-
నీటి ఎద్దడి రాకుండా చూడాలి
దుగ్గొండి : వేసవి పూర్తయ్యే వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అఽధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చాపలబండ, గిర్నిబావి, అడవిరంగాపురం గ్రామాల్లో గురువారం ఆయన తాగునీటి వనరులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని బావుల్లో నీటి లభ్యత, గ్రామానికి కావాల్సిన నీటి అంచనాలను బేరీజు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని పైపులైన్ ద్వారా నీటిని బావిలోకి పోయించాలన్నారు. చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యదర్శులు నిరంతరం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు వైనాల రాజు, మాడిశెట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి నల్లబెల్లి : గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మండలంలోని నందిగామ గ్రామాన్ని గురువారం ఆమె గురువారం సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. డీపీఓ వెంట మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి వద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ స్థానం బీజేపీదే.. గీసుకొండ : దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈసారి వరంగల్ ఎంపీ స్థానం బీజేపీకే అని పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంపీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మరోమారు మోదీ అధికారంలోకి వస్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అవసరమైన నిధులు మంజూరు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు జాన్విక్రం, నాయకులు కత్తి వెంకన్న, ఆకుల వెంకన్న, మర్రి రాజు, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న చేను దగ్ధం ● మూడు గొర్రెలు సజీవ దహనం ● రూ.2 లక్షల ఆస్తినష్టం నర్సంపేట రూరల్ : అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేను దగ్ధమైన సంఘటన మహేశ్వరం గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన నామాల పరమేశ్వర్కు మహేశ్వరం గ్రామ శివారులోని 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు గాలికి మంటలు చెలరేగడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. మొక్కజొన్న చేనులో మేత మేస్తున్న మూడు గొర్రెలు సైతం సజీవ దహనమయ్యాయి. మొత్తం రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు. -
కడియం కావ్యది ఆంధ్రానే
హన్మకొండ: కడియం కావ్యది ముమ్మాటికీ మెట్టినిల్లు అయిన ఆంధ్రానే అని, ఆమె స్థానికేతరురాలు అని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక భాగమేనన్నారు. అవసరమనుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. కడియం శ్రీహరి తన గురువైన చంద్రబాబును అడిగి బాపట్ల నుంచి టికెట్ అడిగి తీసుకోవచ్చుగదా అని అన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి అని, టీడీపీలో మంత్రిగా ఉండి ఉద్యమకారులపై కేసులు పెట్టించారన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారన్నారు. ఈనెల 24న అరూరి రమేశ్ నామినేషన్ వేస్తారన్నారు. సమావేశంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ ప్రభారీ మురళీధర్ గౌడ్, కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు పద్మ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు -
పాలిటిక్స్ షురూ..
సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మురళీనాయక్, అభ్యర్థి బలరాంనాయక్ తదితరులు సాక్షి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మానుకోటలో సీఎం ప్రచారసభలో పాల్గొననున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు, మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వుడు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈరెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రచారం చేసేలా ఆపార్టీ షెడ్యూల్ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేతల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్ వేదిక కానుంది. రెండు రోజుల్లో నామినేషన్లు.. తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరికొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే.. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు. ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం ఉమ్మడి జిల్లాలో మొదలైన రాజకీయ వేడి వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గెలుపుపై దృష్టి 24న హనుమకొండలో కాంగ్రెస్ సభ నిర్వహణకు కసరత్తు అదేబాటలో బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తంపై అభ్యర్థుల ఆరా నేడు మానుకోటకు సీఎం ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్న రేవంత్ సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కాగా మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరిశీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఉదయమే నామినేషన్ వేయనున్నారు. -
తాలు పట్టిన తర్వాతే ధాన్యం కొనాలి
● అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఎల్కతుర్తి: తాలు పట్టిన తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, కేశవాపూర్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు పండించిన ధాన్యంలో తాలు లేకుండా చూడాలన్నారు. అలాగే.. 17శాతం తేమ వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, అప్పుడే రైతులకు ప్రభుత్వం కల్పించే మద్దతు ధర లభిస్తుందన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీపీఎం ప్రకాశ్, డీటీ కృష్ణ, తహసీల్దార్ జగత్సింగ్, ఏపీఎం రవీందర్, ఏఈఓలు కళ్యాణి, తిరుపతి, రోజా, సీసీ రవీందర్ తదితరులు ఉన్నారు. -
అరూరి చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహక సమావేశం హనుమకొండ హంటర్రోడ్డులోని డీ–కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్యను నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
అమాయకులే లక్ష్యంగా దోపిడీ
ఎంజీఎంలో పేషెంట్ల వద్ద ఉండే మహిళలే టార్గెట్ ● లోన్ ఇప్పిస్తామని మాయమాటలు ● ఫొటోలు తీస్తామని ఒంటిపై నగలు తీయించి వాటితో ఉడాయింపు ● భార్యాభర్తతోపాటు మరొకరి అరెస్ట్రామన్నపేట: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కేంద్రంగా పేషెంట్ల వద్ద ఉండే అమాయక మహిళలను టార్గెట్ చేసుకొని వారికి లోన్ల ద్వారా డబ్బులిప్పిస్తానని నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మట్టెవాడ ఏసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరాంనాయక్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య మాట్లాడుతూ.. నిందితుల్లో భార్యాభర్తలతోపాటు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 70.432 గ్రాముల (సుమారు రూ.5.80లక్షల విలువ గల) బంగారు ఆభరణాలు, రూ.80వేల నగదు, ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరానికి చెందిన చుంచు స్వప్న అలియాస్ సానియా జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని ఎంజీఎం ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం వచ్చే కొందరు అమాయకులైన ఆడవారిని, వృద్ధులను లక్ష్యంగా చేసుకునేదని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి లోన్ల ద్వారా డబ్బులిప్పిస్తానని చెప్పి అందుకు ఫొటోలు దిగాల్సి ఉంటుందని, వారి ఒంటిపై బంగారం ఉంటే లోన్ రాదని నమ్మించేదని తెలిపారు. ఒంటిపై బంగారం తీయించి ఫొటో దిగాక ఇస్తానని చెప్పి, బాండ్ పేపర్ తీసుకొస్తానని బయటికి వెళ్లి అక్కడినుంచి ఉడాయించేదని వివరించారు. నిందితురాలు స్వప్న గతంలో ములుగు, హనుమకొండ పీఎస్ల పరిధిలో దొంగతనాలు, లోన్లు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన కేసుల్లో జైలు జీవితం గడిపినట్లు తెలిపారు. ఆర్నెళ్ల క్రితం స్వప్న మొదటి భర్త ఫిరోజ్ వరంగల్ ఆటోనగర్లో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోగా, అతడి స్నేహితుడైన ఖాజాపాషాను 3 నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఈక్రమంలో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని, గతంలో మాదిరిగా ఎంజీఎంకు వచ్చిన పేషెంట్స్ దగ్గర ఉన్నవారిని మోసం చేస్తున్నారని, ఇలా దొంగిలించిన బంగారాన్ని హనీఫ్ అనే వ్యక్తి కుదువపెట్టేవాడని తెలిపారు. పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సొత్తు రికవరీ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపీ, ఎస్సై విఠల్ ఉన్నారు. -
No Headline
వరంగల్ అర్బన్: ప్రభుత్వం కల్పించిన ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పన్ను వసూళ్లపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 5 శాతం పన్ను రిబేట్పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల మేర లక్ష్యం వసూలు చేయాలని ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోలేని అధికారులు, సిబ్బందికి ఈనెలాఖరు తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. -
పాలిటిక్స్ షురూ..
శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం – 8లోuసాక్షి, వరంగల్ : ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మాను కోటలో సీఎం ప్రచారసభలో పాల్గొన నున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డు, మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్డు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రచారం చేసేలా ఆ పార్టీ షెడ్యూల్ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేత ల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్ వేదిక కానుంది. రెండు రోజుల్లో నామినేషన్లు.. తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరికొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబు తున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే.. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు. న్యూస్రీల్ ఉమ్మడి జిల్లాలో మొదలైన రాజకీయ వేడి వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గెలుపుపై దృష్టి 24న హనుమకొండలో కాంగ్రెస్ సభ నిర్వహణకు కసరత్తు అదేబాటలో బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతల ప్రచారానికి ప్లాన్ నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తంపై అభ్యర్థుల ఆరానామినేషన్ సెంటర్వద్ద భారీ బందోబస్తు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వరంగల్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం నామినేషన్ సెంటర్లోని ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. నేడు మానుకోటకు సీఎం ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కాగా, మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధి కారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరి శీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఉదయమే నామినేషన్ వేయనున్నారు. -
నాణ్యమైన సేవలు అందించాలి
వర్ధన్నపేట : విద్యుత్ వినియోగదారులకు నాణ్య మైన సేవలందించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. వర్ధన్నపేటలోని పుస్కోస్ పాఠశాలలో సిబ్బందికి రెండురోజుల శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లను నిరంతరం పెట్రోలింగ్ చేయాలన్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాలని సూచించారు. ప్రతినెల 33/11 కేవీ సబ్స్టేషన్లలో సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. కొత్తగా చేరిన జేఎల్ఎంలకు ప్రత్యేకంగా నాలుగు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు టి.మధుసూదన్, ఎ.ఆనందం, బి.భిక్షపతి, సంజీవరావు, కె.రాజు, తరుణ్, నిఖిల్, 50 మంది ఫీల్డ్సిబ్బంది పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
No Headline
వరంగల్ అర్బన్: ‘కారు కడిగితే రూ.5 వేలు జరిమానా. స్విమ్మింగ్ పూల్స్ వాడితే కఠిన చర్యలు. మోటార్లు పెట్టి నీటిని లాగితే జైలు శిక్ష’ ఇది కర్ణాటకలో పరిస్థితి. అక్కడ తాగునీటి క్యాన్ (20 లీటర్లు) రూ.200 ధర పలుకుతోందట! అలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే నీటిని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. గ్రేటర్ వరంగల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మూడేళ్ల తర్వాత మళ్లీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అదీ గంట కూడా పైపులైన్ల చివరి నల్లాల వరకు అందడం లేదు. జూన్లో వర్షాలు కురవకపోతే దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నగరానికి నీటి కష్టాలు తప్పకపోవచ్చు. ప్రత్యామ్నాయ జలాశయాలు లేక నీటి ఎద్దడి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయమేది? వరంగల్ మహానగర ప్రజలకు ధర్మసాగర్ చెరువు మాత్రమే శరణ్యమైంది. ధర్మసాగర్ జలాశయం సామర్థ్యం 1,500 ఎంసీఎఫ్టీ. ప్రస్తుతం ధర్మసాగర్లో ఉన్న నీరు మరో 80 రోజుల వరకు సరిపోతు ందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు, డెడ్ స్టోరేజీ, నీటి వాడకం తదితర కారణాలతో 60 రో జులే నీరందవచ్చని నిపుణుల అంచనా. లీకేజీలు.. అక్రమ నల్లాలు ప్రస్తుతం మహా నగరానికి రోజూ 6 ఎంసీఎఫ్టీల నీరు అవసరం కాగా.. 5 ఎంసీఎఫ్టీల రా వాటర్ సరఫరా అవుతోంది. ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధి చేసిన నీరు 35 శాతం నీటికి లెక్కలు దొరకడం లేదు. లీకేజీలు, అక్రమ కనెక్షన్లతో నీరు పక్కదారి పడుతోంది. కొన్ని చోట్ల మోటార్లతో నీటిని లాగుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇంజనీర్లు వైఫల్యం చెందుతున్నారనే విమర్శలున్నాయి. దేశాయిపేట ఫిల్టర్బెడ్ -
నీటి గోస
వరంగల్ నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా దయనీయంగా ఉంది. వరంగల్ అండర్ రైల్వే గేట్, హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో చాలా కాలనీల్లో నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తికి 160 లీటర్ల నీరు అవసరం. కానీ.. ప్రస్తుతం 60–70 లీటర్లు అందడం లేదు. నల్లాలు విడవడమే ఆలస్యం.. మోటార్లు పెట్టుకుని లాగేస్తున్నారు. దీంతో చాలా కాలనీల్లో పేదలు నీళ్లు అందక అరిగోస పడుతున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని ఇంజనీర్లు చెబుతున్నా.. ట్యాంకర్లు జాడా పత్తా లేవని పేదలు ఆందోళన చెందుతున్నారు. -
రమేశ్ చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహాక సమావేశం హనుమకొండ హంటర్రోడ్లోని డీ కన్వన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్య నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ధ్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందన్నారు. వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షం
పర్వతగిరి : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ సుధీర్కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఇన్చార్జ్లను కోరారు. పార్లమెంట్ ఎన్ని కల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని వదిలి వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్పు అని ప్రజలు మోసపోయారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీకి మండల, గ్రామ కమిటీలే సుప్రీం అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్రెడ్డి బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు దిమ్మ తిరిగే ఫలితం ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్నికల మండల ఇన్చార్జ్ మార్గం భిక్షపతి, పర్వతగిరి మండల ప్రజా ప్రతినిధులు ఎండీ.సర్వర్, ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, లూనావత్ కమలపంతులు, మోటపోతుల మనోజ్కుమార్, బోయినపల్లి యుగంధర్రావు ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
ఎల్ఈడీ వెలుగులేవి?
నల్లబెల్లి : గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్లతో విద్యుత్ బిల్లులు భారీగా రావడం.. నిర్వహణ కష్టమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా వీధిలైట్లను నిర్వహిస్తామని ముందుకొచ్చిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) గుర్తింపు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు ఎల్ఈడీ లైట్ల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల నిర్వహణను సంస్థ గాలికొదిలేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిగించిన లైట్లను మరమ్మతు చేయడం లేదు. పనిచేయని లైట్ స్థానంలో మరో లైట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒప్పందాన్ని విస్మరించిన ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏడాదిన్నర క్రితం గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్ల వెలుగులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా.. 319 గ్రామ పంచాయతీల్లో 56 వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. లైట్ల బిగింపుతోపాటు నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను సంస్థ ఏడేళ్లపాటు చూసుకోవాల్సి ఉంది. కానీ, నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ విస్మరించింది. ఫలితంగా సుమారు ఐదు నెలలుగా పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ కాంతులు వెదజల్లుతాయని అనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లైట్ల నిర్వహణ చేపట్టాలని మండలస్థాయి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఎన్నిమార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు సంస్థపై తగు చర్యలు తీసుకొని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో నిర్వహణ బాధ్యతలను విస్మరించిన ఈఈఎస్ఎల్ ఐదు నెలలుగా అంధకారం.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ జిల్లాలో 323 గ్రామాలు.. 319 జీపీల్లో 56 వేల లైట్లుసంస్థ పట్టించుకోవడం లేదు.. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో కొన్ని నెలలుగా ఎల్ఈడీ లైట్లు వెలగడంలేదు. మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. గ్రామాల్లో రాత్రి వేళ ఎల్ఈడీ వీధిలైట్లు వెలుగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేపట్టి ఎల్ఈడీ వెలుగులు అందించాలి. – కూచన ప్రకాశ్, మండల పంచాయతీ అధికారి, నల్లబెల్లిచర్యలు తీసుకుంటాం..గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్లు వెలగడం లేదని మా దృష్టికి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. గ్రామాల్లో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా ఎల్ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తాం. – కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి -
రెండు మూడ్రోజులకోసారి..
కరీంనగర్ లోయర్ మేనేరు డ్యామ్(ఎల్ఎండీ) నుంచి ధర్మసాగర్ వద్ద ఉన్న మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ ప్రతీ రోజు 60 మిలియన్ లీటర్ ఫర్ డే (ఎంఎల్డీ)ల రా వాటర్ సరఫరా అవుతోంది. ఎల్ఎండీలో నీటి నిల్వలు కనీస స్థాయికి చేరాయి. దీంతో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 3 లక్షల జనాభాకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రెండు, మూడ్రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. జూన్లో వర్షాలు పడకపోతే నగరానికి తీవ్ర నీటి ఎద్దడి ఎదురుకానుంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకోనైనా ప్రత్యామ్నాయ జలాశయాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం జలాశయాల విషయంలో మీనమేషాలు లెక్కించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కడియం కావ్యది ఆంధ్రానే
హన్మకొండ: కడియం కావ్యది ముమ్మాటికీ మెట్టినిల్లు అయిన ఆంధ్రానే అని, ఆమె స్థానికేతరురాలు అని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక భాగమేనన్నారు. అవసరమనుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. కడియం శ్రీహరి తన గురువైన చంద్రబాబును అడిగి బాపట్ల నుంచి టికెట్ అడిగి తీసుకోవచ్చుకదా అని అన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి అని, టీడీపీలో మంత్రిగా ఉండి ఉద్యమకారులపై కేసులు పెట్టించారన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారన్నారు. ఈనెల 24న అరూరి రమేశ్ నామినేషన్ వేస్తారన్నారు. సమావేశంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ ప్రభారీ మురళీధర్ గౌడ్, కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి, నాయకులు ఒంటేరు జయపాల్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తిరుపతిరెడ్డి, సంతోశ్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు -
సాధారణానికి మించి..!
సాక్షి, వరంగల్ : జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో హైరానా పడుతున్నారు. వారం క్రితం కాస్త చల్లబడిన వాతావరణం గత ఆదివారం నుంచి మళ్లీ వేడెక్కుతోంది. 40.4 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇప్పుడు ఏకంగా 45.1 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతను మించి 8 డిగ్రీ సెల్సియస్ అత్యధికంగా గురువారం నమోదైంది. 2022 మేలో వరంగల్లో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నెలరోజులు మిగిలి ఉండగానే ఆ స్థాయిలో ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో గురువారం ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజకీయ పార్టీలకు గండం.. ఎండ వేడిమి ధాటికి జనాలు ఉదయం 8 దాటిందంటేనే బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం వేళ అవసరమైతేనే తప్ప ఎవరూ రోడ్ల పైకి రావడం లేదు. జిల్లాలో ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో 45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండగా.. మిగలిన మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిపూట బడులకు వెళ్లి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ సభలకు బదులు ఫంక్షన్హాళ్లలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎండతో పాటు వడగాలుల ధాటికి ఏసీ ఫంక్షన్హాళ్లలోనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండలకు భయపడి వీటికి కూడా చాలా మంది రాకపోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోని రావాలని, నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. గంటలకొద్దీ ప్రయాణం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ల వివరాలు.. నాలుగు రోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గీసుకొండ మండలం గొర్రెకుంటలో 45.1 డిగ్రీల నమోదు భానుడి ప్రతాపంతో ప్రజల బెంబేలు.. సభలకు బదులు ఫంక్షన్హాళ్లలో రాజకీయ పార్టీల సమావేశాలు అవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారుల సూచనరోజు ప్రాంతం డిగ్రీ సెల్సియస్లలో ఆదివారం ఉర్సుగుట్ట 40.4 సోమవారం ఖిలా వరంగల్ 42.4 మంగళవారం కల్లెడ (పర్వతగిరి) 43.4 బుధవారం రెడ్లవాడ (నెక్కొండ) 43.7 గురువారం గొర్రెకుంట (గీసుకొండ) 45.1 -
అవినీతిని ప్రోత్సహిస్తున్న కేంద్రం
మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ఎల్కతుర్తి : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో చందాలు తీసుకోవచ్చని ప్రధాన మంత్రి ప్రకటనతో స్పష్టమైందని తెలిపారు. ఒకరు రూ.500 కోట్లు ఇస్తే బెయిల్, ఇంకొకరు రూ.100 కోట్లు ఇస్తే కాంట్రాక్టు వచ్చిందని విమర్శించారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తే నల్లధనం.. తెల్లధనం అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. బాండ్లను తీసుకొని కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఏవిధంగా ప్రోత్సహిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో ఆ రాముడే అందరికి న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీపీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, నాయకులు సంతాజీ, గోలి రాజేశ్వర్రావు, శీలం అనిల్కుమార్, శనిగరం వెంకటేష్, మండ సుమన్గౌడ్, పెండ్యాల తిరుపతి, హింగె శ్రీకాంత్, ముప్పు శ్రీనివాస్, బచ్చు బాబురావు, శ్రీధర్రావు, పాక రమేష్, ప్రభాకర్, భాస్కర్, గొర్రె మహేందర్, సురేశ్రెడ్డి, గూడెల్లి నవీన్, కడారి సురేందర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పద్మాక్షి మహిళా హాస్టల్లో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏబీఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు హాస్టల్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ విద్యార్థినులకు సరైన వసతి కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి వచ్చి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జ్ మచ్చ పవన్కల్యాణ్, అధ్యక్షుడు దూడపాక నరేందర్, చైతన్యగౌడ్, కార్తిక్, అశోక్, నవ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. సభాస్థలి పరిశీలన మడికొండ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 24న హనుమకొండ జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా కాజీపేట మండలం మడికొండ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఉన్న స్థలంలో సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చర్చించారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి విద్యారణ్యపురి : ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశపరీక్షకు రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, ఆసక్తి ఉన్న విద్యార్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు డీఎస్ఆర్ రాజేందర్సింగ్ కోరారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ ఉచిత శిక్షణను హైదరాబాద్ నుంచి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్సింగ్ మాట్లాడుతూ సబ్జెక్టు నిపుణులతో విద్యార్థులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. కేడీసీ కెమిస్ట్రీ విభాగం అధిపతి బి.రమేశ్ మాట్లాడుతూ 60 రోజులపాటు నిర్వహించే శిక్షణకు 750 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి, పింగిళి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, కెమిస్ట్రీ అధ్యాపకులు సత్యనారాయణ, సునీత, మొగిలి, జగదీశ్బాబు పాల్గొన్నారు. 21 నుంచి బీఎల్ఐఎస్సీ తరగతులు కేయూ క్యాంపస్ : కేయూ దూరవిద్య కేంద్రంలో ఈనెల 21, 28, 29, 30, మే 5, 6, 7, 8 ,9 తేదీల్లో బీఎల్ఐఎస్సీ కాంటాక్టు తరగతులు నిర్వహించనున్నట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వి.రాంచంద్రం తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
23న టీచర్లను రిలీవ్ చేయాలి
విద్యారణ్యపురి : బదిలీ అయిన ఉపాధ్యాయులను ఈనెల 23న రిలీవ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బదిలీ అయిన వారిని ఇప్పటికీ రిలీవ్ చేయకపోవడం సరికాదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత టీచర్లకు బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ను ప్రకటించాలన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎం.సదాశివరెడ్డిని ఘనంగా సన్మానించారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధక్షుడిగా సీహెచ్.రవీందర్రాజు, ఉపాధ్యక్షుడిగా అజ్మీరా రాజారామ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, జిల్లా కోశాధికారి డి.కిరణ్కుమార్, జిల్లా బాధ్యులు సీఎస్ఆర్.మల్లిక్, కె.మోజెస్, చంద్రయ్య, నవీన్కుమార్, సీహెచ్.లింగారావు, ఎం.శశిధర్రెడ్డి, మెరుగు ప్రసన్న, కె.సదానందం పాల్గొన్నారు. -
No Headline
యూపీఎస్సీ ర్యాంకర్ ప్రణయ్కుమార్ ‘పౌరులకు వైద్యం, విద్య, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతుల కల్పన, పేదరిక నిర్మూలన కోసం కృషి చేసేందుకే ఐఏఎస్ కావాలనుకున్నా’ అని యూపీఎస్సీ ఆల్ ఇండియా 554వ ర్యాంకర్ కొయ్యడ ప్రణయ్కుమార్ అన్నారు. బుధవారం స్వగ్రామమైన రఘునాథపల్లికి తన తల్లిదండ్రులు లక్ష్మి, ప్రభాకర్తో వచ్చిన ప్రణయ్కుమార్ను గ్రామపెద్దలు ఓపెన్టాప్ జీపులో ఊరేగించి ఘన స్వాగతం పలికారు. – రఘునాథపల్లి..అందుకే ఐఏఎస్ కావాలనుకున్నా– 8లోu -
– మరిన్ని ఫొటోలు 9లో
హనుమకొండ రెవెన్యూ కాలనీలో...హన్మకొండ అర్బన్: హనుమకొండ రెవెన్యూ కాలనీలోని శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణ వేడుకలను తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణతంతు జరిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆలయ ఆవరణలో భక్తుల కోసం షామియానాలు ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేశారు. అనంతరం భక్తులకు మహాన్నదానం చేశారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు సోమేశ్వర్రావు, సాంబమూర్తి, కాలనీ కమిటీ అధ్యక్షులు, ఆలయ కార్యదర్శి మురళీమోహన్, సభ్యులు కోట రమేష్, మల్లారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పరకాలలో..
పరకాల : పరకాల పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణోత్సవం వేదమంత్రోచ్ఛరణలతో బుధవారం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో హాజరైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి–సునంద దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు నరసింహా ఆచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ బాధ్యులు బెల్లం పాకం పంపిణీ చేసి, అన్నదానం చేశారు. కర్ణాటక సంగీత విద్వాంసులు ఉమ్మడి లక్ష్మణాచారి శిష్యబృందం భక్తి సంకీర్తనలు, భ్రమరాంబ కూచిపూడి నృత్యగురువు శిష్య బృందం నృత్య ప్రదర్శనలు అలరించాయి. సాయంత్రం మంగళవాయిద్యాలు, కోలాటాలతో పరకాల పట్టణ పురవీధుల్లో పల్లకీలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయ వ్యవస్థాపకులు చిట్టిరెడ్డి సమ్మక్క–పుల్లారెడ్డి, చిట్టిరెడ్డి వెంకట్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
రోజుకు తొమ్మిది గంటలు
కోచింగ్ లేకుండా సివిల్స్ ర్యాంకు సాధించిన కౌశిక్జనగామ: రోజుకు తొమ్మిది గంటలు.. రెండేళ్ల కఠోర శ్రమ.. కోచింగ్ లేకుండా స్వశక్తితో ప్రిపరేషన్.. సీనియర్ల సలహాలు, సూచనలతో సివిల్స్లో ఆలిండియా 82వ ర్యాంకు సాధించిన మెరుగు కౌశిక్ నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జనగామ పట్టణానికి చెందిన కౌశిక్ ర్యాంకు సాధించిన తర్వాత మొదటిసారి బుధవారం జిల్లా కేంద్రానికి రాగా.. స్నేహితులు, బంధువులు అతడికి ఘన స్వాగతం పలికి అభినందనలతో ముంచెత్తారు. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, స్నేహితులు సత్కరించి ఆశీస్సులు అందించారు. పలువురి సత్కారం.. సివిల్స్ ర్యాంకర్ కౌశిక్ను జిల్లా ఆస్పతుల సమన్వయకర్త డాక్టర్ సుగుణాకర్రాజు, కౌన్సిలర్ సుధ తదితరులు సత్కరించారు. అలాగే బాలాజీనగర్ రేణుకాఎల్లమ్మ ఆలయ కాలనీవాసులతోపాటు సురుగు సుధాకర్ గౌడ్, రాజు, ముస్త్యాల దయాకర్, ఉల్లుంగుల సందీప్, తిప్పారపు విజయ్, సతీష్, అఓపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్కుమార్, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బిజ్జల నవీన్కుమార్, వాసవీ క్లబ్ గ్రేటర్ పట్టణ అధ్యక్షుడు పడకంటి రవీందర్, మదరపు రాజు తదితరులు అభినందించి సన్మానించారు. కౌశిక్ పట్టుదల స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే ‘పల్లా’ కోచింగ్ లేకుండా.. స్వశక్తితో సివిల్స్లో 82వ ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు.. కౌశిక్ పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సతీమణి నీలిమ, మున్సిపల్ చైర్పర్సన్ పి.జమునతో కలిసి ఆయన కౌశిక్ను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో జనగామ పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని ఆకాంక్షించారు. రెండేళ్ల కఠోర శ్రమకు ఫలితం.. 82వ ర్యాంకు ఏడాది పాటు కన్సల్టెన్సీగా ఉద్యోగం అభినందనలతో ముంచెత్తిన స్నేహితులు, బంధువులు జనగామ పేరు నిలబెడతా.. – ‘సాక్షి’తో సివిల్స్ ర్యాంకర్ కౌశిక్ఉస్మానియా వర్సిటీలో సివిల్ ఇంజీనిరింగ్ పూర్తయిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో ఎంబీఏ చదివాను. తర్వాత కన్సట్టెంట్గా ఏడాదిపాటు ఉద్యోగం చేశాను. సివిల్స్కు ప్రిపేర్ కావడానికి ఉద్యోగం మానేశాను. 2022 నుంచి రెండు షిఫ్టుల్లో రోజుకు తొమ్మిది గంటల పాటు ప్రిపేర్ అయ్యాను. యూట్యూబ్లో వచ్చే స్టాండర్డ్ బుక్స్ను మల్టీపుల్గా చూసుకుంటూ.. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకున్నా. ఆన్సర్ రేటింగ్ కోసం తరచూ టెస్ట్ సిరీస్ రాయడం, డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుని తప్పులను సరిచేసుకోవడం వల్ల ఈ ర్యాంకు సాధించగలిగా. మాక్ ఇంటర్వ్యూలు కలిసొచ్చాయి. గతంలో సివిల్స్ ఎంట్రెన్స్ల్లో వచ్చిన ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు రిమైండ్ చేసుకున్నా. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఐఏఎస్ సాధించగలిగా. పుట్టిన ఊరు, ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని మరువలేను. జనగామ పేరు నిలబెడతా. -
కలగానే కార్యాలయం!
పరకాల : అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అనే చందంగా ఎకై ్సజ్ శాఖ పరిస్థితి తయారైంది. మద్యం దుకాణాలతోపాటు మద్యం అమ్మకాలతో ప్రతి ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక ఆదాయంతో పరకాల ఎకై ్సజ్ శాఖ మొదటి స్థానంలో నిలుస్తోంది. కానీ, కార్యాలయం 30 ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతోంది. తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న పరకాల ఎకై ్సజ్ కార్యాలయ ఉద్యోగులకు కొత్త భవనానికి నిధులు మంజూరు, పనుల ప్రారంభం సంతోషం కలిగించింది. 2017లో రూ.40 లక్షల నిధులతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. మొదటి దశ (బెడ్ లెవల్) వరకే పనులు చేపట్టి బిల్లు రావడం లేదని 2019లో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. దీంతో ఎకై ్సజ్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇరుకై న భవనంలో విధులు నిర్వర్తించడం, మహిళా అధికారులు ఉన్న భవనంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఎకై ్సజ్ అధికారులు ఏమైనా కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, బెల్లం, పటికను భద్రపరచడం సవాలుగా మారుతోంది. అదేవిధంగా పట్టుబడిన వాహనాల బహిరంగ వేలాన్ని నడిరోడ్డుపై నిర్వహిస్తుండడంతో వాహనాల రాకపోకలు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 22 షాపులు.. ● పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 22 షాపులకు వచ్చిన 400 దరఖాస్తులతో రూ.8 కోట్ల ఆదాయం. ● ఒక్క షాపు సంవత్సరానికి రూ.55 లక్షలు చెల్లించాలి. అంటే 22 షాపులతో రూ.12.10 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ● స్పెషల్ ఎకై ్సజ్ ఫీజు కింద ఒక్కో షాపు సంవత్సరానికి రూ.5 లక్షలు చెల్లించాలి. ● ఇవేకాకుండా మద్యం అమ్మకాలతో రూ.కోట్ల ఆదాయం వస్తోంది. ఇంత ఆదాయం ఉన్నా పరకాల ఎకై ్సజ్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆదాయానికి గండి సొంతభవనం లేకపోవడంతో 30 ఏళ్లుగా అద్దె చెల్లింపుతో ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. నెలకు రూ.6వేలు చెల్లిన్నారంటే ఏడాదికి రూ.72 వేలు.. 30 ఏళ్లపాటు చెల్లించిన అద్దెతోనే సొంత భవనం నిర్మాణం పూర్తయ్యేది. కార్యాలయం ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి అద్దె భవనంలో ఉన్న ఎకై ్సజ్ శాఖ కార్యాలయాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేస్తున్నాడు. ఖాళీ చేయాలంటే కార్యాలయానికి తగిన భవనం దొరకడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సొంత భవనం నిర్మాణం పూర్తికాదు.. ఉన్న భవనం ఖాళీ చేయాలనే ఒత్తిడి తేవడం ఎకై ్సజ్ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పరకాల పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయానికి సొంతభవనాన్ని నిర్మించాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. సొంత భవనం లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కాంట్రాక్టర్కు బిల్లు మంజూరు చేయిస్తే మిగతా పనులు పూర్తవుతాయని అధికారులకు వివరించాం. అద్దె భవనం ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేస్తున్న మాట నిజమే. – తాతాజీ, ఎకై ్సజ్ శాఖ సీఐ, పరకాల పరకాలలో ఎకై ్సజ్ శాఖకు కరువైన సొంత భవనం 2017లో నిధులు మంజూరు.. 2019లో పనులు ప్రారంభం బిల్లులు రాలేదని భవన నిర్మాణాన్ని నిలిపివేసిన కాంట్రాక్టర్ రోడ్డుపైనే బహిరంగ వేలం.. అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
‘మిరల్’ మూవీ రివ్యూ
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
'దర్శిని' సినిమా రివ్యూ
ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
నాన్న రెండో పెళ్లి.. మా అమ్మ వెళ్లి ఆశీర్వదించింది!: నటి
ఓటమి భయం.. ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
తప్పక చదవండి
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement