-
ఆడపిల్ల విలువ తెలియజేసేలా ‘చిట్టి పొట్టి’
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘చిట్టి పొట్టి’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా ఈ మూవీ ఫస్ట్లుక్తో పాటు మోషన్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ..‘ అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దాం’ అని అన్నారు. -
అంతకు మించి...
‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో రామ్ని ఫుల్ మాస్గా చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో మాస్, కామెడీ, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో అంతకు మించి ఉంటాయి. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. తొలి భాగంలోకన్నా ఇంకా మాస్గా కనిపించ డంతో పాటు స్టయిలిష్గానూ కనిపించనున్నారు.‘‘ఈ చిత్రంలో రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ పాన్ ఇండియా చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ఆరంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఎక్కువ శాతం సినిమా పూర్తవుతుంది. సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి స్వరాలు అందించిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
ఒంటిమిట్టకు పూర్వ వైభవం!
ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం 'శ్రీరామనవమి' వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వలాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది శుభ పరిణామం. 'భద్రాచలం' తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ఆరంభమైంది. ఈ తీర్థం గురించి ఇంకా తెలియల్సినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్నా ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిళ్ళు, దొంగతనాలు,దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి, అనన్య సామాన్యమైన సేవలు నిత్యరమణీయ స్మరణీయాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా, ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో! ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! 'వాసుదాసు -ఒంటిమిట్ట'ను వేరుచేసి చూడలేం. ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే? అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు 'ఏకశిలా నగరం' అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడి వాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఆ వాదంతో అంగీకరించలేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని ఆయన చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు. పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. "పోతన్నది ఒంటిమిట్ట" అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం. ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలచడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం 'ఏకశిలా నగరం'గా ఖ్యాతికెక్కింది. సీతారామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవకముందు కాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు. మృకండుడు,శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే 'అష్ట దిగ్గజ కవులు'లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి,వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి కవితా రూపంగా అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో దేవాలయ పునరుద్దీపనలో ప్రధాన భూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను పోషించాడు. 24వేల శ్లోకాల సంగమమైన వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని 108సార్లు పఠించి,మధించి, ఉపాసించి 'మందరం' పేరుతో తెలుగులోకి పద్యాల రూపంలో అనువాదం చేశాడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవి,పండితులు 'ఆంధ్రవాల్మీకి' బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు. బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది. ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు,జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు,సంపదలు దోపిడీకి,దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో, వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని,దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. "నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా " అంటూ శతకం కూడా రాశాడు. టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా... వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు. తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు 'ఒంటిమిట్ట' కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామనవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు,సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం, ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. మనందరి కర్తవ్యం కూడా. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: థాయిలాండ్లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
‘ఆప్ కా రామ్రాజ్య్’ లాంచ్ చేసిన ఆమ్ ఆద్మీ!
శ్రీరామ నవమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య్’ వెబ్సైట్ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ నేత సంజయ్ సింగ్ తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రస్తావించిన రామరాజ్యంలో అసమానత లేదని, రామరాజ్యం నెలకొల్పాలనే కలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎంతగానో కృషి చేశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లేకుండా చేసుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదేనని అన్నారు. అయితే కేజ్రీవాల్ జైలు నుంచి తమకు సందేశాలు పంపుతూనే ఉన్నారని, అతనిపై నిరాధారమైన కేసులు బనాయించారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్పై ప్రధానికి ద్వేషం ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్ చేస్తున్న పనులను ప్రధాని చేయలేరన్నారు. ఈ సందర్భంగా మరోనేత అతిశీ మాట్లాడుతూ రఘుకుల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని, ప్రాణం పోయినా ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించకూడదన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ, పంజాబ్ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ మేలు చేస్తున్నారన్నారు. రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లవలసి వచ్చినప్పటికీ, తాను ఇచ్చిన మాట తప్పలేదని, అదేవిధంగా ఢిల్లీలో స్కూళ్లు, హెల్త్, విద్యుత్ వ్యవస్థ బాగున్నాయా లేదా అని తమకు మెసేజ్ పంపారన్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యంలో అందరిలో ప్రేమ, సోదరభావం ఉండేదని అన్నారు. -
నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!
శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్గఢ్లోని జాంజ్గీర్ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్ 30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు. -
లోక్సభకు ‘రాముని’కి ముందు ‘కృష్ణుడు’.. చివరికి ఏమయ్యింది?
లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్కు ముందు టీవీ సీరియల్ మహాభారత్లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్లోని జంషెడ్పూర్ నుంచి బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి, విజయం సాధించారు. అయితే 1999 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జంషెడ్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
కుటుంబ కథాంశంతో ‘సఃకుటుంబానాం’
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హెచ్.మహదేవ గౌడ్ నిర్మాత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో ఇంత మంది ఆరిస్టులు, ఇంత మంచి కాంబినేషన్స్తో ఏ సినిమా రాలేదు. ఇందులో చాలా మంచి కథ ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ఉంటుంది. నిర్మాత మహదేవ్ మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగు టైటిల్తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందరు మెచ్చేలా కుటుంబ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
ఓటీటీలోకి వచ్చేసిన దేశ భక్తి చిత్రం ‘రామ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) . రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 16న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ని సంపాదించుకుంది. దర్శకుడు మిహిరామ్ వైనతేయకి ఇది తొలి సినిమానే అయినా.. మంచి పేరును తీసుకొచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ‘రామ్’ కథేంటి? హైద్రాబాద్లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. -
కవలలకు కన్నీటి ‘పరీక్ష’
పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్ రూరల్: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ జన్మించారు. వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది. చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విషాదాన్ని దిగమింగి.. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి శ్రీనివాస్రెడ్డి సోమవారం బైక్ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ధనుష్ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
రామ్లల్లా ముందు పిల్లాడిలా ఏడ్చిన ఎమ్మెల్యే!
అయోధ్యలో కొలువైన రామ్లల్లాను యూపీలోని గోసాయిగంజ్ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అభయ్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో అభయ్ సింగ్ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. పార్టీకి దూరమైన అనంతరం అయోధ్యకు వచ్చిన ఆయన బాలరాముని ముందు సాష్టాంగపడి భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలనుకున్నామని, అయితే తమకు ఆహ్వానం అందలేదన్నారు. దీంతో తమను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకెళ్లాలని అసెంబ్లీ స్పీకర్ను ఎస్పీ ఎమ్మెల్యేలంతా కోరారని తెలిపారు. అయితే సమాజ్వాదీ పార్టీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అయోధ్యకు తీసుకువెళ్లారని’ ఆయన ఆరోపించారు. తాజాగా రామ్లల్లాను దర్శించుకున్న ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీరాముని చిత్రాలను షేర్ చేశారు. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అభయ్ సింగ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
బాలరాముని చిత్రపటాలకు ఆదరణ.. కోట్లలో వ్యాపారం!
అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు. అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను కొనుగులు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య మార్కెట్లో చిన్న సైజు శ్రీరాముని చిత్రపటం నుంచి పెద్ద సైజు చిత్రపటం వరకూ అన్నీ విరివిగా అమ్ముడవుతున్నాయి. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 30 రకాల వస్తువులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు చెందిన వ్యాపారి అశ్వనీ గుప్తా మాట్లాడుతూ, రాముని చిత్రాలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇది తమ వ్యాపారస్థాయిని విపరీతంగా పెంచుతున్నదన్నారు. ఫలితంగా చాలామందికి ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడి వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాలరాముని చిత్రాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కోట్ల రూపాయల మేరకు బాలరాముని చిత్రాల వ్యాపారం సాగుతోంది. -
నెల రోజుల్లో బాలరాముణ్ణి ఎందరు దర్శించుకున్నారు?
అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెల రోజులు గడిచింది. జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. అయోధ్యకు రామభక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించుకుంటున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గడచిన నెల రోజుల్లో వివిధ పార్టీల నేతలే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 11న దాదాపు 300 మంది శాసనసభ సభ్యులతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తన మంత్రివర్గంతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. -
కేరాఫ్ ముంబై.. నయా సినిమాల నయా స్టోరీస్
కొందరు దక్షిణాది హీరోలు చలో ముంబై అన్నారు. ఎందుకంటే ఈ హీరోలు కనిపించే చిత్రాల్లో ‘ముంబై’ బ్యాక్డ్రాప్ ఉంది. కేరాఫ్ ముంబై అంటూ సాగే చిత్రాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. డాన్ మొయిద్దీన్ భాయ్ రజనీకాంత్ ముంబై కాంబినేషన్ అంటే ‘బాషా’, ‘కాలా’ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ జాబితాలో తాజాగా ‘లాల్ సలామ్’ సినిమా చేరింది. కానీ ఈ చిత్రంలో రజనీకాంత్ హీరో కాదు. ఓ లీడ్ క్యారెక్టర్. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ చేయగా,రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. రెండు వర్గాలకు చెందిన క్రికెటర్ల మధ్య గొడవలను మొయిద్దీన్ ఎలా తీర్చాడు? అనేది చిత్రం ప్రధానాంశం. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. డబుల్ ఇస్మార్ట్ ముంబైకి షిఫ్ట్ అయ్యాడట ఇస్మార్ట్ శంకర్. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి సీక్వెల్గా ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు రామ్, పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం మేజర్గా ముంబై నేపథ్యంలో సాగుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ కూడా ముంబైలో జరిగింది. పూరి జగన్నాథ్, ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ధారావి? ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘ఫిదా’ ‘లవ్స్టోరీ’ వంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల సడన్గా ట్రాక్ మార్చారు. ముంబై మాఫియా నేపథ్యంలో ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాను తీస్తున్నారట. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ఇది. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ఇక ‘డీఎన్ఎస్’ కథ రీత్యా నాగార్జున ఓ పెద్ద డాన్ పాత్రలో కనిపిస్తారని, ఓ సాధారణ యువకుడి స్థాయి నుంచి మాఫియా గ్రూప్ లీడర్గా ఎదిగే పాత్రలో ధనుష్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘ధారావి’ అనే టైటిల్ పరిశీలించారనే ప్రచారం కూడా జరిగింది. ముంబైలో మురికి వాడప్రాంతం అయిన ‘ధారావి’ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో మొదలై, పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ను గోవాలో ప్లాన్ చేశారని తెలిసింది. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ములతో సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలో క్యాషియర్ బొంబాయిలో ‘లక్కీ భాస్కర్’గా మారిపోయారు దుల్కర్ సల్మాన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. 1980 కాలంనాటి బొంబాయి నేపథ్యంలో ఈ చిత్రం కథాంశం ఉంటుంది. ఇందులో మగధ బ్యాంకులో క్యాషియర్గా పని చేసే భాస్కర్ పాత్రలో కనిపిస్తారు దుల్కర్ సల్మాన్. ఇటీవలే ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. -
RAM Movie Review: ‘రామ్’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) నటీనటులు: సూర్య అయ్యలసోమయజుల,ధన్య బాలకృష్ణ ,భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు నిర్మాణ సంస్థ: దీపికా ఎంటర్టైన్మెంట్ & ఓ ఎస్ యం విజన్ నిర్మాత:దీపికాంజలి వడ్లమాని కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్ సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే... హైద్రాబాద్లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న సెటప్ కొత్తగా అనిపిస్తుంది. ఉగ్రవాదం మీద సినిమాలు రావడం కొత్తేమీ కాదు. మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులుంటారని చూపించాడు డైరెక్టర్. రామ్ విషయంలో కథనాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే ప్రయాణాన్ని, ఆ గ్రాఫ్ను చక్కగా ప్రజెంట్ చేశాడు. హెచ్ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్త పాయింట్ చూపించాడు. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కున్నాడు. దేశం లోపల ఉండే స్లీపర్ సెల్స్ గురించి చర్చించాడు. ఓ మతం చేస్తే తప్పు.. ఇంకో మతం చేస్తే తప్పు కాదు అంటూ సాయి కుమార్ పాత్రతో డైలాగ్ చెప్పించడం దర్శకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు చాలానే రాసుకున్నాడు. సెకండాఫ్, క్లైమాక్స్లో హై ఇచ్చే సీన్లను బాగానే రాసుకున్నాడు. బ్యూరోక్రసీ జీహాద్ అంటూ సాయి కుమార్ పాత్రతో కొత్త పాయింట్ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు దర్శకుడు. శుభలేఖ సుధాకర్ పాత్రతో రాజకీయానికి ఉగ్రవాదానికి కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. ఫస్ట్ హాఫ్ను సరదా సరదాగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ను ఫుల్ సీరియస్ మోడ్లో నడిపించాడు. క్లైమాక్స్ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. త్రివర్ణ పతాకం కనిపించే షాట్ డైరెక్టర్ విజన్, ప్రతిభకు ఉదాహరణగా నిలుస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను చివరకు జై హింద్ అనిపించేలా చేస్తాడు. అదే దర్శకుడి సక్సెస్ అని చెప్పొచ్చు. ఎవరెలా నటించారంటే? రామ్ పాత్రలో సూర్య అయ్యలసోమయాజుల చక్కగా నటించాడు. కొత్త వాడైనా ఎక్కడా ఆ బెరుకు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్లో ఓ మాస్ హీరోగా ఫైట్స్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్లోనూ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్కు, సెకండాఫ్కు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. అక్కడే సూర్య సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిత్, భాను చందర్ పాత్రలు బాగుంటాయి. రోహిత్ చాలా కాలం తరువాత ఆడియెన్స్ను ఆకట్టుకుంటాడు. సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీతో మరోసారి ఆడియెన్స్ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. శుభలేఖ సుధాకర్ కనిపించేది కొద్ది సేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. ధన్య బాలకృష్ణ లుక్స్ పరంగా బాగుంది. ఎమోషనల్గానూ ఆకట్టుకుంది. భాషా కామెడీ, రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ మెప్పిస్తాయి. రామ్ సినిమాలో టెక్నికల్ టీం మేజర్ అస్సెట్గా నిలిచింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను నిలబెట్టింది. చివర్లో వచ్చే దేశ భక్తి గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ధారన్ సుక్రి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సెకండాఫ్లో వచ్చే డైరెక్టర్ మిహిరాం రాసిన మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఇస్మార్ట్ మ్యూజిక్
‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరందుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేసి, ‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్లో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ చిత్రీకరణ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నది ఫిల్మ్నగర్ తాజా కబురు. -
Ram:ప్రతి టికెట్లో ఐదు రూపాయలను నేషనల్ డిఫెన్స్ ఫండ్: నిర్మాత
అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం రామ్ .దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత దీపికాంజలి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్ మీద ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ఇస్తామని ప్రకటించారు. ‘మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని దీపికాంజలి అన్నారు. ‘కంటెంట్ ఉంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పీపుల్ మీడియా ఫాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల అన్నారు. ‘ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు. అలాంటి వారిపై వచ్చిన ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, మంచి విజయాన్ని అందిచాలి’అని నిర్మాత బెకెం వేణుగోపాల్ అన్నారు. ‘రామ్ దేశ భక్తిని చాటి చెప్పే చిత్రమే కానీ.. బార్డర్లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు. దేశసరిహద్దు లోపల టెర్రర్ అటాక్ బారి నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోల గురించి చూపించాను’అని దర్శకుడు మిహిరాం అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు అయ్యలసోమయాజుల,ధన్య బాలకృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ట్లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
ఆ చిత్రంపై సైంధవ్ డైరెక్టర్ ప్రశంసలు!
సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తోన్న చిత్రం రామ్ (RAM). ఈ చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన సైంధవ్ డైరెక్టర్ శైలేశ్ కొలను ప్రశంసలు కురిపించారు. రామ్ ప్రీమియర్ షో చూసిన డైరెక్టర్ శైలేష్ కొలను ప్రత్యేకంగా చిత్రయూనిట్ను అభినందించారు. ఈ సినిమా కథాంశం, అందులోని సోషల్ మెసేజ్ గురించి ఆయన ప్రస్తావించారు. సినిమాను అద్భుతంగా తీశారని ప్రశంసించారు. ధారన్ సుక్రి విజువల్స్, ఆశ్రిత్ సంగీతం బాగుందని కొనియాడారు. చిత్రయూనిట్కు మంచి విజయం చేకూరుతుందని శైలేష్ అన్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ షోలతో రామ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తోంది. -
రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్
ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్గా మారింది. సచిన్-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jist (@jist.news) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్లో ఉంటున్నారు. -
దేశభక్తిని చాటే ‘రామ్’
రిపబ్లిక్ డేకి ప్రతీ ఏడాది బాలీవుడ్ నుంచి పేట్రియాటిక్ సినిమాలు వస్తుంటాయి. మన టాలీవుడ్ నుంచి ఇలాంటి జానర్లు రావడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఓ దేశభక్తి చిత్రం రిపబ్లిక్ డేకి రాబోతోంది. ఈ మేరకు మేకర్లు అధికారికంగా ప్రకటించారు. కమర్షియల్ ఫార్మాట్లో పేట్రియాటిక్ జానర్లో తెరకెక్కించిన రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) చిత్రం జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ మేరకు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఓఎస్ఎం విజన్తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. అందరిలోనూ అంచనాలు పెంచిన ఇక ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్పూర్లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం!
అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్లల్లా అడుగుపెట్టారు. శ్రీరామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే అయోధ్యకు నాటి త్రేతాయుగం వచ్చినట్టున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. జనవరి 16న నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పండితులు సునీల్ దాస్ అయోధ్య రామమందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కలశ యాత్ర చేపట్టారు. జనవరి 17న శ్రీరామ్లల్లా నూతన విగ్రహాన్ని మొదటిసారిగా ఆలయంలోనికి తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అయోధ్యలో ‘త్రేతా యుగం’నాటి రోజులు కనిపిస్తున్నాయి. అయోధ్యలోని అన్ని దుకాణాలపై రాములవారి జెండాలు రెపరెపలాడుతున్నాయి. రామ్ఘాట్ నుండి అయోధ్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తు చేసేలా ఉంది. రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండంతో అవి రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. శ్రీరామ్లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ విమానం అయోధ్యతో కోల్కతా, బెంగళూరులను కలుపుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విమానాలను ప్రారంభించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ జన్మభూమి మార్గంలోని ఎంట్రీ పాయింట్ దగ్గర రెండు పెద్ద స్తంభాలు నిర్మితమయ్యాయి. అవి త్రేతాయుగాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి గోడలపై రామ్లల్లా జీవితానికి సంబంధించిన పలు దృశ్యాలు కనిపిస్తాయి. నూతన రామాలయం రాకతో ప్రముఖ స్టార్ హోటళ్లు అయోధ్యలో అడుగిడేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారిపై గృహాలు కలిగినవారు తమ ఇళ్లను హోటళ్లుగా మారుస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో రూ.30,923 కోట్ల విలువైన 200కు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 37 శాఖలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యూపీ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ 1200 ఎకరాల్లో న్యూ అయోధ్య టౌన్షిప్ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
22న అయోధ్యలో వెలగనున్న భారీదీపం
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్ఘాట్లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన -
బాలరామునికి బొమ్మల బహుమానం
అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు ‘రామ్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. వారణాసిలోని రామ్ బ్యాంక్ అనేది నామానామాన్ని డిపాజిట్ చేసే సంస్థ. ఇక్కడ భక్తులు తాము రామనామాలను రాసిన పుస్తకాలను జమ చేస్తుంటారు. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తోంది. మెహ్రోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు మూడవ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్లల్లాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందుకు ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకీ, మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మెహ్రోత్రా కుటుంబం రామ్ దర్బార్లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓ వైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే, మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికీ కాశీలో రామ్ బ్యాంక్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
అందుకే రాజీనామా చేశా!
‘‘ఇప్పటిదాకా మనకు మొత్తం సినిమాని ఇంటరాగేషన్ మీద తీయలేదు. ‘ది ట్రయల్’ సినిమా కథ ఇంటరాగేషన్ రూమ్ నుంచి మొదలై అదే గదిలో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ అంటున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్ గన్ని. స్పందనా పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. దర్శకుడు రామ్ గన్ని మాట్లాడుతూ– ‘‘2012 నుంచి 2022 వరకు డిప్యూటీ జైలర్గా చేశాను. సినిమాలపై ఫ్యాషన్తో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇండస్ట్రీకి వచ్చాను. దర్శకునిగా ‘ది ట్రయల్’ నా తొలి చిత్రం. డిప్యూటీ జైలర్గా నా పదేళ్ల కెరీర్లో ఎన్నో నేర ఘటనల గురించి, ఆ నేరాలు చేసిన ఖైదీల కథలను విన్నాను. వాటి స్ఫూర్తితో ఫిక్షనల్గా రాసుకున్న కథ ‘ది ట్రయల్’’ అన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఇండోర్లో ఉచిత పోహా, జిలేబీ..
- వందొస్తే టాప్ కాలేజీల్లో సీఎస్సీ!
- చురుగ్గా రబీ ధాన్యం సేకరణ
- Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
- Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
- Lok Sabha Election 2024: మోదీకి ఆయన స్టైల్లోనే బదులిస్తా
- Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
- Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్ హవా!
- టీడీపీలో భయాందోళనలు
- పోటెత్తిన ఓటర్లు
Advertisement