-
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
-
Lok sabha elections 2024: కమలానికి పెనుసవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇటీవల వైరల్ చేసిన అమిత్ షా డీప్ఫేక్ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకేనా 400 సీట్లు? మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది. సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్ హెగ్డే, అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్పుత్లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. -
మీరట్ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
CM Jagan: అందరి చూపులూ ప్రొద్దుటూరు సభ వైపే..
వైఎస్సార్, సాక్షి: ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలోకి దిగడంతో.. ఏపీలో ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం ఇటు ప్రజలు, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న ఈ 21 రోజుల ప్రచార యాత్ర.. ఇఛ్చాపురంతో ముగుస్తుంది. ఈ క్రమంలో తొలిరోజు ప్రొద్దుటూరులో నిర్వహించబోయే ప్రచార సభలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన ఆందోళనలు చేపట్టినా.. వాళ్ల సాధకబాధకాలను గుర్తించి భరోసా కల్పించేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసినా.. చివరకు సుపరిపాలన తదనంతరం సిద్ధం సభలు నిర్వహించినా.. ఈ జననేతకు ప్రతీసారి జనం బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో.. అదీ ఎన్నికలకు ముందు ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో ప్రచార శైలి ఎలా ఉండనుంది?.. ప్రజా స్పందన ఏస్థాయిలో ఉండబోతోందో? అనే చర్చ నడుస్తోంది. మేమంతా సిద్ధం యాత్రలో.. ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారని, ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఇదివరకే ప్రకటించాయి. అలాగే.. గత 58 నెలల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును సాయంత్రం జరిగే సభల్లో ఆయన వివరిస్తారని తెలిపాయి. దీంతో ప్రొద్దుటూరు సభలో ఆయన ఆయా అంశాల్ని కచ్చితంగా ప్రస్తావిస్తారనేది ఊహించొచ్చు. ఇదీ చదవండి: మరో యాత్రకు సిద్ధం అలాగే గత పాలన- వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనను ఆయన పోల్చి పలు అంశాల్ని ప్రస్తావించ్చొచ్చు. అదే సమయంలో కూటమిపైనా ఆయన విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో గజదొంగల ముఠాగా, తోడేల మంద, మోసకారులుగా చంద్రబాబు అండ్ను కో(యెల్లో మీడియాను కలిపి మరీ) అభివర్ణించిన సీఎం జగన్.. ఇప్పటి కూటమి లక్ష్యంగా విమర్శలు, పంచ్ డైలాగులు గుప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే.. 2014లో ఇదే కూటమి రాష్ట్రాన్ని మోసపూరిత హామీలతో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారని.. దోచుకో పంచుకో దాచుకో ద్వారా అవినీతికి పాల్పడ్డారని.. అలాగే ప్రజలను ఎలా మోసం చేశారనే దాన్ని.. ఆయన ప్రముఖంగా ప్రస్తావించే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే.. కూటమిలో భాగమైన పవన్ కల్యాణ్, బీజేపీ, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ను ఆయన టార్గెట్ చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను ఇంకా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారాయన. ఇక ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇవ్వడం సీఎం జగన్ చేస్తూ వస్తున్నారు. తద్వారా విశ్వసనీయత, విలువల్ని చాటుతూ వస్తున్నారు. దీంతో.. ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమానికి కొనసాగింపుగా ఆయన ఏమైనా ప్రకటనలు చేస్తారా?.. పోనీ మేనిఫెస్టో ఎప్పుడనేదానిపై స్పష్టత ఇస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. జగన్ కోసం జనమంతా.. ఇక.. సీఎం జగన్ సొంత జిల్లా నుంచే బస్సు యాత్ర ప్రారంభం అవుతుండడంతో తొలి ఎన్నికల ప్రచార సభ లక్షలాది మందితో జనసంద్రంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తమ ప్రియతమ నాయకుడికి అండగా నిల్చేందుకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రొద్దటూరు వైపు అడుగులేస్తున్నారు. మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి రావొచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావటంతో పార్టీ కేడర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని ముఖ్యనేతలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. -
Lok Sabha elections 2024: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు 17 సీట్లు
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల పొత్తు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఓ కొలిక్కి వచ్చింది. చాన్నాళ్లుగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగి చివరకు బుధవారం తమ సీట్ల పంపకాలపై ప్రకటన చేశాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు 17 చోట్ల పోటీచేసే అవకాశం ఇచి్చంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, ఏఐసీసీ యూపీ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండేల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ‘మేం 17 చోట్ల పోటీ చేస్తాం. మిగతా 63 స్థానాల్లో ఎస్పీ, ఇతర కూటమి భాగస్వామ్య పారీ్టలు బరిలో నిలుస్తాయి’’ అని కాంగ్రెస్ నేత వినాశ్ పాండే చెప్పారు. ప్రియాంకా గాంధీ చొరవతో కుదిరిన ఒప్పందం యూపీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఒక అడుగు ముందుకేసి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో ఫోన్లో మంతనాలు జరిపారని, దీంతో సీట్ల పంపకాల ప్రక్రియ ఒక కొలిక్కి వచి్చందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రవస్థీ నియోజకవర్గంలో తామే పోటీచేస్తామని పట్టుబట్టి ఎస్పీ సాధించింది. కాంగ్రెస్ అదనంగా సీతాపూర్, బారాబంకీల్లో పోటీచేసే అవకాశం సాధించింది. వీటితోపాటు అమేథీ, రాయ్బరేలీ, కాన్పూర్ నగర్, వారణాసి, షహరాన్పూర్, అమ్రోహా, సిక్రీ, మహారాజ్గంజ్, బన్స్గావ్, బులంద్òÙహర్, ఘజియాబాద్, మథుర, ప్రయాగ్రాజ్, దేవరియా, ఝాన్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీచేయనుంది. మరోవైపు, మధ్యప్రదేశ్లో ఖజురహోలో మాత్రమే ఎస్పీ పోటీచేయనుంది. మిగతా 28 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఎస్పీ మద్దతు ఇవ్వనుంది. -
లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ..
ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు జమ్మూకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్ కాన్ఫరెన్స్ స్వతహాగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఫారుక్ అబ్దుల్లా వెల్లడించారు. ‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దీని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీనిపై ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని పేర్కొన్నారు. కాగా మూడుసార్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారుక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉంది. ప్రతిపక్ష కూటమి అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అయితే తన అనూహత్య నిర్ణయం వెనక కారణాలు మాత్రం అబ్దుల్లా వెల్లడించలేదు. చదవండి: బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు! సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ తప్పుకుంటున్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఆయన, ఎన్డీయే మద్దతుతో తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేశారు. గత నెలలో అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దేశాన్ని రక్షించాలంటే, ముందుగా విభేదాలను మరచిపోయి దేశం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే వీటిని ఆయన దాటవేసారు. -
మోదీ కలలు కంటున్నారు: విపక్షాలు
న్యూఢిల్లీ: ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కుపైగా స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేయడంపై విపక్ష పార్టీలు విమర్శలు పెంచాయి. ‘‘ మోదీ కలలు కంటున్నారు. ఏకంగా 400కుపైగా సీట్లు గెల్చుకుంటామని మోదీ చెప్పడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఆయనకు లేదని అర్థమవుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశ లౌకిక భావనను గాయపరిచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి ద్రోహం చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఏం చేసింది? రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎందుకు ఇంతవరకు నెరవేర్చలేదు?. గత మే నుంచి రావణకాష్టంగా రగిలిపోతున్న మణిపూర్లో మోదీ ఎందుకు ఇంతవరకు ఒక్కసారైనా పర్యటించలేదు?’’ అని సీపీఐ నేత బినోయ్ విశ్వం నిలదీశారు. ‘‘ 400 లేదా 500 సీట్లు గెలుస్తామని కల కనే హక్కు మోదీకి ఉంది. కానీ వాస్తవం వేరు. వేరే వాళ్ల కలలకు తగ్గట్లు నడుచుకోవాలో, సొంత నిర్ణయాలు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు’ అని సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిటస్ చెప్పారు. ‘ ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని ప్రసంగం అస్సలు ముగియదు. ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు స్మరించుకుంటేగానీ మోదీకి ఎన్నికల్లో గిట్టుబాటు అవుతుంది’’ అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ‘‘ బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో కూర్చున్నందుకైనా కాస్తంత గౌరవప్రదంగా మాట్లాడాలి. 400కుపైగా గెలుస్తామనడం చూస్తుంటే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలొస్తున్నాయి’’ అని మరో కాంగ్రెస్ ఎంపీ డ్యానిష్ అలీ అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ నెహ్రూ గతించి దాదాపు 60 ఏళ్లు గడుస్తున్నా మోదీ ఇంకా ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మోదీ ఇంతగా పట్టించుకుంటుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోదీ ఆయన ప్రసంగమంతా కాంగ్రెస్కే అంకితమిచ్చారు. ఇప్పుడు పెరిగిన ధరల గురించి మోదీ ఇంకా నెహ్రూ, ఇందిర గాంధీలనే తిడుతున్నారు. ధరలు పెరిగిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెస్ గెలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి!’’ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ను చూస్తే జాలేస్తోంది.. మా హ్యాట్రిక్ ఖాయం: లోక్సభలో ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: లోక్సభ సాక్షిగా కాంగ్రెస్ను, రాహుల్ గాంధీని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని.. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే ఆ పార్టీ పాకులాడుతోందని.. పదేళ్ల కకాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారాయన. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతూ.. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. సభకు సెంగోల్ తీసుకొచ్చే కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించాం. పార్లమెంట్ ఔన్నత్యానికి సెంగోల్ జోడించాం. విపక్షాలు కూడా చాలా కాలం అదే స్థానంలో ఉంచాలని తీర్మానించుకున్నాయి. అందుకు సభకు నా ధన్యవాదాలు. బీజేపీ పై పోటీ చేయడానికి విపక్షాలు భయపడుతున్నాయి. కొంత మంది పోటీ చేసే స్థానాలు మార్చుకుంటున్నారు. ఈసారి కొందరు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారు. మీ ఆలోచనా తీరును దేశం గమనిస్తోంది. విపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణం. .. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు. తోటి విపక్షాలను కాంగ్రెస్ ఎదగనివ్వడం లేదు. కాంగ్రెస్ నేతలు కొందరు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. కాంగ్రెస్ ఒకే ప్రొడెక్ట్ ను మాటిమాటికీ లాంచ్ చేస్తోంది. వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం. అమిత్ షా, రాజ్ నాథ్, నేను వారసత్వ రాజకీయాలు చేయలేదు. అన్ని నిర్ణయాలు ఒకే కుటుంబం తీసుకోవడం కుటుంబ పాలన. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పుకాదు. కానీ వాళ్లే పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు. ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం మాదే కాంగ్రెస్ తీరు మారడం లేదు దేశాన్ని విభజించడమే విపక్షాల పని. ఇలా ఎంతకాలం ఇలా చేస్తారు?. ఎన్నాళ్లీ మైనారిటీ రాజకీయాలు? అంటూ అధీర్ రంజన్ చౌదరిను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రశ్నించారు. మేం అభివృద్ధి నినాదం చేస్తే.. కాంగ్రెస్ క్యాన్సిల్ నినాదం తలెత్తుంది. మేం ఎలాంటి అభివృద్ధి చేసినా క్యాన్సిల్ అంటున్నారు. ఇంకా ఎంత కాలం ఈ విద్వేషం మీ గుండెల్లో ఉంచుకుంటారు. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మానడం లేదు. ఒక కుటుంబం కోసం పార్టీ పని చేస్తే దానిని కుటంబ పాలనగానే మేం భావిస్తాం. కాంగ్రెస్ది కుటుంబ రాజకీయం. ఒకే కటుంబం చుట్టూ తిరుగుతుంది. వారసత్వ రాజకీయాలతో దేశానికి నష్టం. కుటుంబ పాలన వల్ల దేశం ఎంత నష్టపోయిందో.. కాంగ్రెస్ నాయకులు కూడా అంతే నష్టపోయారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. చాలామంది కాంగ్రెస్ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదు. జాలేస్తోంది.. విపక్షాలకిదే నా సలహా కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టం. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్ పదే పదే రీలాంచ్ చేస్తోంది. కాంగ్రెస్ దుకాణం ఒక్క నాయకుడి కోసమే. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయి. కాంగ్రెస్ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోంది. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరు. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్ చేస్తోంది. తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారడం లేదు. విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకు విపక్షాలకు నా ధన్యవాదాలు. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుంది. కూటమి(ఇండియా) కుదుపులకు లోనైంది. విపక్షాల సంకల్పానికి నేను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్కు ప్రధాని మోదీ చురకలంటించారాయన. 2014 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. పదేళ్ల కిందట ప్రపంచంలోని 11వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది. ఎవరేం అనుకున్నా మా హ్యట్రిక్ విజయం గ్యారెంటీ. ఈ మూడో టెర్మ్లో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ.. అని ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ దేశ ప్రజల్ని అవమానించింది.. దేశ సామర్థ్యంమీద కాంగ్రెస్కు నమ్మకం లేదు. ఆ పార్టీని నడిపించే కుటుంబం భారతీయుల్ని చిన్నచూపు చూసింది. నెహ్రూ, ఇందిరలు దేశ ప్రజల్ని అవమానించారు. భారతీయులు కష్టపడరని ఎర్రకోట సాక్షిగా నెహ్రూ అన్నారు. యూరప్, చైనాలతో పోలిస్తే భారతీయులు అంతకష్టపడరని నెహ్రూ అన్నారు. అమెరికా, జపాన్, చైనా పౌరులతో పోలిస్తే.. భారతీయుల నైపుణ్యం తక్కువనీ నెహ్రూ అన్నారు. అలాగే భారతీయుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువని ఎర్ర కోట సాక్షిగా ఇందిరాగాంధీ చెప్పారు. కాంగ్రెస్కు వందేళ్లు పడుతుందేమో! పదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ది చేయాలంటే కాంగ్రెస్కు వందేళ్లు పడుతుందేమో. నాలుగు కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇచ్చాం. సానిటేషన్ కవరేజ్ వంద శాతానికి పెంచాం. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తొలగించాం. చంద్రయాన్-3తో విజయం సాధించాం. ఒలింపిక్స్లో సత్తా చాటాం. అన్ని రంగాల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చాం. బడ్జెట్లో రైతులకు ఎక్కువ నిధులిచ్చాం. యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇదేపని కాంగ్రెస్ చేయాలంటే 70 ఏళ్లు పట్టేది. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించాం. భగవాన్ రాముడు తన సొంతింటికి వచ్చాడు. అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అభివృద్ధి చేశాం. మాకు అదే ముఖ్యం ఖాదీని, చేనేతను కాంగ్రెస్ ప్రజలకు దూరం చేస్తే.. మేం దగ్గర చేశాం. ప్రభుత్వంలో ఓబీసీ నేతలు లేరని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. కర్పూరి ఠాకూర్ లాంటి వెనకబడిన వర్గాల వారికి మేం భారతరత్న ఇచ్చాం. కానీ, కర్పూరిని కాంగ్రెస్ అవమానించింది. ఆయన్ని గద్దె దించడానికి కాంగ్రెస్ యత్నించింది. మాకు ఓట్లు ముఖ్యం కాదు ప్రజల హృదయాలు ముఖ్యం. మళ్లీ మా సర్కారే వంద రోజుల్లో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడబోతుంది. అబ్కీ బార్ మోదీకి సర్కార్. బీజేపీకి సొంతంగా 370కిపైగా సీట్లు వస్తాయి. ఎన్డీయేకు వందకు పైగా సీట్లు వస్తాయి.. మూడో టర్మ్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాం. సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయి. మూడో టర్మ్లో వెయ్యేళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తాం. దేశ ప్రజలు మా పాలనను వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారు అని ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజకీయావసరాలకు దర్యాప్తు సంస్థలా? కేసులపై తీర్పులు కోర్టులు ఇస్తాయి. దర్యాప్తు సంస్థలపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈడీ దాడులతో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో దర్యాప్తు సంస్థలున రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం రూ.5 వేల కోట్లే సీజ్ చేసింది. మా హయాంలో లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తీశాం. విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. అవి స్వతంత్రంగా తమ చేసుకుంటూ పోతున్నాయి. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేది లేదు అని ప్రధాని మోదీ లోక్సభలో ప్రకటించగానే.. ఎన్డీయే ఎంపీలంతా నిలవడి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. -
జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా?
శ్రీహరి నామ శబ్దాన్నే సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని నానా హింసలూ పెడతాడు.. నీ శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు. అక్కడా...? ఇక్కడా ? ఎక్కడ ? అంటూ ఇబ్బంది పెడతాడు.. అప్పుడు బాలకుడు ప్రహ్లాదుడు పద్యం అందుకుంటూ ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు తండ్రీ.. ఎందెందు వెతికినా.. శ్రీహరి కనిపిస్తాడు అంటాడు.. అప్పుడు తండ్రి.. ధిక్కారమున్ సైతునా అంటూ ఏదీ ఈ స్తంభంలో చూపించు అని ఆ స్తంభాన్ని బద్దలుకొట్టగా అందులోంచి ప్రళయగర్జన చేస్తూ నరసింహస్వామి వస్తాడు.. అది వేరే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులై ఉంది... దేశంలో ఏ చిటారుకొమ్మకు ఎగిరిపోయినా ఏ రాష్ట్రానికి మరలిపోయినా జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు.. తమ పట్ల ఆయన తీసుకున్న బాధ్యత... శ్రద్ధాసక్తులు సైతం ఆ వలస జీవులు తమతో మోసుకెళుతున్నారు. దానికి ఉదాహరణే.. హైదరాబాద్లో బతకడానికి వలసవెళ్లిన గుడివాడకు చెందిన కుమారి అనే మహిళా అక్కడ ఫుట్ పాత్ మీద చిన్న భోజన హోటల్ పెట్టుకుని నడుపుతోంది. ఇక్కడ తాము ఆర్జిస్తున్న ఆదాయం తమ కుటుంబానికి సరిపోకపోవడంతో భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లారు. అక్కడ ఆమె భర్త ఆటో నడుపుతుండగా ఆమె హోటల్ పెట్టి తక్కువ ఖర్చుతో పదిమందికీ భోజనం పెడుతోంది. ఆమె వండి వడ్డిస్తున్న తీరు.. మాటకారితనం.. అన్నీ కలిపి ఆమెను కొద్దిరోజుల్లోనే పాపులర్ చేసేశాయి.. దానికి తోడు యూట్యూబ్ చానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేయగా తనకు ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చిందని, ఇల్లు ఇచ్చిందని సంతోషంగా చెప్పింది.. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణలోని తమ అనుకూల ప్రభుత్వంలోని పెద్దలను పురమాయించి రోడ్డు పక్కనున్న ఆమె హోటల్ను తొలగించారని వార్తలు వెల్లువెత్తాయి. కేవలం జగనన్న పేరు తల్చుకున్నంతనే ఆమె మీద టార్గెట్ చేసి హోటల్ తీయించేసారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ అన్న పేరు తలచుకున్నవారిని చూసి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని కొందరు అంటున్నారు. దేశ విదేశాలకు వెళ్ళిపోయినా వారు కూడా ఏదో విధంగా జగన్ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందినవారేనని ఈ ఒక్క సంఘటన వెల్లడిస్తోంది. ఏ రాష్ట్రానికి వలసపోయినా వారికి స్వగ్రామంలో ఏదోవిధంగా ప్రయోజనం జగన్ ప్రభుత్వం కల్పించిందని... అందుకే వారంతా జీవిత పర్యంతం సీఎం జగన్ని తలచుకుని గుండెల్లో గుడికట్టుకుంటున్నారని చెప్పడానికి కుమారి ఉదంతమే ఒక ఉదాహరణ అంటున్నారు -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: Pulivendula Politics : పులి ముందు ఫ్లూటా.? -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్బంధన్తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్బంధన్లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్లో ఆప్దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్బై చెప్పారు. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో మహాఘట్బంధన్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
Today Headlines: ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు
ఇవాళ్టి ప్రధాన వార్తల రౌండప్ 1.నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన 146మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆందోళన 2. కొత్త క్రిమినల్ చట్టాలు చరిత్రాత్మకమన్న ప్రధాని మోదీ మసిపూసి మారేడు చేశారంటూ కాంగ్రెస్ కౌంటర్ 3. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు విచారణ ఆరుగురు నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్షలు 4. పూంచ్ లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్ నిన్నటి దాడిలో 5గురు జవాన్లు మృతి 5. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా ఢిల్లీ, యూపీని కమ్మేసిన మంచు తెర 6. హాలీవుడ్ లో మరోసారి METoo కలకలం విన్ డీసెల్ పై మాజీ అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు -
ఆ పార్టీలది ఫ్రస్ట్రేషన్: ప్రధాని చురక
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ నిస్పృహలోకి వెళ్లాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ నిస్పృహతోనే ఆ పార్టీలు పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయన్నారు. మంగళవారం(డిసెంబర్19)ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన వల్ల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ల నంబర్లు మరింత దిగజారుతాయని,బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకుంటుందన్నారు. కాగా, పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్తోనే ఆపార్టీలు పార్లమెంట్ సెషన్ను అడ్డుకుంటుండడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోపక్క పార్లమెంట్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇదీచదవండి..గెలవాలనుకుంటే నితీశ్, నిశ్చయం.. రెండూ కావాలని పోస్టర్లు -
పార్లమెంట్.. విపక్షాలది ఫ్రస్ట్రేషన్: మోదీ
Parliament Winter Session 2023 Updates ►లోక్సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్ బిల్లు-2023 పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi writes to Lok Sabha Speaker Om Birla, expressing his "deep concern about the Telecominniocation Bill 2023. In its current form, the Bill raises several serious concerns that have the potential to negatively impact the future of… pic.twitter.com/81nSyleKma — ANI (@ANI) December 19, 2023 ►కేంద్ర వస్తు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు- 2023 లోక్సభలో ఆమోదం పొందింది. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్-2023ని లోక్సభలో ప్రవేశపెట్టారు. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్పై మిమిక్రీ చేయడం సభ హక్కులను దిక్కరించడమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. "Contemptible": Kiren Rijiju slams Rahul Gandhi for filming TMC's Kalyan Banerjee mimicking Rajya Sabha Chairman Read @ANI Story | https://t.co/B5BomJ328f#KalyanBanerjee #RajyaSabha #RahulGandhi pic.twitter.com/6wQgyUPRrW — ANI Digital (@ani_digital) December 19, 2023 ► ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షాలు ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నాయని ప్రధాని మోదీ చురకలు అంటించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. Venting out frustration after poll routs: PM Modi calls out Oppn for 'political spin' to Parliament security breach Read @ANI Story | https://t.co/r9FJB4hexS#BJP #PMModi #Parliament pic.twitter.com/dP60IxCqg3 — ANI Digital (@ani_digital) December 19, 2023 ►పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి సభాధ్యక్షున్ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. #WATCH | "Ridiculous, unacceptable", says Jagdeep Dhankhar after TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman and Congress MP Rahul Gandhi films the act. pic.twitter.com/F3rftvDmhJ — ANI (@ANI) December 19, 2023 ఎన్సీఆర్ ఢిల్లీ సవరణ బిల్లు, సీజీఎస్టీ సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం #WATCH | National Capital Territory of Delhi Laws (Special Provisions) Second (Amendment) Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. pic.twitter.com/dmAXVkSdtp — ANI (@ANI) December 19, 2023 పార్లమెంట్ నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ లోక్సభ, రాజ్యసభల నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ ఇవాళ ఒక్కరోజే లోక్సభ నుంచి 49 మంది ఎంపీల సస్పెన్షన్ నిన్న 33 మంది ఎంపీలు..అంతకుముందు 13 మంది సస్పెన్షన్ లోక్సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీల సస్పెండ్ ఈ సెషన్లో మొత్తం 141 మంది ఎంపీలు బయటికి More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 అపోజిషన్ ముక్త్ పార్లమెంట్కు బీజేపీ ప్రయత్నం : శశి థరూర్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోవాలనుకుంటోంది పార్లమెంట్ డెమొక్రసీకి ఇవాళ చచ్చిపోయింది #WATCH | On suspension of more than 40 MPs from Lok Sabha, including his own, Congress MP Shashi Tharoor says, "...It is clear that they want an Opposition-mukt Lok Sabha and they will do something similar in Rajya Sabha. At this point, unfortunately, we have to start writing… pic.twitter.com/mh9LeXEgiB — ANI (@ANI) December 19, 2023 లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల నినాదాల మధ్య లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా ప్లకార్డులు ప్రదర్శించవద్దని కోరిన స్పీకర్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి స్టేట్మెంట్కు విపక్షాల పట్టు గాంధీ విగ్రహం వద్ద ఖర్గే, శరద్పవార్ నిరసన 92 మంది ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల ఆందోళన పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నేతల నిరసన #WATCH | Opposition MPs including NCP's Sharad Pawar and Congress' Mallikarjun Kharge stage protest in front of Gandhi Statue in Parliament premises, after the suspension of 92 MPs for the remainder of the ongoing winter session pic.twitter.com/WKzk0xa1TP — ANI (@ANI) December 19, 2023 పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ పార్లమెంట్ సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల ఆగ్రహం మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు సస్పెండైన ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు నేడు పార్లమెంటులో కీలక బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు నిన్న విపక్ష ఎంపీల సస్పెన్షన్ తో సాఫీగా సభా కార్యక్రమాలు జరిగే చాన్స్ సస్పెన్షన్పై పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టనున్న విపక్ష ఎంపీలు లోక్ సభలో బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు ఐపీసీని భారత న్యాయ సంహితగా పేరు మార్పు సిఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహితగా చేంజ్ ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా నామకరణం కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన హిందీ పేర్లతో వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందంటున్న విపక్షాలు -
Parliament security breach: భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి పొగపెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ ఆదివారం అభివరి్ణంచారు. గత బుధవారం జరిగిన ఈ ఘటనపై ఓ హిందీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తొలిసారిగా స్పందించారు. ‘‘పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమే. ఈ ఘటన నన్నెంతగానో బాధించింది. దీనిపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగడం వ్యర్థం. ఈ చొరబాటు వెనుక ఉన్న శక్తుల గుట్టుమట్లు బయటపెడతాం. ఇవి పునరావృతం కాకుండా ఉమ్మడిగా పరిష్కారం కనుగొందాం’’ అని సూచించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లలో ముఖ్యమంత్రులైన వారు కొత్తవాళ్లు కాదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో 370ను ఎవరూ ఎప్పటికీ తిరిగి అమల్లోకి తేలేరన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేయబోతోంది. ఇకనైనా విపక్ష పారీ్టలు తమను ప్రజలు ఎందుకు గెలిపించట్లేదనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది’ అని సూచించారు. ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్ లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులకు లోక్సభలోకి పాస్లిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. కాలిన ఫోన్లు స్వా«దీనం లోక్సభలో కలకలం ఘటనలో నిందితుల తాలూకు కాలిన ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఘటన సూత్రధారి లలిత్ ఝా బసచేసిన రాజస్తాన్లోని నాగౌర్లో అవి లభించాయి. వాటిని కాల్చేయడంతో సాక్ష్యాధారాల ధ్వంసం సెక్షన్లను ఎఫ్ఐఆర్కు జతచేశారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్లను అరెస్ట్ చేసి కఠిన ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం తెలిసిందే. లోక్సభ ఛాంబర్లో మనోరంజన్, సాగర్శర్మ, పార్లమెంట్ ప్రాంగణంలో నీలం దేవి, అమోల్ షిండే పొగ గొట్టాలు విసిరి కలకలం రేపడం తెలిసిందే. సంబంధిత వీడియోలను వైరల్ చేయాలంటూ లలిత్ తన మిత్రుడు సౌరవ్కు పంపాడు. తర్వాత రాజస్థాన్లోని నాగౌర్లో తమ ఫోన్లను తగలబెట్టాడు. ఢిల్లీ వచ్చి లొంగిపోయాడు. -
14 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల నిరసన.. ఉభయసభలు వాయిదా
-
దాడి ఘటనపై లోక్ సభలో గందరగోళం..సభ వాయిదా
-
ప్రతిపక్షాలకి రోజా కౌంటర్
-
రాజకీయ పొత్తులను నియంత్రించలేం: ఈసీ
న్యూఢిల్లీ: రాజకీయ పొత్తులను నియంత్రించేందుకు చట్టపరంగా తమకు ఎలాంటి అధికారమూ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టుకు ఈసీ సోమవారం ఈ మేరకు తన స్పందన తెలియజేసింది.‘‘మాకు పారీ్టల నమోదుకు, ఎన్నికల నిర్వహణకు మాత్రమే అధికారముంది. అంతే తప్ప రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పొత్తులకు నియంత్రిత కూటములుగా గుర్తింపునిచ్చే అధికారం కూడా లేదు. పైగా కేరళ హైకోర్టు గత తీర్పు మేరకు ఈ కూటములను చట్టబద్ధమైన సంస్థలుగా కూడా పరిగణించలేం’’ అని వివరించింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం తాలూకు చట్టబద్ధత తమ పరిధిలోని అంశం కాదని వివరించింది. విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ గిరీశ్భరద్వాజ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ప్రతిపక్షాలకు మంత్రి రోజా అదిరిపోయే కౌంటర్
-
విపక్షాలకు విజన్ లేదు, రోడ్మ్యాప్ లేదు
జైపూర్/గ్వాలియర్: దేశ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలకు ఒక విజన్ లేదని, రోడ్మ్యాప్ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం రాజస్తాన్, మధ్యప్రదేశ్లో పర్యటించారు. రాజస్తాన్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓటమిని ముందే అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయొద్దని, ఎప్పటిలాగే కొనసాగించాలని, ఆ మేరకు గ్యారంటీ ఇవ్వాలని గహ్లోత్ ఇటీవల కోరారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందన్న సంగతి గహ్లోత్కు తెలిసిపోయిందని అన్నారు. మోదీ రాజస్తాన్లో రూ.7,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శాన్వాలియా శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తోర్గఢ్లో బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు మేలు చేకూర్చే ఏ పథకాన్నీ తాము రద్దు చేయబోమని, పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని తేలి్చచెప్పారు. భారత్ విజయాలను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి ప్రతిపక్షాలు అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఒక విజన్ గానీ, రోడ్మ్యాప్ గానీ లేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. మోదీ మధ్యప్రదేశ్లో రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. గ్వాలియర్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు ప్రశంసలు దక్కుతున్నాయని, ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలకు కేవలం అధికారం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. -
పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు
లక్నో: బహుజన్ సమాజ్వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్లోనూ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ సభ్యులు అందరూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్ధులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా వెనకాడవని ప్రతి దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దీని కారణంగా మన ఎన్నికల ప్రణాళిక దెబ్బ తినకూడదని అన్నారు. అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై స్పందిస్తూ.. వారి పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం వంటి సమస్యలతో సహా ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో వారి వ్యవహారం ఉంటుందని అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రిజర్వేషన్ను ప్రతిపాదికగా తీసుకోకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బుల్డోజర్ యాక్షన్లపై ఆమె స్పందిస్తూ ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదని పూర్తి ప్రజా వ్యతిరేక విధానమని అన్నారు. 01-10-2023-BSP PRESS NOTE-UP MEETING pic.twitter.com/PVgb7KdhiA — Mayawati (@Mayawati) October 1, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన -
బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం
భోపాల్/జైపూర్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్ నక్సలైట్లకు ఔట్సోర్సింగ్కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ దివాలా తీసింది కాంగ్రెస్ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్లో కాంగ్రెస్ను గద్దె దించాలి రాజస్తాన్లో సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్ రాజధాని జైపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్ సంకల్ప్ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు. -
ఇండియా కూటమిపై సీఎం ఏక్నాథ్ షిండే సెటైర్లు..
ముంబై: ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి మూకుమ్మడిగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జతకట్టడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందిస్తూ గొర్రెలు, మేకలు సింహం లాంటి ప్రధాని నరేంద్ర మోదీని ఏమీ చేయలేవని అన్నారు. వాళ్ళు గొర్రెలు, మేకలు సోమవారం ఒక మీడియా ఛానల్తో మాట్లాడిన ఏక్నాథ్ షిండే ప్రతిపక్షాలు గురించి ఒకే మాటలో తేల్చేశారు. ప్రతిపక్షాల గుంపును నేను రాబందులని పిలవను కానీ వారు గొర్రెలు, మేకలతో సమానం అన్నారు. అలాంటి మేకలు, గొర్రెలు ఎన్ని వచ్చినా అడవిలో సింహంలాంటి ప్రధానిని ఏమీ చేయలేవని అన్నారు. కనుచూపుమేరలో కూడా లేరు.. రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమైన విషయాన్ని ప్రస్తావించగా వారంతా ఏకమై ప్రధానిని ఓడిద్దామనుకుంటున్నారు.. అది వారి మనసులో ఆలోచన తప్ప వారెక్కడా ఆయన దరిదాపుల్లో కూడా లేరు. ఎన్నికల్లో వారు కనీసం పోటీనిస్తారని నేననుకోవడం లేదన్నారు. దేశంలోనే అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ 80 మంది పార్లమెంటు సభ్యులను లోక్సభకు పంపించనుండగా మహారాష్ట్ర 48 మంది సభ్యులను లోక్సభకు పంపిస్తూ రెండో స్థానంలో ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే ప్రతిపక్షాలు మాకు దగ్గర్లోనే లేరని అన్నారు. మళ్ళీ మేమే.. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే అజిత్ పవార్ మాతో కలిసిన తరువాత మా బీజేపీ-శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి బలం 215కు చేరింది. మా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వానికి ఢోకానే లేదని అన్నారు. బాల్ థాక్రే వారసులుగా మేము ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఉన్నాము. తమ కోసం పనిచేసే వారు కావాలో లేక ఇంట్లో కూర్చుని ఉండే నేత(ఉద్ధవ్ థాక్రే) కావాలని కోరుకుంటారో అదంతా ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: Parliament Special Sessions:సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం -
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అక్టోబర్లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
Advertisement