-
నీతా అంబానీ లగ్జరీ కార్లు, డైమండ్ నగలు (ఫోటోలు)
-
నీతా అంబానీ లగ్జరీ కారు, ఫోటోలు వైరల్, ధర ఎంతంటే..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ అంటే లగ్జరీకి పెట్టింది. డైమండ్ నగలు, వాచ్లు, ఖరీదైన చీరలు,విలాసవంతమైన బ్యాగులు, డనుంచి చెప్పులు, లిప్స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. స్పెషల్ గా కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు ఇది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి కారు ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.దీని స్టాండర్డ్మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా కారు హెడ్రెస్ట్లపై నీతాముఖేష్ అంబానీ (ఎన్ఎంఏ) కూడా ఎంబ్రాయిడరీ చేసిన పిక్స్కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్ సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్ అధునాతన ఫీచర్లతో ఉన్న కొత్త లగ్జరీ రోల్స్ రాయిస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. గత దీపావళికి, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్యూవీని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ప్రముఖ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉన్నవారు ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒకరు. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!
రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమర్థవంతమైన బిజినెస్ విమెన్గానూ, ఓ మంచి గృహిణిగా తల్లిగా, అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్న శక్తిమంతమైన మహిళ ఆమె. రాబోయే తరాలకు స్పూర్తి ఆమె. అలాగే ఎప్పటికప్పుడూ ట్రెడిషన్కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్ లుక్లో కనిపిస్తారు. ఇటీవల చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా నీతా స్పెషల్ ఎంట్రాక్షన్గా నిలిచారు. ఆమె ధరించే అత్యంత ఖరీదైన చీరలు, నగలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి కూడా. అలానే ఈసారి నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ వార్షికోత్సవంలో ధరించిన చీర కూడా హైలెట్గా నిలిచింది. ఆ చీరకు ఓ స్పెషాలిట కూడా ఉంది. అదేంటంటే..స్టైల్కి స్పెషల్ సిగ్నేచర్ నీతా అంబానీ. హైప్రొఫైల్ వేడుకలకు తగ్గట్టుగా నీతా వస్త్రధారణ ఉంటుంది. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) వార్షికోత్సవంలో కూడా అలాంటి ఆకర్షణీయమైన వస్తధారణతో హైలెట్గా నిలిచింది. ఆమె ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా పైథాని చీరలో వచ్చారు. చూపురులందర్నీ కట్టిపడేసేలా స్టన్నింగ్ లుక్లో సందడి చేసింది నీతా. ఈ చీర బంగారు జరీతో అజంతా గుహలను గుర్తుకు తెచ్చేలా పుష్పాలు, పక్షులతో డిజైన్ చేసి ఉంది. చీరల రాణి.. చీర అంతా కూడా కమలా పువ్వులతో డిజైన్ చేసి ఉంది. నాటితరం చీరల నైపుణ్యం చాటిచెప్పేలా ఉంది ఆ చీర. అంతేగాదు మన దేశీ చీరల కళాకారులను గౌరవిద్దాం. చేతి వృత్తులను ప్రోత్సహించేలా వారు తయారు చేసిన చీరలనే దరిద్దాం అని సోషల్మీడియవేదికగా నీతా పిలుపునిచ్చారు. నిజానికి ఈ పైథాని చీరు మహారాష్ట్ర రాయల్ చీరగా పరిగణించే చీరల్లో ఒకటి. ఈ పైథాని చీరను స్వచ్ఛమైన పట్టుతో రూపొందిస్తారు. ఈ చీర డిజైన్ ముందు వైపు కనిపించినట్లే వెనుకవైపు డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. చక్కగా చేతితో నేసిన చేనేత వస్త్రం. ఈ చీర నేయాలంటే కళాకారుల వద్ద మంచి నైపుణ్యం ఉండాల్సిందే. ఇది భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు చాలా శ్రమతో ఈ పైథాని చీరలను రూపొందిస్తారు. దీన్ని చీరల రాణిగా పిలుస్తారు. అలాగే ఈ చీరను నకిలీ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇక ఇక్కడ నీతా కూడా భారతీయ కళలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఈ నీతా ముఖేష్ అబానీ కల్చర్ సెంటర్(ఎన్ఎంఏసీసీ) వార్షిక వేడుకలో దీన్నే గుర్తు చేసేలా ఆ పైథాని చీరతో కనిపించారు. అంతేగాదు మన భారతీయ కళల గొప్పదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు ఆమె. ఏ వేడుకైన హైలెట్ కావాలన్న, దాని ప్రాముఖ్యత తెలియజెప్పాలన్నా.. అందుకు తగ్గ వస్త్రాధారణతోనే సాధ్యమని నీతా చెప్పకనే చెప్పారు. దటీజ్ నీతా అంబానీ కదూ..! (చదవండి: సమ్మర్లో డీహైడ్రేషన్కు చెక్పెట్టేవి ఇవే..!) -
లక్షల కోట్లు ఉంటేనేం!.. 2 పాయింట్లు.. చిన్నపిల్లల్లా అంబానీల సంబరాలు
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో తొలి గెలుపు కోసం ఎంతగానో తపించి పోయింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేయడంతో అటు పాండ్యాతో పాటు.. ఇటు మేనేజ్మెంట్పైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మపై వేటు వేసినందుకు తగిన శాస్తే జరిగిందంటూ సొంత అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వారి కోపాన్ని చల్లారుస్తూ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఈ సీజన్లో మొదటి గెలుపు అందుకుంది. సొంత మైదానం వాంఖడేలో భారీ స్కోరు నమోదు చేయడమే కాకుండా ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ను 29 పరుగుల తేడాతో చిత్తు చేసి పాయింట్ల ఖాతా తెరిచింది. దీంతో ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మనకి రెండు పాయింట్లు వచ్చాయి అన్నట్లుగా కొడుకు ఆకాశ్తో కలిసి నీతా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు ఈ విజయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసింది. అటు హార్దిక్ పాండ్యా సైతం అనేక అవమానాల అనంతరం గెలుపు దక్కడంతో తొలిసారిగా మనస్ఫూర్తిగా నవ్వినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ హైలైట్గా నిలిచారు. చిన్నపిల్లలా తన సంతోషాన్ని పంచుకుంటూ ఆమె చేసిన సందడి అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘వేల కోట్లు ఉంటేనేం.. నీతా మేడమ్కు ఇప్పుడు కలిగిన ఆనందం మాత్రం వెలకట్టలేనిది’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఇక తాజా పరాజయంతో నాలుగో ఓటమి నమోదు చేసిన ఢిల్లీ పదోస్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు: ►వేదిక: వాంఖడే, ముంబై ►టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్ ►ముంబై స్కోరు: 234/5 (20) ►ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 205/8 (20) ►ఫలితం: 29 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రొమారియో షెఫర్డ్(ముంబై- 10 బంతుల్లో 30 రన్స్- నాటౌట్) ►ఓవరాల్ టాప్ స్కోరర్: ట్రిస్టన్ స్టబ్స్(ఢిల్లీ- 25 బంతుల్లోనే 71 రన్స్- నాటౌట్). చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That feeling of your first win of the season 😀 A blockbuster batting and a collective bowling performance help Mumbai Indians get off the mark in #TATAIPL 2024 on a special day at home 🙌 Scorecard ▶ https://t.co/Ou3aGjpb7P #TATAIPL | #MIvDC pic.twitter.com/5UfqRnNxj4 — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
గంతులేసిన కావ్య.. ఈ దారుణం చూడలేనని కళ్లు మూసుకున్న నీతా!
IPL 2024: సిక్సర్ల మోత.. బౌండరీల జాతర.. ముంబై బౌలింగ్పై సన్రైజర్స్ బ్యాటర్ల ఊచకోత చూస్తుంటే ఇది కదా అసలైన ఐపీఎల్ మ్యాచ్ మజా అనిపించింది. ముఖ్యంగా స్లో బ్యాటింగ్ జట్టు అనే అపఖ్యాతి మూటగట్టుకున్న సన్రైజర్స్ సొంత మైదానంలో రెచ్చిపోవడంతో అభిమానులకు కన్నుల పండుగే అయ్యింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. సిక్సర్ల వర్షం కురిపిస్తూ రైజర్స్ ఆటగాళ్లు బ్యాట్ ఝులిపిస్తే.. ముంబై బౌలర్ల ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేకపోయారు. ట్రవిస్ హెడ్(24 బంతుల్లో 62), అభిషేక్ శర్మ(23 బంతుల్లో 63), మార్క్రమ్(28 బంతుల్లో 42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్) ఏమాత్రం జాలి లేకుండా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వెరసి ఉప్పల్లో సన్రైజర్స్ 277 పరుగులు చేసి ఐపీఎల్లో ఆల్టైమ్ అత్యధిక రన్స్ స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. మరోవైపు.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కు శుభారంభమే లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యంగా జోరు మీదున్న ఓపెనర్లు రోహిత్ శర్మ(12 బంతుల్లో 26), ఇషాన్ కిషన్(13 బంతుల్లో 34) త్వరగానే అవుట్ కావడం ప్రభావం చూపింది. ఆ తర్వాత నమన్ ధిర్(14 బంతుల్లో 30) కాసేపు మెరుపులు మెరిపించినా.. స్థానిక బ్యాటర్ తిలక్ వర్మ(34 బంతుల్లో 64) అద్భుతమైన అర్థ శతకం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ ధనాధన్ ఇన్నింగ్స్(22 బంతుల్లో 42 నాటౌట్)తో చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఫలితంగా 31 పరుగులతో ఓడిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది. The moment when @SunRisers created HISTORY! Final over flourish ft. Heinrich Klaasen 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb — IndianPremierLeague (@IPL) March 27, 2024 ఇక ఆద్యంతం ఆసక్తి రేపుతూ.. అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్లో ఇద్దరు సెలబ్రిటీల హావభావాలు మాత్రం హైలైట్గా నిలిచాయి. వారు మరెవరో కాదు సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్.. ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ. ఎప్పుడూ ఆఖరిదాకా ఊరించి ఓటమి పాలయ్యే జట్టుగా పేరున్న రైజర్స్ ఉప్పల్లో అదరగొడుతుంటే కావ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్లు బాదినపుడు ఆమె సీట్లో నుంచి లేచి నిలబడి చిన్నపిల్లలా గెంతులు వేశారు. pic.twitter.com/I3UhbAzCiP — Out Of Context Cricket (@GemsOfCricket) March 27, 2024 అదే విధంగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ కమిన్స్ బౌలింగ్లో అభిషేక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగానే.. ఆమె సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు.. రైజర్స్ బ్యాటర్ల ఊచకోత ఇక చూడలేనన్నట్లు నీతా అంబానీ తలపట్టుకుని కళ్లు మూసుకున్నారు. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 అంతేకాదు.. ఇక ఇది అయ్యే పని కాదన్నట్లుగా కొడుకు ఆకాశ్ అంబానీతో కలిసి ఫోన్ చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 18 సిక్సర్లు, 19 ఫోర్లు బాదితే.. ముంబై 20 సిక్స్లు, 12 బౌండరీలు బాదింది. చదవండి: #srhvsmi: మా బౌలర్ల తప్పు లేదు.. వారి వల్లే ఓడిపోయాం: పాండ్యా WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు, కానీ పాపం ఎంఐ
ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ (MI) యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ (Nita Ambani) బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించు కున్నారు. ప్లేఆఫ్కు అర్హత సాధించిన ఎంఐ జట్టు విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా బుధవారం హైదరాబాద్ వచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాలు అమ్మవారి సన్నిధిలో గడిపారు. (సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో) మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో నీతా అంబానీ, పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ను అలరించారు. హైదరాబాద్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉన్న ప్రతీ సందర్బంలో నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు. అందులో భాగంగానే ఈసారి కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని నీతా సందర్శించారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీగా జరిగిన మ్యాచ్లో ఎంఐ ఓటమి పాలైంది.అంతేకాదునిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేయడం విశేషం -
అబ్బురపరిచిన ‘అనంత’ భావోద్వేగం
కళ్లు చెదిరే ఐశ్వర్యం, దేన్నయినా క్షణాల్లో సాధించగల అధికారం, కుటుంబ విలువల పట్ల అచంచల విశ్వాసం, భగవంతుడిపై అంతులేని భక్తి... ఇవన్నీ ఒకే కుటుంబంలో కలగలిసి వుండటం ఊహాతీతం. కానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ‘అంబానీ పరివార్’ వీటన్నిటి సమ్మేళనం అని మరోసారి రుజువైంది. గుజరాత్లోని జామ్నగర్లో మూడు రోజులపాటు ఈమధ్య జరిగిన ప్రీ వెడ్డింగ్ సంబరాలు దేశంలోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగనివి. కానీ వీటన్నిటి కంటే అందరికీ ఆసక్తి కలిగించింది మరొకటుంది. అది జూలైలో పెళ్లికొడుకు కాబోతున్న అనంత్ అంబానీ చేసిన ప్రసంగం! చిన్ననాటి స్నేహితురాలూ, ప్రియురాలూ అయిన రాధికా మర్చంట్తో ఆయనకు వివాహం అవుతున్న సందర్భంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. వర్తమాన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులు, కార్పొరేట్ కుబేరులు, బాలీవుడ్ అగ్రతారలు, క్రికెటర్లు సకుటుంబ సమేతంగా వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరయ్యారు. అనంత్ అంబానీ చేసిన ప్రసంగం అందరి మనసులనూ మెలిపెట్టింది. కుమారుడి ప్రసంగం వింటూ ముఖేష్ దంపతులైతే కంటతడి పెట్టారు. 2003లో కరణ్ థాపర్ ‘బీబీసీ’ కోసం ముఖేష్–నీతా దంపతులను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా నీతాను ‘మీ దృష్టిలో డబ్బంటే ఏమిటి?’ అని అడిగినప్పుడు ‘డబ్బు దానికదే అంతిమ లక్ష్యం కాదు... దాన్ని ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యం’ అని చెబుతూ ఒక మాటన్నారు. ‘డబ్బు సంపాదన, సంపద జీవితం కానే కాదు... కొన్ని అపురూప చిరస్మరణీయ జ్ఞాపకాలను నిర్మించుకోవటమే జీవితం’ అని చెప్పారు. అనంత్ హృదయాంతరాళాల్లోంచి పెల్లుబికి వచ్చిన మాటల వెనక ఆ విలువల జీవశక్తి నిండివుందనీ, ఆ దంపతుల పెంపకం అతణ్ణి తీర్చిదిద్దిందనీ అనిపిస్తుంది. ఏమన్నారూ అనంత్? తన కుటుంబసభ్యులంతా తన కోసం, తన సుఖ సంతోషాల కోసం పడుతున్న శ్రమను వివరించారు. తనకున్న ప్రత్యేక అనారోగ్య సమస్యల నేపథ్యంలో అమ్మానాన్నలిద్దరూ అనుక్షణమూ తనను అపురూపంగా చూసుకున్న వైనాన్ని కళ్లకు కట్టారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత విలక్షణంగా ఉండాలన్న తపనతో గత కొన్ని నెలలుగా రోజుకు కనీసం 20 గంటలు తన కుటుంబసభ్యులంతా పడిన కఠోర శ్రమను గుర్తుకు చేసుకున్నారు. అందరూ అనుకుంటున్నట్టు తన జీవితం పూలపాన్పు కాదనీ, చిన్ననాటినుంచీ భరించలేని బాధల ముళ్లు వేధిస్తూనే ఉన్నాయనీ చెప్పారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే క్రమంలో వాడక తప్పని స్టెరాయిడ్స్ చివరకు ఊబకాయానికి కారణమైన తీరును తెలిపారు. సాధారణంగా 25–30 ఏళ్ల మధ్యనుండే సంపన్న కుటుంబాల యువతలో చాలా సందర్భాల్లో విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం కనబడుతూ ఉంటుంది. ఇంగ్లిష్ తప్ప ఏదీ మాట్లాడలేరు. ఈ వేడుకల సందర్భంగా ‘న్యూస్18’కు ఇచ్చిన ఇంటర్వ్యూ అనంత్లోని మానవీయతను వెల్లడిస్తుంది. నిలువెల్లా వినమ్రత, పలికే ప్రతి మాటలో నిజాయితీ అతని సొంతం. ఇంగ్లిష్లో కాదు... అందరికీ అర్థమయ్యేలా స్వచ్ఛమైన హిందీలో భావ వ్యక్తీకరణ అనంత్ ప్రత్యేకత. గాయపడిన, ఆదరణ కోల్పోయిన వన్యప్రాణులను అక్కున చేర్చుకుని వాటి సంరక్షణ కోసం జామ్నగర్లో మూడువేల ఎకరాల్లో ‘స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ వన్తార’ అనే ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. చిన్ననాడు తన నాయనమ్మ కోకిలా బెన్ నేర్పిన ప్రేమ, దయ భావనలే ఈ ప్రాజెక్టుకు తనను పురిగొల్పాయని చెప్పారు. తన ఆధ్వర్యంలోనే గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఒక ‘జూ’ కూడా నిర్వహిస్తున్నారు. ‘ఇండియా టుడే’ ఛానెల్లో వచ్చిన ఇంటర్వ్యూ ఆయనలోని మరో మనిషిని ఆవిష్కరించింది. ఆ యువకుడిలో దాగున్న ఆధ్యాత్మిక భావనలూ, మాతృదేశంపై ఉన్న చెక్కుచెదరని మమకారాన్నీ ఆ ఇంటర్వ్యూ వెలికితీసింది. పెళ్లి వేడుకలు మన దేశంలోనే జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపే స్ఫూర్తిగా అందుకోసం జామ్నగర్ను ఎంచుకున్నానని చెప్పారు. తన ఇంటిల్లిపాదికీ సనాతన ధర్మంపై ఉన్న భక్తి విశ్వాసాలనూ, వాటికి అనుగుణంగా ఆచరిస్తున్న విలువలనూ వివరించారు. ఆసియా ఖండంలోని సంపన్నవంతుల్లో మొట్టమొదటి స్థానంలో, ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్న కుటుంబంలో ఒక 28 ఏళ్ల కుర్రాడు ఇంత పరిణతితో, ఆధ్యాత్మిక విలువలతో మాట్లాడతాడని బహుశా ఎవరూ అనుకుని ఉండరు. ‘లైసెన్స్ రాజ్’గా పేరుబడిన ఆర్థిక సంస్కరణల పూర్వ దశలో అనంత్ తాత ధీరూభాయ్ అంబానీ తనదైన రీతిలో పావులు కదుపుతూ, ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ తన విశాల కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన వారసత్వాన్ని ముఖేష్ అప్రతిహతంగా కొనసాగిస్తూ దాన్ని మరింత పెంచుతున్న వైనమూ కళ్లముందే ఉంది. అందుకే ఇవాళ దేశంలో రిలయన్స్ స్పృశించని రంగమంటూ లేదు. ఆ కుటుంబ విలువలు సైతం అందరి హృదయాలనూ తాకుతాయని ప్రీ వెడ్డింగ్ వేడుకలు తెలియజెప్పాయి. బి.టి. గోవిందరెడ్డి వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు -
నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ మంచి గృహిణిగా, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. కేవలం ముఖేశ్ అంబానీ భార్య అనే ఐడెంటిటీ కంటే తనను తానుగా గుర్తించే ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు. రిలయన్స్ బోర్డు మెంబర్గా, ఐపీఎల్లో ముంబై ప్రాంచైజ్ ఓనర్గా మంచి విజయాలను అందుకున్నారు. ఆ సక్సెస్ ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకునేలా చేశాయి కూడా. ఇటీవల చిన్న కొడుకు నీతా అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హడావిడి అంత ఆమెదే. ఏ డ్రెస్లు వేసుకోవాలి..? ఈవెంట్ ఎలా చేయాలి..? వంటివన్నీ తన అమ్మే దగ్గరుండి మరీ చూసుకున్నారని స్వయంగా అనంత్ అంబానీనే చెప్పారు కూడా. 54 ఏళ్ల నీతా అంబానీ తన కోడళ్లకు, కూతురుకి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. చూడటానికి ఓ హిరోయిన్ మాదిరిగా మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె అందం, ఫిట్నెస్ ముందు సినీ సెలబ్రెటీలు కూడా సరిపోరని చెప్పొచ్చు. ఇంతలా చలాకీగా ఫిట్నెస్గా ఉండటానికి ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతారు?. ఆమె ఫిట్నెస్ రహస్యం తదితరాలు గురించి చూద్దామా!. నీతా అంబానీ మొదట్లో 90 కిలోల బరువు ఉండేవారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ఆస్మా, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల కారణంగా విపరీతమైన బరవు పెరిగిపోయాడు. దీని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు కూడా. తన కొడుకు బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతం కాకపోవడంతో ఆమెనే స్వయంగా తగ్గి కొడుకుకి స్ఫూర్తినిచ్చారు. పైగా నీతా కొడుకు తగ్గేందుకు ఉపక్రమించేలా చేశారు. అలా అనంత్ కూడా ఆ టైంలో బరువు తగ్గడం జరిగింది కూడా. అదీగాక నీతా మంచి శాస్త్రీయ నృత్యకారిణి కావడంతో ఆమె రోజువారీ దినచర్యలో భాగంగా నృత్యం చేస్తుంటారు. ఇదే ఆమెను మంచి ఫిట్నెస్గా ఉండేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అలాగే ఈ డ్యాన్స్ కదిలికలు, శరీరానికి ఓ మంచి వ్యాయామంలా ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నీతా క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తగ్గుతారు. పోషకాలు అధికంగా ఉండే ఈ జ్యూస్లో అద్భుతమైన డిటాక్స్లు ఉంటాయి. అవి అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా చేసి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఇది నిధానంగా బరువు తగ్గడంలో తోడ్పాడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫ్క్ట్లు తలెత్తకుండా ఉండేలా చేసి బరువుని అదుపులో ఉంచుతుంది. పైగా మంచి మానసికొల్లాసం కలిగించి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, చికాకులు, టెన్షలు వంటి వాటిని తట్టుకునేలా చేస్తుంది. ఇదే ఆమె ఫిటనెస్ రహస్యం. అందువల్లే నీతా ఇంత అందంగా ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగానే ఆమె శక్తిమంతమైన బిజినెస్ విమెన్గా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారని కూడా అనొచ్చు. (చదవండి: ట్రెండీ షార్ట్ బాబ్ హెయిర్ స్టయిల్..ఎక్కడి నుంచి వచ్చిందంటే..) -
Nita Ambani 1st Salary: ‘నన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారు’
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ టీచర్గా, వ్యాపారవేత్తగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, నృత్యకారిణిగా, సేవకురాలిగా..ఇలా తన లైఫ్లో ఎన్నో పాత్రలు పోషించారు. జీవితంలో ఎదిగేందుకు చాలాకష్టపడినట్లు ఐకానిక్ టాక్ షో విత్ సిమి గరేవాల్ ఎపిసోడ్లో వెల్లడించారు. ఈమేరకు అప్పటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియోలో నీతా అంబానీ నర్సరీ స్కూల్లో టీచర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేష్ అంబానీతో 1985లో వివాహం జరగడానికంటే ఏడాది ముందు నుంచే ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? ముఖేష్ అంబానీని పెళ్లాడిన తర్వాత కూడా సన్ఫ్లవర్ నర్సరీ స్కూల్లో టీచర్గా కొనసాగినట్లు తెలిపారు. అప్పుడు తన వేతనం నెలకు రూ.800 ఉండేదని నీతా అంబానీ గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సమయంలో తనను చూసి చాలా మంది ఎగతాలిగా నవ్వేవారని చెప్పారు. కానీ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Elite Learning Minds (@elite_learning_minds) -
నీతా అంబానీ ధరించిన ఈ నగ ధర, అసలు ఇది ఎక్కడిదో తెలుసా?!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా తన ప్రత్యేకతను చాటుకుంటారు. భారతీయ వారసత్వ సంపదను, అద్భుతమైన కళారీతులను ప్రదర్శించేలా చేనేత చీరలను ధరించి ఆకట్టుకోవడంలో నీతా తర్వాతే ఎవరైనా. అంతేనా కోట్ల విలువ చేసే డైమండ్ నగలు, ఖరీదైన బ్యాగులు మొదలు లిప్స్టిక్లు, చెప్పుల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో బనారసీ చీరలో మెరిసిపోయారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ధరించిన అరవంకి (బాజూబాంద్) స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. దీంతో దీని ఖరీదు ఎంత అని వాకబు చేసిన నెటిజనులు ఔరా! అంటున్నారు. మార్చి 9 ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఈవెంట్లో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా చేసిన దాతృత్వ సేవలకు గాను 'బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు' అందుకున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్ మేడ్ జాంగ్లా డిజైన్ బనారసీ చీరలో అందరి చూపును తన వైపు తిప్పుకున్నారు నీతా. చీర మాత్రమే కాదు, ఆమె ఆభరణాలు, మరీ ముఖ్యంగా ఆర్మ్ బ్యాండ్పై అందరి దృష్టి పడింది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ చక్రవర్తి శిరస్సుపై(తలపాగాపై) ధరించే (సర్పేచ్ లేదా కల్గీ)ని మరింత అందంగా రీ-స్టైలింగ్ చేసి మరీ ధరించారట. ఈ ఆభరణం ధర తాజా సమాచారం ప్రకారం రూ. 200 కోట్లు అని తెలుస్తోంది. టోపోఫిలియా ఇన్స్టా సమాచారం ప్రకారం, ఈ ఆభరణం 13.7 సెం.మీ ఎత్తు , 19.8 సెం.మీ వెడల్పుతో మేలిమి బంగారంతో తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ఇతర విలువైన రాళ్లను అందంగా పొదిగారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి చెందిన కొన్ని ఆభరణాలను 2019లో వేలం వేసిన సందర్భంలో చివరిసారిగా దీన్ని చూసినట్టు ఇన్స్టా పోస్ట్ పేర్కొంది. -
మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్ అవార్డు!
దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల్లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీని ప్రతిష్టాత్మక హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు. సామాజిక కార్యక్రమల పట్ల నీతాకు ఉన్న అచంచలమైన నిబద్ధత తోపాటు సమాజంపై సానుకూత ప్రభావం చూపేలా ఆమె చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. నీతా చేసిన అశేష దాతృత్వ సేవలు, జాతీయ-అంతర్జాతీయ పరంగా ఆమెకు విశేషమైన కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సీఈవో జూలియా మోర్లీ చేతుల మీదుగా నీతా అంబానీ ఈ మిస్ వరల్డ్ ఫౌండేషన్ హ్యుమానిటేరియన్ అవార్డుని అందుకుంది. ఆమె ఒక గృహిణిగా, సక్సెఫుల్ బిజినెస్ విమెన్గా ఎన్నో విజయాలు సాధించింది. అలాగే దాతృత్వంలో కూడా ఆమెకి సాటి లేరెవ్వరూ అని నిరూపించింది. ఆమె నేటి యువతకు, భావితరాలను స్పూర్తిగా నిలిచింది. ఓ మహిళ ఇల్లాలిగా ఉంటూ ఎలాంటి విజయాలను అందుకోగలదు అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కాగా, మిస్ వరల్డ్–2024 పోటీల్లో కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా దక్కించుకున్నారు. రన్నరప్గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. ఇక భారత్కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. (చదవండి: 'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్గా సరిలేరామెకు;! దటీజ్ నీతా) -
'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్గా సరిలేరామెకు'! దటీజ్ నీతా!
అందిరిలానే ఓ సాధారణ అమ్మాయి నీతా. అనుకోకుండా ఓ సంపన్న కుటంబం తమ కోడలిగా చేసుకుంటానని ముందుకొచ్చింది. అందరిలా ఎగిరి గంతేయ్యలేదు. ఇద్దరి మనసులు కలిసాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆఖరికి కోడలిగా అడుగుపెట్టిన తన ఉద్యోగం మాత్రం వదిలేయనని తెగేసి చెప్పింది. నిజానికి ఆమె గొప్పింటి కోడలిగా రాజభోగాలు అనుభవిస్తూ ధర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చొవచ్చు అందుకు ఆమె అంగీకరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండాలనుకుంది. కేవలం ముఖేష్ అంబానీ వైఫ్ నీతాగా గుర్తింపు కంటే తన ఆత్మగౌరవంతో ఆర్జించుకన్న గుర్తింపుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ విలక్షణమే అమెను పవర్ ఫుల్ విమెన్గా ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కేలా చేసింది. పైగా సక్సెస్ఫుల్ విమెన్కి అసలైన నిర్వచనంగా నిలిచింది నీతా అంబానీ. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం నీతాది. ఆమె కామర్స్లో డిగ్రీ చేశారు. భరత నాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఒకరోజు ఎప్పటిలానే ప్రదర్శన ఇచ్చి ఇచ్చారు. అది ధీరుబాయ్ అంబానీ కుటుంబం కంటపడింది. ఆమె నృత్య ప్రదర్శన, చలాకీతనం ధీరుబాయ్ దంపతులకు ఎంతాగనో నచ్చింది. తమ పెద్ద కుమారుడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే అంబానీలకు పెద్ద ధనవంతుల కుటుంబమని మంచి ఫేమ్ ఉంది. అయితే ఈ విషయం నీతా చెవిన పడింది. కానీ ఆమె ఎగిరి గంతెయ్యలేదు. పైగా తమ ఇరువురి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది. ఇక పెళ్లయ్యాక కూడా తాను చేసే టీచర్ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తానని షరతు కూడా విధించింది. అయితే అప్పుడూ ఆమె జీతం రూ. 800/-. అయినా ఇప్పుడూ అంబానీ కోడలివి అది ఏ పాటిదన్న ససమేరా అంది. పైగా అది తన ఆత్మగౌరవం అని తేల్చి చెప్పింది. ఓ తల్లిగా పిల్లలను.. ఆమె పిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారేమె. తన పిల్లలను మధ్య తరగతి పిల్లల్లానే పెంచేవారట. అయితే ప్రతి శుక్రవారం పిల్లలకు కొనుక్కోవడానికి రూ.5/- ఇచ్చేవారట. ఒకరోజు చిన్న కొడుకు అనంత్ నువ్వు రూ. 5లే తెచ్చుకుంటున్నావ్.. అంబానీ కొడుకువేనా అని స్నేహితులు హేళన చేస్తున్నారని మారం చేశాడు. ఆ ఘటన నీతాను కదిలించినా చిన్నపిల్లలకు ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో సర్ది చెప్పి పంపించారట. అలాగే వారిపై ఆంక్షలు విధించేవారట. స్వేచ్ఛగా వారి నిర్ణయాలు తీసుకుని కెరియర్లో రాణించేలా చేసేవారట. సమానత్వానికే పెద్ద పీట.. ఎవ్వరైనా మీకు ఇద్దరు వారసులు కదా అని అడిగితే కాదు ముగ్గురు అని సవరించేవారట నీతా. అంతేగాదు తన కూతురు ఇషా అంబానీని నువ్వు ఎవ్వరికీ తీసిపోవంటూ కూతురిని వ్యాపారం రంగంలో ప్రోత్సహించారు నీతా. అదుకే ఇషా విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆఖిరికి అనంత్ అంబానీ బరువు విషయంలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో, హేళనలకు గురయ్యేవాడో పలు ఇంటర్యూల్లో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అందుకోసం ఆమె అతని తోపాటు యోగా, వ్యాయామాలు చేసి 90 కేజీలు బరువున్న ఆమె కాస్త 50 కేజీలకు వచ్చి కొడుకుకి ఆదర్శంగా నిలిచి చూపించింది. అయితే అనంత్ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బరువు తగ్గి చూపించాడు. అయితే అనారోగ్యం కారణంగా మళ్లీ అనూహ్యంగా చాలా బరువు పెరిగిపోవడం జరిగింది. ఆ సమయంలో మరింతగా బాధపడుతున్న అనంత్కి తనలో ఉన్న లోపాలను చూడొద్దని, సానుకూలతలనే చూడమని చూపింది. అందువల్లే ముగ్గురు పిల్లలు కూడా 'అమ్మే మా ధైర్యం' అని పలు ఇంటర్యూల్లో ముక్త కంఠంతో చెప్పారు. తొలి మహిళా బోర్డు సభ్యురాలు ఆమె.. ఇల్లు, పిల్లలే జీవితం అనుకోలేదు. ధీరూభాయ్ అంబానీ స్కూల్ ప్రారంభించి దేశంలో ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కుటుంబ వ్యాపారం రిలయన్స్ ఇండస్ట్రీస్లోకి అడుగుపెట్టి తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. అప్పుడే కీలక పదవుల్లో మహిళా ప్రాధాన్యంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ ‘ముంబయి ఇండియన్స్’ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి, విజయం సాధించారు. కళలంటే ప్రాణం. వాటిని ప్రోత్సహించడానికి ‘స్వదేశీ మార్ట్’, ‘జియో వరల్డ్ సెంటర్’, ‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ వంటివీ ప్రారంభించారు. తాజాగా రియలన్స్ ‘డిస్నీ ఇండియాను’ విలీనం చేసుకునే పనిలో ఉంది. దానికి ఛైర్పర్సన్ కూడా నీతానే!. ఇలా కెరీర్ పరంగాను సక్సెస్ఫుల్గా దూసుకుపోయారామె. ఈ విజయాలే ఆమెను పవర్ఫుల్ బిజినెస్ విమెన్’గా ఫోర్బ్స్ జాబితాలో నిలచేలా చేసింది. ఎన్నెన్నో పురస్కారాలను అందుకునేలా చేసింది. సేవలోనూ ముందుటారామె.. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు నీతా. అందుకే 1997 జామ్నగర్లో రిలయన్స్ రిఫైనరీలో చేసే ఉద్యోగుల కోసం కాలనీ నిర్మించారు. 17వేలమంది కోసం నిర్మించిన దానిలో లక్ష మొక్కలు నాటించారు. అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించి మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, కళల అభివృద్ధికి కృషి చేశారు. ‘ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్’ ద్వారా లక్ష మంది చిన్నారులను విద్య, ఆటలకు చేరువ చేశారు. బ్రెయిలీ లిపిలో న్యూస్పేపర్, ఉచిత కంటి ఆపరేషన్లు... వంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అలాగే హర్ సర్కిల్’ పేరుతో మహిళా సాధికారతకు ఎంతగానో కృషిచేశారు. (చదవండి: లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!) -
అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ : పాక్ జీడీపీ, నీతా నగలపై సెటైర్లు
రిలయన్స్ అధినేత బిలియనీర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ బాష్ అంగరంగ వైభంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు. అయితే ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ 12 వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు. దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్ నగలు, కాబోయే వరుడు అనంత్ అంబానీ డైమండ్ వాచ్ గురించి ఇంటర్నెట్ తీవ్ర చర్చ నడిచింది. ఇదంతా ఒక ఎత్తయితే నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ వైరల్గా మారింది. పాకిస్తాన్ జీడీపీ కంటే నీతా అంబానీ డైమండ్ నెక్లెస్ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్స్టాలో పలు పోస్ట్లు వైరల్గా, తాజాగా ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం. కాగా ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 341 కోట్ల డాలర్లు (రూ. 28.23 లక్షల కోట్లు)గా ఉన్న సంగతి తెలిసిందే. Etched with the initials Anant Ambani and Radhika Merchant, Nita Ambani dons the world-famous handloom Kanchipuram saree designed by Swadesh and handcrafted by artisans. She was seen thanking the Jamnagar Reliance Parivar for their love and support during Anant and Radhika's… pic.twitter.com/YEOYdVOmjp — ANI (@ANI) March 7, 2024 -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అద్బుతమైన డ్యాన్స్తో మెస్మరైజ్ చేసిన నీతా అంబానీ (ఫోటోలు)
-
సంప్రదాయ నృత్యంతో కోడలికి ఆహ్వానం పలికిన నీతా అంబానీ.. వీడియో వైరల్
అనంత్ అంబానీ-రాధికామర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రివెడ్డింగ్ సంబరాలు ఆదివారంతో ముగిశాయి. ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్ను అనంత్ ఈ ఏడాది జులైలో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో అంబానీ కుటుంబం ముందస్తు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించింది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిపారు. ఈ ప్రీ వెడ్డింగ్ సంబరాలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని బిలియనీర్స్ తరలివచ్చారు. ఇక ఈ వేడుకల్లో నీతా అంబానీ తన సంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? అంబానీ ఇంట్లో ఏ వేడుకైనా నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. రాధిక మర్చంట్ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #WATCH | Founder and chairperson of Reliance Foundation Nita Ambani performed at Anant Ambani-Radhika Merchant's pre-wedding celebrations in Jamnagar, Gujarat. pic.twitter.com/7XvDzbr7Qa — ANI (@ANI) March 3, 2024 -
అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్తో అందరినీ మెస్మరైజ్ చేయడం ఆమెకు అలవాటు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్లో ఆమె లుక్తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్లో ఆమె లుక్ నీతా స్టయిలింగ్ను ప్రతిబింబించింది. -
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ మెరిసిపోతున్న ఇషా అంబానీ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా?
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. ప్రపంచం నాలు మూలాల నుంచి పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో జామ్నగర్ మొత్తం సందడిగా మారింది. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ డ్యాన్స్ వేయనున్న.. దానికోసం వారు రీహార్సిల్స్ చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట్లో వైర్ల అవుతున్న వీడియోలో 'ప్యార్ హువా ఇక్రార్ హువా హై' అనే పాటకు లిప్ సింక్ చేస్తూ.. ట్రెడిషినల్ దుస్తుల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ చాలా అద్భుతంగా డ్యాన్స్ వేయడం చూడవచ్చు. కాగా అనంత్, రాధికల పెళ్లి జులై 2024లో జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. గుజరాత్లోని జామ్నగర్లో మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Isha Ambani Piramal (@_ishaambanipiramal) -
అనంత్-రాధిక పెళ్లి : తల్లిగా నీతా అంబానీ రెండు కోరికలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సందడి జోషే వేరుగా ఉంది. రోజుకో విశేషం వార్తల్లో నిలిచింది. ఈఏడాది జూన్లో జరగనున్న అనంత్- రాధికా పెళ్లికి సంబంధించి ప్రతీ వేడుక ముచ్చటగా నిలుస్తోంది. వివాహ వేడుకు కంటే ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. వ్యాపారవేత్త అనంత్ అంబానీ , పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వెడ్డింగ్ బెల్స్కు ముహూర్తం ఖరారైన ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. జామ్నగర్లోని రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్లో జరిగే మూడు రోజుల ఈ వేడుకలకు ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ జామ్నగర్ చేరుకుంది. బుధవారం వేలాదిమందికి అన్నసేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అటు అతిథులు సైతం ఒక్కొక్కరుగా జామ్నగర్ చేరుకుంటున్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ సహా దాదాపు 2వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఆ రెండు ఆకాంక్షలతోనే జామ్నగర్లో.. ఇవన్నీ ఒక ఎత్తయితే అనంత్ అంబానీ తల్లి, నీతా అంబానీ విడుదల చేసిన స్పెషల్ వీడియో సందేశం ఇంటర్నెట్లో వైరల వుతోంది. జామ్నగర్లోనే ధీరూభాయ్ అంబానీ, ముఖేష్ రిలయన్స్ సామ్రాజాన్ని నిర్మించారు. తన కరియర్ కూడా అక్కడే మొదలైందనీ, అందుకే ఈ వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఎడారి లాంటి ప్రదేశాన్ని పచ్చని ప్రకృతితో అలరారేలా రిలయన్స్ గ్రీన్స్ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అలాగే కళలు, సంస్కృతీ సంప్రదాయాలంటే ఇష్టపడే నీతా అంబానీ ఈ వారసత్వాన్ని ప్రతిబింబించేలా తన తనయుడి పెళ్లి ముచ్చట ఉండాలని కోరు కుంటున్నారట. తమ మూలాల్ని గుర్తించుకునేలా కూడా వేడుకలు ఘనంగా ఉండాలని భావిస్తున్నామన్నారు. అందుకే గుజరాత్లోని రిలయన్స్ గ్రీన్స్ను వేదికగా ఎంచుకున్నామని ఆమె ప్రకటించారు. #WATCH | Jamnagar, Gujarat | Founder and chairperson of Reliance Foundation Nita Ambani speaks on the pre-wedding function of her son Anant Ambani with Radhika Merchant. "...When it came to my youngest son Anant's wedding with Radhika, I had two important wishes - first, I… pic.twitter.com/udOVozqbWP — ANI (@ANI) March 1, 2024 -
Disney India: రిలయన్స్ చేతికే డిస్నీ..
భారత వ్యాపార ప్రపంచంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన వయోకామ్ మీడియా- వాల్ట్ డిస్నీల మధ్య విలీన ఒప్పందం జరిగింది. తర్వలోనే రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ వెంచర్లో రిలయన్స్ మీడియా యూనిట్ దాని అనుబంధ సంస్థలు విలీన సంస్థలో కనీసం 61 శాతం వాటాను కలిగి ఉండగా... మిగిలిన వాటా డిస్నీదేనని తెలుస్తోంది. ఈ మీడియా వెంచర్కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్పర్సన్గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్గా వ్యవహరించనున్నాయి. ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభం నాటికి విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనానంతర స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు ఉండనున్నాయి. -
కాబోయే కోడలి కోసం ఖరీదైన కానుకలు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు..
భారతదేశంలో అత్యంత ధనవంతులైన అంబానీ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ తరుణంలో కాబోయే కోడలు 'రాధిక మర్చంట్'కు ఖరీదైన గిఫ్ట్స్ అందించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. అంతకంటే ముందు అత్తింటి వారు కాబోయే కోడలికి సుమారు రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మి గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటి వాటిని గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాధికా మర్చంట్ గతంలో ఓ పార్టీలో తన అత్తగారికి చెందిన డైమండ్ చౌకర్ ధరించి కనిపించింది. ఇది విలువైన ముత్యాలు, వజ్రాలతో పొడిగినట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్కు నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం. ఇదీ చదవండి: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఇండియాకు.. వచ్చే నెల ప్రారంభంలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ వంటి వాటితో పాటు ఇవాంకా ట్రంప్ కూడా ఉన్నట్లు సమాచారం. -
అంబానీ ఆంటిలియాకు కొత్త కళ తెచ్చిన సూపర్ డిజైనర్ ఎవరో తెలుసా?
అత్యంత అందమైన, ఖరీదైన భవనం అంటే ముంబై నగరం నడిబొడ్డున అల్టామౌంట్ రోడ్లో కొలువుదీరిన ఆంటిలియా భవనం గుర్తొస్తుంది. మరి అంత గొప్ప భవనానికి మరింత సొబగులు అద్ది కొత్త కళను తీసుకొచ్చిన ఇంటీరియర్ డిజైనర్ ఎవరో తెలుసా? ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ ముఖేష్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీలకు చెందినదే ఈ ఆంటిలియా భవనం, ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లు ఈ ఐకానిక్ ఆంటిలియా. ఐశ్వర్యానికి, నిర్మాణ అద్భుతానికి,లగ్జరీ సదుపాయాలకు నిదర్శనంగా నిలుస్తుందీ భవనం. దీని విలువ 15,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. యూకేకు చెందిన బకింగ్ హామ్ ప్యాలస్ తర్వాతే ఇదే అత్యంత ఖరీదైన భవనంగా నిలిచింది. దాదాపు 4,532 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్ పెర్కిన్స్ డిజైన్ చేశారు. దీనిని ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాణ రంగ సంస్థ లైయిటన్ హోల్డింగ్స్ నిర్మించింది. అయితే ఈలగ్జరీ భవనంలోని లాంజ్ ఏరియాను డిజైన్ చేసిన డిజైనర్ మరెవరో కాదు, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ,బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్. తనదైన డిజైన్స్, క్రియేటివ్ టచ్తో ఆంటిలియాకు మరింత సొబగులను అద్దింది గౌరీ ఖాన్. ఇంటీరియర్ ఆర్కిటెక్చర్గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గౌరీ ఖాన్ 2019లో ఈ ప్రాజెక్ట్ను చేపట్టి తన మార్క్ నైపుణ్యం, డిజైన్స్తో ఈ భవంనలోని బార్ లాంజ్ ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చింది. తన అనుభవాలను గతంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన గౌరీ ఖాన్ "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించింది. అంతేకాదు డిజైన్స్ పట్ల ఆసక్తి ఉన్న నీతాతో కలిసి పనిచేయడం నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ ఆమె రాసుకొచ్చింది. గౌరీ ఖాన్ డిజైన్స్ ఫౌండర్గా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకులుగా గౌరీ ఖాన్ ఇంటిరీయర్ డిజైనర్గా ఖ్యాతి గడించారు. ఈ క్రమంలోనే రణ్బీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, అలియా భట్, అనన్య పాండే తదితర పలువురు బాలీవుడ్ ప్రముఖుల గృహాలను అద్భుతంగా తీర్చిదిద్దింది. 27 అంతస్తులున్న లగ్జరీ హౌస్ ఆంటిలియాలో హెల్త్ స్పా, సెలూన్, మూడు స్విమ్మింగ్ పూల్స్, ఒక బాల్రూమ్ ఉన్నాయి. అలాగే యోగా, డ్యాన్స్ స్టూడియోల తోపాటు, 168 కార్లు పార్క్ చేసేందుకు కావాల్సినంత స్థలం ఉంటుంది. అంతేకాదు ఈ ఆంటిలియా భవనం 8.0 తీవ్రతతో భూకంపాన్ని కూడా తట్టుకోగలదట.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏడాదిలో సీపీఎస్ సమస్యకు పరిష్కారం
కూటమి కోటలు బద్దలు కొట్టాలి
పశ్చిమంలో సుజనా ప్రైవేట్ సైన్యం
అవనిగడ్డలో ఫ్యాన్ ప్రభంజనమే
జగన్ను గెలిపించేందుకు నాయీ బ్రాహ్మణులు సిద్ధం
నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా పోలింగ్ విధులు
క్వారీ గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
కిడ్నాపైన ఎల్లయ్య మృతదేహం లభ్యం
అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత
బెజవాడలో ప్రధాని మోదీ రోడ్షో
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement