-
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్పై ఒక పాస్పోర్ట్ అధికారి ఫోన్ నంబర్ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్పై అతని ఫోన్ నంబర్ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోని QR కోడ్తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్లోని ఆనంద్లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఓటు వేయకుంటే రూ. 350 జరిమానా? నిజమెంత?
దేశంలో ఒకవైపు లోక్సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ. 350 జరిమానా ఉంటుందని, ఈ మెత్తం సదరు ఓటరు బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుందని ఆ పోస్టులో తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేని ఓటర్లు.. వారు మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు వారి నగదు జరిమానా కింద కట్ అవుతుందని కూడా ఆ పోస్ట్లో తెలియజేస్తున్నారు. ఈ ఉదంతంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని, కమిషన్ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ ప్రచారం అబద్ధమని పేర్కొంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది. 𝗙𝗮𝗹𝘀𝗲 𝗰𝗹𝗮𝗶𝗺 : नहीं दिया वोट तो बैंक अकाउंट से कटेंगे 350 रुपएः आयोग 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 : यह दावा फर्जी है, चुनाव आयोग द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।#FakeNews #ECI #VerifyBeforeYouAmplify pic.twitter.com/yqnzWwrw6E — Election Commission of India (@ECISVEEP) April 2, 2024 -
కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!
సమ్మర్ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకా కోలా డ్రింక్ బాటిల్స్ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!) ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్ వేసిన ప్లాస్టిక్ బాటిల్స్లో ఒక వ్యక్తి డ్రింక్ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ ఒకింత ఆందోళనగా కమెంట్స్ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్ను గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) A forward doing the rounds. Things get ...... With @CocaCola pic.twitter.com/vAhxcDhb1F — R. Balakrishnan (@BalakrishnanR) March 29, 2024 -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
విదేశాల్లో చదువు : ఫన్ అన్నారు, అంట్లు కడిగితే తప్పేంటి?
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం ఒకప్పుడు కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది.అది గొప్పోళ్లకే సొంతం అన్నట్టు ఉండేది. కానీ చాలామంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ చదువు కోవడానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇలా పలుదేశాలకి ఎగిరిపోతున్నారు. తీరా అక్కడికెళ్లాక చాలామంది విద్యార్థులు కల్చర్ పరంగా, ఆర్థికంగా ఇలా రక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్వతంత్రంగా, భద్రంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అన్ని నిబంధనలూ, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేస్తూ కష్టపడాలి. మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. కానీ అపుడు మాత్రమే, అక్కడి ఖర్చులు లోన్లు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు విద్యార్థులు. కొందరు చదువుతున్న కాలేజీల్లోనే అసిస్టెంట్లుగా పనిచేస్తారు. పనికొందరు మాత్రం వంట చేయడం, గిన్నెలు కడగటం, పిల్లల సంరక్షణా కేంద్రాలు, మొదలు పెట్రోలు బంక్, ఇతర దుకాణాల్లో పనిచేస్తారు. తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు ఇలా అంట్లు కడుగుతున్న వీడియో నొక దాన్ని ఒకరు షేర్ చేశారు. విద్యార్థి నాన్-స్టిక్ పాన్ను కడుగుతున్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశాడు. ‘‘విదేశాలకి స్టడీకోసంవెళ్లండి, సరదాగా ఉంటుంది అన్నారు." క్యాప్షన్తో వచ్చిన ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. కొందరు యూజర్లు ఈ పోస్ట్ను సానుకూలంగా అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం అంట్లు కడిగితే తప్పేంటి, చిన్న చిన్న పనులైనా నేర్చుకుని ఉండాలి అంటూ మండి పడ్డారు. విదేశాల్లో అయినా ఇండియాలో అయినా ఎవరో ఒకరు అంట్లు కడగాల్సిందే.. వాటంతట అవి శుభ్రపడవు. కాకపోతే నువ్వు ఇంటికొచ్చాక ఇంకొకరు చేస్తారు. లేదా పెళ్లి అయ్యాక నీకోసం ఆ పనులు మరొకరు చేయాలని భావిస్తావ్.. అంతే తేడా. దీన్ని ఫన్గా అనుకోకుండా, జీవితమంతా ప్రతిరోజూ మీకోసం మీరు పనులు చేసుకోవాలని అర్థం చేసుకోండి అని కమెంట్ చేయడం గమనార్హం. go study abroad it’ll be fun they said pic.twitter.com/3yoj19uKyC — Dew (@itmedew) March 19, 2024 -
వాన్ని వదలొద్దు గీతాంజలి భర్త ఆవేదన
-
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!
‘మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి ఒక మార్గం ఉంది. అదే ఆరెంజ్ పీల్ థియరీ’ అంటూ ఇంటర్నెట్లో మొదలైన సందడి వైరల్ కావడానికి ఎంతో టైమ్ పట్టలేదు. లవ్ లిట్మస్ టెస్ట్గా భావించే ‘ఆరెంజ్–పీల్–థియరీ’ సోషల్ మీడియా వైరల్ ట్రెండ్గా మారింది. ఈ ట్రెండ్లో భాగంగా ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. తాజాగా కమేడియన్ అంచల్ అగర్వాల్ ‘ఆరెంజ్ పీల్ థియరీ’పై తన తల్లితో కలిసి చేసిన వీడియో వైరల్ అయింది. 7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇంతకీ ఏమిటి ఆరెంజ్ పీల్ థియరీ? సింపుల్గా చెప్పాలంటే ఒక ఆరెంజ్ను లవర్కు చూపిస్తూ....‘నా కోసం ఈ ఆరెంజ్ తొక్క తీయగలవా?’ అని అడగాలి.లవర్ వెంటనే ‘ఓకే’ అంటే మనది నిజమైన ప్రేమ! ఇది సిల్లీ టెస్ట్గా అనిపిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ లోకవాసులలో చాలామంది దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఈ వైరల్ ట్రెండ్ పుణ్యమా అని ఆరేంజ్ ఫలాలు తెగ అమ్ముడవుతున్నాయట! View this post on Instagram A post shared by Aanchal Agrawal (@awwwnchal) (చదవండి: షాకింగ్ ఘటన అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి) -
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్'
నిర్మల్: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిత్రకారుడు అడ్డిగ శ్రావణ్ కుమార్.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత వయసు ప్రమేయం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నారు. అధికసమయాన్ని వీటికే వెచ్చిస్తున్నారు. ఇదే అంశాన్ని స్థానిక మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రావణ్కుమార్ తన ఇంటిముందు స్వయంగా వేసిన ముగ్గులో సందేశం రూపంలో అందించాడు. రోడ్డుపై వచ్చిపోయే వారు సందర్శించేలా ‘‘డోంట్ బి అడిక్టెడ్’’ అంటూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గులో పలు సామాజిక మాధ్యమాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాడు. ఫేస్బుక్, ఇంస్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, జిమెయిల్, గూగుల్ క్రోమ్ వంటి పలు ఇంటర్నెట్ సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ వాటికే అడిక్ట్ అవుతున్న తీరును ఇలా సృజనాత్మకంగా ప్రదర్శించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చాలామంది విభిన్నరీతిలో ఇచ్చిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు. ఇవి కూడా చదవండి: సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ? -
క్రిస్మస్ ఎనర్జీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్కు సంబంధించి బాలీవుడ్ సెలబ్స్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్మస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్మస్ తన ఫేవరెట్ ఫెస్టివల్ అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘క్రిస్మస్కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది. నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా బహ్రెయిన్లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్ సో కూల్ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్. ‘క్రిస్మస్ ఎనర్జీ’ పేరుతో క్రిస్మస్ జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్. -
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
అంకుల్.. నా పేరెందుకు స్మరిస్తున్నారంటూ రేణు దేశాయ్ ఫైర్
సినీ నటి రేణు దేశాయ్ సుదీర్ఘ విరామం తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ద్వారా ఇటీవలే వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రతో ఆమె మెప్పించారు. చాలాకాలం తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని ప్రేక్షకులను పలకరించారు. ఆమె రీ ఎంట్రీతో పాటు మరో పెళ్లి అంశంపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన చేసిన కామెంట్స్ క్లిప్పింగ్స్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సందించారు రేణు. సమాజంలో మహిళలను తక్కువగా చూడడం తగదని ఆమె సూచించారు. ఇదే వీడియోను షేర్ చేస్తూ, ఆ జర్నలిస్టును ఉద్దేశించి రేణు దేశాయ్ ఇలా అన్నారు. 'నా పేరు పదే పదే స్మరించి యూట్యూబ్లో కొన్ని వ్యూస్ సంపాదిస్తున్నారు. ఇలా నా పేరు ద్వారా మీరు డబ్బులు సంపాదించుకుంటున్నందుకు నాకు కూడా సంతోషమే.. కానీ ఇలా కుర్చీలో కూర్చొని సినీ నటులపై నాలుగు గాసిప్స్ చెప్పడం కంటే మీ టాలెంట్తో డబ్బు సంపాదిస్తే బాగుండేది. మీకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. మీ జీవిత అనుభం నేర్పింది ఇదేనా.. ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. నా పేరును వదిలేసి దైవ నామస్మరణ చేయండి. నేను మిమ్మల్ని ఎక్కడా కలవలేదు. కాబట్టి నా గురించి నీకు ఏం తెలుసు..? మహిళలను దుర్గాదేవిగా, కాళీమాతగా చూడటం మన సాంస్కృతిక ప్రాముఖ్యత అని మరిచిపోవద్దు. మగవారి పేరు, ప్రోత్సాహం లేకుండా మహిళలు ఏం చేయలేరని మీలాంటి వారు మాట్లాడుతుంటారు.' అని రేణు తెలిపింది. ఈ వ్యాఖ్యలు కేవలం తన గురించి మాత్రమే కాదని, సమాజంలో మహిళలపై కొందరు మగవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిపేందుకే ఈ పోస్ట్ చేశానని రేణు దేశాయ్ తెలిపారు. చివరిగా రేణు ఈ వ్యాఖ్యలను కూడా జోడించింది. 'ఈ పోస్ట్కి నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మా కుమార్తెలు, మనవరాలు మంచి భవిష్యత్తు కోసం చర్చను సృష్టించడం కోసం మాత్రమే.' అని తెలిపారు. రేణు దేశాయ్ మరో పెళ్లి అంశాన్ని సదరు జర్నలిస్ట్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా మగవారు అయితే మరో పెళ్లి చేసుకోవచ్చని తెలిపాడు. అదే సమయంలో స్త్రీల గురించి తక్కువగా చేసి మాట్లాడటం ఆమె తప్పుబట్టింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఫుల్గా చిల్ అవుతోన్న నిహారిక.. పొట్టి నిక్కర్లో ఫరియా అబ్దుల్లా!
► ఫుల్గా చిల్ అవుతోన్న నిహారిక ► పొట్టి నిక్కర్తో డ్యాన్స్ చేస్తోన్న ఫరియా అబ్దుల్లా ► రెడ్ డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు ► షార్ట్ జీన్స్ డ్రెస్తో కవ్విస్తోన్న ఆషిక రంగనాథ్ ► స్టన్నింగ్ లుక్లో దివి అందాలు View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
దీపావళికి కలర్పుల్ దీపాలు కావాలా? ఈ వీడియో చూస్తే మీరు ఫిదానే!
Diwali Special Magic Candle lights: దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది. దీపావళి సందర్భంగా నూనె దీపాలతోపాటు, రంగు రంగుల కొవ్వొత్తులతో ఇంటిని అందంగా అలంకరించుకోవడం అలవాటు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో, కలర్ఫుల్ క్యాండిల్ లైట్స్ను తయారు చేసుకోవాలని భావిస్తున్నారా.మీలాంటి వారికోసమే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇది ట్విటర్లో 40 లక్షలకుపైగా వ్యూస్ను సొంతం చేసుకుంది మరింకెందుకు ఆలస్యం.. మీరు మెచ్చే, మీకు నచ్చే అందమైన కాండిల్ లైట్స్ ఎలా తయారు చేసుకోవాలా చూసేయండి మరి. Very cool idea!pic.twitter.com/WjGQL49hTq — Figen (@TheFigen_) October 29, 2023 -
ప్రముఖ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో లీక్.. ఇంటర్నెట్లో వైరల్
ఇంటర్నెట్, సోషల్ మీడియా రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అనేక సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అలీజా సహర్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలీజా సహర్ పాకిస్థాన్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్. అలీజా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్థాన్ పల్లెటూరి జీవితాన్ని చూపించేది. ఈ యూట్యూబర్కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. పాకిస్థానీ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో వైరల్ అలీజా సహర్ ప్రతిరోజు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్తాన్ గ్రామీణ జీవితాన్ని చూపించేది. దీంతో ఆమె ఈ ఛానెల్ ద్వారా ప్రజాదరణ పొందింది. యూట్యూబ్, టిక్టాక్ ద్వారానే దాదాపు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. వారందరి కోసం పాకిస్తానీ గ్రామ ప్రజల జీవితం, వంట పద్ధతి, సంస్కృతి వంటి కంటెంట్ను చూపించేది. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అలీజా సహర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్గా మారింది. (ఇదీ చదవండి: కల్పికతో ఎఫైర్ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం) ఏం జరిగింది..? అలీజా సహర్ ఒక వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడింది. ఆ సమయంలో జరిగిన కొన్ని కార్యకలాపాలు వీడియో కాల్లో రికార్డ్ చేయబడ్డాయి. దానిని ఆ వ్యక్తి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆమె తెలుపుతుంది. నివేదికల ప్రకారం ఆ వీడియో కాల్లో అలీజా సహర్ తన దుస్తులు తొలగించి శరీరాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలతో పాటు కొంత అసభ్యకరమైన మాటలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పాకిస్థానీ సోషల్ మీడియా స్టార్ చిక్కుల్లో పడింది. అయితే, అలీజా సహర్ ఇప్పటికీ దీని గురించి స్పందించి అందులో ఉండేది తాను కాదని ఎవరో వీడియోను ఎడిట్ చేశారంటూ ఆమె పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెళ్లింది. కానీ నెటిజన్లు మాత్రం వీడియోలో ఉండేది పక్కాగా ఆమెనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ అలీజా సహర్ పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)ని ఆశ్రయించి.. తన ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఖతార్లో నివసిస్తున్న అతన్ని ఎఫ్ఐఏ గుర్తించినట్లు ఆమె తెలిపింది. ఈ విషయాన్ని అలీజా తన వీక్షకులకు చెప్పింది. సైబర్ క్రైమ్ టీమ్ కూడా తనకు సహాయం చేసేందుకు వచ్చిందని ఆమె తెలిపింది. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఆన్లైన్ కమ్యూనిటీకి తన యూట్యూబ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. View this post on Instagram A post shared by Aliza Sehar Official (@aliza.sehar.official) -
ఇన్స్టా కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్లో అప్డేట్ చేయగలుగుతారు. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! డెమో వీడియో ప్రకారం, వినియోగదారులు నోట్ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్లో పోస్ట్ చేయవచ్చు. ఇది తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. -
నాలాంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకున్నా: నయని పావని
బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్ మీడియా స్టార్ నయని పావని. అయితే హౌస్లో అడుగుపెట్టిన వారానికే ఎలిమినేట్ అయి అందరినీ షాకింగ్కు గురిచేసింది. ఈ ఎలిమినేషన్తో ఫుల్ ఎమోషనల్ అయ్యారు నయని పావని. ఏడుస్తూనే హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఎలిమినేషన్ తర్వాత ఇంటికెళ్లిన పావని.. తల్లిని చూసి కంటతడి పెట్టుకుంది. ఈ షో వల్ల నయని పావని ఇంటికొచ్చేసినప్పటికీ ఫుల్ పాపులారిటీ అయితే తెచ్చుకుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన నయని పావని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాన్న గురించి తలుచుకుంటూ ఫుల్ ఎమోషనల్ అయింది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) నయని పావని మాట్లాడుతూ.. 'మా ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకునేదాన్ని. మా నాన్న చనిపోయాక ఏం చేయాలన్నా ఖర్చు అవుతుంది. అది వీళ్లేవరికి అర్థం కాదు. కొందరు చాలా దారుణంగా మాట్లాడతారు. మీ నాన్న చనిపోయాక ఇలాంటి డ్రెస్సులు వేస్తారా? అని కామెంట్స్ పెడతారు. కొందరి కామెంట్స్ చూసి నాకు చాలా డిప్రెషన్కు గురయ్యాను. అసలు దానికీ, దీనికి సంబంధమేంటి? మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నా వీడియోలు, ఫోటోలు చూడకండి. ఆ సమయంలో అలాంటి కామెంట్స్ నాపై తీవ్ర ప్రభావం చూపాయి. అవీ చూసి నాకు చాలా బాధేసింది. మా ఫ్యామిలీ అంతా బాధలో ఉన్నాం. ఆ సమయంలో అందరూ ఇంత ఈజీగా ఎలా కామెంట్ చేస్తారా అనిపించింది. మాకు డబ్బులు సంపాదించాలని నాన్న ఎప్పుడూ చెప్పలేదు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదని అనేవారు. నన్ను చాలా గారాభంగా పెంచారు. మా నాన్నకు సర్జరీ సమయంలో ఫ్రెండ్స్, బంధువులు ఎవరూ ఫోన్ చేయలేదు. ఆ రోజు రాత్రి ఏడుస్తూనే ఉన్నా. నాకు ఎవరూ కాల్ చేయలేదంటీ? అని ఎంతో బాధగా అనిపించింది' అంటూ కన్నీటి పర్యంతమైంది. (ఇది చదవండి: బద్రి సినిమా ఇప్పుడే రిలీజైనట్లు ఉంది: రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!) -
మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..!
ఈ రోజుల్లో సాటి మనుషులపై, జంతువులపై దయ, ప్రేమ చూపేవారు చాలా అరుదైపోయారు. ఆపదలో ఉన్న జంతువులను, మనుషులను కనీసం పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో ఎవరైనా ఇతరులకు తోచిన సహాయం చేస్తూ కనిపించినప్పుడు జనం ఆ వ్యక్తిని అమితంగా గౌరవిస్తారు. ఇతరుల మీద దయ, ప్రేమలను ఎవరైనా చూపిస్తే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కుక్కను కాపాడుతూ కనిపించాడు. ‘ఎక్స్’లో గుడ్ న్యూస్ కరస్పాండెంట్ పేరుతో పోస్ట్ అయిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్లను చేరుకునేందుకు ఆ వ్యక్తి ట్రాఫిక్ను ఎంతో ధైర్యంగా దాటాడు. ఆ కుక్కకు ప్రేమతో కూడిన స్పర్శను అందించాడు. ఈ అద్భుతమైన క్లిప్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో 43 వేలకు మించిన వీక్షణలను దక్కించుకుంది. ఈ వీడియో మూగజీవాలపై చూపాల్సిన సానుభూతి గురించి తెలియజేస్తుంది. ఇది కూడా చదవండి: 4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? An angel saving another angel This kind soul spotted an abandoned puppy on a busy freeway and rushed to save him from a certain injury or worse. The herododges traffic and approaches the dog gently to gain his trust, petting him sweetly. pic.twitter.com/MtmxPQ8f77 — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 1, 2023 -
కారు చీకటిలో పెద్దపులి.. వీడియో వైరల్!
ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఇది ఊహకు వస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్కు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో @prashant_lmp పేరుతో ఉన్న ఖాతాతో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసినప్పుడు దీనిని వాహనంలో నుండి చిత్రీకరించారని గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ ‘ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అనిరాశారు. ఈ పోస్ట్ను రీపోస్ట్ చేస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారి రమేష్ పాండే ..‘చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర జంతువులకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుంది. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? यूपी के तराई में पड़ने वाले लखीमपुर खीरी जिले में टाइगर्स कुछ ऐसे गन्ने के खेतों में मस्ती भरी चाल से घूमते हैं। वीडियो कुकरा इलाके की बताई जा रही। #Canetigers@rameshpandeyifs @DudhwaTR @raju2179 pic.twitter.com/ewhdJvbcPJ — Prashant pandey (@prashant_lmp) September 30, 2023 -
కువైట్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!
కువైట్ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, ఏపీఎన్ఆర్టీసీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, ఏపీఎస్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్ పాల్గొన్నారు. కువైట్ నలుమూలాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపు 400 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ: జగనన్న మీద అభిమానమే మనల్ని అందరినీ ఒక చోటకు చేర్చింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. 175/175 టార్గెట్గా అందరం కలిసి పని చేద్దాం, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పేదల పక్షపాతి. అనుక్షణం పేదల కోసం పాటు పడుతున్నారు.. రాష్ట్ర ప్రజలకే కాదు ప్రవాసాంధ్రులకు సైతం ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చల్లా మధు సూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు మన సీఎం వైఎస్ జగన్ గారు తీసుకు వచ్చారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీఠ వేయడమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న గొప్ప నాయకుడికి మనం అందరం అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. (చదవండి: దుబాయ్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం) -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. -
ఆ హీరో కోసం పది వేల వాట్సాప్ గ్రూప్లు.. ప్లాన్ అదుర్స్!
కోలీవుడ్ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం ఆయన తన ప్రజా సంఘం ద్వారా తలపెడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలే. విజయ్ తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు పోతున్నారు అనే చెప్పాలి. నటుడుగా అశేష ప్రజాదరణ పొందుతున్న విజయ్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న విజయ్ ఇటీవల సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇటీవలికాలంలో విజయ్ ప్రజా సంఘం కార్యదర్శి బుస్సీ ఆనంద్ నిత్యత్వంలో స్థానిక పనైయూర్ లోని విజయ్ అభిమాన సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని 24 నియోజక వర్గాలకు చెందిన పలువురు సంఘ కార్యకర్తలు హాజరయ్యారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా..?) ఈ కార్యక్రమంలో టెక్నాలజీ వాడుకునే విధంగా 1600 వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేశారు ఈ సంఖ్యను 10 వేలకు చేర్చాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా గతంలో ఎండీఎంకే నేత విజయకాంత్ కూడా ఇదేవిధంగా తన అభిమానులను ప్రజల్లోకి పంపారు. కాగా నటుడు విజయ్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకపోయినా కొన్నింట్లో అయినా సత్తాచాటాలని యత్నిస్తున్నట్టు విజయ్ ప్రజా సంఘం నాయకుడొకరు పేర్కొన్నారు. -
1985లో టెన్త్.. 2023లో పీయూసీ.. విద్యాదాహాన్ని తీర్చుకుంటున్న ఆటోడ్రైవర్
బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్ ఇటీవల ఎక్స్(ట్విట్టర్)లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ట్వీట్ చేశారు. ఆటో డ్రైవర్ భాస్కర్తో తనకు ఎదురైన అద్భుత అనుభవాన్ని ఆమె ఆ పోస్టులో తెలియజేశారు. భాస్కర్ ఇటీవలే తన ప్రీ- యూనివర్శిటీ(పీయూసీ) పరీక్ష రాశారని తెలిపారు. నిధి తన పోస్టులో ఆటో డ్రైవర్ భాస్కర్ 1985లో స్కూలు మానివేసినప్పటి నుంచి ఉన్నత విద్య చదవాలనే తపనతో ఉన్నారన్నారు. ఆటో డ్రైవర్కు సంబంధించిన ఒక ఫొటోతో పాటు నిధి అగర్వాల్ ఇలా రాశారు ‘ఈరోజు ఓలాక్యాబ్స్ ఆటో ద్వారా భాస్కర్ పరిచయం అయ్యారు. ఈ రోజే ఆయన పీయీసీ పరీక్షలోని ఆంగ్ల ప్రశ్నాపత్రం రాశారు. భాస్కర్ 1985లో 10వ తరగతి పాసయ్యాక ఈ ఏడాది పీయూసీ పరీక్ష రాశారు. భాస్కర్ పిల్లలు స్కూలులో చదువుతున్నారు. భాస్కర్కు చదువుపై ఉన్న శ్రద్ధ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది’ అని రాశారు. నిధి అగర్వాల్ అందించిన ఈ పోస్టు ఇంటర్నెట్లో సందడి చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ పోస్టుకు 1,500కు మించిన వీక్షణలు దక్కాయి. దేశంలో ఐటీ హబ్గా పేరొందిన బెంగళూరులో ఇటువంటి అనేక కథలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! "Introducing Baskar ji, my @Olacabs auto companion today. He faced his English paper today, he is writing PUC exams this year after cleaning 10th in 1985. Father of two, with kids in 3rd and 6th grade. His enduring smile was truly motivating! @peakbengaluru pic.twitter.com/5R21YtdomZ — Nidhi Agarwal (@Ngarwalnidhi) August 26, 2023 -
ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..!
ఎక్కడ ఏకాస్త ప్రతిభ ఉన్నా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు తయారు చేస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు చక్రాలతో కూడిన విచిత్ర వాహనం కనిపిస్తుంది. వాహనానికి బైక్ ఇంజిన్ అమర్చారు. స్టీరింగ్ కోసం ప్రత్యేక డిజైన్ చేశారు. పాత వస్తువులతో వాహనం బాడీ తయారు చేశారు. అలాగే పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది. తరువాత ఈ వినూత్న వాహన తయారీదారులను మెచ్చుకోకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్లో @being_happyyy అనే పేరు కలిగిన అకౌంట్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్లో దేశీయ ఆవిష్కరణ అని రాశారు. 29 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని కనిపిస్తారు. ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో.. Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD — Neeraj M (@being_happyyy) July 27, 2023
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ‘సత్య’ మూవీ రివ్యూ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement