-
ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం.. ఇద్దరి అరెస్ట్
చెన్నై: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్ను క్యాష్ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్ బెడిసి కొట్టింది. కడలూరు నియోజకవర్గంలో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్ బచ్చన్ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్ ప్రకటించాడు. దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్పై విడుదల చేశారు. ఇదీ చదవండి.. పిల్లి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత్యువాత -
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
పంజరంలో చిలుకలా ఈసీ: రౌత్
ముంబై: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘం కూడా పంజరంలో చిలుకలా మారిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనం కలి్పస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే చెబుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. అదే హామీ విపక్షాలు ఇస్తే వెంటనే షోకాజ్ నోటీసులిచ్చేది’’ అంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన వ్యాసంలో రౌత్ విమర్శించారు. మోదీ హయాంలో భారత క్రికెట్ పూర్తిగా ఆయన స్వరాష్ట్రం గుజరాత్కు తరలిపోయిందని ఆరోపించారు. ‘‘గతంలో దేశ క్రికెట్కు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇప్పుడంతా అహ్మదాబాద్మయం! ప్రపంచ కప్ ఫైనల్ కూడా అక్కడే జరుగుతోంది! స్వీయ రాజకీయ లబ్ధి కోసం చివరికి క్రికెట్ను కూడా కూడా మోదీ సర్కారు పొలిటికల్ ఈవెంట్గా మార్చేసింది’’ అని ఎద్దేవా చేశారు. -
చైనా చిలుక.. స్కేటింగ్ చేస్తుందోయ్.!
-
ఈ చిలుక తెలివి చూస్తే షాక్ అవుతారు...
-
నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు
భోపాల్: సాటి మనిషి మీద దయ చూపని ఈ సమాజంలో కొందరు మాత్రం జంతువులు మీద కూడా అంతులేని ప్రేమను చూపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ఉత్తరప్రదేశ్లో సరస్ క్రేన్, ఒక వ్యక్తి మధ్య స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్లోని దామోహ్ నుండి ఈ తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీపక్ సోనీ తన తప్పిపోయిన చిలుక కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. అంతేకాకుండా తన చిలుక ఆచూకీతో తెలిపితే ₹ 10,000 నగదు బహుమతిని అందజేస్తూ, పట్టణం అంతటా పోస్టర్లు వేశాడు. తప్పిపోయిన పక్షిని కనుగొనే ప్రయత్నంలో నగరం అంతటా పోస్టర్లు అంటించేందుకు అతను ఒక ఆటోరిక్షా డ్రైవర్లకు సహాయం తీసుకున్నాడు. అందుకు వారికి డబ్బులు కూడా చెల్లించాడు. ‘గత నెలలో ఎగిరిపోయి దానికదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. ఇంకా తిరిగి రాలేదు. వీధి కుక్కలు దానికేమైనా హాని చేశాయోనని భయపడుతున్నాము. చిలక అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. దాని ఆచూకీ తెలిపిన వారికి పదివేలు, అంతకంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధం. దానిని కనుగొన్న వారు నా నంబర్కు కాల్ చేయగలరు ’ అని వారి ప్రాంతంలో పోస్టర్లు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్గా మారింది. -
సైంటిస్ట్ల అద్భుతం.. ఎడాపెడా వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్న చిలుకలు!
రామచిలుకలు మాట్లాడగలుగుతాయి. మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి పలుకుతాయి. ఈ చిలక పలుకులు మనకు తెలిసినవే! హైటెక్ కాలంలోని రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ కూడా చేసేస్తున్నాయి. ఎవరికంటారా? వాటి తోటి పక్షి నేస్తాలకే! మాటలు నేర్చుకునే చిలుకలు, నేర్పిస్తే వీడియోకాల్స్ చేయడం ఎందుకు నేర్చుకోలేవు అనుకున్న శాస్త్రవేత్తలు కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం నేర్పించారు. ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఇటీవల కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు విజయవంతంగా వీడియోకాల్స్ నేర్పించారు. చదవండి👉 దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి? ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని మరచిపోగలుగుతున్నాయని, తోటి నేస్తాలతో ముచ్చట్ల ద్వారా అవి ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముద్దుముద్దుగా పసిపిల్లలు అమ్మా.. అని పిలిస్తే చిలక పలుకులంటూ.. మురిసిపోతాం. అలాంటిది, నిజంగానే రామచిలుకే అమ్మా.. అంటుంటే.. కుటుంబ సభ్యుల్ని వారి పేర్లతో పిలుస్తుంటే.. ఆ ఆనందమే వేరు. వివరాలివి. సిద్దిపేట హౌసింగ్ బోర్డుకాలనీలోని జర్నలిస్ట్ వీధిలో కూతురు రాజిరెడ్డి, వనజ రెడ్డిల ఇంటి పైకి రోజూ ఓ రామచిలుక వచ్చి సందడి చేస్తోంది. నెల రోజులుగా రోజూ ఉదయం 6గంటలకే వచ్చి కుటుంబ సభ్యులను నిద్ర లేపుతుంది. చిన్నారులతో ఆడుకుంటుంది. వనజరెడ్డిని అమ్మా.. అని, పిల్లలను టింకు.. అని పిలుస్తుంది. ఎత్తుకో, టాటా, బాయ్ అంటుంది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, కాలనీవాసులు సంబరపడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 7.30 గంటల వరకు ఉండి పాలు, నీరు తాగుతుంది. జామ, మామిడి, ఆపిల్, తదితర పండ్లు, బిస్కెట్లు తిని వెళ్లిపోతుంది. సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి మళ్లీ 6 గంటల వరకు తిరిగి వెళ్లిపోతుంది. ఈ చిలుక ఎక్కడి నుంచి వస్తుంది...ఎక్కడికి పోతుందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నెల రోజులుగా ఈ రామచిలుక రాజిరెడ్డి, వనజరెడ్డిల కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోయింది. శ్రీరాముడే వచ్చినట్టుంది రామచిలుక రోజూ మా ఇంటికి వచ్చి అమ్మా. అని పిలుస్తుంటే సంతోషంగా ఉంది. శ్రీ రామనవమి ముందు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి.. శ్రీ రాముడే వచ్చినట్టు అనిపిస్తోంది. – వనజరెడ్డి, సిద్దిపేట -
లైసెన్స్ ఇచ్చి నల్లమందు సాగు చేయిస్తుంటే..చిలుకలు దొంగలిస్తున్నాయ్!
ప్రతి ఏడాది అక్కడ పెద్ద మొత్తంలో నల్లమందును సాగు చేస్తారు. అయితే రైతుల ఉత్పత్తిని అంతా చిలుకలు దొంగలించేస్తున్నాయ్. దీంతో రైతులు దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతి ఏడాది చిలుకలు పెద్ద మొత్తంలో ఈ నల్లమందును ఎత్తుకుపోతున్నట్లు తెలిపారు రైతులు. వాస్తవానికి మధ్యప్రదేశ్లోని మందసౌర్, నీముచ్, రత్లాం జిల్లాలో నల్లమందు సాగు చేస్తారు. అందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సాగుకు లైసెన్సులు ఇస్తుంది. ఈ పంటను పర్యవేక్షించే బాధ్యతలన్నింటిని బ్యూరో తీసుకుంటుంది. నల్లమందు పంటను జనవరి, మార్చి మధ్యలో సాగు చేస్తారు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కూరగాయాల మార్కెట్లలో కూడా విక్రయిస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ప్రజలు వాటి విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అంతేగాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రైతుల నుంచి నల్లమందును కొనుగోలు చేస్తుంది. ఈ నల్లమందును ఉపయోగించి కొన్ని గుండె, రక్తం, నిద్రకు సంబంధించిన మందుల తయారీలో వినయోగిస్తారు. ఇటీవల ఈ చిలుకల దాడి కారణంగా నల్లమందు సాగులో రైతులు ఎక్కువుగా నష్టపోతున్నారు. ఈ విషయంలో పోలీసుల సైతం ఏం చేయలేమని చెప్పడంతో ప్లాస్టిక్ వలలను అమర్చడం ప్రారంభించారు. దీంతో ఆ చిలకలు కూడా నల్లమందు కాయలను అందించుకోవడం సాధ్యం కాక నిలబడి ఉన్న పంటకు నష్టం చేయడం ప్రారంభించాయి. (చదవండి: ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..) -
ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన
సాక్షి, బెంగళూరు(తుమకూరు): కొన్నిరోజుల క్రితం తమకు ఇష్టమైన రామచిలుకను పోగొట్టుకొని దానిని పట్టుకోవడం కోసం రూ.80 వేల నజరానా ప్రకటించిన తుమకూరు వాసి కథ తెలిసే ఉంటుంది. అర్జున్, రంజన దంపతులు కొన్నేళ్లుగా బూడిద రంగు రామచిలుకలను ఎంతో మురిపెంగా పెంచుకుంటున్నారు. వాటికి రుస్తుమా, రియో అనే పేర్లు పెట్టి నిత్యం రకరకాల పండ్లతో పోషిస్తున్నారు. ఇటీవల రుస్తుమా ఎక్కడికో ఎగిరిపోయింది, దానిని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పట్టించినవారికి రూ. 80 వేల బహుమానాన్ని ప్రకటించగా, ఓ వ్యక్తి దానిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఉదంతం దేశమంతటా వార్తల్లో నిలిచింది. ఇక వాటిని గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మృగాలయానికి ఇచ్చేస్తామని తెలిపారు. తరచూ ఎగిరిపోతుంటే ఇబ్బందిగా ఉందని చెప్పారు. చదవండి: (లవర్తో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య) -
పక్కింటి చిలుక గోల తట్టుకోలేకపోతున్న కాపాడండి సార్!
ముంబై: రామ చిలుక అంటే ఎవరైనా ఇష్టపడతారు. వీలుంటే దానిని ఒకసారి చేతిలోకి తీసుకుని ముద్దాడాలని అనుకుంటారు. కొందరు వాటిని ఇళ్లల్లో పెంచుకుంటారు. ఎంతో గారాబంగా చూసుకుంటారు. దాని అరుపులు, చేష్టలకు మురిసిపోతుంటారు. కానీ, ఓ వృద్ధుడికి అదే నచ్చలేదు. రామ చిలుక అరుపులు తనకు చికాకు తెప్పించాయి. పక్కింటి రామ చిలుక గోల తట్టుకోలేకపోతున్న కాపాడండి సార్.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పుణెలోని శివాజీనగర్ ప్రాంతంలోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్లో నివాసం ఉంటున్నారు సురేశ్ షిండే అనే 72 ఏళ్ల వ్యక్తి. ఆయన పక్కింట్లో అంటున్న అక్బర్ అమ్జద్ ఖాన్ అనే వ్యక్తి రామ చిలుకను పెంచుకుంటున్నాడు. అది ఎప్పుడూ అరుస్తూనే ఉందని, అది వృద్ధుడికి చికాకు తెప్పించినట్లు పోలీసులు తెలిపారు. ‘షిండే ఫిర్యాదుతో చిలుక యజమానిపై మనశ్సాంతి లేకుండా చేయటం, బెదిరింపుల వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నిబంధనల ప్రకారం ఈ కేసు దర్యాప్తు చేపడతాం.’ అని ఖడ్కి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ! -
చిలుకను తెచ్చిచ్చినందుకు రూ.85 వేల నజరానా
తుమకూరు: ఇంట్లో ఎంతో అపురూపంగా పెంచుకునే కుక్కలు, పక్షులు వంటి జంతువులు తప్పిపోతే వాటి యజమానుల బాధ వర్ణనాతీతం. పగలూ రేయి నిద్రాహారాలు మానేసేవారు ఉన్నారు. అదే కోవకు చెందిన ఓ యజమాని తప్పిపోయిన చిలుకను తెచ్చిచ్చిన వ్యక్తికి రూ.85 వేల బహుమానాన్ని అందించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు నగరం జయనగరలో జరిగింది. అర్జున్ అనే వ్యక్తి అరుదైన 2 ఆఫ్రికన్ బూడిద రంగు రామచిలుకలను ఇంట్లో పెంచుకుంటున్నాడు. వాటికి ఏటా ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపేవాడు. వారం కిందట అందులోని ఒక చిలుక ఎగిరిపోయింది. దీంతో అర్జున్ చిలుకను పట్టిస్తే రూ.50 వేల నజరానా ఇస్తానని పోస్టర్లు వేయించాడు. ఫలితం లేకపోవడంతో ఆ బహుమానాన్ని రూ. 85 వేలకు పెంచాడు. శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ అనే వ్యక్తి బుట్టలో చిలుకను తీసుకువచ్చి అర్జున్కు ఇచ్చాడు. రోడ్డుపై పడి ఉంటే ఇంటికి తీసుకెళ్లి పరిచర్యలు చేశానని పోస్టర్లను చూసి మీ దగ్గరకు పట్టుకువచ్చానని అర్జున్కు చెప్పాడు. దీంతో మాట ప్రకారం శ్రీనివాస్కు రూ.85 వేల నగదును అర్జున్ అందజేశాడు. -
రుస్తంను కనిపెట్టాడు.. జాక్పాట్ కొట్టాడు
వైరల్: రుస్తం.. పర్షియన్ పురాణాల్లో ఓ వీరుడి పేరు. అలాంటి పేరును ఇక్కడో వ్యక్తి తాను ప్రేమగా పెంచుకున్న చిలుకకు ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ.. అది కనిపించకుండా పోయేసరికి అల్లలాడిపోయాడు. ఆచూకీ చెప్పినా.. తెచ్చి ఇచ్చినా మంచి పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు పోస్టర్లతో పాటు నగరం అంతటా ప్రకటన ఇచ్చాడు. కనిపించకుండా పోయిన తను రుస్తంను పట్టి తెచ్చిస్తే యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించాడు కూడా. ఆ ప్రకటన చూసి శ్రీనివాస్ అనే ఓ స్థానికుడు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఫలితంగా.. రుస్తం దొరక్కగా.. ఓ ఓనర్ మరో 35 వేల రూపాయలను అదనంగానే ఇచ్చాడు. కర్ణాటక తుమ్మకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జున్ అనే వ్యక్తి ఓ ఆఫ్రికన్ చిలుకను రెండున్నరేళ్లుగా పెంచుకుంటున్నాడు. దానికి రుస్తం అని పేరు పెట్టారు. అది ఆ కుటుంబంతో మమేకం అయిపోయింది. అయితే జులై 16వ తేదీ ఇంట్లోంచి ఎగిరిపోయి.. అది మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అర్జున్ ఒక ప్రకటన ఇచ్చాడు. అయితే ఆ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో చెట్లలో గాయపడి.. ఆకలితో, భయంతో ఉన్న తన రుస్తంను శ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారని, అందుకే అదనంగా పారితోషకం ఇచ్చానని అర్జున్ చెప్తున్నాడు. ఇన్స్టంట్ అదృష్టం కూడా ఊరికే రాదు.. అందుకూ ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందే అని అంటున్నారు ఈ ఘటన చూసిన కొందరు. -
భలే ఆఫర్.. ఆ చిలును తెచ్చిస్తే రూ. 50వేలు ఇస్తారట..
తుమకూరు: ఒకప్పటి పాత సినిమాలలో మాంత్రికుని ప్రాణం ఏడు సముద్రాల అవతల ద్వీపంలో ఉన్న చిలుకలో ఉంటుందని కథ సాగుతుంది. ఆ చిలుక కోసం కథానాయకుడు వేట సాగిస్తాడు. అంత కాకపోయినా ఇక్కడ చిలుకను పడితే రూ.50 వేలు కానుక పొందవచ్చు. తుమకూరు నగరంలోని జయనగర లేఔట్లో నివసిస్తున్న ఒక కుటుంబం రెండు చిలుకలను పెంచుతోంది. ఏటా చిలుకల జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవల ఒక చిలుక ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ పక్షి కోసం పగలూ రాత్రి గాలిస్తున్నారు. అయినా ఆచూకీ లభించలేదు. రెండున్నర ఏళ్లుగా ఎంతో ప్రేమగా సాకుతున్న చిలుక తప్పిపోయిందని, దానిని వెతికి తీసుకువస్తే రూ. 50 వేల బహుమతిని అందిస్తామని సదరు కుటుంబం ప్రకటించింది. నగరంలో అక్కడక్కడ బ్యానర్లు కట్టారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. More Video for Missing Parrot -#Tumakuru: A family that rears parrots at home in Tumakuru has announced Rs 50,000 cash for those who can find their favourite bird which went missing.#Karnataka #Missing #Tumakuru pic.twitter.com/C2vfbxz3UU — Chaudhary Parvez (@ChaudharyParvez) July 19, 2022 -
రుస్తుమా ఎగిరిపోయింది.. కనిపెట్టిన వారికి రూ.50వేల నజరానా
బెంగళూరు: ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎగిరిపోయిందని బాధపడుతోంది కర్ణాటక తుమకూరుకు చెందిన ఓ కుటుంబం. ఇంట్లో ఓ కుటుంబసభ్యుడిగా ఉన్న చిలుకను బాగా మిస్ అవుతున్నట్లు చెబుతోంది. దాని ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటన కూడా ఇచ్చారు కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తుమకూరు వ్యాప్తంగా అతికించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'మా చిలుక కన్పించడం లేదు. దానికి మాకు చాలా అనుబంధం ఉంది. మీకు ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి. రూ.50 వేలు ఇస్తాం. మీ ఇంటి బాల్కనీ, కిటీకీలు వెతకండి' అని చిలుక యజమానులు పల్లవి, అర్జున్ ప్రకటనలో తెలిపారు. #Karnataka Family Announces Rs 50K Reward For Finding Missing #Parrot #Trending #Viralvideo #India pic.twitter.com/cTVRLVjlKZ — IndiaObservers (@IndiaObservers) July 19, 2022 వీరిది జంతు ప్రేమికుల కుటుంబం. కొన్నేళ్లుగా ఆఫ్రికాకు చెందిన రెండు చిలుకలను పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకటి శనివారం నుంచి కన్పించడం లేదు. దాని పేరు రుస్తుమా. అది ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని వీళ్లు భావిస్తున్నారు. రెండున్నరేళ్లకుపైగా ఈ చిలుక వీళ్లతో ఉంది. రెండుసార్లు దానికి ఘనంగా పుట్టినరోజు వేడుక కూడా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’
చాలా మందికి పెంపెడు జంతువులు అంటే ప్రాణం. వాటిని ఇంట్లో పెంచుకోవడానికి తెగ ఇష్టపడతారు. వాటికి ఏలోటు రాకుండా మనుషులతో సమానంగా చూసుకుంటారు. ఎక్కువగా కుక్కలు, పిల్లలు, కొంతమంది చిలుకలు కూడా పెంచుకుంటారు. పెంపుడు జంతువులు కూడా తమ యజమానులపై ఎనలేని ప్రేమను చూపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తాము ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఊరంతా గోడలపై పోస్టర్లు అతికించారు. అంతేగాక చిలుకను పట్టించిన వారికి క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. గయాకు చెందిన శామ్దేవ్ గుప్తా, సంగీత గుప్తా పిప్పరపాటి రోడ్డులో నివసిస్తున్నారు. వీరు గత 12 ఏళ్లుగా ‘పోపో’ అనే చిలుకను పెంచుకుంటున్నారు. అ క్రమంలో గత నెల ఏప్రిల్ 5న ఆ చిలుక తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిలుక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని, అయినా అది దొరకడం లేదని వాపోయారు. ఎవ్వరికీ అయినా కనిపిస్తే తమకు అప్పగించాలని కోరుతున్నారు. చిలుకను ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరమితం కాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తన పక్షిని తీసుకెళ్తే దయచేసి తమకు అప్పగించాలని కోరారు. వారికి అదనంగా మూడు పక్షలు కొనిస్తానని ఆఫర్ ఇచ్చారు. అది కేవలం పక్షి మాత్రమే కాదని తమ కుటుంబంలో ఓ సభ్యడని తెలిపారు. -
'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక
టర్నీ: మనం అప్పుడే పుట్టిన నవజాతువు శిశువుల్ని చూడగానే చిన్నతల్లి లేదా చిన్న తండ్రి లేదా మరేదైనా ముద్దు పేరుతో పిలుస్తూ ఆనందిస్తాం కదా. అచ్చం మనిషిలాగేనే టర్కీలోని బుర్సాలో ఒక చిలుక తన పిల్లలను ముద్దు ముద్దుగా పలకరిస్తోంది. కాకాటిల్స్ అనే పక్షి రామచిలుక జాతికి చెందినది. (చదవండి: "సైక్లోథాన్తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") ఈ పక్షి మనుషులను చక్కగా అనుకరించడమే కాక మనం ఏదైన శిక్షణ ఇస్తే అత్యంత సులభంగా నేర్చుకోగలదు. ఇది అత్యంత తెలివైన పక్షి. ఆ చిలుకకు ఇష్టమైన ఆట పికాబు కావడంతో ఆ పేరుతోనే తన పిల్లలను చక్కగా పలకరిస్తోంది. పైగా వాటిని పింగాణి పాత్రలో భద్రపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను నెస్టేక్ కనట్లర్ అనే జంతు ప్రేమికుడు ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. ఎంత చక్కగా తన పిలల్ని పలకరిస్తోందో మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు) -
చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం
వజ్రపుకొత్తూరు: కొబ్బరికాయ నుంచి మొలక బయటకొచ్చి చిలక ఆకారంలో ఆకట్టుకుంటోంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు పంచాయతీ హుకుంపేటలో గ్రామ వలంటీర్ కొండ ఈశ్వరీబాయి తన ఇంట్లో పూజ కోసం కొన్న కొబ్బరికాయ ఇలా చూపరులను ఆకర్షిస్తోంది. చిలక ఆకారంలో ఉండటంతో జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇవీ చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్ నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం -
మొబైల్ ఫోన్ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో
సాధారణంగా మనలో చాలా మందికి ఫోటోలు, సెల్ఫీవీడియోలు తీసుకోవడం అంటే మహసరదా. దీనికోసం ప్రత్యేకంగా తయారై మరీ ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఫోటోలు దిగడానికి ప్రత్యేకమైన ప్రదేశాలకు వేళ్తుంటే.. మరికొంత మంది తమ ఇంట్లో లేదా మిద్దేమీదకో వెళ్లి ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒక్కొసారి కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. మన ఇంట్లోని తినే వస్తువులను కోతులు ఎత్తుకుపోవడం మనకు తెలిసిందే. ఇక్కడో పక్షి ఏకంగా మొబైల్ ఫోన్ను ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి ఇంట్లో మిద్దేమీద తన మొబైల్ ఫోన్ను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఫోటోలు దిగుతున్నాడో.. మరేంటోకానీ.. కాసేపటికి తన ఫోన్ను కాస్త పక్కన ఉన్న పిట్ట గోడ మీద ఉంచాడు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక రామచిలుక వచ్చింది. ఆ ఫోన్ను తినేపదార్థం అనుకుందో.. మరేం అనుకుందో గానీ దాన్ని తన కాళ్ల మధ్యలో పట్టుకొని తుర్రున గాలిలో ఎగిరింది. ఆ వ్యక్తి , వెంటనే ఏదో అలజడి కావడంతో తన ఫోన్ కోసం అటూ ఇటూ చూశాడు. తన మొబైల్ ఫోన్ను ఒక రామ చిలుక తన కాళ్లలో అదిమి పట్టుకుని గాల్లో ఎగిరిపోతుండటాన్ని గమనించాడు. వెంటనే దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికి అది చిక్కలేదు. మొబైల్ ఫోన్ వీడియో ఆన్లోనే ఉండటంతో అది ఆకాశంలో వెళ్తున్నప్పుడు అక్కడి ఇళ్లు, నగరాలు అన్ని దాటుకుంటు ప్రయాణిస్తున్న దృష్యాలు అందులో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని ఫ్రెడ్జ్ స్కూల్జ్ అనే యూజర్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘భలే చిలుక.. పాపం సెల్ఫీ దిగుతామని తీసుకుందేమో..’, ‘ఇది నిజమైన వీడియో కాదు..’, ‘బరువైన సెల్ఫోన్ను చిలుక ఎలా పట్టుకుందబ్బా.. ’, ‘కింద పడకుండా ఎంత బాగా పట్టుకుంది..’, ‘ఆ ఫోన్ మళ్లి మీకు ఎక్కడ దొరికింది’ ?, అంటూ కామెంట్లు పెడుతున్నారు. Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124 — Fred Schultz (@fred035schultz) August 24, 2021 చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
Big Mango: యే దిల్ ‘మ్యాంగో’ మోర్..
సమ్మర్.. అంటే మామిడి పళ్ల సీజన్.. ఒకదాని మీద ఒకటి ఆపకుండా లాగించేసేవాళ్లు ఎందరో.. అయితే, చిత్రంలోని మామిడి పండును మాత్రం ఒకదాని మీద ఒకటి లాగించేయాలంటే అస్సలు కుదరదు.. ఎందుకంటే.. ఈ పండు బరువే అచ్చంగా 4.25 కిలోలు! చూశారుగా.. మిగతావాటితో పోలిస్తే.. ఏ సైజులో ఉందో.. చివరికి గిన్నిస్ వారు కూడా నోరెళ్లబెట్టేసి.. ప్రపంచంలోనే అత్యంత బరువైన మ్యాంగోగా దీనికి రికార్డు కట్టబెట్టేశారు. గత రికార్డు 3.43 కిలోలుగా ఉంది. పండు ఒకే.. ఇంతకీ అది ఎక్కడ కాసిందో చెప్పలేదు కదూ.. కొలంబియాకు చెందిన జర్మన్ ఒర్లాండో, రీనాలకు చెందిన తోటలోనిది భారీ ఫలం. రికార్డు బద్దలు కాగానే.. పండును కుటుంబమంతా కలిసి ఆరగించారట. -
రామ చిలుకకు ఘనంగా అంత్యక్రియలు
ఖమ్మం : కరెంట్ షాక్తో మృతి చెందిన రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జిల్లాలోని బోనకల్ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం హై టెన్షన్ కరెంటు వైర్లపై వాలిన రామచిలుక షాక్తో మృతి చెందింది. ఇది చూసిన స్థానికులు చలించి పోయారు. రామచిలుకకు సాంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. రామనామంతో ఉన్న రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించడం వల్ల మంచి కలుగుతుందన్న భావనతో అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ప్రకృతిలో ప్రతీ జీవిపై జాలిని చూపించాలని పశుపక్ష్యాదులపై ప్రేమను కలిగి ఉండాలని జంతు ప్రేమికుడు రావట్ల సత్యనారాయణ అన్నారు. అంతక్రియలు నిర్వహించేటప్పుడు రామ నామాన్ని జపించారు. -
వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక..
చిన్న పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి నుంచి పారిపోతాం. మళ్లీ కొద్ది రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించం. అయితే రోడ్డుపై ఒక వ్యక్తి చేతిలో కొండచిలువ, భుజంపై రామ చిలుకతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని చోటుచేసుకొంది. వివరాలు.. ఒక రోజు హేలీరోబిన్ అనే మహిళ తన మిత్రులతో కోసం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి చూస్తొంది. అప్పుడు రోడ్డుకు ఆవల ఉన్న ఒక వ్యక్తిని చూసి, ఆశ్చర్యపోయింది. వెంటనే తన చేతిలోని మొబైల్ తీసుకొని రికార్డు చేసింది.. కాగా, ఒక వ్యక్తి తన చేతిలో ఒక పెద్ద కొండచిలువను, భుజంపై రామచిలుకతో ఎంచక్కా నడుచుకొంటు వెళ్తున్నాడు. అతడిలో ఏమాత్రం భయంలేదు. తీరిగ్గా డ్యాన్స్ చేసుకొంటూ, ఫోన్ బయటకు తీసి మాట్లాడుకొంటూ వెళ్తున్నాడు. కొండ చిలువను ఒక చేతిలో నుంచి మరొక చేతిలోకి మార్చుకొంటూ ఏదో బటన్ నొక్కాల్సి వచ్చిన క్రమంలో కొండ చిలువను కిందపడేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు ఏదో ర్యాంప్వాక్ చేస్తున్నట్లు ఏంటా నడక అని సరదా కామెంట్లు పెడుతున్నారు చదవండి: బాత్రూమ్లో ఐదడుగుల కొండచిలువ -
అన్నీ ఒక్కటవ్వడంతో.. బతుకు జీవుడా అంటూ
సాక్షి, గుడివాడ: మనుషులే కాదు..మాటలు రాని పక్షులు సైతం తమ బిడ్డలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతాయనేందుకు గుడివాడలో జరిగిన ఓ ఘటన సాక్షీభూతంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని వృక్షానికి గల తొర్రలో ఓ చిలుక పిల్లలను పెట్టింది. దానిని పసికట్టిన ఓ పెద్ద పాము తల్లి చిలుక గూటిలో లేని సమయంలో వాటిని మింగేందుకు తొర్ర వద్దకు చేరింది. అదే సమయానికి అక్కడకు చేరుకున్న తల్లి రామచిలుక గట్టిగా అరవడంతో చుట్టు పక్కల ఉన్న చిలుకలన్నీ దీనికి తోడయ్యాయి. అవి మూకుమ్మడిగా పాముపై దాడి చేశాయి. ఆ దెబ్బకు బతుకు జీవుడా అంటూ పాము పలాయనం చిత్తగించింది. తమ బిడ్డలను రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగించి పామును తరిమికొట్టే వరకు చిలుకలు చేసిన పోరాటాన్ని చూసిన ప్రజలు..పేగు బంధం అంటే ఇదే సుమా అంటూ చర్చించుకున్నారు. -
పలికే చిలుక మూగబోయింది..
-
పలికే చిలుక మూగబోయింది..
సాక్షి, ఆదిలాబాద్ : బైంసాలోని సాయిబాబా మందిరంలో 18 సంవత్సరాలుగా పెంచిన పలికే చిలుక మృతి చెందింది. ఈ జాతి రామ చిలుకలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ చిలుకను ఆలయ పరిసరంలోని దశరత్ కుటుంబం పెంచుకున్నారు. ఈ చిలుకతో ఎవరైనా కాసేపు మాట్లాడితే కొద్ది సమయానికి ఆ పదాలను తిరిగి పలుకుతుంది. ఇది దీని ప్రత్యేకత. చిలుకను చూడడానికి రోజు చాలా మంది వస్తూ ఉండేవారు. అయితే చిలుక మృతితొ కుటుంబ సభ్యుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలొ ఒకరిగా ఉన్న చిలుకకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
లోక్సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం
‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా! సానియా మరో పెళ్లి చేసుకోవాలి!
సీఎస్కేతో ఆర్సీబీ కీలక పోరు.. తుది జట్లు ఇవే
రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్తో..
రాయ్బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
తప్పక చదవండి
- ‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement