికి ఏకంగా రూ. 11 కోట్లు!
టీమిండియా స్టార్ బౌలర్, ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా పోస్ట్తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇన్స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీలతో హాట్టాపిక్గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ నర్మగర్భ పోస్ట్పై టీమిండియా, ఆర్సీబీ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్లో భాగమైన అతడికి.. వన్డే సిరీస్ సందర్భంగా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో.. డిసెంబరు 26న మొదలుకానున్న టెస్టు సిరీస్తో సిరాజ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్ హార్ట్బ్రేక్ ఎమోజీలను సిరాజ్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేయడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్-2024 వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహాలు.. బౌలర్లను కొనుగోలు చేసిన విధానం సిరాజ్కు నచ్చలేదేమో’’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘‘కొంపదీసి సిరాజ్ గాయపడ్డాడా ఏంటి? ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై ఇండియా టెస్టు సిరీస్ గెలిచిందే లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సిరాజ్ ఈ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీలతో ఏం సందేశం ఇస్తున్నట్లు?’’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే సిరాజ్ ఆర్సీబీ కెప్టెన్ కావాలని భావించాడేమో! పాపం.. ఇంతకీ ఆర్సీబీ క్యాంప్లో ఏం జరుగుతోందో మీకేమైనా తెలుసా?’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్గా నియమించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తన హృదయం ముక్కలైందంటూ.. రోహిత్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ను ముందుకు నడిపించిన సూర్యకుమార్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ క్రిప్టిక్ పోస్ట్ నేపథ్యంలో సూర్య పోస్ట్ను తెరమీదకు తెచ్చి నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. తాను ఆ ఎమోజీలు పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో మహ్మద్ సిరాజ్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ వేలం-2024లో ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే: వెస్టిండీస్ స్పీడ్స్టర్ అల్జారీ జోసెఫ్ను అత్యధికంగా రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. అతడితో పాటు యశ్ దయాళ్ (రూ.5 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఇక సిరాజ్ను ఆర్సీబీ రూ. ఏడు కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. Did Siraj wake up and see his co-bowlers who ll be bowling at Chinnaswamy? pic.twitter.com/ZIDVVUvUD6 — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 Das (@SergioCSKK) December 21, 2023 Is there any secret message behind this? — King Kohli's Fan (@ViratFan100) December 21, 2023 Mohammed Siraj's Instagram story. pic.twitter.com/TSCqSCbshv — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement