-
మోసాలు, ఎగవేతలపై వేగంగా స్పందించాలి
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) తగ్గించుకునేందుకు మోసాలు, ఉద్దేశ పూర్వక రుణ ఎగవేత కేసుల్లో వేగవంతంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్లకు (పీఎస్బీలు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. వృద్ధి మార్గాన్ని ఇదే మాదిరిగా ఇకముందూ కొనసాగించాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీఎస్బీలు 2021–22 వరకు క్రితం ఆరేళ్లలో రూ.11.17 లక్షల కోట్ల ఎన్పీఏలను మాఫీ చేశాయి. నాలుగేళ్ల కాలం పాటు ఎన్పీఏలుగా కొనసాగి, వాటికి నూరు శాతం కేటాయింపులు చేసిన వాటిని బ్యాంక్లు మాఫీ చేసి, బ్యాలన్స్ షీట్ల నుంచి తొలగిస్తుంటాయి. అయినా కానీ, ఆ తర్వాత కూడా వాటి వసూలుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి. ఇటీవలే పీఎస్బీల చీఫ్లతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత రిస్్కలను అధిగమించేందుకు, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని కూడా ఆర్థిక మంత్రి కోరారు. బలమైన అంతర్గత ఆడిట్ కార్యాచరణను అనుసరించాలని సూచించారు. ప్రభుత్వరంగ బ్యాంక్లు రుణాలు, తక్కువ వ్యయ డిపాజిట్ల విషయంలో క్రమంగా తమ మార్కెట్ వాటాను కోల్పోతుండడం తదితర సవాళ్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నికర వడ్డీ మార్జిన్లపైనా ఆందోళన వ్యక్తమైనట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అధిక ఈల్డ్ వచ్చే రుణ విభాగాలపై దృష్టి సారించాలని, ఫీజులు పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలన్న సూచన వచి్చనట్టు తెలిపాయి. -
పారదర్శకంగా ఎన్పీఏల గుర్తింపు
న్యూఢిల్లీ: వసూలు కాని రుణాన్ని నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏలు) గుర్తించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్లను (పీఎస్బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని సూచించారు. వృద్ధి, లాభదాయకత విషయంలో ఇక ముందూ మంచి పనితీరు చూపించాలని కోరారు. ఆర్థిక మంత్రి అన్ని పీఎస్బీల సీఈవోలతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, అత్యవసర రుణ వితరణ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో నిర్ధేశించిన లక్ష్యాలను ప్రభుత్వరంగ బ్యాంక్లు ఏ మేరకు చేరాయన్నది మంత్రి పరిశీలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రుణ వితరణలో వృద్ధి, ఆస్తుల నాణ్యత, తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యంక్ల నిధుల అవసరాలను సమీక్షించినట్టు తెలిపాయి. రుణాల పంపిణీ, లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల అడెక్వెసీ తదితర గణాంకాలన్నీ పీఎస్బీల పనితీరు ఎంతో మెరుగుపడినట్టు తెలియజేస్తుండడాన్ని మంత్రి పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నాయి. త్వరలో గ్రామీణ బ్యాంక్ల వంతు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ల పనితీరును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి త్వరలోనే సమీక్షించనున్నారు. ఇందుకోసం గ్రామీణ బ్యాంక్ల అధినేతలతో ఆమె భేటీ కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుండడం తెలిసిందే. సాగు రంగం, దాని అనుబంధ విభాగాలకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)ల జారీని ఆర్థిక మంత్రి సమీక్షించనున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. వీలైనంత ఎక్కువ సంఖ్యలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు అందేలా చూడాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా ఉంది. బలహీనంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లకు నిధుల అవసరాలను కూడా మంత్రి పరిశీలించనున్నారు. టెక్నాలజీ పెంపు, ఎప్పీఏల తగ్గింపు విధానాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బ్యాంకింగ్ సంస్కరణలే లక్ష్యం
జ్ఞాన సంగం సదస్సులో విస్తృతస్థాయిలో చర్చలు మొండి బకాయిలు, విలీనాలు తదితర ఆరు కీలక అంశాలపై దృష్టి సంస్కరణల బ్లూప్రింట్ను నేడు ప్రధాని మోదీకి సమర్పించనున్న బ్యాంకింగ్ నిపుణులు పుణే: ప్రభుత్వ రంగ(పీఎస్యూ) బ్యాంకులు, ఆర్థిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ‘జ్ఞాన సంగం’ సదస్సులో సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక(బ్లూప్రింట్) రూపుదిద్దుకుంటోంది. శుక్రవారమిక్కడ ప్రారంభమైన ఈ రెండు రోజుల సదస్సులో 100 మందికి పైగా బ్యాంకర్లు, నిపుణులు విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సంస్కరణల బ్లూప్రింట్ను నేడు ప్రధాని మోదీకి సమర్పించనున్నారు. పీఎస్యూ బ్యాంకుల సీఎండీలు, ఆర్బీఐ అధికారులు, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న మొండిబకాయిలు(ఎన్పీఏలు), రుణ వృద్ధి మందగించడం, బ్యాంకుల మధ్య విలీనాలు, కొనుగోళ్లు(కన్సాలిడేషన్) వంటి కీలక అంశాలపై తగిన పరిష్కార మార్గాల కోసం విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్క్లూజన్), టెక్నాలజీ సద్వినియోగం, ప్రాధాన్య రంగ రుణాలు, రిస్క్ మేనేజ్మెంట్, పీఎస్యూలకు తగిన వ్యూహాల రూపకల్పన, కన్సాలిడేషన్లపై ఆరు ప్రత్యేక గ్రూపు లు నివేదికలను తయారు చేయనున్నాయని.. వీటిని నేడు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించనున్నట్లు చెప్పారు. ఇదో గొప్ప అవకాశం... ఈ సదస్సును ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రారంభించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, అదేవిధంగా వ్యాపారాలకూ అనుకూలంగా వ్యవహరిస్తుందని చెబుతూ... బ్యాంకులు కూడా ఇదేవిధమైన ధోరణితో ముందుకెళ్లాలని చెప్పారు. తమ వ్యాపారాన్ని లాభదాయకంగా నిర్వహించుకుంటూ నే... పేద ప్రజలు, సామాజిక రంగాలకు కూడా చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని సిన్హా వ్యాఖ్యానించారు. భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు నిలకడగా 7-8 శాతం మేర కొనసాగడానికి తగిన సలహాలు, సూచనలను బ్యాంకర్ల నుంచి ఆయన ఆహ్వానించారు. సదస్సులో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం బాసిన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ వీఆర్ అయ్యర్, కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ ఎస్ఆర్ బన్సల్ తదితర బ్యాంకుల అధిపతులతోపాటు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ(పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్, ఆర్బీఐ డీప్యూటీ గవర్నర్లు హాజరయ్యారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేడు చర్చల్లో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ సదస్సు ముగింపు ప్రసంగం చేయనున్నారు. కాగా, వచ్చే 10-15 ఏళ్లలో దేశ ఫైనాన్షియల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఈ వినూత్న వర్క్షాప్ ఒక అద్భుత అవకాశాన్ని కల్పించిందని సిన్హా వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ కొత్త రూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో సంస్కరణలను తక్షణం, వేగంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. విలీనాలొక్కటే మార్గం కాదు... పీఎస్యూ బ్యాంకుల బలోపేతానికి విలీనాలు, కొనుగోళ్లు ఒక్కటే మార్గం కాదని అధియా పేర్కొన్నారు. మార్కెట్ నుంచి సులువుగా నిధులను సమీకరించేందుకు తగిన యంత్రాంగాన్ని రూపొందించుకోవడం ఇతరత్రా చర్యల ద్వారా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు కూడా మెరుగుపడతాయని ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అధియా అభిప్రాయపడ్డారు. పీఎస్యూ బ్యాంకుల మధ్య విలీనాలను ప్రోత్సహించాలంటూ పలు నివేదికలు వచ్చినప్పటికీ.. ఈ కన్సాలిడేషన్ అంశం చాన్నాళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 27 బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కాగా, కన్సాలిడేషన్పై బ్యాంకుల నుంచి కొన్ని సూచనలు వచ్చాయని.. దీనిపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపాల్సి ఉంటుందని అధియా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్య రంగ రుణాల(పీఎస్ఎల్) లక్ష్యాలకు సంబంధించి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది వ్యవసాయ రంగ వృద్ధికి ఇప్పుడు చాలా కీలకమైనది. అయితే, పీఎస్ఎల్లో ఈ రంగానికి చోటు లేదు’ అని అధియా ఉదహరించారు. కాగా, బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడంతో పాటు రుణాలకు డిమాండ్ తగ్గిపోవడం కూడా ఆందోళనకరమైన అంశమేనని అధియా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో రుణ వృద్ధి కేవలం 5.2 శాతానికి పరిమితమైంది. 2014 సెప్టెంబర్ 30 నాటికి పీఎస్యూ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) రూ.2.43 లక్షల కోట్లకు చేరాయి. టాప్ పోస్టులకు పైవేటు నిపుణులు! పీఎస్యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో చైర్మన్, సీఈఓ-ఎండీ పోస్టుల్లో ప్రైవేటు రంగ నిపుణులకు కూడా అవకాశం కల్పించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ పోస్టులకు ప్రైవేటు రంగ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఈ మార్పులకు ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ(ఏసీసీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందని చెప్పారు. యాజమాన్యపరమైన సంస్కరణల్లో భాగంగా పీఎస్యూ బ్యాంకుల్లో సీఎండీ పోస్టులను సీఈఓ-ఎండీ, చైర్మన్గా ప్రభుత్వం ఇటీవలే విడదీసింది.
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఆ ముసలోడికి ఏం రోగం..కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
బీసీలను ఆదరించడంలో సీఎం జగన్ ముందుంటారు: కొడాలి నాని
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
మత్స్యకారులకు గుడ్ న్యూస్
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement