-
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మాస్ మహరాజ్ రవితేజ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". పెళ్లి సందడి ఫేమ్ డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా కనిపించనుంది.. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ను రవితేజ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు అల్ ది బెస్ట్ చెప్పారు.టీజర్ చూస్తే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్లో కనిపిస్తోంది. టీజర్ కాలేజీ సీన్స్, కామెడీ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం తలైవార్171. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేశారు. కూలీ పేరుతో టైటిల్ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు. రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ టీజర్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ టీజర్ను ఉద్దేశించి స్టార్ డైరెక్టర్ చేసిన పోస్ట్ కోలీవుడ్లో వివాదానికి దారితీసింది. రజనీకాంత్ కూలీ టీజర్ను ఉద్దేశించే వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని కొందరు కొట్టి పారేయగా.. మరికొందరు ఖండించారు. ఇంతకీ వెంకట్ చేసిన పోస్ట్ ఏంటి? అసలు అది ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం.దళపతి విజయ్ హీరోగా గోట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న దర్శకుడు వెంకట్ ప్రభు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కమర్షియల్ తమిళ సినిమా ట్రైలర్ ఫార్ములాపై చర్చించే రీల్ను ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. అందుకో కమెడియన్ కార్తీక్ కుమార్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాల ట్రైలర్స్ అన్ని ఓకే విధంగా ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ అల్ను వెంకట్ ప్రభు ఇన్స్టాలో పంచుకోవడంతో కాంట్రవర్సీగా మారింది.ఇదంతా రజనీకాంత్ కూలీ టీజర్ను ఉద్దేశించే పోస్ట్ పెట్టారని వెంకట్ ప్రభుపై నెటిజన్స్ మండిపడ్డారు. కూలీ టైటిల్ టీజర్ లక్ష్యంగా చేసుకున్నారని రజనీకాంత్ అభిమానులు ఆరోపించారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మద్దతుగా నిలిచారు. ఇదంతా జస్ట్ ఫన్నీ కోసమేనంటూ కొట్టిపారేశారు.తాజాగా తన పోస్ట్పై దర్శకుడు వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " కాదు.. ఇది మేమంతా చేస్తున్న కమర్షియల్ ఫ్లిక్ కోసమే.! అతను చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. మనం రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్కు భిన్నంగా ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఫ్యాన్స్ కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు " అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి వెంకట్ ప్రభు తెరదించారు. కాగా.. గతంలో అట్లీ మూవీ మెర్సల్ను సమయంలోనూ ట్రోలింగ్కు గురయ్యారు. ఇదిలా ఉండగా గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Breaking News 🚨 : Director @vp_offl reposted an Instagram story in which @Dir_Lokesh is being Mocked for #Coolie Title Teaser , Then Atlee .... Now Lokesh ... pic.twitter.com/AfN201kqGn— Let's X OTT GLOBAL (@LetsXOtt) April 28, 2024 -
హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్
చాలా ఏళ్ల నుంచి చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజా రవీంద్ర. ఇప్పుడు ఇతడు ప్రధాన పాత్రలో ఓ మూవీ చేశాడు. అదే 'సారంగదరియా'. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే నెలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) టీజర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. మూవీ యూనిట్కి విషెస్ చెప్పారు. ఓ మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి.. తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!) -
దేవర భామ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ చూశారా!
దేవర మూవీతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా జాన్వీ ప్రధాన పాత్రలో తెరెకక్కుతోన్న తాజా చిత్రం ఉలజ్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విదేశీ రాయబారి పాత్రలో కనిపించనుంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో గూఢచర్యంపై కథాంశంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతో యాక్షన్ అవతార్లోకి అడుగు పెట్టింది. కాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్లో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మెయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జంగిల్ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ యాక్షన్ జోనర్లో అడుగు పెట్టింది. కాగా.. టాలీవుడ్లో కొరటాల డైరెక్షన్లో వస్తోన్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత రామ్ చరణ్తోనూ జతకట్టనుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఆర్సీ16లో జాన్వీ హీరోయిన్గా నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్లోనూ కరణ్ జోహార్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. మరో క్రేజీ రికార్డ్ సొంతం!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న విడుదలైన పుష్ప-2 యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైమ్లో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగిన టీజర్గా నిలిచింది. ఇప్పటివరకు పుష్ప-2 టీజర్కు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥 Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥 ▶️ https://t.co/5Mvmxzyfrp Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/LderAMGCRg — Pushpa (@PushpaMovie) April 14, 2024 -
పుష్ప-2 టీజర్.. ఆ సినిమాను దాటలేకపోయింది!
ఐకాన్ స్టార్ పుష్ప-2 ది రూల్ చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు బర్త్ డే రోజే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్ను పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ను షేక్ చేసింది. ఒక్కసారిగా నంబర్వన్ ప్లేస్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. అయితే ఆ ఒక్క విషయంలో మాత్రం పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ప్రభాస్ సలార్ మూవీ టీజర్ రికార్డ్ను అధిగమించలేకోపోయింది. సలార్ టీజర్ రిలీజైనప్పుడు కేవలం 6 గంటల 15 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అదే లైక్స్ పుష్ప-2 టీజర్కు రావడానికి 9 గంటల 59 నిమిషాలు పట్టింది. ఇక ఇదే జాబితాలో ఆర్ఆర్ఆర్ చిత్రం 36 గంటల 4 నిమిషాలతో మూడుస్థానంలో ఉంది. ఏదేమైనా యూట్యూబ్లో మాత్రం రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్టాపిక్గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
Pushpa 2 Teaser Photos: చీర కట్టులో పుష్ప రాజ్ విశ్వరూపం
-
Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ.., నీ యవ్వ తగ్గేదేలే.. ఈ డైలాగులకు రికార్డులు తగలబడిపోయాయి. అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడుతుంటే జనాలకు భలే గమ్మత్తుగా అనిపించింది. అభిమానులకైతే సినిమా చూసిన తర్వాత ఎక్కిన మత్తు అంత ఈజీగా దిగలేదు. ఇప్పుడు మరోతూరి అందర్నీ పిచ్చెక్కించేందుకు రెడీ అయిపోయాడు పుష్ప. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప:ది రూల్ సినిమా టీజర్ను చెప్పిన టయానికి టంచనుగా రిలీజ్ చేశారు. అమ్మోరు గెటప్లో బన్నీ పుష్పగాడు సిండికేట్ అయ్యాక తన రేంజే పెరిగింది. శ్రీవల్లి ఒంటినిండా నగలతో మెరిసిపోయినట్లు పోస్టర్స్లో చూపించారు. టీజర్లో మాత్రం హీరో అమ్మోరు గెటప్లో కనిపించారు. ఊచకోత తర్వాత చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు. డైలాగ్ మాత్రం లేదు. టీజర్ నిడివి కేవలం ఒక్క నిమిషమే ఉంది. అయినా సరే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. పుష్పరాజ్ను చూస్తుంటే పాత రికార్డులు పాతరేసి.. గంగమ్మ జాతర జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనబడ్తా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ ఈపారికి టీజర్తో కడుపు నింపేసుకుంటామంటున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బాక్సాఫీస్ను రూల్ చేసేందుకు పుష్ప ఆగస్టు 15న రాబోతున్నాడు. చదవండి: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే -
Pushpa 2: The Rule Teaser: పుష్ప టీజర్ అప్డేట్.. గూస్బంప్స్ ఖాయమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా టీజర్ టైమింగ్ను రివీల్ చేశారు మేకర్స్. బన్నీ బర్త్ డే రోజున 11:07 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గూస్ బంప్స్ గ్యారంటీడ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో పుష్ప అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #Pushpa2TheRule teaser tomorrow at 11:07AM. pic.twitter.com/utmMi2Hdyu — Allu Arjun (@alluarjun) April 7, 2024 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 is the day ❤️🔥 𝟏𝟏.𝟎𝟕 𝐀𝐌 is the time ❤️🔥#Pushpa2TheRuleTeaser will mark the entry of #PushpaRaj that will create ripples across the box office💥💥 𝗚𝗢𝗢𝗦𝗘𝗕𝗨𝗠𝗣𝗦 𝗚𝗨𝗔𝗥𝗔𝗡𝗧𝗘𝗘𝗗 🔥#PushpaMassJaathara #Pushpa2TheRule pic.twitter.com/kMTYEgx8GB — Pushpa (@PushpaMovie) April 7, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్తో వచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పుష్ప స్టైల్లో దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ నిలిచారు. #Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh — Allu Arjun (@alluarjun) April 2, 2024 Let the #PushpaMassJaathara begin 💥 𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗔𝗪𝗔𝗜𝗧𝗘𝗗 #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️🔥❤️🔥 He is coming with double the fire 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024. Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/gCPRAxqoPh — Pushpa (@PushpaMovie) April 2, 2024 -
ఐదు భాషల్లో డబ్బింగ్
‘నేను సూడలేదని ఓ పులుపెక్కి పోతాండవట కదా..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా అదో రకం మాస్ స్టయిల్లో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ కూర్గ్ బ్యూటీ ‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ ఆ సినిమాలో తాను చేసిన శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ మధ్యకాలంలో సంచలన విజయం సాధించిన ‘యానిమల్’కి హిందీలోనూ, ఆ చిత్రం తెలుగు, కన్నడ అనువాదాలకూ తన పాత్రకు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు ఏకంగా ఐదు భాషలు మాట్లాడారు రష్మికా మందన్నా. తాను లీడ్ రోల్ చేస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రం టీజర్కి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పారు రష్మిక. ఆమె మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారి. ఐదు భాషల్లోనూ రష్మిక డబ్బింగ్ చెప్పిన విధానం అద్భుతం అని కొనియాడుతున్నారు ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రదర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఐదు భాషల టీజర్ విడుదల కానుంది. మరి.. రష్మికతో టీజర్కి డబ్బింగ్ చెప్పించిన రాహుల్ పూర్తి పాత్రకు ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి. -
పుష్ప-2 క్రేజీ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ లీక్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్తో పాటు యాగంటిలో పుష్ప-2 షెడ్యూల్ జరిగింది. దీంతో పుష్ప-2 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ పుష్ప-2 అప్డేట్ గురించి ప్రశ్నించాడు. చాలా మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ని సోషల్ మీడియా వేదికగా ఆరా తీశారు. వారికి ట్వీట్కు స్పందించిన శరత్ పుష్ప టీజర్ అప్ డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ వస్తుందని కామెంట్ చేశాడు. ఇది చూసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Teaser untundi birthday ki…Fix — Sarath Chandra Naidu (@imsarathchandra) March 29, 2024 -
‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ నుంచి కొత్త టీజర్
ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, పీటర్ మకాన్, విలియమ్ హెచ్. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. వెస్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 10న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ‘వెల్కమ్ టు మై కింగ్డమ్’, ‘బెండ్ ఫర్ యువర్ కింగ్’, ‘..నెవర్’ అనే డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ రీ బూట్ సిరీస్లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2011)’, ‘డ్వాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2014), ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. -
నువ్వు ఇంస్ట్రుమెంట్ వాయిస్తున్నావా?.. గేదెను గోకుతున్నావా?.. ఆసక్తిగా టీజర్!
ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం నీ దారే నీ కథ. ఈ చిత్రానికి వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా ఉంటూ దర్శకత్వం వహిస్తున్నారు. జేవి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తేజేష్ మాట్లాడుతూ.. 'ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నా మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కు వచ్చిన ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. 'సినిమా మీద ఉన్న ప్యాషన్తోనే నిర్మించాం. బుడాపెస్ట్లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. మీడియా, ప్రేక్షకులు మాలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసి సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ..'నేను న్యూయార్క్లో డైరెక్షన్ గురించి చదువుకుని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆల్బర్టో గురియోలి సంగీతమందిస్తున్నారు. -
సూర్య 'కంగువ' టీజర్.. కళ్లు చెదిరిపోయేలా విజువల్స్!
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ తాజాగా విడుదల అయింది. పీరియాడికల్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘కంగువ’ టీజర్.. పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులందరినీ మెప్పించింది. అందులో సరికొత్త అవతారంలో ప్రేక్షకుల్ని సూర్య మెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్ను చూస్తుంటే సూర్య నట విశ్వరూపం ఏంటో ఇండియన్ బాక్సాఫీస్కు చూపెట్టనున్నారని తెలుస్తోంది. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న కంగువ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగనుంది. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని నిర్మాత ధనంజయన్ గతంలో చెప్పారు. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించే ప్లాన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. కంగువా టీజర్ చూస్తే విజువల్ వండర్గా ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్ను ఈ టీజర్ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్ను దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్తో కంగువ చేసిన రూత్లెస్.. ఫెరోషియస్ ఫైట్ టీజర్లో హైలైట్గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్లో కనిపించింది. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
'అమ్మాయిని వదిలేసి ఆంటీ వెనక పడ్డావా?'.. ఆసక్తిగా టీజర్!
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. గతేడాది మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి మాస్ సినిమాలు చేసిన మళ్లీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రలో నరేశ్ కనిపించనున్నారు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని.. లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ మొదలైంది. దీంతో నీ పెళ్లెప్పుడు అంటూ అల్లరి నరేశ్ను అందరూ ఆట పట్టిస్తుంటారు. అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తారు. పెళ్లి అనే కాన్సెప్ట్తో ప్రేక్షకులను కామెడీ అందించేందుకు నరేశ్ రెడీ అయిపోయారు. టీజర్ చూస్తే నరేశ్ మరోసారి తన మార్క్ కామెడీని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. -
'ఒకసారి డేట్కు పిలిస్తే కదా తెలిసేది'.. టీజర్తోనే భయపెట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'లవ్ మీ'. ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో సరికొత్త ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్గా అరుణ్ భీమవరపు దర్శకత్వం తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రాన్ని హారర్ జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు భయపెడుతూనే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. గతంలో దెయ్యం కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ దెయ్యంతో హీరో ప్రేమను కొనసాగించడం కాస్తా ఆసక్తిని పెంచుతోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. 'లవ్ మీ' ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్లైన్తో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. -
మృణాల్ అలాంటి పిలుపు.. ఏం కావాలంటోన్న విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీకి సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ టీజర్ నంబర్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అంతే కాకుండా మృణాల్ ఠాకూర్ క్యూట్గా విజయ్ను పిలుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఏవండీ.. ఏవండీ.. అంటూ మృణాల్ పిలవగా.. ఆ.. ఏం కావాలి? అంటూ మన హీరో రిప్లై ఇచ్చాడు. దీనికి మృణాల్ నవ్వులు చిందిస్తూ చిందులు వేస్తూ కనిపించింది. మృణాల్ అలా ప్రేమగా పిలవడంతో మా సెట్ వెలిగిపోతోందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అదేంటో మీరు చూసేయండి. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. #FamilyStar trending at No 1 ❤️ And @mrunal0801 is glowing in your love and lighting up our set with “THE PILUPU”https://t.co/gRbhprx4rV pic.twitter.com/D4d8u17jgR — Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2024 -
పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా
‘గీతగోవిందం’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. ‘‘ఏమండి.. నేను కాలేజీకి వెళ్లాలి... కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్), ‘ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’(విజయ్ దేవరకొండ)’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం గోపీ సుందర్, కెమెరా: కేయూ మోహనన్. -
'లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా'.. అంచనాలు పెంచుతోన్న టీజర్!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్ ఫుల్ ఫ్యామిలీ మ్యాన్లా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. అంతే కాదు.. ఊర మాస్ ఫైట్స్తో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. గోపీ సుందర్ కంపోజ్ చేసిన 'దేఖొరో దెఖో' అనే సాంగ్తో హీరో క్యారెక్టరైజేషన్ వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకునే పాత్రలో విజయ్ కనిపించారు. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. అతను వేస్తే బడ్జెట్ షాక్.. ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్ అవుతుంది. టీజర్ చివర్లో హీరోయిన్ మృణాల్ 'నేను కాలేజ్కు వెళ్లాలి.. కొంచెం దించేస్తారా..' అని అడిగితే..'లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా' అనే డైలాగ్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Sorry thalli, ochestundi..❤️ Next few minutes lo teaser upload aipotundi.. Ee saari naa guarantee.. https://t.co/TbfzSDgWOf — Vijay Deverakonda (@TheDeverakonda) March 4, 2024 -
'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా!
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్నడు లేని విధంగా ఆడియన్స్కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఈనెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్ లాంఛ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻 Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju… pic.twitter.com/dAqb09Vddh — Telugu FilmNagar (@telugufilmnagar) February 22, 2024 -
లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ‘వాస్తవం’
మేఘశ్యాం, రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘వాస్తవం’. జీవన్ బండి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అంజనిసూట్ ఫిలిమ్స్ సంస్థ పై ఆదిత్య ముద్గల్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ : ‘ఈ సినిమా ఇష్టంతో చాలా కష్టపడి తీసాం. డైరెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ.. ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్టులు నాకు చాలా సపోర్ట్. పి. ఆర్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖ నిరోషా చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు. ‘ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అందరికీ నచ్చే కథ అవుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’అని హీరోయిన్ రేఖ నిరోషా అన్నారు. ‘నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను’ అని హీరో మేఘ శ్యాం అన్నారు. -
Deadpool & Wolverine:మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేసింది!
మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్పటికే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్పూల్ & వోల్వారిన్’ .ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్పూల్గా ర్యాన్ రేనాల్డ్స్ మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?
గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఆదా శర్మ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదానికి దారితీసింది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ.. కమర్షియల్గా సక్సెస్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తోన్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్. నక్సలిజం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్గా కనిపిస్తోంది. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్లో పాకిస్థాన్తో పోరాడి కన్నుమూసిన జవాన్ల కంటే.. నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువగా ఉందంటూ అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్లో జరిగిన మారణహోమంలో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్తో యూస్ ఉండదట!
కేకేఆర్ ఆల్రౌండర్కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
RCB vs DC: మరో కీలక మ్యాచ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement