-
బ్లూ వేల్స్ నాలుక అంత బరువా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు
బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు. అంతరించిపోతున్న వాటిల్లో అతి పురాతన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో చూడవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో ఆర్కిటిక్ నీటిలో ఉంటుంది. శీతాకాలంలో దక్షిణ (వెచ్చని) జలాలకు వలసపోతాయి. బ్లూవేల్స్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు. ♦ బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు . దీని బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు అంటే దాదాపు 100-150 టన్నుల సమానం. ♦ బ్లూ వేల్స్ 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ♦ బ్లూ వేల్ నాలుక బరువు ఆఫ్రికా ఆడ ఏనుగు బరువు సుమారు 2.7 టన్నులు ఉంటుంది. ♦ నీలి తిమింగలం నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు. ♦ నీలి తిమింగలం గుండె మినీ కూపర్ (కారు) పరిమాణంలో ఉంటుంది. ♦ తిమింగలం పొడవు రెండు పాఠశాల బస్సుల పొడవుకు సమానం మరియు వాటి బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు సమానం ♦ ఇది గ్రహం మీద అతి చిన్న జంతువులలో ఒకదానిని క్రిల్ (రొయ్యల లాంటిది) తింటుంది ♦ బ్లూ వేల్ ప్రతిరోజూ 4 నుండి 6 టన్నుల క్రిల్ తింటుంది. ఫీడింగ్ సీజన్లో, బ్లూ వేల్ ప్రతిరోజూ 3600 చేపలను తింటుంది. ♦ గర్భం దాల్చిన ఒక సంవత్సరం తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. ఈ బుల్లి వేల్ దాదాపు 3 టన్నుల బరువు ఉంటుంది. ♦ ఈ బేబీ వేల్ ప్రతిరోజూ 100 గ్యాలన్ల పాలు తాగుతుంది, ప్రతి గంటకు 9 పౌండ్లు (రోజుకు 200 పౌండ్లు) పెరుగుతుంది. ♦ ఇవి ఈత కొడుతూ నిద్రపోతాయి. తిమింగలాలు నిద్రపోతున్నప్పుడు మెదడులో సగం మాత్రమే ఉపయోగిస్తాయట. -
‘ఆ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షలు’
హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్లో కలకలం రేపాయి. ఈ నేపధ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్లను అతికించింది. పాట్నాలోని బీహార్ శాసనసభ సభ్యుల ఫ్లాట్ల దగ్గర ‘శివ భవానీ సేన’ ఆర్జేడీ ఎమ్మెల్యేకు సంబంధించిన పోస్టర్ను అతికించింది. అందులో ఈ రివార్డ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బహదూర్ సింగ్ స్పందిస్తూ ‘శివ భవానీ సేన’పై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటన చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు లేఖ రాశానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ పేరుతో పలు గోడలపై కొన్ని చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేను చెప్పిన మాటను ఉదహరిస్తూ.. ‘ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం, పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం’ అని రాసివుంది. ఇది గుడి గంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు పయనిస్తున్నామని, బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తున్నామనే సందేశం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకోండి’ అని దానిలో రాసివుంది. కాగా ఆ పోస్టర్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ గురించి పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హిందూ శివ భవానీ సేన ఈ ప్రకటనను తప్పుబట్టింది. ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు చేశారని, అతని నాలుకను తెగ్గోసినవారికి రూ. 10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. ఫతే బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. -
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం ఈ వేరియంట్ కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో 0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్గా వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్.1 వేరియంట్ను ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్తో సహా 12 దేశాలలో కనుగొన్నారు. కోవిడ్ టంగ్ ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి కోవిడ్లో కీలక లక్షణాలు. అయితే, ఈ కొత్త వేరియంట్ సోకిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్ హెచ్వీ.1, పిరోలా జాతి జేఎన్.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం వైరస్తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు. ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఎక్కువ మ్యుటేషన్ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు. -
పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని జస్టిన్ ట్రూడో చేష్టలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ప్రదర్శించాల్సిన తీరుకాదని విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ కొలువుదీరిన నేపథ్యంలో జస్టిన్ ట్రూడో నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ గ్రెగ్ ఫెర్గస్.. ప్రధాని జస్టిన్ ట్రూడోను సభకు పరిచయం చేస్తూ..'గౌరవనీయులైన ప్రధాని' అని సంబోధించారు. ఇంతలోనే ట్రూడో మధ్యలో కలగజేసుకుని 'చాలా గౌరవనీయులైన ప్రధాని' అని సరిచేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ గ్రెగ్ వైపు చూస్తూ నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. The rig is in. Canadian Prime Minister Justin Trudeau gives a wink and bites his tongue at new Speaker of the House of Commons, Greg Fergus. What is going on in Canada? Fergus, who is a liberal, was elected after the previous speaker was forced to resign for praising a Nazi on… pic.twitter.com/WjuaaVuLIu — illuminatibot (@iluminatibot) October 4, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని స్థానంలో ఉండి ట్రూడో వైకరి చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కన్నగీటడం, నాలుకతో సంజ్ఞలు సాధారణ పౌరులకే ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటిది పార్లమెంట్ సాక్షిగా ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షనాయకులు విమర్శలు సందించారు. నాజీ సైన్యంలో పనిచేసిన ప్రముఖునికి పార్లమెంట్లో గౌరవసన్మానం చేసిన వ్యవహారంలో మాజీ స్పీకర్ ఆంటోని రోటా తన పదవికి రాజీనామా చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. యూదులను ఊచకోత కోసిన హిట్లర్ తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తికి సన్మానం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో మాజీ స్పీకర్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదీ చదవండి: మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్ -
ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..
మాట్లాడుతూ లేదా భోజనం చేస్తూ నాలుక కరుచుకోవడం అనేది సర్వసాధారణం. కరచుకున్న వెంటనే బాధగా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి లేదా మరుసటి రోజుకి తగ్గిపోతుంది. అంత సీరియస్ అయిన ఘటనలు ఇంతవరకు జరగలేదు కూడా. కానీ ఇక్కడొక మహిళకు ఎదురైన విపత్కర స్థితిని చూస్తే మాత్రం వామ్మో!నాలిక కరచుకుంటే ఇంతలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ మహిళ భోజనం చేస్తూనే అనుకోకుండా నాలిక కరుచుకుంది. అదే ఏకంగా ఆమె ప్రాణాలను కోల్పోయే స్థితికి దారితీసింది. ఈ అనుహ్య ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..27 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ కైట్లిన్ అల్సోప్ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా నాలుక కరుచుకుంది. ఆ టైంలో ఆమెకు కాస్త నొప్పిగా అసౌకర్యంగా అనిపించింది. సర్వసాధారణంగా జరిగేదే కదా అని తేలిగ్గా తీసుకుంది. అంతే కొన్ని గంటలకే ఊపిరి ఆడటం, శ్వాస తీసుకోవటం కష్టమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా స్నేహితులంతా ఆమె పరిస్థితిని చూసి కంగుతిన్నారు. వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ కేసు అంటూ టెస్ట్లు చేయడం ప్రారంభించారు వైద్యులు. ఆమె ఒక విధమైన అనాఫిలాక్సిస్ అనే ఎలర్జీకి గురయ్యిందని చెప్పారు. తక్షణమే కొన్ని మందులు ఇచ్చి పరిస్థితి నార్మల్కి వచ్చేలా యత్నించారు వైద్యులు. ఐతే అనూహ్యంగా ఆమె పరిస్థితి విషమంగా మారడం ప్రారంభమైంది. చూస్తుండగానే చర్మం ఎరుపు నుంచి నీలం రంగులోకి వచ్చేసింది. ఆమె నాలుకు నల్లగా అయిపోవడం జరిగింది. ఇక ఆమె నాలుకను తీసేయాల్సి వస్తుందని భావించి వెంటనే అప్రమత్తమయ్యి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి ఆమె అరుదైన లుడ్విగ్స్ ఆంజినా అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది నోరు, మెడ వరుకు ఉన్న మృదుకణజాలంపై ప్రభావం చూపే ప్రాణాంతక సెల్యూటైటిస్గా పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఆమె నోటిలో ఉండే జ్ఞాన దంతాల కారణంగా వచ్చిందని, ఇది ఆమె నోటిలోకి వేగంగా వ్యాపించడం ప్రారంభించిందని అన్నారు. ఇదికాస్త సెప్సిస్కి గురయ్యి అవయవాన్ని తీసేయాల్సిన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు వైద్యలు. తక్షణమే చికిత్స అందించేందుకు ఆమెకు మత్తు ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నందున్న ఇతర అవయవాలు మూసుకుపోకుండా చూసుకోవాల్సి ఉందని ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్ అని చెప్పారు. సూమారు గంటపాటు వైద్యలు శ్రమించి కొద్దిపాటి శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే క్లైటిన్ కోలుకుంటోంది. లుడ్విగ్ ఆంజినా అంటే.. ఇటీవల జరిగిన గాయం ఇన్ఫెక్షన్కి గురయ్యినా లేదా మధుమేహం, మద్యపానం, పోషకాహారలోపం తదితరాల కారణంగా గాయలైతే అది లుడ్విగ్ ఆంజినా అనే ఎలర్జీకి గురయ్యి రోగి పరిస్థితిని దిగజారస్తుంది. ఇది సాధారణంగా దంతాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందట. దాదాపు 10 నుంచి 9 కేసుల్లో దవడలోని రెండవ లేదా మూడవ దంతాల నుంచి మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని లక్షణాలు మాట్లాడటం కష్టం అధిక జ్వరం, చలి దవడలో నొప్పి మెడ నొప్పి వాపు వాచిపోయిన నాలుక నోరు సున్నితత్వం మారడం తీవ్రమైన పంటి నొప్పి నివారణ: లుడ్విగ్ ఆంజినాను నివారించాలంటే నోటి పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు వైద్యులు. దంతాలు పుచ్చిపోకుండా చూసుకోవాలని చెప్పారు. దంతాల ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దంతాలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండేలా చేస్తుందని కూడా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు. (చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!) -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
బడ్జెట్లో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ..ఓహ్ !సారీ అంటూ...
లోక్సభలో 2023-24 బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికరమైన పొరపాటు చేశారు. ఆమె అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యి అన్న మాటతో అక్కడ ఒక్కసారిగా లోక్సభలో నవ్వులు విరబూశాయి. వెహికల్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతూ ఆమే ఓల్డ్ పొల్యూషన్ వెహికల్స్ బదులుగా ఓల్డ్ పాలిటిక్స్ అన్నారు. దీంతో అక్కడ అర్థమే మారిపోయిందంటే పాత రాజకీయాలను తొలగించటం అన్నట్లు అర్థం వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. అయితే ప్రతి పక్షాల సభ్యుల ముఖాలు ఎలాంలి భావాన్ని వ్యక్తం చేయాలేదు. ఐదే ఈ తప్పిదాన్ని నిర్మలమ్మ వెంటనే గమనించి చిరునవ్వుతో..ఓహ్ సారీ అంటూ సరైన వివరణ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా పాత కాలుష్య వాహనాలను మార్చడం అని పలుమార్లు తప్పిదాన్ని సరిచేస్తూ చెప్పారు. అంతేగాదు పాత కాలుష్య వాహనాలను మార్చడం మన ఆర్థిక వ్యవవస్థను పచ్చగా మార్చడంలో ముఖ్యమైన భాగం అని నిర్మలమ్మ చెప్పారు. అలాగే బడ్జెట్ 2021-22లో పేర్కొన్న వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కొనసాగించడంలో రాష్ల్రాలకు కూడా మద్దతు ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. (చదవండి: పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ) -
యూపీలో దేవతకు నాలుక సమర్పణ
లక్నో: ఉత్తరప్రదేశ్లో భక్తి పారవశ్యంలో మునిగిన ఓ భక్తుడు ఏకంగా నాలుక తెగ్గోసుకున్నాడు! కౌషాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్.. మెహందీగంజ్లోని మాతా శీతలాదేవి మందిరానికి భార్యతో కలిసి వెళ్లాడు. ఆలయదర్శనానికి ముందు గంగానదిలో పుణ్యస్నానం చేశాడు. తర్వాత బ్లేడుతో తన నాలికను కత్తిరించుకుని ఆలయ ద్వారం వద్ద సమర్పించాడు. నాలుక తెగడంతో కొద్దిసేపటికే సంపత్ పరిస్థితి దారుణంగా తయారైంది. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కరా ధామ్ పోలీస్స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ అభిలాష్ తివారీ చెప్పారు. ఇంత పని చేస్తాడనుకోలేదంటూ భార్య వాపోతోంది. చదవండి: అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ -
వైరల్ వీడియో.. ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు..
కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు. అయితే, ఒకసారి ఒకదాన్నే రుచి చూసి చెప్పగలరు. అదేంటి ఎవరైనా ఒకసారి ఒకదాన్నే రుచి చూడగలరు అంటారా? కానీ బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు. ఆమె నాలుక అలాంటిది మరి! అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్.. అదేనండి శరీరంలో మార్పులు చేసుకోవడమంటే మహా సరదా. సర్జరీ ద్వారా ఆమె తన నాలుకను రెండుగా స్ప్లిట్ చేయించుకుంది. ఇటీవల ఆమె ఒక గ్లాస్లో స్ప్రైట్ కూల్డ్రింక్, మరోగ్లాస్లో మంచినీళ్లు పెట్టుకుని రెండింటిని ఒకేసారి తాగి తన స్ప్లిట్ నాలుకతో రెండింటి రుచులు చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా పిచ్చపిచ్చగా లైక్స్ వచ్చాయి. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 2,28,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఈ స్ప్లిట్ టంగ్ అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. చదవండి: చేనులో చేపలే పంట! View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) -
ష్యాషన్ కోసం నాలుకను రెండుగా విడగొట్టింది...ఆ తర్వాత
Woman With Split Tongue Tastes 2 Drinks At: చాలామంది యువత ఫ్యాషన్ మాయలో పడి విచిత్రమైన విధంగా తమ శరీరం సౌష్టవాన్ని మార్చుకుంటుంటారు. అంతేందుకు కొంతమంది మగవాళ్లు చెవులకు రింగులు పెట్టుకోవడాలు, టాటులు వేయించుకోవడం వంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు చెవులకు రింగులు కుట్టించుకుంటే వీళ్లు నాలుకకి, నోటికి రింగులు పెట్టుకుంటున్నారు. పైగా జుట్టుకు కూడా విచిత్రమైన రంగురంగుల డైలు వేసుకుని దెయ్యాన్ని తలపించేలా రెడీ అవుతున్నారు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక ఆమె ఫ్యాషన్ కోసమో లేక మరేందుకో గానీ నాలుకను రెండుగా విడగొట్టుకుంది. పైగా ఇప్పుడు తాను ఒకేసారి రెండు రకాల పదార్థాలను టేస్ట్ చేయగలనని మరీ చెబుతోంది. వివరాల్లోకెళ్తే.... కాలిఫోర్నియాలో నివసిస్తున్న బ్రియానా మేరీ షిహదేహ్ ఆమె తన శరీరాన్ని రకరకాలు మార్చుకోవడం ఆమెకు ఇష్టం. ఈ మక్కువతోనే తన నాలుకను శస్త్ర చికిత్స ద్వారా రెండుగా విడదీసింది. అంతేగాదు మీరెప్పుడైన రెండు రకాల ఆహార పదార్ధాలను ఒకేసారి టెస్ట్ చేయగలిగారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఆమె రెండు రకాల ఆహార పదర్థాలను ఎలా టేస్ట్ చేయగలదో కూడా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) (చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు...) -
ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా!
Man Starts Growing Thick Black Hair: ఇంతవరకు మన చాలా అరుదైన వ్యాధులు గురించి విన్నాం. పైగా వాటిలో చాలా మటుకు జన్యు సంబంధ సమస్యల వల్ల సంభవించినవి. అయితే కొన్ని రకాలైన వ్యాధులు వ్యక్తిగత అపరిశుభ్రత వల్లనో లేక మరేదైన కారణం వల్లనో తెలయదు గానీ చాలా విచిత్రంగా వస్తుంటాయి. అవి కాస్త డాక్టర్ వద్ద చెప్పడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అరుదైన విచిత్రమైన వ్యాధితోనే బాధడపడుతున్నాడు. వివరాల్లోకెళ్లే..50 ఏళ్ల వ్యక్తికి నాలుక పై దట్టమైన జుట్టు పెరడం ప్రారంభించింది. దీంతో అతను వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతనికి లింగువా విల్లోసా నిగ్రా లేదా నల్లటి వెంట్రుకల నాలుక అనే అసాధారణ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధికి ముందు అతను పక్షవాతానికి గురయ్యాడు. అతని సంరక్షకులు ఆ సమయంలో అతని నాలుక పై నల్లటి మచ్చలు రావడం గమినించామని చెప్పారు. కానీ అవి కాస్త దట్టంగా వచ్చేంత వరకు అది జుట్టు అని వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో వాళ్ల చర్మవ్యాధి నిపుణిడిని సంప్రదించారు. అప్పడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యులు ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందనే దానిపై పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ మేరకు బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల పెరుగుదలను తనిఖీ చేసే నిమిత్తం అతని నోటి నుంచి శ్లేష్మ నమూనాలను తీసుకున్నారు. అవన్నీ ప్రతికూత ఫలితాలనిచ్చాయి. దీంతో అతను ఒక అరుదైన నల్లని వెంట్రుకల నాలుక(బీహెచ్టీ) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. నాలుక ఉపరితలంపై చిన్న, కోన్-ఆకారపు గడ్డలు, ఫిలిఫార్మ్ పాపిల్లే అని పిలవబడేవి, షెడ్, లేనప్పుడు ఈ వెంట్రుకలు వస్తాయిని చెప్పారు. నిజానికి మనం బ్రెష్ చేసినప్పుడు ఈ పాపిల్లే అని పిలవబడే షెడ్ క్లీన్ అయ్యి అవి కొంచెంగా పెరుగుతుంటాయి. అదిగాక నాలుక సాధారణ రాపిడికి గురి కానప్పుడూ ఇలాంటి సమస్య తలెత్తుందని చెప్పారు. అంతేకాదు సాధారణ నోటి పరిశుభ్రత పద్ధతులతో మనిషి నల్లటి వెంట్రుకల నాలుక త్వరగా క్లియర్ అవుతుందని చెప్పారు. వైద్యులు సూచనతో ఆ వ్యక్తి ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నెమ్మదిగా రికవరి అవుతున్నాడు. నోటి అపరిశుభ్రత వల్లే ఇలాంటి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది -
రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!
ఇంతవరకు ఈజిప్టులో పిరమిడ్ రూపంలో మమ్మీలుగా పిలిచే సమాధులు ఉన్నాయని మనం విన్నాం. అంతేగాక ఆ సమాధులు రాజ వంశానికి చెందిన వారివి అని, పైగా వారు వాడిన వస్తువులు అన్నింటిని ఆ సమాధిలో భద్రపరిచేవారని విన్నాం. కానీ ఈజిప్టులో ఇంకా కొన్ని సమాధులపై పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతూ....పరిశోధనలు చేస్తూనే ఉంది. అయితే ఆ క్రమంలోనే ఈజిప్టు పురావస్తు శాఖ ప్రస్తుతం ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించడమే కాక బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) అసలు విషయంలోకెళ్లితే....కైరోలోని పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. పైగా ఈ సమాధులను స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా కనుగొన్నట్లు తెలిపింది. అంతేకాదు బార్సిలోనా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన మిషన్ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు. పైగా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో కవర్తో కూడిన సున్నపురాయి శవపేటికను గుర్తించినట్లు చెప్పారు. అయితే సమాధి యొక్క ప్రాథమిక అధ్యయనాల్లో ఇది గతంలో పురాతన కాలంలో తెరివడబడినట్లు వాజీరి పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండోవ సమాధి మాత్రం త్రవ్వకాల సమయంలో మిషన్ సాయంతో దానిని మొదటిసారిగా తెరిచినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, మానవ ముఖంతో ఉన్న సున్నపురాయి శవపేటిక ఏ మాత్రం చెక్కు చెదరకుండా మంచి స్థితిలో రెండవ సమాధిలో ఉన్నట్లు మిషన్ త్రవ్వకాలను పర్యవేక్షించే హసన్ అమెర్ చెప్పారు. అయితే ఒక కుండలో ఫైయన్స్తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని హసన్ చెప్పారు. ఈ మేరకు హసన్ ఇటీవల కాలంలో ఈజిప్టులో ఫారోనిక్ సమాధులు, విగ్రహాలు, శవపేటికలు, మమ్మీలతో సహా అనేక పురావస్తు ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!
రెండు తలల పాములను చూసి ఉంటాం. అంతేందుకు అవిభక్త కవలలు అంటూ మనుషులను కూడా చూసి ఉంటారు. అయితే రెండు తలలు బల్లులను ఎప్పుడైన చూశారా. అంతేకాదు అవి ఉంటాయని కూడా అనుకోరు. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడొక రెండు తలలతో చాలా వింతగా కూడా ఉంది. పైగా దాని నాలుక నీలి రంగులో ఉంటుందట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!. అయితే దీనికి సంబంధిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. లక్షల్లో వ్యూస్, లైక్లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: గతేడాది చనిపోతే!... ఇప్పుడు మృత దేహాలను ఇచ్చారు!!) View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) -
తేనెను జుర్రేసే ప్రత్యేక పురుగు.. దీని నాలుక ఎంత పెద్దదో తెలుసా?
తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక (గొట్టం వంటి ప్రత్యేక నిర్మాణం) చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్ మోత్ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక ఎంత పెద్దదో తెలుసా.. ఏకంగా 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్ మోత్ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు. చదవండి: మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్ చూడక ముందే ఊహించి.. జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్కు ఈ చిమ్మట పురుగుకు ప్రత్యేక సంబంధం ఉంది. మడగాస్కర్లో చెట్లు, మొక్కలను పరిశీలిస్తున్న క్రమంలో డార్విన్కు ‘అంగ్రాకమ్ సెస్కీపెడబుల్’గా పిలిచే ఒకరకం ఆర్కిడ్ పూల మొక్క కనబడింది. దాని పూల కాడలు చాలా పొడవుగా ఉండి.. కిందివైపున తేనె (నెక్టార్) ఉన్నట్టు గుర్తించారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు ఇలాంటి పూల నుంచి తేనె పీల్చే సామర్థ్యమున్న పురుగులు ఉండి ఉంటాయని, వాటి నాలుక చాలా పొడవుగా ఉంటుందని 1862వ సంవత్సరంలోనే డార్విన్ అంచనా వేశారు. కానీ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా ఎవరూ ఆ పురుగులను గుర్తించలేకపోయారు. 1903వ సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తలకు ఈ పురుగు కంటబడింది. దానిని ముందే ఊహించిన డార్విన్ పేరిటే దీనికి ‘డార్విన్స్ మోత్’ అని నామకరణం చేశారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వింత వ్యాధి కలకలం.. పసుపు పచ్చగా మారిన బాలుడి నాలుక
ఈ భూమి ఓ వింత ప్రపంచం. అలాగే ఇక్కడ పుట్టే వింత జబ్బులు మనుషులను బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. వందేళ్లకు ఓ సారి పుట్టుకొచ్చే జబ్బుల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాలకు గ్రామాలు తుడుచుకు పెట్టుకుపోతే.. ఇప్పుడు కరోనా ప్రపంచ దేశాలకే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ వస్తుందో.. ఏ కొత్త రకం వ్యాధి పుట్టుకొస్తుందో.. తెలియక ప్రపంచ జనులు హడలి చస్తున్నారు. ఒట్టావా: కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు సూచిస్తున్నారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత బాలుడుకి రక్తహీనత ఉందని, ఎప్సీన్ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని తెలిపారు. ఇది అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని వెల్లడించారు. కాగా యూఎస్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుంది. అయితే బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలో పేర్కొంది. -
గాఢమైన ముద్దు.. నాలుక కట్, ట్విస్టు ఏంటంటే!
లండన్: బ్రిటన్లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి నాలుకను కొరికింది. దీంతో తెగిపడిన నాలుక ముక్కను పక్షి ఎత్తుకుపోయిన వింత సంఘటన స్కాంట్లాండ్లో జరిగింది. 2019లో జరిగిన ఈ సంఘటనలో మహిళకు ఇటీవల కోర్టు జరిమాన విధించింది. వివరాలు... ఎడిన్బర్గ్కు చెందిన బెథానీ ర్యాన్ అనే మహిళకు జేమ్స్ మెకెంజీలు అనే వ్యక్తికి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిద్దరు రోడ్డుపైనే గొడవకు దిగారు. ఈ క్రమంలో మెకెంజీ పడికిలి బిగించి ర్యాన్పై దాడి చేసేందుకు వెళ్లడంతో ఆమె ఊహించని రీతిలో అతడికి ముద్దు పెట్టింది. అక్కడితో ఆగకుండా మెకెంజీ నాలుక చివరి భాగాన్ని గట్టిగా కొరకడంతో రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కింద పడిపోయింది. అయితే అది గమనించుకోకుండా వారిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ఇక తెగిపడిన ఆ నాలుక భాగం చెట్టుపై ఉన్న సిగుల్ పక్షి కంట పడింది. దీంతో ఆ నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని సిగూల్ పక్షిఎగిరిపోయింది. కాసేపటికి అతడి నాలుక తెగిపోయిన విషయం గమనించిన స్థానికులు మెకెంజీని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి అతడికి సర్జరీ చేయాలని సూచించారు. అందుకు తెగిన నాలుక భాగం కావాలని చెప్పారు. అయితే జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో అది లేకపోతే ఆపరేషన్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. కాగా, ర్యాన్పై అతడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్బర్గ్ ఫరీఫ్ కోర్టులో ర్యాన్ తను చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరింది. అయితే ఆమెకు శిక్ష విధించకుండా కోర్టు జరిమాన విధించింది. చదవండి: డివిలియర్స్పై మనసుపడ్డ షాహిద్ భార్య! రామ్దేవ్ బాబాను అరెస్టు చేస్తారా? -
2వేల ఏళ్ల నాటి మమ్మీ: నోట్లో బంగారు నాలుక
కైరో: ఈజిప్టులో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో 2వేల ఏళ్ల నాటి మమ్మి బయటపడింది. ఈజిప్టులో మమ్మీలు బయటపడటం సహజమే కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. కానీ ఈసారి బయటపడిన మమ్మీ బంగారు నాలుకతో ఉంది. అది చూసి అధికారులు అవాక్కయ్యారు. దీంతో మమ్మీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. వివరాలు.. ఈజిప్టులోని తపోరిస్ మగ్నా ప్రాంతంలో పురావస్తు పర్యాటక శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ మమ్మీ బయటపడింది. అయితే దాని నోటిలో బంగారు నాలుక ఉండటంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా ఇది 2వేల ఏళ్ల నాటిదిగా తేలింది. అయితే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు అతడిని మమ్మీగా మార్చేందుకు ఈ బంగారు నాలుకను నోటీ మీద ఉంచి ఉంటారని, కాలక్రమేణా అది నోట్లోకి జారి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘ఈజిప్టులో మరణం తర్వాత వారు ఖచ్చితంగా మళ్లీ పుడతారని అక్కడి వారి నమ్మకం. బహుశా ఆ నమ్మకంతోనే మరో జన్మలో కూడా ఈ వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశంతో బంగారు నాలుకను పెట్టడం అక్కడి సంప్రాదాయమని’ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. -
కోడలి కోసం నాలుక కోసుకున్న అత్త
రాంచీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు ఎంతగానో వైజ్ఞానిక అభివృద్ధి సాధించినా.. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించలేకపోతున్నారు. మూఢనమ్మకంతో తాజాగా ఓ మహిళ తన నాలుకనే కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా తిరిగి రావాలంటూ శివుడికి నాలుకను సమర్పించింది. ఈ ఘటన జార్ఖండ్లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని ఎన్ఐటీ క్యాంపస్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఐటీ క్యాంపస్కు చెందిన లక్ష్మీ నిరాలా కోడలు జ్యోతి ఆగస్ట్ 14న తన బిడ్డతో కలిసి తప్పిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీ శివుడి గుడి ముందు కూర్చొని ప్రార్థిస్తూ ఉంది. తన కోడలు సురక్షితం తిరిగి ఇంటికి రావాలని తన నాలుకను కత్తిరించుకుంది. శివుడికి నాలుకను సమర్పిస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో ఆమె అలా చేసిందని లక్ష్మి భర్త నందూలాల్ నిరాల చెప్పారు. నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగు వాళ్లు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. అలాగే తప్పిపోయిన జ్యోతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నాలుక మంటతో ఏమీ తినలేకపోతున్నాను...
నా వయసు 36 ఏళ్లు. నెలలో రెండు మూడు సార్లు ఆల్కహాల్ తీసుకుంటుంటాను. కొన్నాళ్ల కిందట నా నాలుకపై కుడివైపు ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ కరిగిపోయింది. దీనివల్ల భోజనం తినేటప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరును సంప్రదిస్తే బీ–కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాసిచ్చారు. మొదట్లో కాస్త ఉపశమనం అనిపించినా ఆ తర్వాత అదే సమస్య తిరగబెట్టింది. ఇప్పుడు నాలుకకు ఎడమవైపున కూడా ఇదే సమస్య వచ్చింది. ఏమీ తినలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. మీరు చెప్పిన లక్షణాలు గ్లాసైటిస్ అనే కండిషన్ను సూచిస్తున్నాయి. ఈ సమస్య వచ్చిన వారిలో నాలుక మీద ఉన్న పొర మీద ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ సమస్యకు బీ కాంప్లెక్స్ లోపం మొదలుకొని ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం, పొగతాగడం, డయాబెటిస్ వంటి అనేక అంశాలు కారణం కావచ్చు. గ్లాసైటిస్కు కారణమైన అంశాలను గుర్తించి వాటిని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. అలాగే మీరు వైద్యుల సలహా మేరకు ప్రో–బయాటిక్స్ అనే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రో–బయాటిక్స్ అంటే మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లో సాధారణంగా ఎక్కువగా కనిపించే లాక్టోబ్యాసిల్లై అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా అన్నమాట. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ గ్లాసైటిస్ అనే సమస్యనుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. మీరు మరోసారి జనరల్ ఫిజీషియన్కు చూపించుకొని ఆయన సూచనల మేరకు చికిత్స తీసుకోండి. ఒంటి మీదంతా చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి నా వయస్సు 30 ఏళ్లు. నా చేతులు, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. డాక్టర్కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందా? వీటికి ఎవరికి చూపించాలి? మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి జనరల్ ఫిజీషియన్ను కలిసి వారి సలహా/చికిత్స తీసుకోండి. డాక్టర్ జి. నవోదయ, కన్సల్టెంట్, జనరల్ మెడిసన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నిజం చెప్పే నాలుక
ఫుడ్ బాగుందో లేదో ఎలా తెలుస్తుంది.. నాలుకతో రుచి చూస్తేనే.. అదే విధంగా రసాయనాలను రుచి చూసేద్దామంటే మాత్రం అది దాదాపు అసాధ్యమే.. కానీ కొన్నిచోట్ల వాటి రుచి తెలిస్తే తప్ప పనులు జరగవు. మరి వీటి రుచిని చూసేదెలా.. అందుకోసం కృత్రిమ నాలుక తయారుచేస్తే పోలే అనుకున్నారు స్కాట్లాండ్లోని గ్లాస్గో వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధకులు. ముఖ్యంగా దీన్ని ఆల్కహాల్లో కల్తీని నిరోధించడానికి తయారుచేశారట. కల్తీని ఇది ఇట్టే పసిగట్టేస్తుందని.. చిన్నచిన్న తేడాలను గుర్తిస్తుందని, 99 శాతం కచ్చితత్వంతో చెబుతుందని అంటున్నారు. అంతేకాదు 12 ఏళ్లు, 15 ఏళ్లు, 18 ఏళ్ల కిందటి ఆల్కహాల్ల మధ్య తేడాను కూడా ఇట్టే కనిపెట్టేస్తుందట. అల్యూమినియం, బంగారం లోహాలను ఉపయోగించి దీనిని తయారు చేశారు. ‘ఈ కృత్రిమ నాలుక అచ్చు మన నాలుకలాగే పనిచేస్తుంది. కాకపోతే సంక్షిష్టమైన రసాయనాల మధ్య తేడాను గుర్తించడానికి ఉపయోగపడుతుంది’అని పరిశోధకులు అలస్డేర్ క్లార్క్ వివరించారు. కృత్రిమ నాలుకను ఇప్పటికే చాలా మంది అభివృద్ధి చేశారని, అయితే రెండు వేర్వేరు రకాల నానోస్కేల్ మెటల్ రుచి గ్రాహికలను ఉపయోగించి ఒకే నాలుక పనిచేసేలా తయారు చేయడం ఇదే తొలిసారని చెప్పారు. ముందుగా ఆల్కహాల్ తేడాలను గుర్తించేందుకు వినియోగించామని, ఈ నాలుక ఏ రకమైన రసాయనాల మధ్య తేడానైనా గుర్తిస్తుందని చెప్పారు. ఎలా పనిచేస్తుంది.. - బంగారం, అల్యూమినియం లోహాలతో తయారుచేసిన నానోస్కేల్ రుచి గ్రాహికలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. - విస్కీ నమూనాలను ఈ రుచిగ్రాహికలపై పోశారు. ఈ రుచిగ్రాహికలు మన నాలుకలోని రుచిగ్రాహికల కన్నా 500 రెట్లు చిన్నవి. - ఆ తర్వాత ద్రవంలో మునుగుతున్న కొద్దీ ఆ గ్రాహికలు కాంతిని ఎలా శోషించుకుంటున్నాయో పరిశోధకులు విశ్లేషించారు. - అవి కాంతిని శోషణం చేసుకునే తీవ్రతను బట్టి నమూనాల మధ్య తేడాలను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాన్ని ‘ప్లాస్మోనిక్ రెసోనెన్స్’అని పిలుస్తారు. -
నాలుక పట్టేసి మాట ముద్దగా వస్తోంది...
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా పెద్దనాన్నగారి వయసు 48 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోంది. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి పరిష్కారం చెప్పండి. – ఎల్. వెంకటేశ్వరరావు, నల్లగొండ మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... వంటి అకస్మాత్తుగా కనిపించే లక్షణాలన్నీ పక్షవాత సూచనలుగా పరిగణించాలి. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. కాళ్లలో మంటలూ – తిమ్మిర్లు... ఎందుకిలా? నా వయసు 53 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు లేవు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. అయినా నాకు ఎందుకీ సమస్య. నాకు తగిన పరిష్కారం చూపగలరు. – ఎమ్. రామ్మోహన్రావు, నెమ్మికల్ కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యలకు ఒక సూచన. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్ఐవీ, హెపటైటిస్–బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడానికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సెటిన్ మందులతో పాటు, మీ కండిషన్కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ ఏర్పడిందనుకోండి. అప్పుడు దాన్ని భర్తీ చేయడం కోసం ఆ విటమిన్ను సమకూర్చాలన్నమాట. మీరు చెబుతున్న లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్ను సంప్రదించండి. నా తలనొప్పే వంశపారంపర్యంగా మా అబ్బాయికీ వస్తోందా? నా వయసు 36 ఏళ్లు. గత రెండు దశాబ్దాలుగా నాకు ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అలా నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. ఈ తలనొప్పితో నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని కూడా అదే సమస్య వేధిస్తోంది. ఇప్పుడు వాడి వయసు ఎనిమిదేళ్లు. నా సమస్య వంశపారంపర్యంగా వాడికి సంక్రమించిందా? దయచేసి మా సమస్యను వివరించండి. – డి. కామేశ్వరి, కాకినాడ మీ చెబుతున్న లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్ను సంప్రదించండి. కళ్లు తిరిగి పడిపోతున్నట్లుగా ఉంది... కారణం ఏమిటి? నా వయసు 47 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా? – కె. రాధాకుమారి, శ్రీకాకుళం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ సమస్య ‘వర్టిగో’ అని చెప్పవచ్చు. మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్డ్గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవిలోపల ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్ను సంప్రదించాలి. అలాగే కళ్లు తిరగడం అనేది తల తిప్పినప్పుడు కొద్ది క్షణాల పాటు ఉండి, వెంటనే తగ్గిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో హోరు శబ్దం రావడం... ఇవి చెవి నరానికి సంబంధించిన జబ్బు తాలూకు లక్షణాలు. దీనికి తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్సైజెస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. వర్టిగో అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది గానీ ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడకండి. – డాక్టర్ బి. చంద్రశేఖర్రెడ్డి, చీఫ్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
భక్తురాలి సాహసం
భోపాల్ : తమ కోరికలు తీరడానికి, మొక్కుబడులు చెల్లించుకోవడానికి దేవుళ్లకు భక్తులు జంతు బలులు ఇస్తూంటారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నమైన పని చేసింది. తాను నిత్యం కొలిచే దేవున్ని తృప్తి పరచడానికి తన నాలుకనే కోసుకుంది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన మధ్యప్రదేశ్, మొరేనా జిల్లాలోని తర్సామా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానిక బిజసాన్ మాతా ఆలయంలో రోజు పూజలు చేసేది. తన కోరికలను తీర్చిన దేవతకు మొక్కుబడి చెల్లించడం కోసం నాలుకను కోసుకుంది. నోటి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుండటం గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ‘తను అలా నాలుక కోసుకున్న సంగతి మాకు తెలియదు. తనీ పని ఆలయానికి వెళ్లినప్పుడు చేసింది. తనను ఆస్పత్రిలో చేర్చిన తరువాత మాకు సమాచారం ఇచ్చాకే ఈ విషయం తెలిసింద’ని కుటుంబ సభ్యులు అన్నారు. -
నాలుక మీద పొర కరిగిపోయింది
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్స్ నా వయసు 37. నెలలో రెండు మూడు సార్లు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. గత ఏడాది తినేటప్పుడు బాగా మంటగా ఉంటే డాక్టరును సంప్రదించాను. నాలుకపై కుడివైపు ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ కరిగిపోయిందని చెప్పి, బీ–కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాసిచ్చారు. మొదట్లో కాస్త ఉపశమనం అనిపించినా ఆ తర్వాత అదే సమస్య తిరగబెట్టింది. ఇప్పుడు మళ్లీ నాలుకకు ఎడమవైపున కూడా ఇదే సమస్య వచ్చింది. ఏమీ తినలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – రామచంద్రయ్య, కర్నూలు మీరు చెప్పిన లక్షణాలు గ్లాసైటిస్ అనే కండిషన్ను సూచిస్తున్నాయి. అంటే గ్లాసైటిస్ సమస్యలో నాలుక మీద ఉన్న పొర ఇన్ఫ్లేమ్ కావడం జరుగుతుంది. ఈ సమస్యకు బీ కాంప్లెక్స్ లోపం మొదలుకొని ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం, పొగతాగడం, డయాబెటిస్ వంటి అనేక అంశాలు కారణం కావచ్చు. గ్లాసైటిస్ అదుపులోకి రావడానికి అందుకు కారణమైన అంశాలను అదుపులో పెట్టుకోవాలి. దాంతోపాటు ప్రో–బయాటిక్స్ అనే పదార్థాలను వైద్యులు దాదాపు ఒక నెల నుంచి రెండు నెలల వరకు ప్రిస్క్రయిబ్ చేస్తూ ఉంటారు. ప్రో–బయాటిక్స్ అంటే మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లో సాధారణంగా ఎక్కువగా కనిపించే లాక్టోబ్యాసిల్లై అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా అన్నమాట. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ గ్లాసైటిస్ అనే సమస్య కొంతవరకు మెరుగవుతుంది. మీరు ఇకసారి మెడికల్ స్పెషలిస్ట్కు చూపించి ఆయన సూచనల మేరకు చికిత్స తీసుకోండి. రాత్రిళ్లు కాళ్లు తిమ్మిరెక్కుతున్నాయి... నాకు రోజు రాత్రివేళల్లో అదీ నిద్రలో కాళ్లు తిమ్మిరెక్కుతాయి. పడుకున్న కాసేపటికే కాలు తిమ్మిరెక్కిపోయి బాధగా లేచి కూర్చుంటాను. తిమ్మిరెక్కిన సవుయంలో కాలు కిందపెట్టనివ్వదు. నొప్పి, బాధతో విలవిల్లాడిపోతాను. ఇది చాలా బాధాకరంగా ఉంటోంది. దయచేసి నాకు సరిౖయెన సలహా ఇవ్వగలరు. – శ్రీహరిప్రసాద్, నల్లగొండ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ సవుస్య పెరిఫెరల్ న్యూరోపతి కావచ్చని అనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వుుఖ్యంగా డయాబెటిస్, క్రానిక్ ఆల్కహాలిజం సమస్యలు ఉన్నవారిలో ఇది చాలా సాధారణం. మీ సమస్యకు అసలు కారణాన్ని నిర్ధారణ చేయడానికి బ్లడ్టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి సవుస్యకు తగిన వుందులను మెడికల్ కన్సల్టెంట్ పర్యవేక్షణలో కనీసం రెండు, వుూడు నెలలైనా వాడాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత క్షయ మళ్లీ తిరగబెట్టవచ్చా...? నా వయస్సు 42 ఏళ్లు. రెండేళ్ల క్రితం క్షయ వ్యాధి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవీ పరీక్ష కూడా చేయించాను. అది నెగెటివ్ వచ్చింది. ఆర్నెల్ల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాను. చికిత్స తర్వాత పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఒకసారి క్షయ వచ్చాక అది తగ్గేవరకు మందులు తీసుకొని నెగెటివ్ అని వచ్చాక కూడా మళ్లీ అది తిరగబెట్టే అవకాశం ఉందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రసాదమూర్తి, అనకాపల్లి పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత క్షయవ్యాధి తిరగబెట్టడానికి అవకాశాలు కాస్త అరుదే. అయితే అరుదుగానైనా ఈ సమస్య మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఇలా వ్యాధి తిరగబెట్టడం అన్నది చికిత్స పొందిన వ్యక్తి వ్యాధి నిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా వారిలో ఇతర కారణాల వల్ల (ఉదా: డయాబెటిస్, వయస్సుపైబడటం, హెచ్ఐవీ వంటివి) వ్యాధినిరోధకశక్తి తగ్గి క్షయ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉండవచ్చు. దీన్నే ‘రీ యాక్టివేషన్’ అంటారు. ఇలా వ్యాధి తిరగబెట్టకుండా ఉండాలంటే మంచి సమతుల పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్ర, డయాబెటిస్ లాంటి సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వాడినప్పటి నుంచి కడుపులో మంట! నా వయసు 47 ఏళ్లు. నాకు మొదటి నుంచి అసిడిటీ సమస్య ఉంది. ఇటీవల తీవ్రమైన మెడ నొప్పి రావడంతో డాక్టర్ను సంప్రదించి మందులు వాడుతున్నాను. ఒకటి రెండు సార్లు పెయిన్కిల్లర్స్ వాడాను. అవి వాడినప్పటి నుంచి కడుపులో మంట మరింతగా పెరుగుతోంది. నాకు పరిష్కారాన్ని సూచించండి. – నాగరాజు, గుంటూరు కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల... ముఖ్యంగా ఎన్ఎస్ఏఐడి గ్రూపునకు చెందిన బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి వాటివల్ల అసిడిటీ, గుండెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేని మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి మీ డాక్టర్ను సంప్రదించి మీకు మందులతో వస్తున్న సైడ్ఎఫెక్ట్స్ గురించి వివరించండి. డాక్టర్ మందులు మార్చి ఇస్తే మీ సమస్య తీరుతుంది. ముక్కులు బిగదీసుకుపోతున్నాయి... పరిష్కారం చెప్పండి నా వయస్సు 33. ఈ వయసులోనూ రోజూ ఉదయం వేళ చాలా సేపు వుుక్కు కారుతుండటంతో నేను చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాను. ఇక స్వీట్స్, అరటిపళ్లు, పెరుగు, పులుసు కూరలు తిన్నప్పుడు ఆ రాత్రంతా వుుక్కులు బిగదీసుకుపోతాయి. ఊపిరి సరిగా అందక బాధపడుతుంటాను. ముక్కు రంధ్రాల్లో ఏదో ఒకటి ఎప్పుడూ మూసుకుపోయి ఉంటుంది. మాకు దగ్గర్లోని డాక్టర్కు చూపిస్తే ఇజ్నోఫిలియా అని సిట్రజిన్ ఇచ్చారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపించండి. – డి. పార్థసారథి, నరసరావుపేట మీరు రాసిన వివరాల ప్రకారం మీ సవుస్య అలర్జిక్ సైనోరైనైటిస్ కావచ్చు. అంటే... అలర్జీ కారణంగా ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్లలో, ముక్కులో ఉండే లైనింగ్ పొరల్లో కొంత వాపు వచ్చి అవి ముక్కు రంధ్రాలను బ్లాక్ చేయడం వల్ల ఇలాంటి సమస్య కనిపిస్తుంటుందన్న మాట. మీరు మీ డాక్టర్ చెప్పిన మందులతో పాటు కొన్ని నేసల్ స్ప్రేస్ (డీ–కంజెస్టెంట్స్) వాడటం వల్ల ఉపశమనం ఉంటుంది. ఒకసారి మీరు మెడికల్ స్పెషలిస్ట్ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
వామ్మో.. రెండు నాలుకల అమ్మాయి
-
వామ్మో.. రెండు నాలుకల అమ్మాయి
నీది రెండు నాల్కల ధోరణి అనే మాట రోజూ మనకు వినిపిస్తూనే ఉంటుంది. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విమర్శలు చేసేటపుడు ఈ మాట ఎక్కువగా వినబడుతుంది. నిజానికి నిజజీవితంలో రెండు నాలుకలతో పుట్టిన వాళ్లు ఎక్కడా కనిపించరు. కేవలం హర్రర్ సినిమాల్లో భయం పుట్టేలా దయ్యం చేత నాలుకను బయటపెట్టించి పలు రకాలుగా చూపిస్తారు. అయితే, ఓ అందమైన అమ్మాయి తన రెండు నాలుకలతో కనిపించడమే కాదు, ఏకంగా వాటితో లయబద్ధంగా నాట్యం కూడా చేయించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
భారతదేశం మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
'నోటాకు ఓటు వేయండి': ఇండోర్ ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి
బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement