-
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్ఫ్లిక్స్లో రిలీజైన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్ ట్రెండింగ్తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సిరీస్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది.ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
-
మనిషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా!
ఓటీటీలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. లాహోర్లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు భన్సాలీ. (చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ వెబ్సిరీస్కి ఓటీటీ ప్రేక్షకులను అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించింది.మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్ సిరీస్కే హైలెట్. కొన్ని సీన్లలో మనిషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తిస్తుంది. తాజాగా సోనాక్షి ఆ సీన్ల గురించి మాట్లాడుతూ.. మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పింది. ‘నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి వెబ్ సిరీస్ మొత్తం చూశాక ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సీన్లలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూశాక..నేను అలా ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే మనీషాకు క్షమాపణలు చెప్పాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్ మొత్తం సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు. ఇక భన్సాలి గురించి మాట్లాడుతూ..‘ఆయన సినిమాలో నటించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్ షూటింగ్కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. హీరామండి లాంటి వెబ్ సిరీస్లో ఇంతగొప్ప పాత్ర ఇచ్చినందుకు భన్సాలిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని సోనాక్షి చెప్పారు. -
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఈ సిరీస్లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్ 'అలంజేబ్' పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త ఎవరు. అతని నెట్వర్త్ ఎంత అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క 'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్ పాత్రను దక్కించుకుంది.రూ. 50 వేల కోట్ల ఆస్తిషర్మిన్ సెగల్ భర్త, పారిశ్రామికవేత్త అమన్ మెహతా వేల కోట్లకు యజమాని. గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్ను అమన్ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్నకు టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి అనుబంధ కంపెనీలున్నాయి.టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్కు కూడా డైరెక్టర్గా ఉన్నారు.ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అమన్ మెహతా విద్యార్హతలుఅమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి అయిన తరువాత టోరెంట్ ఫార్మాలో సీఎంఓగా చేరి మూడేళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి పొందాడు. -
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్లో లిస్ట్లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.కామెడీ డ్రామా సిరీస్లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్సిరీస్ల లిస్ట్లో టాప్ ప్లేస్లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.తాజాగా విడుదలైన ట్రైలర్తోనే పంచాయత్ మూడో సీజన్పై భారీ అంచనాలను పెంచేశారు. తొలి రెండు సీజన్లు ఎంతటి హిట్ అందుకున్నాయో.. మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంచనావేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కామెడీకి ఎక్కువ చోటు కల్పించిన దర్శకుడు రెండో భాగం ముగింపులో కాస్త భావోద్వేగాలను కూడా జోడించడంతో మరింతగా ప్రేక్షకులకు ఈ సిరీస్ దగ్గరైంది. -
టబుకి హాలీవుడ్ చాన్స్.. ఆ వెబ్ సీరీస్లో కీలక పాత్ర!
సీనియర్ నటి టబు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళుతున్నారు. ఇటీవల విడుదలైన ‘క్రూ’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టబు ప్రస్తుతం హిందీలో మరికొన్ని ప్రాజెక్ట్లు కమిట్ అయ్యారు. అలాగే హాలీవుడ్ సూపర్ హిట్ టెలివిజన్ సిరీస్ ‘డ్యూన్: ఫ్రొఫెసి’లో నటించే లక్కీ చాన్స్ అందుకున్నారు. ‘డ్యూన్’ సిరీస్కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. తొలి భాగానికి మంచి స్పందన రావడంతో రెండో భాగం ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో సిస్టర్ ఫ్రాన్సెస్ అనే ఎంతో ప్రాధాన్యమైన పాత్రలో టబు నటించనున్నారు. డయాన్ అడెము–జాన్ క్రియేషన్లో ఈ సిరీస్ రూపొందనుంది. పది వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అనే పాయింట్తో ‘డ్యూన్’ తొలి భాగం రూపొందింది. ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కించనున్నారట. తొలి భాగం కంటే ఐదు రెట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. -
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మధ్య కాలంలో లాహోర్లో రెడ్లైట్ ప్రాంతంగా పేరున్న హీరామండిలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు భన్సాలీ. (చదవండి: హీరామండి రివ్యూ)మనీషా కోయిరాలా , అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా , ఫర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్ పాత్ర వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్ సీన్స్, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్ చేసిందని చెప్పుకొచ్చింది. ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్తో కలిసి సోనాక్షి ఇంటిమేట్ సీన్స్లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్ చెప్పాడు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలే వేసవికాలం.. బయటచూస్తే మండుటెండలు భయపెట్టేస్తున్నాయి. స్కూళ్లకు సైతం సెలవులు రావడంతో పిల్లలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను అందిస్తున్నాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ జానర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.ఈనెల 10 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఏకంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది కేవలం జియో సినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. Bas teen din mein milenge saare sawalon ke jawab🔪Murder In Mahim streaming 10th May onwards, exclusively on JioCinema Premium.Subscribe to JioCinema Premium at Rs. 29 per month. Exclusive content. Ad-free. Any device. Up to 4K. pic.twitter.com/kL5cnFp8Uy— JioCinema (@JioCinema) May 7, 2024 -
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించారు. బాలీవుడ్ భామ రిచ్చా చద్దా ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మే 1వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిచా సహానటులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా నటీమణులు, మహిళా నిర్మాతలతో పనిచేయడం గురించి మాట్లాడింది. తనతో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో కలిసి పనిచేసినట్లు వెల్లడించింది. ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకునే వారితో కలిసి నటించడం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది.రిచా చద్దా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలామంది స్త్రీవాదులనే ఆలోచనను నేను అంగీకరించను. చెక్కులు బౌన్స్ అయిన మహిళా నిర్మాతలతో కూడా పనిచేశా. అంతే కాదు వారితో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా. అలాంటి వారు కేవలం ట్విట్టర్లో మాత్రమే స్త్రీవాదులుగా చలామణి అవుతుంటారు. సినిమా సెట్లో నటీనటుల మధ్య సోదరి భావం ఎప్పుడూ ఉండదు. తనకు ఎలాంటి సరైన సూచనలు ఇవ్వకుండా.. సన్నివేశాలలో లైట్స్ ఆఫ్ చేసే సహనటులు ఇప్పటికీ నాతో నిరంతరం పోటీ పడుతున్నారు. స్త్రీవాదమనేది జెండర్కు సంబంధించినది కాదు. పురుషుల్లోనూ బలమైన స్త్రీవాదులు ఉన్నారని తెలుసు' అని అన్నారు. పురుషులు కూడా స్త్రీవాదులు కావచ్చు.. అలాగే స్త్రీలు కూడా పురుషవాదులు కావచ్చని పేర్కొంది. కాగా.. రిచా చద్దా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ'హీరామండిలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. -
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల కంటే ఓటీటీల్లో మూవీస్-వెబ్ సిరీసులు చూసేవాళ్లే ఎక్కువయ్యారు. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు సరికొత్త సిరీసులు తీసుకొస్తున్నాయి. అలానే కొన్ని హిట్ సిరీస్లకు తర్వాత భాగాల్ని కూడా మొదలుపెడుతున్నాయి. అలా ఓటీటీలో సెన్షేషన్ సృష్టించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.దేశభక్తి అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సిరీసులు వస్తున్నాయి. అయితే దేశభక్తి ప్లస్ ఓ మధ్య తరగతి వ్యక్తి నేపథ్యంగా తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఈ జానర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్లో మనోజ్ భాజ్పాయ్-ప్రియమణి జంటగా నటించారు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రిపీట్స్లో చూశారు. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.అయితే రెండో సీజన్ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్ షూటింగ్ మొదలైందని డైరెక్టర్స్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఓ పిక్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉంటుంది.(ఇదీ చదవండి: ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్లో ఓకే ఎక్స్ప్రెషన్తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్స్టా పోస్ట్కు కామెంట్ సెక్షన్ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్ చేసిన బిగ్ మిస్టేక్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
హీరామండి.. భారీ బడ్జెట్తో నిర్మితమైన వెబ్ సిరీస్. పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ కళాఖండం మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ సిరీస్లో కొన్ని పొరపాట్లను నెటిజన్లు గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.జర్నలిస్టు ట్వీట్ఐదో ఎపిసోడ్లో సోనాక్షి సిన్హా వార్తా పత్రిక చదువుతున్న సమయంలోని పొరపాటను ఎత్తిచూపుతున్నారు. ఈ మేరకు పర్వేజ్ ఆలమ్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ చేశాడు. హీరామండి సిరీస్ 1920-40 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. స్వతంత్రానికి ముందు బ్రిటీష్ పాలనలో ఉన్న లాహోర్లో కథ సాగుతుంది. ఉర్దూ పేపర్ఐదో ఎపిసోడ్లో ఫరీదన్ (సోనాక్షి సిన్హ) ఉర్దూ పేపర్ చదువుతుంది. అందులోని హెడ్లైన్స్లో వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్: టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్ అని ఉంది. 50వేల మాస్కులను పంపిణీ చేయనున్న యూత్ కాంగ్రెస్.., కరోనాతో పోరాడాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి: కరోనా రోగులకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సలహా.. ఇలాంటి హెడ్లైన్సే ఉన్నాయి అని రాసుకొచ్చారు. అది కూడా తెలీదా?మరో నెటిజన్.. ఉర్దూ పేపర్ను ఎడమ నుంచి కుడికి చదవడం మాత్రం హైలెట్ అని సెటైర్ వేశాడు. ఉర్దూని కుడి నుంచి ఎడమకు చదువుతారని కూడా తెలీకుండా ఆ పాత్రను డిజైన్ చేయడం, కనీసం ఎవరైనా భాషాజ్ఞానులను సంప్రదించకపోవడం విచారకరం అని కామెంట్లు చేస్తున్నారు. Sanjay Leela Bhansali’s epic web series Heera Mandi on Netflix is set against the Indian independence/British Raj in Lahore of the 1920s-1940s. Fareedan (Sonakshi Sinha) is supposedly reading an Urdu newspaper (EP5). Headlines say, “Warangal Municipal Elections: TRS Distributes… pic.twitter.com/EI44Z61rkt— Pervaiz Alam (@pervaizalam) May 3, 2024 -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్లు
ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జనం వణికిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సూరీడు అందరిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు వెళ్లడం లేదు. వారందరికీ వినోదాన్ని పంచేందుకు ఓటీటీలు బోలెడంత కంటెంట్తో రెడీ అయ్యాయి. సినిమాలు, సిరీస్లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నాయి. మరి మే నెలలో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్లు ఏంటో చూసేద్దాం..నెట్ఫ్లిక్స్👉హీరామండి: ద డైమండ్ బజార్ (వెబ్ సిరీస్)👉షైతాన్👉ద హాలీడే👉ఎ మాన్ ఇన్ ఫుల్ (వెబ్ సిరీస్)👉టి- పిబన్ (వెబ్ సిరీస్)👉అన్ఫ్రాస్టెడ్👉ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో (ఎపిసోడ్ 6)(పైవన్నీ మే నెల ప్రారంభంలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి)👉సూపర్ రిచ్ ఇన్ కొరియా (వెబ్ సిరీస్) - మే7👉ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ (వెబ్ సిరీస్) - మే 7👉ద ఫైనల్: అటాక్ ఆన్ వెంబ్లీ - మే 8👉క్రేజీ రిచ్ ఆసియన్స్ - మే 8👉మదర్ ఆఫ్ ద బ్రైడ్ - మే 9👉లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2)- మే 10👉ద గ్రేడ్ ఇండినయ్ కపిల్ షో (ఎపిసోడ్ 7) - మే 11👉బ్రిడ్జర్టన్ (మూడో సీజన్- ఎపిసోడ్ 1)👉మేడ్మి వెబ్ - మే 14👉తెల్మా ద యునికార్న్ - మే 17👉అట్లాస్ - మే 24లయన్స్ గేట్ ప్లే📽️ బ్లాక్ మాఫియా ఫ్యామిలీ (సీజన్ 3) - మే 3📽️ ద మార్ష్ కింగ్స్ డాటర్ - మే 10📽️ కాప్షాప్ - మే 17📽️ వాంటెడ్ మ్యాన్ - మే 24📽️ విజిల్ (సీజన్ 2) - మే 31హాట్స్టార్🎞️ బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్🎞️షార్డ్లేక్🎞️వెల్కమ్ టు వ్రెక్జామ్🎞️ప్రామ్ డేట్స్🎞️స్టార్ వార్స్: టేల్స్ ఆఫ్ ద ఎంపైర్(మే ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి)🎞️మాన్స్టర్స్ ఎట్ వర్క్ - మే 5🎞️మంజుమ్మెల్ బాయ్స్ - మే 5🎞️ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ - మే 8🎞️అండర్ ద బ్రిడ్జ్ - మే 8🎞️లెట్ ఇట్ బి - మే8🎞️డాక్టర్ హు - మే 11🎞️క్రాష్ - మే 13🎞️అంకుల్ సామ్సిక్ - మే 15🎞️క్వీన్ రాక్ మాంట్రియల్ - మే 15🎞️పాలైన్ - మే 22🎞️మార్వెల్ స్టూడియోస్ అసెంబ్ల్డ్: ద మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ 97 - మే 22🎞️ద కర్దాషియన్స్ - మే 23🎞️ద బీచ్ బాయ్స్ - మే 24🎞️కాండెన్ - మే 29🎞️జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ - మే 31అమెజాన్ ప్రైమ్📽️ అమెరికన్ ఫిక్షన్ - మే 14📽️ ద బ్లూ ఏంజెల్స్ - మే 23📽️ ద బాయ్స్ ఇన్ ద బోట్ - మే 28బుక్ మై షో స్ట్రీమ్👉 డేర్ డెవిల్ ముస్తఫా👉 ఆర్కెస్ట్రా మైసూరు👉 మిస్టర్ నట్వర్లాల్👉 కాంక్రీట్ ఉటోపియా👉 మాన్స్టర్👉 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ద న్యూ ఎంపైర్👉 ఎండేవర్ సీజన్ 1👉 ఎండేవర్ సీజన్2👉 ఎండేవర్ సీజన్ 3👉 ఎండేవర్ సీజన్ 4👉 ఎండేవర్ సీజన్ 9👉 ఎండేవర్ - పైలట్అల్ట్రాజకాస్🎞️ రంగీత్🎞️ యాసిడ్🎞️ అభ్యూహమ్🎞️ డోంట్ లుక్ అవే🎞️ టైగర్ రాబర్స్📺 ఫ్యామిలీ కట్టా (షో)📺 కుకరీ షో📺 మహారాష్ట్రచీ హస్యజాతర (షో)📺 అనైతిక్ (వెబ్ సిరీస్)📺 ఉదర్ బైకో (వెబ్ సిరీస్)📺 నజరబండి (వెబ్ సిరీస్)📺 లైసా (వెబ్ సిరీస్)యాపిల్ టీవీ👉 అకాపుల్కో (సీజన్ 3) - మే 1👉 డార్క్ మ్యాటర్ - మే 8👉 హాలీవుడ్ కాన్ క్వీన్ - మే 8👉 ద బిగ్ సిగర్ - మే 17👉 ట్రైయింగ్ (సీజన్ 4) - మే 22అమెజాన్ మినీ టీవీ📽️ ద రిటర్న్ ఆఫ్ రెబల్ - మే 2📽️ మగధీర - మే 2📽️ మిడిల్ క్లాస్ అబ్బాయి - మే 2📽️ యు ఆర్ మై డెస్టినీ - మే 8📽️ 96 - మే 9📽️ దేవ్ - మే 9📽️ ప్రేమమ్ - మే 9📽️ అమర్ అక్బర్ ఆంటోని - మే 9📽️ డేంజరస్ ఖిలాడీ 2 - మే 9📽️ టర్న్ బ్యాక్ - మే 13📽️ అండర్కవర్ కౌంటర్ అటాక్ - మే 14📽️ ఐ బిలాంగ్డ్ టు యువర్ వరల్డ్ - మే 15📽️ మర్డర్ ఇన్ ద ఫస్ట్ - మే 15మ్యాక్స్👉 స్టాప్ మేకింగ్ సెన్స్ - మే 3👉 ద ఐరన్ క్లా - మే 10👉 మూవీపాస్, మూవీ క్రాష్ - మే 29హుళు🎞️ ప్రామ్ డేట్స్ - మే 3🎞️ ఈలెన్ - మే 10🎞️ బయోస్పియర్ - మే 10🎞️ బర్త్/ రీబర్త్ - మే 17🎞️ ద స్వీట్ ఈస్ట్ - మే 17🎞️ ద వెంట్ దట్ వే - మే 17🎞️ ఫెరారీ - మే 24🎞️ ద ప్రామిస్డ్ ల్యాండ్ - మే 30🎞️ సింపతీ ఆఫ్ ద డెవిల్ - మే 31చదవండి: అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. మధ్యలో చై ఎందుకో! -
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్లో లిస్ట్లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్కు మేకర్స్ గుడ్న్యూస్ వినిపించారు. ఓటీటీలోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందా..? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.అభిషేక్ త్రిపాఠి అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉంటాడు. అతనికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం రాదు. కానీ, కొన్ని కారణాల వల్ల స్నేహితుల సలహా మేరకు పంచాయతీ సెక్రటరీలో ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ రత్యా ఉత్తర ప్రదేశ్లోని ఫులేరా అనే గ్రామంలో అభిషేక్ అడుగుపెడుతాడు. భిన్న మనస్తత్వాలు కలిగిన గ్రామస్తుల మధ్య ఆయనకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అభిషేక్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? ఈ క్రమంలో దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా కామెడీని పండించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ కామెడీ డ్రామా సిరీస్లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్సిరీస్ల లిస్ట్లో టాప్ ప్లేస్లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.you moved the laukis, we unlocked your reward! #PanchayatOnPrime S3, May 28@TheViralFever @ArunabhKumar @StephenPoppins #ChandanKumar @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @chandanroy77 @malikfeb @Sanvikka #PankajJha pic.twitter.com/ouN5ON5hGp— prime video IN (@PrimeVideoIN) May 2, 2024 -
తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్ను భారీ బడ్జెట్తో తెరకెక్కించడం మరో విశేషం.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోషించారు.కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్లోని రెడ్లైట్ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో ఉంది. -
రియల్ స్టోరీతో వస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గంగూభాయి కతియావాడి. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ముంబయిలో వేశ్యవాటిక నేపథ్యంలో వచ్చిన గంగూభాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.తాజాగా అలాంటి కథతోనే సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంజయ్. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. హీరామండి: ది డైమండ్ బజార్ పేరుతో వస్తోన్న వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదికరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్లో మల్లికాజాన్గా మనీషా కొయిరాలా, ఫరీదాన్గా సోనాక్షి సిన్హా, బిబ్బోజాన్గా అదితి రావు హైదరీ, అలంజేబ్గా షర్మిన్ సెగల్, వహీదాగా సంజీదా షేక్, లజ్జోగా రిచా చద్దా నటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. పాక్లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్ సిరీస్లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్స్ట్రాగామ్లో పంచుకున్నారు. దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
తెలంగాణ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్.. ఆ ఓటీటీలోనే రిలీజ్?
ఓటీటీల వల్ల చాలామంది సినిమాలు, వెబ్ సిరీసులకు బాగా అలవాటుపడిపోయారు. కొత్త రిలీజులు ఏమున్నాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు స్ట్రెయిట్ వెబ్ సిరీస్ ఒకటి రెడీ అయిపోయింది. తెలంగాణ నేపథ్యంగా ఈ సిరీస్ తీయడం విశేషం. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఆచితూచి సినిమాలు, సిరీసులు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ 'దూత' లాంటి స్ట్రెయిట్ వెబ్ సిరీస్ వచ్చింది. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు అలానే 'వికటకవి' అనే డిటెక్టివ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. డేట్ చెప్పాల్సి ఉంది. అయితే ఏప్రిల్ చివర్లో లేదా మే తొలివారంలో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
సేవ్ ది టైగర్స్ సీజన్-2.. అది చెప్పేందుకు ప్రయత్నిస్తా : మహి వి రాఘవ్
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్-1కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఆయన సేవ్ ది టైగర్ సీజన్ -2 ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సేవ్ ది టైగర్స్ సీజన్- 1, సైతాన్ సూపర్ హిట్, సేవ్ ది టైగర్స్ సీజన్ -2 సక్సెస్తో హ్యాట్రిన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓటీటీలో హ్యాట్రిక్ విజయంపై మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. 'ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు. వెబ్ సిరీస్ గురించి చెబుతూ.. 'సేవ్ ది టైగర్స్ సీజన్- 1లో ఫ్రస్టేషన్తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే.. సీజన్- 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్- 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్లతో మీ ముందుకు వస్తా' అని అన్నారు. -
ఓటీటీలో హైజాక్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన లూటేరే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రెండు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ హైజాక్ థ్రిల్లర్ సిరీస్ లూటేరే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా షిప్ హైజాక్ నేపథ్యంలోనే ఈ సిరీస్ను తెరకెక్కించారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వచ్చే వారంలో మిగిలిన ఎపిసోడ్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లూటేరే వెబ్ సిరీస్ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. ఆయన తనయుడు జై మెహతా డైరెక్షన్లో తెరకెక్కించారు . సోమాలియా పైరేట్స్ ఓ షిప్ను హైజాక్ చేయడం.. దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలు పోషించారు. Time to drop the anchor! ⚓🚢#HotstarSpecials #Lootere is now streaming. Watch now: https://t.co/KnAtofkAqW pic.twitter.com/NSqwm5GUnG — Disney+ Hotstar (@DisneyPlusHS) March 21, 2024 -
అమెజాన్ ప్రైమ్లో ఏకకాలంలో బోలెడు సినిమాలు విడుదల!
ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో క్రేజీ అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. రానున్న రోజుల్లో విడుదల చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ల లిస్ట్ ప్రకటించింది. ముంబై వేదికగా జరిగిన ఈవెంట్లో ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలతో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషల్లో రాబోయే వెబ్ సిరీస్ లిస్ట్ను ఒకే రోజు రిలీజ్ చేసింది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు పలు తెలుగు సినిమాలు అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో సందడి చేయబోతున్నాయి. అలాగే సిటాడెల్: హనీ బన్నీ,మీర్జా పూర్-3, పాతాళ్ లోక్-2, బందిష్ బండిట్స్, పంచాయత్-3, గుల్కంద్ టేల్స్, ది రానా కనెక్షన్, ఇన్ ట్రాన్సిస్ట్, రంగీన్, మట్కా కింగ్, దల్దల్, డేరింగ్ పార్ట్నర్స్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, సుబేదార్, ఉప్పు కప్పురంబు లాంటి వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న కొత్త సినిమాలివే టైటిల్: గేమ్ ఛేంజర్; నటీనటులు: రామ్ చరణ్, కియరా అద్వానీ టైటిల్: ఫ్యామిలీస్టార్; నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ టైటిల్:కంగువ; నటీనటులు:సూర్య,జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు టైటిల్: ఉస్తాద్భగత్ సింగ్; నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల టైటిల్: హరి హర వీర మల్లు; నటీనటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ టైటిల్: కాంతార 2; నటీనటులు: రిషబ్ శెట్టి,రుక్మిణీ వసంత్ టైటిల్: తమ్ముడు; నటీనటులు:నితిన్, సప్తమి, లయ టైటిల్: ఓమ్ భీమ్ బుష్; నటీనటులు: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్: అశ్వత్థామ; నటీనటులు: షామిద్ కపూర్ టైటిల్: ఘాటి; నటీనటులు: అనుష్క శెట్టి టైటిల్: భాఘీ 4, నటీనటులు: టైగర్ ష్రాప్; నిర్మాత: సాజిద్ నడియాద్వాలా టైటిల్: చందు ఛాంపియన్; నటీనటులు: కార్తిక్ ఆర్య టైటిల్: ఇక్కీస్; నటీనటులు:అగస్త్య నంద, ధరేంద్ర, జైదీప్ అహల్వత్ టైటిల్: స్త్రీ; నటీనటులు: షాహిద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ టైటిల్: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా; నటీనటులు: షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ జాబితా సిటాడెల్: హనీ బన్నీ మీర్జా పూర్-3 పాతాళ్ లోక్-2 మట్కా కింగ్ చోరీ2 ది మెహతా బాయ్స్ సుబేదార్ సుడల్ 2 బండిష్ బ్యాండిట్స్ 2 ది మెహతా బాయ్స్ బి హ్యాపీ చీకటి లో యే వతన్ మేరే వతన్ జిద్దీ గర్ల్స్ బ్యాండ్వాలే దిల్ దోస్తీ డైలమా ఫాలో కర్లో యార్ కాల్ మి బే డాల్డల్ ఖౌఫ్ గ్యాంగ్స్ కురుత్తి పునల్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ -
ఓటీటీలో మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు వెబ్ సిరీస్ ఏదో తెలుసా!
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. గతేడాది నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో డిసెంబర్ 1న స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్ను శరద్ మరార్ నిర్మించారు. ఈ సిరీస్కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో అత్యంత సక్సెస్ఫుల్గా నిలిచిన వెబ్ సిరీస్గా ఘనతను సొంతం చేసుకుంది. ఇవాళ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రజెంట్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదికపై నాగచైతన్యతో పాటు ఈ సిరీస్ దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే ఈనెల 19న దూత సీజన్-2 గురించి హింట్ ఇచ్చారు నాగచైతన్య. కానీ అప్డేట్ అయితే రాలేదు.. దూత సిరీస్ మాత్రం అమెజాన్ ప్రైమ్లో తెలుగు సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్గా నిలిచింది. Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
కన్ఫ్యూజ్ అవుతున్నారా?.. ఆ రోజు క్లారిటీ ఇస్తా: నాగ చైతన్య
యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. సముద్రం బ్యాక్డ్రాప్లో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ మత్య్సకారుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. అయితే ఇదిలా ఉండగా.. గతేడాది నాగ చైతన్య ఓటీటీలోను ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైతూ ప్రధాన పాత్రలో దూత అనే వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దూత వెబ్ సిరీస్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. దూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా నాగ చైతన్య వీడియోను అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో నాగచైతన్య చదువుతున్న న్యూస్ పేపర్లో మార్చి 19 అని రాసి ఉంది. దీంతో అదే రోజున దూత సీజన్-2 అప్డేట్ అదే రోజున రానుందని అర్థమవుతోంది. ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకా క్లూస్ కావాలా? మార్చి 19న.. మీరు రెడీనా? అని నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముఖ్యంగా దూత వెబ్ సిరీస్లో న్యూస్ పేపర్ ప్రధానంగా ఉంటుంది. ఈ వీడియోలో న్యూస్ పేపర్తో చైతూ కనిపించడంతో సీజన్ 2 గురించే నని క్లారిటీ ఇచ్చినట్లు ఉంది. మార్చి 19న ఈ రెండో సీజన్కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేసేలా కనిపిస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే. Are you ready Are you ready Are you ready 𝟏𝟗 𝐌𝐚𝐫𝐜𝐡 ✅ Em plan chesav mawa @PrimeVideoIN...?🤔@chay_akkineni || #NagaChaitanya pic.twitter.com/kLEJ6jg3Rh — ChayAkkineni ™ 🏹 (@MassChayCults) March 17, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
IPL 2024: చెల్లెలు కాదు.. అక్క! ఈమెను గుర్తుపట్టారా?
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
తప్పక చదవండి
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement