-
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
రియల్ ఎస్టేట్ క్వీన్కు మరణశిక్ష.. ఈమె చేసిన నేరం ఏంటంటే..
వియత్నాం రియల్ ఎస్టేట్ క్వీన్కు ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్కు దక్షిణ వియత్నాంలోని హో చి మిన్ న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని ఆ దేశ అధికార మీడియా థాన్ నీన్ తెలిపింది. ఇవీ అభియోగాలు వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత్రి అయిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్ 12.5 బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఇది ఆ దేశ 2022 జీడీపీలో దాదాపు 3 శాతం. 2012 నుండి 2022 మధ్యకాలంలో ఆమె సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ను అక్రమంగా నియంత్రించి డొల్ల కంపెనీలు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా ఈ నిధులను కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వియత్నాంలో అవినీతి నిరోధక డ్రైవ్లో భాగంగా 2022 అక్టోబరులో లాన్ను అరెస్టు చేశారు. ఇది ఆ దేశంలో అత్యంత హై ప్రొఫైల్ అరెస్ట్లలో ఒకటిగా నిలిచింది. బ్లేజింగ్ ఫర్నేస్ పేరుతో ఎగిసిన ఈ అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమం వియత్నాం రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి వియత్నాం ప్రెసిడింట్ వో వాన్ థుంగ్ రాజీనామా చేశారు. లాన్ అరెస్ట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విలాసవంతమైన నివాస భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు వంటి ప్రాజెక్ట్లతో వీటీపీ కంపెనీ వియత్నాంలోని అత్యంత ధనిక రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి. వియత్నాంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. 2023లో 1,300 ప్రాపర్టీ సంస్థలు మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నాయని అంచనా. డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, బంగారాన్ని బహుమతులుగా అందిస్తున్నారు. స్థానిక మీడియా ప్రకారం.. హో చి మిన్ నగరంలో షాప్హౌస్ల అద్దె మూడవ వంతు తగ్గినప్పటికీ, సిటీ సెంటర్లో చాలా వరకూ ఖాళీగానే ఉన్నాయి. -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
Phu Quoc: వెహికిల్స్కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్లకు ప్రసిద్ధి. అక్కడి సన్సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్బీకే వ్యవస్థ అద్భుతం
సాక్షి, అమరావతి/ఆనందపురం(విశాఖ): ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన సేవలందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ‘రైతు భరోసా కేంద్రాలు’ వంటి వ్యవస్థ మాకు తెలిసి ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదో విప్లవాత్మక ఆలోచన.. ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని రైతులు చెబుతున్నారు’’ అని వియాత్నం ప్రావిన్షియల్ నేషనల్ అసెంబ్లీ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఇండో–వియత్నాం పార్టనర్షిప్లో భాగంగా వియత్నాంకు చెందిన ప్రొవిన్షియల్ పార్టీ కమిటీస్ చైర్మన్ వోడిన్ టిన్, జియాన్జియా సిటీ పీపుల్స్ కౌన్సిల్ చైర్మన్ వో ఫామ్ ఎక్స్వాన్ లామ్, ప్రొవిన్షియల్ పీపుల్స్ కమిటీ వైస్ చైర్మన్ లిట్రాంగ్యెన్ తదితరులతో కూడిన 14మంది సభ్యుల అత్యున్నత స్థాయి బృందం మూడురోజుల పర్యటనకు భారతదేశానికి విచ్చేసింది. దేశంలోని వివిధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అమలు తీరుపై అధ్యయనం చేసేందుకు విచ్చేసిన ఈ బృందం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఏపీలో వివిధ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పుల పరిశీలన కోసం రాష్ట్రానికి వచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం చేసింది. తొలుత వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్ తమ శాఖల్లో గడచిన నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలపై వియాత్నం బృందానికి వివరించారు. అనంతరం క్షేత్ర స్థాయి సందర్శనలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వేములవలస గ్రామంలోని ఆర్బీకేను సందర్శించారు. ఆర్బీకే సేవలతో కూడిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. కాగా, ఇప్పటికే ఇథియోఫియా దేశం ఏపీలో పర్యటించి ఆర్బీకే సాంకేతికతతో పాటు ఇతర కార్యక్రమాలను తమ దేశంలో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందని కమిషనర్ హరికిరణ్ వివరించారు. వ్యవసాయ ప్రాధాన్యతా దేశాల్లో ఇదే రీతిలో డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షిస్తూ ఆర్బీకే విజిటర్స్ బుక్లో బృందం తమ అభిప్రాయాన్ని రాశారు. వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్లర్లు, జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మన్మధరావు, పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు కరుణాకర్, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకే వ్యవస్థ అద్భుతం ఏపీలో విద్య, వైద్య, వ్యవసాయ ఇతర రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. మీ కేంద్ర ప్రభుత్వం చూసి రమ్మంటే ఇక్కడకు వచ్చాం. నిజంగానే ఇక్కడ ప్రభుత్వం దూరదృష్టి చాలా బాగుంది. డిజిటల్ టెక్నాలజీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారు. వ్యవసాయంపై ఆధారపడిన దేశాలు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– లిట్రాంగ్యెన్, వైస్ చైర్మన్ వియాత్నం ప్రొవిన్షియల్ అసెంబ్లీ కమిటీ -
వీసా లేకుండానే వియత్నాంకి: టూరిస్టులకు బంపర్ ఆఫర్
థాయ్లాండ్, శ్రీలంక తరువాత వియత్నాం కూడా త్వరలోనే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పనేంది. వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించేందుకు భారతీయులకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరించనుంది. వియత్నాం సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి న్గుయిన్ వాన్ జంగ్, చైనా, భారత్ వంటి ప్రధాన మార్కెట్లకు స్వల్పకాలిక వీసా మినహాయింపులపై కీలక సూచన చేశారు. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన ఆయన కొంతకాలం పాటు ఈ మినహాయింపు నిచ్చేందుకు యోచిస్తోందని వియత్నాం వార్తా సంస్థ VnExpress నివేదించింది. 2023 ఏడాదిలో తొలి పది నెలల్లో, వియత్నాంను సందర్శించిన అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య దాదాపు 10 మిలియన్ల దాటింది. 2022 నుండి 4.6 రెట్లు పెరిగింది.కోవిడ్కు ముందు, వియత్నాంను సందర్శించిన ఇండియా టూరిస్టలు సుమారు 1,70,000 మంది . ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ , ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు. కాగా అక్టోబర్లో, థాయ్లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 10 నుండి మే 10, 2024 వరకు ఆరు నెలల పాటు భారతదేశం, తైవాన్ నుండి పర్యాటకులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
మస్క్కు తెగ నచ్చేసిన సరికొత్త సైబర్ ట్రక్: వీడియో చూస్తే మీరూ ఫిదా!
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా సైబర్ట్రక్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోసం నెట్లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్కు ఒక నోట్ పెట్టాడు. తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు. సైబర్ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్ట్రక్ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. -
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు.. 50 మందికిపైగా మృత్యువాత
వియాత్నంలోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేశ రజధాని హనోయిలోని 9 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 50 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరో 70 మందిని అధికారులు రక్షించారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు భవనంలోని పార్కింగ్ ఏరియాలో మొదలైన మంటలు క్షణాల్లోనే అపార్ట్మెంట్ మొత్తం వ్యాపించాయి. భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బిల్డింగ్లో 45 కుటుంబాలు నివసిస్తుండగా ప్రమాద సమయంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారు. నిద్రమత్తులో ఉన్న నివాసితులు తేరుకొని సాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయితే అపార్ట్మెంట్ నుంచి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని, ఈ కారణంతోనే మరణాలు భారీగా సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే అపార్టమెంట్ ఇరుకైన గల్లీలో ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో అగ్నిమాపక వాహనాలను భవనానికి 300 నుంచి 400 మీటర్ల దూరంలో నిలిపి ఉంచి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం -
వియత్నాం బయలుదేరిన జో బైడెన్
ఢిల్లీ: శనివారం జీ20 సమావేశాలు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం నేరుగా ఢిల్లీ విమానశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారత్ నుంచి వెనుదిరిగారు. ఢిల్లీ నుంచి నేరుగా వియత్నాం బయలుదేరారు. అక్కడ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. US President Joe Biden departs for Vietnam, take a look at key takeaways of India visit Read @ANI Story | https://t.co/IHeIsh2EWB#JoeBiden #USPresident #Vietnam #India pic.twitter.com/SXk8e1zj3F — ANI Digital (@ani_digital) September 10, 2023 భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమావేశానికి బైడెన్ శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. దేశ రాజధానిలోని మౌర్య హోటల్లో బస చేశారు. శనివారం ఉదయం నుంచి జరిగిన జీ20 సమావేశాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయానికి ఆమోదం తెలిపారు. బైడెన్ భార్య జిల్ బైడెన్కు కరోనా సోకిన కారణంగా జీ20 సమావేశాలకు ఆయన హాజరవుతారా..?లేదా..? అనే సందిగ్ధం నెలకొంది. కానీ జో బైడెన్కు కరోనా నెగిటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ అగ్రదేశ నేతగా బైడెన్ జీ20 సమావేశాల్లో కీలకంగా పాల్గొన్నారు. ఇదీ చదవండి: బైడెన్ డ్రైవర్ను నిర్బంధించిన భద్రతా సిబ్బంది..ఎందుకంటే..? -
‘స్వయంభూ’ కోసం వియత్నామ్ వెళ్లిన హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిద్ధార్థ వియత్నామ్లో వాలిపోయారు. ఏదో వెకేషన్కి వెళ్లుంటారేమో అనుకుంటే పొరబడినట్టే. తన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కోసం నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వియత్నామ్ వెళ్లారాయన. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న మూవీ ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో యోధునిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్రకు సంబంధించి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. సైగాన్లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్లు ‘స్వయంభూ’ యూనిట్లో భాగంగా ఉండి యాక్షన్ సీక్వెన్స్ల కోసం నిఖిల్కి శిక్షణ ఇస్తారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు నిఖిల్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద..
సాధరణంగా ఊహించని లాభాలు, ఆదాయం వస్తే అదృష్టం వరించింది అంటుంటారు. కానీ ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద పెరిగితే దాన్ని ఏమంటారు? అదృష్టం కాదు.. అంతకు మించి అంటారు. సింగపూర్కు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ (VinFast Auto Ltd) స్టాక్ మార్కెట్లలో ప్రవేశించిన మొదటి రోజునే దూసుకెళ్లి, దాని వ్యవస్థాపకుడి సంపదను భారీగా పెంచింది. దిగ్గజ కంపెనీలను దాటేసి.. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షేర్లు మంగళవారం (ఆగస్టు 15) ఏకంగా 255 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ చైర్మన్ వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ (Pham Nhat Vuong) నికర సంపదకు 39 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరాయి. పరిశ్రమ దిగ్గజాలు జనరల్ మోటార్స్ కో, మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కంటే విన్ఫాస్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ సంపద ఇప్పుడు 44.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీలో వూంగ్ వాటాను స్టాక్ ఇండెక్స్ గతంలో చేర్చలేదు. తన వింగ్ గ్రూప్ జేఎస్సీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 99 శాతం కంపెనీ అవుట్స్టాండింగ్ వూంగ్ నియంత్రణలోనే ఉన్నాయి. అత్యధిక వాటా ఆయనకే ఉండటంతో ఇతర ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లు అందుబాటులో లేవు. విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ను 2017లో వూంగ్ స్థాపించారు. తమ వాహనాల అమ్మకాలు ఈ సంవత్సరం 45,000 నుంచి 50,000కి చేరుకుంటాయని కంపెనీ అంచనా వేసింది. గత నెలలో నార్త్ కరోలినాలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. వూంగ్తోపాటు అతని బంధువులు విన్ఫాస్ట్ సంస్థలో కనీసం 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. న్యూడిల్స్ బిజినెస్తో మొదలుపెట్టి... రష్యాలో జియో-ఎకనామిక్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత 1990ల ప్రారంభంలో వూంగ్ ఉక్రెయిన్కు వెళ్లారు. అనంతరం వియత్నాంకు తిరిగి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఇన్స్టాంట్ న్యూడిల్స్ బిజినెస్ను ప్రారంభించారు. తర్వాత దాన్ని 2010లో నెస్లే ఎస్ఏకి అమ్మేశారు. అప్పటికే ఆయన రియల్ ఎస్టేట్, రిసార్ట్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ వ్యాపారాలు నిర్వహించే వింగ్ గ్రూప్ జేఎస్సీ (Vingroup JSC)ని స్థాపించారు. హనోయి కేంద్రంగా కార్యకలాపాలు నర్వహిస్తున్న ఈ సంస్థ గత సంవత్సరం 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. విన్ఫాస్ట్ కంపెనీలో ఇది ప్రధాన వాటాదారుగా ఉంది. -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
వియత్నాం పర్యటనలో ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వియత్నాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వియత్నాం ప్రభుత్వ ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమయ్యారు. ఇందులో వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన తోడ్పాటుపై ప్రధానంగా చర్చతో పాటు వియత్నాం నుంచి మరింత సహకారం దిశగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు కోసం చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రాన్ కోక్ ఫుంగ్ను మంత్రి కలిశారు. వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ 'గార్కో 10'ను సందర్శించారు. టెక్స్ టైల్ కంపెనీ, 'గార్కో 10' సహకారంతో వృత్తివిద్య కళాశాలల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు. వీటితో పాటు హానోయ్ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్శిటీని విజిట్ చేశారు. టెక్స్ టైల్ రంగంలోని సాంకేతికత, ఫ్యాషన్ శిక్షణలో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం చేశారు. ఇందులో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. హనోయిలోని ఇండియా హౌస్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భారత రాయబారి సందీప్ ఆర్యాను కలిశారు. చదవండి నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై క్లారిటీ.. ఆక్సిజన్ కొరతపై దుష్ప్రచారాన్ని ఖండించిన వైద్యులు -
యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్:ఈ కానుక ఏ తీరాలకి..?..ప్రత్యేకతలివే..!
► పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయన్న ఆందోళనలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచి్చనçప్పుడు ఈ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలు ఇచి్చంది. మయన్మార్కు ఒక జలాంతర్గామిని ఇచి్చంది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది. ప్రత్యేకతలివే..! ► ఐఎన్ఎస్ కృపాణ్ ఖుక్రీ క్లాస్కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది. ► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది. ► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు. ► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది. ► భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నౌక విశాఖ నుంచి ఈ నెల 28 బుధవారం వియత్నాంకు బయల్దేరి వెళ్లింది. 2016 నుంచి భారత్, వియత్నాం మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో దేశాలకు మిలటరీ సాయం చేశాము. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే యుద్ధ నౌకను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు ? ఎందుకీ నిర్ణయం? దీని వల్ల భారత్కు ఒరిగేదేంటి ? దక్షిణ చైనా సముద్రం వివాదమేంటి? ► దక్షిణ చైనా సముద్రంపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సముద్ర భూభాగంపై సార్వ¿ౌమాధికారాన్ని ప్రకటించుకున్న చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఈ సముద్రంలో ఎన్నో దీవులున్నాయి. మత్స్య సంపద అపారంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం ఈ సముద్రంలో జరుగుతుంది. దీనిపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ఇతర దేశాలకు మింగుడు పడడం లేదు.ఈ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా విడుదల చేసిన ‘‘నైన్ డ్యాష్ లైన్’ మ్యాప్తో తనవేనని వాదిస్తోంది. ఈ సముద్రంలో భారీగానున్న చమురు నిల్వలపై అన్వేషణ కూడా ప్రారంభం కావడంతో దేశాల మధ్య పోటీ ఎక్కువైంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉండడం వల్ల అక్కడ చైనా జోక్యం పెరిగితే భారత్కూ నష్టమే. ఈ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయి. ఇవి కూడా సముద్రంలో తమకూ వాటా ఉందని ప్రకటించాయి. మరోవైపు చైనా కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలతో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మనం పంపిన కృపాణ్ దక్షిణ చైనా జలాల్లో ఎంత మేరకు నిఘా పెడుతూ డ్రాగన్కు చెక్ పెడుతుందో వేచిచూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏయూలో వియత్నాం విద్యార్థుల సందడి
-
రూ. 407 కోట్లతో సీసీఎల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాం తయారీ కేంద్రంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఫెసిలిటీని నెలకొల్పనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.407 కోట్లు. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ రూ.3 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.9 శాతం ఎగసి రూ.73 కోట్లు సాధించింది. ఎబిటా 9 శాతం పెరిగి రూ.101 కోట్లుగా ఉంది. టర్నోవర్ 26.5 శాతం అధికమై రూ.535 కోట్లు నమోదు చేసింది. -
ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
వియత్నాంలోని కాన్థో నగరంలో ఇటీవల వెలిసిన బంగారు భవనం అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. కాన్థో నగరానికి చెందిన ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే ఆసామి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించాడు. కొత్తతరహాలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాడు. ఇళ్ల నమూనాలు చూడటానికి దేశదేశాల్లో సంచరించాడు. ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డెకరేటర్లతో చర్చోప చర్చలు జరిపాక, ఇదివరకు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో బంగారు తాపడంతో ఇల్లు నిర్మించాలని నిశ్చయించుకుని, తన నివాసంగా బంగారు భవనాన్ని నిర్మించాడు. ఇంటి వెలుపల గోడలను, పైకప్పును పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాడు. ఇంటి బయటే కాదు, లోపల కూడా అడుగడుగునా కళ్లుచెదిరేలా బంగారు వస్తువులతో నింపేశాడు. ఇంట్లోని చాలా వస్తువులు పూర్తి బంగారంతో తయారు చేయించనవి అయితే, కొన్ని భారీ విగ్రహాల వంటివి మాత్రం బంగారు తాపడం చేయించనవి. ఆరేళ్ల కిందటే బంగారు భవనాన్ని నిర్మించాలని అనుకున్నానని, దీని నిర్మాణం పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టిందని ట్రుంగ్ మీడియాకు వెల్లడించాడు. ఇప్పుడు ఈ భవంతి వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది. వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులు పనికట్టుకుని మరీ కాన్థో నగరానికి వచ్చి, ఈ ఇంటిని కళ్లారా చూసి వెళుతున్నారు. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీసులు.. 4 గంటల్లోనే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా వియత్నాంకు విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని హనోయి, హో చి మిన్, డా నాంగ్ నగరాలకు వియట్జెట్ ఫ్లైట్లను నేరుగా నడుపనున్నట్లు జీఎమ్మార్ ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. ఈ సర్వీసులు 4 గంటల్లో వియత్నాం చేరుకుంటాయి. హనోయికి అక్టోబర్ 7న, హో చి మిన్ సిటీకి అక్టోబర్ 9న, డా నాంగ్కు నవంబర్ 29వ తేదీన వియట్జెట్ తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని ఫణికర్ అభిప్రాయపడ్డారు. అలాగే వ్యాపార, వాణిజ్య రంగాల్లోను సంబంధాలు మెరుగు పడతాయన్నారు. కొత్త సర్వీసుల వల్ల భారతదేశంలో తమ నెట్వర్క్ బలోపేతం అవుతుందని వియట్జెట్ కమర్షియల్ డైరెక్టర్ జె.ఎల్.లింగేశ్వర అన్నారు. ఆగ్నేయ, ఈశాన్య ఆసియా దేశాలకు వారధిగా ఉన్న వియత్నాం సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రావాలని ఆయన హైదరాబాద్ పర్యాటకులను ఆహ్వానించారు. -
అక్టోబర్ నుంచి హైదరాబాద్–వియత్నాం ఫ్లయిట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ నుంచి హైదరాబాద్తో పాటు భారత్లోని మరో రెండు నగరాల నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ వియత్జెట్ డైరెక్టర్ జయ్ ఎల్ లింగేశ్వర తెలిపారు. ఒకో ప్రాంతం నుంచి వియత్నాంలోని హనోయ్, హో చి మిన్హ్ తదితర ప్రాంతాలకు వారానికి మూడు–నాలుగు సర్వీసులు ఉంటాయని గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై నుంచి వియత్నాంలోని ప్రధాన నగరాలకు వారానికి 20 వరకూ సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 60 శాతం మేర పెరిగిందని లింగేశ్వర చెప్పారు. ప్రయాణికులను ఆకర్షించడానికి రూ. 26 బేస్ రేటుకే టికెట్లు వంటి ఆఫర్లు రూపొందిస్తున్నామని వివరించారు. మరోవైపు సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యల ద్వారా అధిక ఇంధన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పరిశ్రమకు సానుకూలాంశమని పేర్కొన్నారు. -
యాపిల్: వెళ్లిపోతాం..చైనాలో ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!
త్వరలో చైనాకు భారీషాక్ తగలనుంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐపాడ్ ప్రొడక్షన్ను చైనాలో నిలిపి వేయనుందని నిక్కీ ఆసియా నివేదించింది. షాంఘై వంటి నగరాల్లో కొనసాగుతున్న లాక్డౌన్లతో పాటు, అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల యాపిల్ చైనా నుండి ప్రొడక్షన్ను వియాత్నంకు తరలించాలని భావిస్తోంది. చైనాకు చెందిన బీవైడీ సంస్థ యాపిల్ ఐపాడ్లను తయారు చేస్తోంది. తయారు చేసిన వాటిని యాపిల్ అమ్మకాలు నిర్వహిస్తుంది. గతేడాది యాపిల్కు రెండో అతిపెద్ద ప్రొడక్ట్ ఐపాడ్లను 58మిలియన్ల షిప్ మెంట్ చేసింది. కానీ ఈఏడాది సాధ్య పడలేదు.పెరిగిపోతున్న కరోనా కేసులు, చిప్ కొరత, సప్లయ్తో పాటు ప్రభుత్వ నిర్ణయాలతో యాపిల్ సంస్థ ఐపాడ్ ప్రొడక్షన్ను చైనా నుంచి మరో చోటికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే భవిష్యత్లో చిప్ కొరత లేకుండా ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చిప్ తయారీ సంస్థలకు చిప్లను వెంటనే పంపించాలని యాపిల్ విజ్ఞప్తి చేసినట్లు నీక్కీ ఆసియా తన నివేదికలో వెల్లడించింది చైనా టూ వియాత్నం! చైనా షాంఘైలో యాపిల్ సంస్థకు సగ భాగానికి పైగా 200 ప్రధాన సప్లయర్స్ ఉన్నారు. అందుకే యాపిల్ సంస్థ షాంఘై కేంద్రంగా 31 కంపెనీలతో తన ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం నుంచి వియాత్నంకు ఐపాడ్ ప్రొడక్షన్ను తరలించనుంది. ఇందుకోసం యాపిల్..బీవైడీ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ షాంఘై నుంచి వియాత్నం కు తరలింపు, వియాత్నంలో తక్కువ సంఖ్యలో ఐపాడ్లను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. -
గాజు వంతెన.. గుండె జారేనా!
అర కిలోమీటరు ఎత్తులో ఉన్న వంతెనను చూస్తేనే ‘అమ్మో..!’ అంటాం. అలాంటిది అంత ఎత్తులో ఉన్న వంతెన అడుగు భాగం గాజుతో నిర్మిస్తే..! నడవడానికి గజగజలాడిపోమా. కానీ వియత్నాం ప్రజలు మాత్రం తమ దేశంలో కట్టిన గాజు వంతెనను చూసేందుకు, దానిపై నడిచేందుకు ఎగబడుతున్నారు. సోన్ లా ప్రావిన్స్లో 632 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన ఈ వంతెనను ఇటీవలే ప్రారంభించారు. దీనికి బాచ్ లాంగ్ (తెల్ల డ్రాగన్) పెడెస్ట్రియన్ వంతెన అని పేరు పెట్టారు. చైనాలోని గువాంగ్డాంగ్ వంతెన కన్నా (526 మీటర్లు) ఇది పొడవైనది. ఫ్రాన్స్లో ఉత్పత్తి చేసిన టెంపర్డ్ గ్లాస్ను ఈ వంతెనకు వాడారు. ఒకేసారి 450 మంది వరకు దీనిపై నడవొచ్చు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో..
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. తనకంటే పిల్లల కోసం ఆలోచించే మాతృమూర్తి అమ్మ. పేగు బంధాన్ని రక్షించేందుకు తల్లి ఎంతవరకైనా పోరాడుతుందనే విషయం మరోసారి రుజువైంది. తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా బిడ్డ గురించి ఆలోచించింది ఓ మహిళ. ట్రక్ కింద పడిపోతుండగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. అయితే ఇది 2019లో జరగ్గా.. క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ తాజాగా తన ట్విట్టర్లో షేర్ చెయ్యడంతో ఇది మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నామ్ దిన్హా ప్రాంతంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఇంతలో ఓ కారు వీరిని తాకుతూ ఓవర్ టేక్ చూస్తూ వెళ్లింది. దీంతో బైక్ వెనక కూర్చున్న తల్లి, చేతిలోని పిల్లాడు కిందపడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. వేగంగా స్పందించి చక్రాల కింద పడిపోబోతున్న తన బిడ్డను చాకచక్యంగా వెనక్కి లాగింది. పెను ప్రమాదం నుంచి కుమారుడిని కాపాడుకుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ ఘటనలో తల్లీ, కొడుకులు వెంట్రుకవాసిలో తల్లి, క్షేమంగా భయటపడ్డారు. చదవండి👉 ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో రికార్డయిన దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి. తల్లి చాకచక్య తెలివితేటలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 5 మిలియన్ల మంది వీక్షించారు. 'తల్లి ప్రేమకు మించింది ఏది లేదు', 'కన్నపేగుబంధం అంటే ఇదే మరి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. Mother of the year https://t.co/qIZlz1PYEZ — Jofra Archer (@JofraArcher) April 25, 2022 -
ఇంట్లోకి దూసుకెళ్లిన బైక్.. మొబైల్ చూస్తూ కూర్చున్న మహిళ, అక్కడే ఉన్న కుక్క షాక్!
Motorcycle Crashed Into A Shop: ఇంతవరకు మనం చాలా రకాల ప్రమాదాలను చూసి ఉన్నాం. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్లను కూడా చూశాం. అయితే కొద్దిమంది మాత్రమే ఎలాంటి గాయాలపాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అచ్చం అలాంటి ఘటనే వియాత్నంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...వియాత్నంలోని హో చి మిన్లో ఒక వ్యక్తి నడుపుతున్న మోటారు బైక్ అదుపు తప్పి ఓ ఇంట్లోని లివింగ్ రూమ్లోకి దూసుకెళ్లింది. దీంతో లివింగ్ రూమ్లో మొబైల్ చూస్తూ కూర్చున్న ఓ మహిళకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లక్కీగా ఆమె వెంటనే తేరుకుని ఒక్క ఉదుటున వెనక్కి జరగడంతో దూసుకొచ్చిన బైక్ ఆమెకు కొద్ది దూరంలో ఎగిరిపడింది. అక్కడే ఉన్న పెంపుడు కుక్క సైతం ప్రమాదాన్ని గ్రహించి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే! ఇక బైక్తోపాటు దాని రైడర్ కూడా వెళ్లకిలా పడి చచ్చాన్రా దేవుడో అని నడుము పట్టుకున్నాడు. స్వల్ప గాయాలతో అతను బయటపడటం, ఆ మహిళకు, కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ బైక్ ఎందువల్ల అదుపుతప్పి ఇంట్లోకి దూసుకు వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
బంగారంలో బప్పీ లహరిని మించిపోయాడు.. శరీరంపై 2 కిలోలు, కారు, బైక్ అన్నీ..
బప్పీలహిరి.. సంగీతమే కాదు.. ఆయన ఆహార్యమూ స్పెషలే.. ముఖ్యంగా బంగారం. అది తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన నమ్మకం.. ఈ చిత్రంలోని వియత్నాంవాసి ట్రాన్డక్లాయ్ అయితే.. దాన్ని మరింత ఎక్కువ నమ్ముతాడు.. అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా ఇలా గోల్డ్ ఉంచుకుంటాడు. అదొక్కటేనా.. తన కారు, బైక్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ చేయించేశాడు.. దాని వల్ల లోకల్గా పాపులర్ కూడా అయ్యాడు. ఇంత బంగారం ఉంది.. ఏం చేస్తాడు అనేదేగా మీ డౌట్.. వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.. వాటిని తెచ్చి.. అమ్మడమే మనోడి పని. చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ఆగని టీడీపీ అరాచకాలు
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
Advertisement