-
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో తల్లి.. ఎన్ని కోట్లంటే!
బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో విశాలమైన ఫోర్ బీహెచ్కే అపార్ట్మెంట్ను దాదాపు రూ.17.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మే 10న రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్కే దాదాపు రూ.1.04 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. ప్రస్తుతం పాలి హిల్లోని కృష్ణ రాజ్ బంగ్లాలో నివసిస్తున్న నీతు కపూర్ రీసేల్ డీల్లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. (ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్) సూరజ్ సినిమాతో అరంగేట్రం చేసిన నీతూ కపూర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్ చిత్రాల్లో నటించారు. కాలా పత్తర్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. 1980లో ఆమె నటుడు రిషి కపూర్ను వివాహం చేసుకోగా.. రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ జన్మించారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) -
కూతురి పేరును రివీల్ చేసిన ఆలియా-రణ్బీర్.. ఫోటో వైరల్
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్--రణ్బీర్ కపూర్ ఇటీవలె పేరెంట్స్గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా తాజాగా తన కూతురి పేరును రివీల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ను షేర్ చేసింది. ఇంతకీ ఆ పేరు ఎవరు పెట్టారు? దానివెనకున్న అర్థాలేంటో కూడా వివరించింది ఆలియా. కూతుర్ని ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసిన ఆలియా తన బుజ్జాయికి రాహా అని పేరు పెట్టినట్లు చెప్పింది. ఈ పేరును రణ్బీర్ కపూర్ తల్లి, నీతూకపూర్ సూచించిందట. అయితే మా కూతురు రాహ పేరుకు ఎన్నో అర్థాలు ఉన్నాయని అనేక భాషల్లో అనేక అర్థాలు ఉన్నాయని వివరించింది.రాహా అంటే దైవ మార్గమని, స్వాహిలి భాషలో ఆనందమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని అనేక అర్థాలున్నట్లు తెలిపింది. ఇక రాహా రాకతో లైఫ్ ఇప్పుడే కొత్తగా ప్రారంభమైందని పేర్కొంది. ప్రస్తుతం ఆలియా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆలియా-రణ్బీర్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆలియా-రణ్బీర్ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఆలియా ప్రెగ్నెన్సీపై స్పందించిన నీతూ కపూర్
బాలీవుడ్ కొత్త జంట ఆలియా భట్-రణ్బీర్ కపూర్లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ‘మా పాపాయి రాబోతుంది’ అంటూ సోమవారం(జూన్ 27) ఉదయం సోషల్ మీడియా వేదికగా గుడ్న్యూస్ చెప్పింది ఆలియా. దీంతో రణ్బీర్-ఆలియా దంపతులకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఆలియా ప్రెగ్నెన్సీపై రణ్బీర్ తల్లి, నటి నీతూ కపూర్ స్పందించింది. మూవీ షూటింగ్లో ఉన్న నీతూ కపూర్కు మీడియా నానమ్మ(దాది) కాబోతున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్ దీనికి ఆమె ‘నేను నానమ్మ కాబోతున్నానని అప్పుడే ఇండియా మొత్తానికి తెలిసిపోయిందా?’ అని అంటుండగా.. ఆలియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్లు మీడియా ఆమెతో చెప్పింది. ఇక ఈ విషయం తెలియని నీతూ కపూర్ కాస్తా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన రణ్బీర్-ఆలియాలు ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రణ్బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. చదవండి: Alia Bhatt Ranbir Kapoor: తల్లిదండ్రులు కాబోతున్న అలియా భట్-రణ్బీర్ కపూర్ View this post on Instagram A post shared by SimplyAmina 🌴 (@simplyaminaofficial) -
నవ్వులు పూయిస్తున్న 'జగ్ జగ్ జీయో' ట్రైలర్
JugJugg Jeeyo Trailer: Varun Dhawan Kiara Advani Love Drama: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం (మే 22) మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ యాక్టింగ్ చూస్తుంటే సినిమాకే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్, కియరా, నీతూ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ తరహాలో సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల పెళ్లి, విడాకుల కథాంశంగా సినిమా రూపొందించారు. ఈ సినిమాను యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్ చేస్తోంది.. నీతూ కపూర్పై ట్రోలింగ్
బాలీవుడ్ యంగ్ హీరో రణ్బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషి కపూర్ మరణించి రెండేళ్లు కావొస్తుంది. సుమారు రెండేళ్లు క్యాన్సర్తో పోరాడిన ఆయన 2020 ఏప్రిల్లో చనిపోయారు. అయితే తన భర్త మరణం తర్వాత ఇన్స్టాగ్రామ్లో తనను ట్రోల్ చేస్తున్నారని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ తెలిపారు. రిషి కపూర్ ఇక లేరన్న బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అయితే భర్త చనిపోయాడన్న బాధ లేకుండా ఇలా పోస్ట్లు పెట్టడంపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ ట్రోలర్స్కు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది నీతూ కపూర్. ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న నీతూ మాట్లాడుతూ 'నేను ఇలా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను, ఆస్వాదిస్తున్నాను. నేను నా ఫాలోవర్స్ను ప్రేమిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారిని బ్లాక్ చేస్తున్నాను. ఎందుకంటే భర్త చనిపోయాక కూడా ఎంజాయ్ చేస్తుందని కొందరు అంటున్నారు. నేను ఏడుస్తూ, బాధపడుతూ, విధవలా ఉండటాన్ని చూడాలనుకుంటున్నవారిని నేను బ్లాక్ చేస్తాను. నేను ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇలాగే ఉంటాను.' అని తెలిపారు. ఇంకా 'ఇలా ఉండటం వల్ల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. కొందరు ఏడుస్తూ, మరికొందరూ నవ్వుతూ బాధ నుంచి కోలుకుంటారు. నేను నా భర్తను మరచిపోలేను. అతను ఎప్పుడూ ఇక్కడ నాతో, నా పిల్లలతో జీవితాంతం ఉంటాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. భోజనానికి వచ్చి సగం సమయం అతని గురించే మాట్లాడుతున్నాం. రణ్బీర్ ఇప్పటికీ తన మొబైల్ స్క్రీన్సేవర్లో అతని ఫొటోనే ఉంది. అంటే మేము అతన్ని ఎంతగా మిస్ అవుతున్నామో అర్థం చేసుకోండి. కానీ మేము అతన్ని మిస్ అవుతున్నందుకు దిగులుగా లేదు. మేము అతన్ని మిస్ అవడాన్ని కూడా సంతోషంగా భావిస్తాం. అతను ఎంతో గొప్ప వ్యక్తి అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం' అని పేర్కొన్నారు నీతూ కపూర్. View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement