-
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్గా, గాలి కార్భన్ను కాథోడ్గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
Lotus: కుండీల్లో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేలు
కొలనుల్లో తామరలు సూర్య నమస్కారాలు చేస్తాయి. దొరువుల్లో కలువలు చంద్రునికి మోహలేఖలు రాస్తాయి. కాని అవి పాత రోజులు. ఇప్పుడు ఇళ్లల్లో అలంకరణ కోసం తామరలు కొని నీటి తొట్లలో వదులుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? కేరళలో అంజలి లాంటి స్త్రీలు కుండీల్లో, ప్లాస్టిక్ తొట్లలో తామరలను పెంచి అమ్ముతున్నారు. దాదాపు 40 రకాల తామరలు ఉన్నాయి. 300 నుంచి ఒక్కో పువ్వు 4000 రూపాయల వరకూ పలుకుతాయి. నెలకు 30 నుంచి 50 వేలు సంపాదిస్తూ ఉంది అంజలి. కోవిడ్ వల్ల ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా అది అంజలికి తామరలు కూడా పూయించింది. కేరళలోని పాలక్కాడ్కు చెందిన 28 ఏళ్ల అంజలిని చూడండి. కోవిడ్ కాలంలో భర్తకు సంపాదన పోవడంతో తామరలను నమ్ముకుంది. ముందు మిద్దె మీద పెంచింది. ఆదాయం బాగుండటంతో ఇప్పుడు 20 సెంట్ల భూమి సంపాదించి అక్కడ తామరలు పెంచుతోంది. అన్నీ కుండీల్లోనే. లేకుంటే ప్లాస్టిక్ టబ్బుల్లో. దీనిని ‘నీటి తోట’ అనొచ్చు. నీటి మొక్క తామర. దీనితో పాటు కలువ. అంజలి జీవితం ఇప్పుడు మూడు కలువలు ఆరు తామరలుగా సాగిపోతోంది. వేసిన 15 రోజులకే పూస్తుంది ‘ముందు నాటు రకం తామరలు పెంచాను. అవి ఏడాదికి కాని పూలు పూయవు. ఇలా కాదని హైబ్రిడ్ తామరలను పెంచడం నేర్చాను. కొన్ని హైబ్రిడ్ తామర మొక్కలు నెలకే పూస్తాయి. వీటిని థాయ్లాండ్ వాళ్లు డెవలప్ చేశారు. అమిరి కెమిలియా అనే తామర రకం ఉంది. అదైతే వేసిన 15 రోజులకే పూస్తుంది. ఇప్పుడు నా తామర సాగులో దాదాపు 40 రకాలు ఉన్నాయి’ అంటుంది అంజలి. ఆమెకు పూలు పూయించడంతో పాటు ప్రచారం చేయడం కూడా వచ్చు. ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఆ తామర మొక్కలు, పూలు ఫోటోలు పెడుతుంది. మొదట కేరళ నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘తామరలు దుంపవేరు నుంచి వస్తాయి. దుంపవేర్లు కొనేవాళ్లు ఉంటారు. కాని వాటిని పెంచడం తెలియాలి. కొందరు నేరుగా మొక్కలు కొంటారు. అవి కొన్న తర్వాత పది రోజులకు మించి బతకవు. అందుకని వెంటనే వాడుకోవాల్సి ఉంటుంది. కొందరు ఒట్టి పూలే కొంటారు’ అంటుంది అంజలి. రూ. 4000 పెడతారు కూడా! నాటు తామరలకు రెక్కలు తక్కువ ఉంటాయి. హైబ్రిడ్ తామరలకు రెక్కలు ఎక్కువ. ‘మిరకిల్’ అనే వెరైటీలో పువ్వుకు 700 రెక్కలు ఉంటాయి. ఇక సహస్రదళపద్మానికి డిమాండ్ జాస్తి. దీనిలో వేయి రెక్కలు ఉంటాయి. ‘బుద్ధ పద్మం’, ‘దుర్గపద్మం’ అని చాలా రకాలే ఉన్నాయి. ‘పసుపు రంగు తామరలకు బాగా గిరాకీ ఉంది. ఒక్కో మొక్కకు రూ. 4000 పెట్టడానికి కూడా సిద్ధమవుతారు’ అంటుంది అంజలి. నెలకు యాభైవేల వరకు సంపాదన ఆమె దగ్గర పూలు, దుంపవేర్లు, మొక్కలు రకాన్ని బట్టి 300 నుంచి మొదలవుతాయి. నెలకు అన్ని రకాలూ 100 పూల వరకూ అమ్ముతుంది. అన్నీ కుదిరితే 50 వేలు కూడా సంపాదిస్తుంది. వీటితోపాటు కలువలు కూడా సాగు చేస్తుంది. వాటి మీద ఆదాయం కూడా బాగుంది. ‘మొక్కలను జాగ్రత్తగా చూడాలి. తామరకు బాగా ఎండ తగలాలి. నీటి కుండీల్లో దోమలు చేరకుండా గుప్పీ చేపలను వదిలితే మంచిది’ అంటుంది అంజలి. తన దగ్గర మొక్కలు కొన్నవారికి వాటిని ఎలా సంరక్షించాలో చెబుతుంది. ఇప్పుడు శ్రీమంతులే కాదు మధ్యతరగతి వారు కూడా ఇంటి ముంగిలిలో ఒక తామరతావును లేదా పూలను అలంకరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ సాగు నేర్చితే మహిళలు ఇంటి దగ్గరి నుంచే ఆదాయం గడించవచ్చు. చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం
పాలక్కడ్: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. బేస్లియస్ స్కూల్కు చెందిన 10, 11, 12వ తరగతి విద్యార్థులను టూర్కు తీసుకెళ్లిన బస్సు.. ఓవర్ స్పీడ్తో ఓ కారును ఓవర్టేక్ చేయబోయే ప్రయత్నంలో అదుపు తప్పింది. అంజుమూర్తీ మంగళం బస్టాప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆపై అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. వలయార్-వడక్కన్చెర్రి జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గం. తర్వాత ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైంలో జోరుగా వాన కురుస్తోందని అధికారులు తెలిపారు. టూరిస్ట్ బస్సులో 41 మంది చిన్నారులు, ఐదుగురు టీచర్లు, బస్సుకు సంబంధించి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని, 28 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఆర్టీసీ బస్సు కొట్టారక్కరా నుంచి కొయంబత్తూరు రూట్లో వెళ్తోంది. ప్రమాదం తీవ్రమైంది కావడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు పాలక్కడ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వానలో టూరిస్ట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. Kerala | 9 people died while 38 were injured after a tourist bus crashed into Kerala State Road Transport Corporation (KSRTC) bus in Vadakkenchery in Palakkad district: State minister MB Rajesh — ANI (@ANI) October 6, 2022 ఇదీ చదవండి: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు -
వాట్ ఏ ప్రిస్క్రిప్షన్.. ఈజీగా చదివేయొచ్చు: వైరల్
ఒంట్లో బాగోలేదని డాక్టర్ వద్దకు పోతే పరీక్షలన్ని నిర్వహించి ఏవో మందులు రాసిస్తారు జౌనా!. ఐతే ఆ మందుల చీటి చూస్తే మనకేం అర్థం కాదు. చదువకున్న వాడికైనా కాస్త పరీశీలించి చూస్తే ఏదో కొంచెం అర్థమవుతుందే తప్ప ఒక పట్టాన అర్థమైతే కాదు. కేవలం మందుల షాపు వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఐతే ఇక్కడో ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన మందుల పేర్లు ఎవరైన ఈజీగా చదివేయొచ్చు. ఎందుకంటే అంత నీట్గా సులభంగా అర్థమైరీతీలో చాలా క్లియర్గా రాశాడు. వివరాల్లెళ్తే...కేరళకు చెందిన డాక్టర్ నితిన్ నారాయణ పాలక్కడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పీడియాట్రిక్(చిన్న పిల్లల డాక్టర్)గా పనిచేస్తున్నాడు. ఆయన గత మూడేళ్లుగా అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను ఎంత బిజీగా ఉన్న ఇలానే బ్లాక్ లెటర్స్(క్యాపిటల్ లెటర్స్)లోనే రాస్తానని అంటున్నాడు. తాను బాల్యం నుంచే గుడ్ హ్యండ్ రైటింగ్ స్కిల్స్పై దృష్టిసారించినట్లు చెబుతున్నాడు. మిగతా డాక్టర్లు బిజీగా ఉండటం వల్ల కుదరదని కానీ తనకు చిన్నప్పటి నుంచి ఇలా నీట్గా రాయడం అలవాటు కాబట్టి రాయగలుగుతున్నానని తెలిపాడు. ఆ డాక్టర్కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ చీటి ఫోటో తీసి బెన్సీ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రను కూడా ఆకర్షించింది. ఆయన కూడా ఈ వైరల్ ఫోటోని షేర్ చేస్తూ అతని విభిన్న విద్యా విధానాన్ని తేటతెల్లం చేస్తుంది. స్కూల్ లెవల్ నుంచి దృష్టి సారిస్తేనే ఇలా రాయగలం అంటూ ఆ డాక్టర్ని ట్విట్టర్లో ప్రశంసించారు. (చదవండి: భావోద్వేగ దృశ్యం.. రాహుల్ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి) -
అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్
పాలక్కడ్ (కేరళ): కుబేరుల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ, రైతులు, చిన్న వ్యాపారులను రుణాల పేరిట వేధిస్తున్న మోదీ అవినీతి సర్కార్పై పోరాటమే భారత్ జోడో యాత్ర అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం యాత్ర 19వ రోజు పాలక్కడ్ జిల్లా కొప్పమ్లో పార్టీ మద్దతుదారులు, గిరిజన యువతతో రాహుల్ భేటీ అయ్యారు. బీజేపీ సర్కారు తెర తీసిన రెండు రకాల హిందుస్తాన్ పాలనను దేశం సహించబోదన్నారు. గిరిజన వైద్యాన్ని కేంద్రం ఆయుష్లో భాగం చేయాలని, గిరి పుత్రుల స్కూల్, కాలేజీ డ్రాప్ఔట్స్ తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గిరిజనులు రాహుల్తో అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
బాస్కెట్బాల్ జాతీయ పోటీలకు ఏలూరు క్రీడాకారులు
టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్ చేయాలి
జగనన్న గెలుపులో భాగస్వాములవుదాం
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ప్రశాంతంగా నీట్ పరీక్ష
వైఎస్సార్సీపీలోకివలసలవరద
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
కాకర్ల విజయం క్లిష్టమే..!
నోటుతో ఓటుకు ఎర
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement