-
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ పాకిస్తాన్లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్లో రాహుల్గాంధీ చాలా పాపులర్. ఒకవేళ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్ను పాకిస్థాన్లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
బీజేపీ 400 లక్ష్యానికి ఈ 32 సీట్లు కీలకం!
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది. 2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది. 2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్లో తన ఖాతాను తెరిచింది. -
అరుణాచల్లో బీజేపీకి తొలి విజయం?.. ఐదుగురు ఏకగ్రీవం?
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని సమాచారం. మార్చి 26, బుధవారం నామినేషన్కు చివరి తేదీ అని, అయితే రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని రెండు లోక్సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లు అధికారి తెలిపారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుస్తారా లేదా అనేది నిర్ణయిస్తామని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్తో సహా ఐదుగురు అభ్యర్థులు ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచారని బీజేపీ పేర్కొంది. వీరు పోటీ చేస్తున్న చోట నుంచి చివరి రోజు వరకు ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తేజీ నేచా పేర్కొన్నారు. -
నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు. గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్లోని సెంట్రల్ స్క్వేర్లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. ‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు. అసురక్షితం నుంచి సురక్షితానికి.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ఒకే వారంలో 80 మంది హత్య ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది. El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV — Reuters (@Reuters) January 30, 2024 70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం 2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు. President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere He then tells foreign critics to go stuff it pic.twitter.com/iBNEPooXcP — Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024 -
South Africa Under-19: అర్షిన్ సెంచరీ: అజేయంగా భారత్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అమెరికాతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 201 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్ దశను అజేయంగా ముగించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్షిన్ కులకర్ణి (108; 8 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ సాధించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడిపోయింది. మంగళవారం జరిగే ‘సూపర్ సిక్స్’ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ ఆడతుంది. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68). -
Womens Hockey Olympic Qualifier: గెలిచి నిలిచిన భారత్
రాంచీ: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుకుంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సంగీత కుమారి (1వ ని.లో), ఉదిత (12వ ని.లో), డుంగ్డుంగ్ బ్యూటీ (14వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు మేగన్ హల్ (9వ ని.లో) ఏకైక గోల్ను అందించింది. మరో మ్యాచ్లో అమెరికా 2–0తో ఇటలీ జట్టును ఓడించింది. ప్రస్తుతం అమెరికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, న్యూజిలాండ్ 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో అమెరికాతో న్యూజిలాండ్; ఇటలీతో భారత్ తలపడతాయి. -
గెలుపు
విక్రాంత్కి మెలకువ వచ్చింది. తాను చనిపోయాడని అతనికి తెలుసు. ఇది స్వర్గమా లేక మధ్యలో ఏదైనా మజిలీనా.. అనుకుంటూ చుట్టూ చూశాడు. అది ఒక గది. విక్రాంత్ ఆ గదిలోని ఒక కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏదో ఆఫీస్ రూమ్లా ఉందా గది. కాస్త దూరంలో ఉన్న ఇంకో చైర్లో ఎవరో వ్యక్తి కూర్చుని టేబుల్ లైట్ వెలుగులో ఏదో రాసుకోవడం కనిపిస్తోంది. తాను చనిపోయిన విషయం విక్రాంత్కి స్పష్టంగా గుర్తుంది. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళుతుంటే.. స్కూటీ మీదనించి ఎగిరి పడటం, రోడ్డు పక్కనున్న డివైడర్కి తల గుద్దుకోవడం, ఆ ఫోర్స్ తెలియడంతోనే ప్రాణం పోతోందని అర్థంకావడం, కళ్ళ మీంచి కారిపోతున్న రక్త ధారల మధ్యలోంచి తనని గుద్దిన కారు వేగంగా అక్కడినించి వెళ్లిపోవడాన్ని మసక మసకగా చూడటం.. ఇవన్నీ అతనికి గుర్తున్నాయి. ఆ యాక్సిడెంట్లో అతను బతికే అవకాశమే లేదు. తాను నిజంగా చనిపోయాడని అతనికి తెలీడానికి కారణం అదొక్కటే కాదు. తనకి శరీరం లేని విషయం, ఇప్పుడు ఆలోచిస్తున్నది తన ఆత్మ మాత్రమేనన్న సంగతి అతనికి బాగా అర్థమవడం కూడా! తన సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ చాలా గొప్ప వృద్ధి పొందినట్టుగా, బతికి ఉన్నప్పటి అనుభూతికి భిన్నమైన గ్రాహ్యత ఏదో అతనికి తెలుస్తోంది. ఎక్కడున్నాడు మరి! కొంచెం వెనక్కి జరిగి కిటికీ కర్టెన్ని జరిపి బయటకి చూశాడు. అంతా చీకటి. వీధి లైట్లు కూడా వెలగడం లేదు. ఇంతలో అతనున్న గదిలో కదలికకి మళ్ళీ తిరిగి చూశాడు. ఆ గదిలో కూర్చుని ఉన్న వ్యక్తి.. భయం, అయోమయం నిండిన ముఖంతో కదిలిన కర్టెన్లోంచి లోపలికి వస్తున్న వాహనాల హెడ్ లైట్ల వెలుగును చూస్తున్నాడు. ఆ వెలుగు నీడల మధ్య ఆ వ్యక్తిని గుర్తు పట్టాడు విక్రాంత్. అతను రఘు. తండ్రి అతనికి విక్రాంత్ అని పేరు పెట్టినప్పుడు అందరూ నవ్వారట. ‘నీ రాతల పైత్యం నీ కొడుకు పేరులో కూడా కనిపిస్తోందిరోయ్’ అంటూ స్నేహితుల్లాంటి శత్రువులు వెటకారం చేశారట. ‘నా కొడుకు ఈ జీవితమనే యుద్ధాన్ని గెలిచి విక్రాంతుడవాలి. అందుకే ఆ పేరు పెట్టాను’ అనేవాడట తండ్రి. అతను స్కూల్ చదువుకి వచ్చినప్పుడు కూడా పిల్లలు ‘వికారం వికారం’ అని ఏడిపించేవారు. తెలుగు మాస్టారు విశ్వనాథంగారు మాత్రం ‘మంచి మోడరన్ పేరు పెట్టాడురా మీ నాన్న!’ అన్నరోజు తాను పడిన సంతోషం ఇంకా గుర్తుంది విక్రాంత్కి. ఇంటికెళ్లి తండ్రికి ఎంతో గొప్పగా చెప్పాడు ఆ విషయం. మురిపెంగా నవ్వి ముద్దు పెట్టుకున్న తండ్రి, ప్రేమగా, గారంగా తనని చూసుకున్న తండ్రి అనుకోకుండా అనారోగ్యం బారిన పడ్డాడు. పెద్దగా ఆస్తులేవీ లేని, కో ఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్న తండ్రికి సరైన వైద్యం అందలేదు. అసలు రోగమేమిటో కూడా తెలీకుండానే నెల తిరక్కుండా తననీ, అమాయకురాలైన అమ్మనీ అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క మేనమామే వాళ్ళకి దిక్కయ్యాడు. ‘ఒక్కడే మగపిల్లాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది’ అని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడం విక్రాంత్కి తెలుసు. ఆ మేనమామ కొడుకే రఘు. రఘు ముఖంలో కనిపిస్తున్న ఆ భయం చూస్తుంటే విక్రాంత్కి అదో విధమైన ఆనందం కలిగింది. మెల్లగా కర్టెన్ వదిలేశాడు. రఘు ఓసారి గదంతా కలియజూసి, తిరిగి రాసుకోవడం మొదలుపెట్టాడు. మరోసారి కర్టెన్ జరిపి రఘు రియాక్షన్ ఏమిటో చూడాలనిపించింది విక్రాంత్కి. ‘చిన్న పిల్లాడిలా ఏంటిది!’ అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. చనిపోయాడు సరే, తన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? స్వాతి ఎంత కంగారు పడుతూంటుందో, తను యాక్సిడెంట్లో చనిపోయిన విషయం ఇంకా తెలిసిందో లేదో, సహజ తన కోసం ఎదురు చూసీ చూసీ నిద్రపోయి ఉంటుంది. సూపర్ మార్కెట్లో ఆ ఉద్యోగం వల్ల వచ్చే సంపాదనతో గడవక, పిజ్జా డెలివరీలు చేస్తుండటంతో ఇంటికి వెళ్ళడానికి ఒక టైమంటూ లేకుండాపోయింది. తను ఎప్పటిలాగే తిరిగి వస్తాడని అనుకుంటూండి ఉంటుంది స్వాతి. ఎదురుగా టేబుల్ మీద ఉన్న సెల్ మోగడంతో విక్రాంత్ అటువైపు చూశాడు. రఘు ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏం విన్నాడో గానీ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ‘ఎప్పుడు? ఎక్కడ? వస్తున్నా...’ అంటూ రూమ్ లోంచి బయటకి పరుగుతీశాడు. తిరిగి చూసేసరికి హాస్పటల్లో ఉన్నాడు విక్రాంత్. ఎదురుగా బెడ్ మీద పదిహేడు, పద్దెనిమిదేళ్ల అబ్బాయి వెంటిలేటర్ మీద కనిపించాడు. దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్. ముఖానికి కూడా బాగా గాయాలయ్యాయి. బతకడం కష్టంలాగే అనిపిస్తోంది. తర్వాతి నిమిషంలో పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రఘుతో మాట్లాడుతూండటం కనిపించింది విక్రాంత్కి. ఈసారి హాస్పిటల్లోని విజిటింగ్ రూమ్లో ఉన్నాడు విక్రాంత్. ఈ మార్పులు, ప్లేస్లు, టైమ్ ఒక్కసారిగా ముందుకు జరిగిపోవడం ఇవన్నీ సహజంగానే అనిపిస్తున్నాయి విక్రాంత్కి. బతికి ఉన్నప్పుడే కనుక ఇలా జరిగి ఉంటే, తనకేవో అద్భుత శక్తులు లభించాయని అనుకునేవాడేమో! ‘చాలా స్పీడ్గా వెళ్లి.. ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు. పైగా డ్రింక్ చేసి ఉన్నాడు. మైనర్ కదా. అసలు కారెలా ఇచ్చారు మీరు అబ్బాయికి?’ ఇద్దరిలో కొంచెం పొడుగ్గా ఉన్న పోలీస్ అడుగుతున్నాడు రఘని. ‘వాడు కారు తీసుకెళ్లిన విషయమే నేను గమనించలేదు సార్. ఎప్పుడు తీశాడో ఏమో!’నిజమో అబద్ధమో తెలీదు గానీ రఘు శరీరం వణకడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కుర్రవాడు రఘు కొడుకన్నమాట. పోలీస్ ఇంకా గట్టిగా గదమాయిస్తున్నాడు. కొంచెం పక్కకి తిరిగి చూస్తే కాస్త అవతలగా చైర్లో కూర్చుని కనిపించింది రేఖ. ఎటో చూస్తోంది. ఆమె శరీరంలో అసలు చలనం ఉందా అనిపిస్తోంది. కళ్ళు ఎర్రబడి వాచిపోయి ఉన్నాయి. చెంపల మీదనించి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె వల్లనే కదా తను దొంగయ్యాడు! ఒకే కాలేజ్లో కలిసి చదువుకున్నారు విక్రాంత్, రఘు, రేఖలు. అప్పట్లో అమ్మాయిలు.. అబ్బాయిలతో పెద్దగా మాట్లాడేవారు కాదు. లైబ్రరీ బుక్స్లో అక్కడక్కడా కవితలు రాసి కింద పేరు రాసుకునేవాడు విక్రాంత్. అలా చూసిందట రేఖ.. అతని కవిత ఒకటి. నిజానికి అది కవిత కూడా కాదు, ఏదో ఒక ఆలోచనలాంటిది అంతే! అలా ఏదైనా ఊహ తోచినప్పుడు ఒక పుస్తకంలోనో, అక్కడో ఇక్కడో రాసేస్తూ ఉండేవాడు. లైబ్రరీ పుస్తకంలో రాసింది ఆమెకి బాగా నచ్చిందట. వచ్చి పలకరించింది. మెల్లగా పరిచయం పెరిగింది. అది ఇష్టంగా మారింది. ప్రేమ మాటలూ, చూపులూ దొర్లాయి. ప్రపంచం అంత అందంగా అంతకు ముందెప్పుడూ కనిపించలేదు విక్రాంత్కి. కానీ... అనుకోకుండా ఓ రోజు కాలేజ్లో ఇన్స్పెక్షన్ జరిగింది. అతని బ్యాగ్లో, రాబోయే సంవత్సరపు పరీక్ష పేపర్ దొరికింది. విక్రాంత్ కాలేజ్నించి ఎక్స్పెల్ అయ్యాడు. ఇంట్లో కూడా బీరువాలో ఉండే వెండి కంచం కనిపించకుండా పోయింది. మెడ పట్టి గెంటకపోయినా మేనమామ కాస్త మర్యాదగానే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. అప్పటికే అతని తల్లి చనిపోయి రెండేళ్ళవుతోంది. ఉండటానికి చోటు లేక, తినడానికి తిండి లేక ఫుట్పాత్ మీద పడుకున్నాడు నాలుగైదు నెలలు. చివరికి కూలి పనికి వెళ్ళాడు ఆకలి తీర్చుకోవడానికి. కానీ అన్నింటికంటే పెద్ద బాధ రేఖ కోసం పడ్డదే. ఆమె మళ్ళీ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకో కూడా అతనికి తెలీదు. ప్రేమలో ఉన్నామన్న ఆ భావం వల్ల, అది పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ కంటే ఏదీ ఎక్కువ కాదేమో! నిద్ర పట్టేది కాదు. ఒకటే దుఃఖం. ఏం చెయ్యాలో ఎందుకు బతకాలో తెలీని స్థితి. చివరికి ఎలాగో అందులోంచి బయట పడ్డాడు. జీవితంలో కొంత స్థిరపడ్డాడు. తనలాగే స్వాతికి కూడా తల్లితండ్రులు లేరు. కులం ఒక్కటీ లెక్క చూసుకుని ఆమెని తనకి ముడేసి వదిలేసి, చేతులు దులుపుకున్నారు ఆమె దగ్గరి బంధువులు. తమ మధ్య అద్భుతమైన ప్రేమ బంధం ఏర్పడకపోయినా ఒక ఒప్పందంలాంటి జీవితం ఉంది. ఒకరికి ఒకరున్నారన్న ధైర్యం, ఆసరా ఉన్నాయి. సహజ పుట్టాక ఆ బంధం మరింతగా బలపడింది. ఇప్పుడు స్వాతి ఒంటరి. పైగా పసితనం ఇంకా వీడని సహజ బాధ్యత ఒకటి. స్వాతి పెద్దగా చదువుకోలేదు. తను లేకుండా ఎలా బతుకుతారో ఇద్దరూ...! అతనా ఆలోచనలో ఉండగానే ఏదో ఒక సందేశం లాంటిది అడ్డు తగిలింది. ‘నీ ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి’ అంది అదృశ్య శక్తి. ‘ఏమిటవి?’ అన్నాడతను, జరుగుతున్నది అతి సహజమైన విషయంలాగా. ‘ఆ కుర్రవాడిని బతికించే చాయిస్ నువ్వు తీసుకుంటే పదేళ్ల పాటు ఒక చీకటి ప్రదేశంలో ఆకలి దప్పికలతో, ఒంటరితనంతో బాధ పడుతూ బతకాల్సి వస్తుంది’ అందా శక్తి. అంటే నరకమా... అనుకున్నాడు. అంతలోనే అవన్నీ మనిషిగా ఉన్నప్పటి నమ్మకాలని గుర్తొచ్చి, ‘మరి రెండో చాయిస్ ఏమిటీ?’ అడిగాడు. కుర్రవాడి చావుకి అతన్ని వదిలేసి నీదారి నువ్వు చూసుకుంటే ఆకలి దప్పికలు లేని వెలుగులోకంలో ఎప్పటికీ ఉండిపోయే అవకాశం. స్వర్గమన్నమాట... ఈసారి కావాలనే అనుకున్నాడు. ‘ఎందుకు అలా? మంచి పని చేస్తే శిక్షా! ఇదేం న్యాయం?’ అన్నాడు. ‘కుర్రవాడికి ఆయుష్షు లేదు. నీ కరుణతో అతన్ని బతికించి ఆ శిక్ష నువ్వు తీసుకోగలవా?’ అంది అదృశ్య శక్తి. ‘నిర్ణయం పూర్తిగా నీ ఇష్టం’ అంటూ మౌనం వహించింది. కళ్ళ ఎదురుగా మళ్ళీ రేఖ కనిపించింది. అప్పట్లో ఆమె తనని ఎందుకు దూరం పెట్టిందో తెలీలేదు. నిన్న చనిపోయే వరకు కూడా ఆ ప్రశ్నకి సమాధానం దొరక్క చాలా బాధపడేవాడు. ఇప్పుడు ఎంతో సహజంగానే, అప్పట్లో అన్నీ చూసినట్టుగానే తెలుస్తోంది.రఘు... రఘు కూడా ఆమెని ఇష్టపడ్డాడు. విక్రాంత్కి ఆమె దగ్గర కావడం సహించలేకపోయాడు. ఆ క్వశ్చన్ పేపర్ విక్రాంత్ బ్యాగ్లోకి రావడానికి, ఇంట్లో వెండి కంచం పోవడానికి కూడా రఘునే కారణం. కవిత్వం కూడా రఘు రాసిందే విక్రాంత్ దొంగిలించినట్టుగా ఆమెని నమ్మించాడు. విక్రాంత్ని చూసి అంతో ఇంతో రాయాలని రఘు కూడా ప్రయత్నించేవాడు అప్పట్లో. విక్రాంత్ని రోడ్డు మీద పడేశాకా, జీవితంలో స్థిరపడ్డాకా విక్రాంత్ పాత కవితల పుస్తకాన్ని అచ్చు వేయించుకుని సో కాల్డ్ సాహితీ ప్రపంచానికి దగ్గరయ్యాడు. ఒక కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని కొడుకుని బతికిస్తే తనకి పదేళ్ల నరకం. తనకి ఎంతో ద్రోహం చేసినవాడికి మంచి చేసే అవకాశం. తన గొప్పతనానికి పరీక్ష. ఇప్పుడు తనకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే మాత్రం తను కోల్పోయిన జీవితం వెనక్కి వస్తుందా! తను పడ్డ బాధ, కష్టాలు మాయమై పోతాయా! చీకటీ, ఆకలిదప్పికలూ తనకి కొత్తేమీ కాదు. ఇంకో పదేళ్లు భరిస్తే ఒక చిన్న కుర్రవాడు బతుకుతాడు. నిండు జీవితాన్ని అనుభవిస్తాడు. ఇద్దరు మనుషులకి కడుపు కోత తప్పుతుంది. అది రఘు కన్న ప్రేమ అయితేనేం... కత్తికి కత్తి, కన్నుకి కన్ను ఎలా సమాధానం అవుతాయి! తిరిగి పొడిస్తే పడిన పోటు మానిపోదు. అవతలి కన్ను కూడా పోగొడితే, పోయిన చూపు తిరిగి రాదు. నిర్ణయం తీసుకోవడానికి విక్రాంత్కి ఎక్కువ సమయం పట్టలేదు. లేకపోతే పట్టిందా... ఏమో... ఆ లెక్క ఇప్పుడు పెద్దగా తెలీడం లేదు. ‘సరే. నరకమే’ అన్నాడు అదృశ్య శక్తితో. అప్పుడు ఆ శక్తి ఇంకో విషయం కూడా చెప్పింది. ఈసారి ఆ కాస్త కూడా ఆలోచించకుండానే, ‘అయినా పర్లేదు’ అన్నాడు. అప్పుడే అతనికి ఒక విజన్ వచ్చింది. కలలాగా భవిష్యత్తు కనిపించింది. తన కొడుకు బతకడానికి కారణం విక్రాంత్ అని రఘుకి తెలియడం, విక్రాంత్ కుటుంబాన్ని ఆదుకుంటానని అతను మాట ఇవ్వడం, అంతేకాక సహజ తన ఇంట్లోనే తన బిడ్డలా పెరుగుతుందని చెబుతూ రఘు, విక్రాంత్ కూతుర్ని కన్నీళ్లతో దగ్గరికి తీసుకోవడం... ‘ఆపండి!’ అన్నాడు విక్రాంత్ వెంటనే. ‘ఇంకా తనకి మానవ సహజమైన రియాక్షన్స్వదిలినట్టు లేవు’ అనుకున్నాడు. ‘ఈ చాయిస్ తీసుకోవడానికి నాకు ఒక కండిషన్ ఉంది’ అన్నాడు విక్రాంత్. ఏమిటో చెప్పమంది అదృశ్య శక్తి. ‘నాకారణంగా రఘు కొడుకు బతుకుతాడన్న విషయం రఘు కుటుంబానికి తెలియకూడదు’ అన్నాడు. ‘నీ కుటుంబం ఏమవుతుంది?అతను ఆదుకుంటాడు కదా’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్. ‘సరే’ అంది అదృశ్య శక్తి. తండ్రి పోయాక తల్లి చెయ్యి పట్టుకుని మేనమామ ఇంటికి వెళ్లినప్పటినించీ అక్కడ ఎదుర్కొన్న అవమానాలన్నీ గుర్తొచ్చాయి అతనికి. పరాయి ఇంట్లో ఉంటూ, తింటూ, ఎంత చాకిరీ చేసినా, పెద్దగా మాటల రూపంలో వినకపోయినా, అవతలినించి ఎదురొచ్చిన నిర్లక్ష్యం, చులకన భావం, విసుగులూ, అసహనాలూ, లోకువతనాలూ అన్నీ అతన్ని ఒక్కపెట్టున చుట్టుముట్టాయి. ఆ బెంగతోనే కదా అతని తల్లి బతికున్నప్పుడు కూడా చనిపోయినట్టే ఉండేది. అటువంటి స్థితి మళ్ళీ స్వాతికి, సహజకి రాకూడదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ఏమో అది అతనికి తెలీదు. ఇంతలో ఎవరో చిటికె వేసినట్టుగా చాలా వేగంగా కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. అతను చూస్తూ నిలబడ్డాడు. విక్రాంత్ ఆర్గాన్స్తో రఘు కొడుక్కి సర్జరీ అవడం, కుర్రవాడు తొందరలోనే కోలుకోవడం, ఆర్గాన్స్డొనేట్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని తలుచుకుని రఘు, రేఖ కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకోవడం... అలా సెకన్ల మీద అతని కళ్ళ ముందు... కాదు కాదు ఊహ ముందు కదిలిపోయాయి. ఇక ఇప్పుడు చీకటిలోకానికి ప్రయాణం. ఆ ప్రయాణంలో మరో విజన్ కలిగిందతనికి. మరో భవిష్యత్ దృశ్యం. స్వాతి, సహజ.. ఇండియాలో ఒక పెద్ద చైన్ అఫ్ హోటల్స్కి ఓనర్స్. వాళ్ళు ఎంతో సంతోషంగా, దర్జాగా, హుందాగా జీవిస్తున్నారు. తనకి తెలుసు. స్వాతి దగ్గర ఆ శక్తి ఉంది. ఆమె వంటలు చాలా బాగా చేస్తుంది. అతను పోయిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ మెల్లగా పచ్చళ్ళు చెయ్యడం, ఉద్యోగులకి క్యారేజ్లు వండి పంపడం మొదలుపెట్టింది స్వాతి. అది చాలా తొందరగా వృద్ధిలోకి వచ్చి ఒక హోటల్ కూడా పెట్టింది. అది చైన్స్గా విస్తరించింది. సహజ కూడా ఎంబీఏ చేసి ఆ బిజినెస్ నడపడంలో తల్లికి సహాయంగా ఉంది. విక్రాంత్ మనసు తృప్తితో నిండిపోయింది. ఈ బెంగ కూడా ఇక తనకి అవసరం లేదు. ‘రఘు కుటుంబానికి చెందిన భవిష్యత్తు కూడా చూస్తావా?’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్. అది తనకి సంబంధం లేని విషయం. తన ప్రయాణం ముగుస్తోందని విక్రాంత్కి అర్థం అయింది. అతను మెల్లగా.. ఏమీ లేని, ఏమీ తెలియని స్థితిలోకి జారిపోతున్నాడు. ఆ చివరి నిమిషంలో అతనికి ఓ విషయం అర్థమయింది. బహుశా ఆ చీకటి లోకం గురించి అదృశ్య శక్తి చెప్పిందంతా ఒక పరీక్ష. తాను ఆ నరకానికి వెళ్ళబోవడం లేదు. అలాగని స్వర్గంలోనూ అడుగు పెట్టడం లేదు. నిజానికి ఆ రెండూ ఉన్నాయో లేదో కూడా! తాను పూర్తిగా ఒక తెలియనితనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేకపోవడంలోకి. ఒక కథని, తన కథని తనే రాసుకుని పూర్తి చేసుకుంటున్నాడు. జీవితంలో ఓడిపోయి మరణంలో గెలుస్తున్నాడు. తన తండ్రి పెట్టిన పేరుని సార్థకం చేసుకుంటున్నాడు. ఆ ఆఖరి క్షణంలో అదృశ్య శక్తి చెప్పిన ఇంకో విషయం గుర్తొచ్చింది అతనికి. తాగిన మత్తులో యాక్సిడెంట్ చేసి, అతని చావుకి కారణమైంది రఘు కొడుకే. ఆ కంగారులో కాస్త దూరం వెళ్ళాకా, ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు.ప్రయాణంతో పాటుగా, అతని ఆలోచన కూడా అక్కడితో అలా అంతమైపోయింది. ఇప్పుడతను పూర్తిగా విక్రాంతుడయ్యాడు. -భవానీ ఫణి -
అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. కలిసికట్టుగా ముందుకుసాగుతూ తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేలా పోరాడుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచినా మరింత గట్టిగా పోరాడి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు సాధించేలా ఇప్పటి నుంచే పట్టుదలతో కృషి ప్రారంభిస్తామని చెప్పారు. ఎంతో కష్టపడినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని, 7 నుంచి 14 శాతానికి ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పారు. పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ప్రేంసింగ్రాథోడ్, చింతా సాంబమూర్తి, ప్రకాష్రెడ్డి తదితరులతో కలిసి కిషన్రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓడిన స్థానాలపై జాతీయస్థాయి నుంచి జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు సమీక్ష జరిపి వచ్చే లోక్సభ ఎన్నికలకల్లా లోటుపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు. లోక్సభకు ఓటేస్తామన్నారు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వెళ్లినప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మద్దతు తెలిపే ఓటర్లు తాము అసెంబ్లీకి ఎవరికి ఓటేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారన్నారు. తాము గెలిచింది 8 స్థానాలే అయినా, 80 మంది ఎమ్మెల్యేల బలాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పారు. క్రియాశీల ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని తెలి పారు. అధికార బీఆర్ఎస్పై ఐదేళ్లుగా బీజేపీ సాగించిన పోరు వల్ల కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో లాభం పొందిందన్నా రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీపై పడి ఏడ్చి బురదచల్లిన వారు ఈ రోజు ఫామ్హౌస్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని (మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. అక్కడ కాంగ్రెస్కు ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్గఢ్, రా జస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదని కిషన్రెడ్డి పేర్కొన్నా రు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకుందని, మధ్యప్రదేశ్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించిందని చెప్పారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి అని చెబుతున్న రేవంత్రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించి రికార్డు సృష్టించారన్నారు. ఇలాంటి రికార్డు దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదన్నారు. పార్టీ పోటీచేసిన స్థానాల్లో ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకుంటామని, ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల సరళి, ప్రభావం చూపిన అంశాలు, తదితర విషయాలపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు, రాబో యే లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావడం, తెలంగాణ ఎన్నికల తీరుతెన్నులపై సవివరంగా తెలియజేస్తామన్నారు. తమ పార్టీ వారే తనను ఓడించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా, ఆ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని కిషన్రెడ్డి సమాధానమిచ్చారు. బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొట్టారు: కిషన్రెడ్డి రాజాసింగ్ నివాసానికి వెళ్లి అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల అధినేతలు కేసీఆర్, అసదుద్దీన్ ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యే రాజాసింగ్ బలమైన విశ్వాసం, ధైర్యంతో తిప్పికొట్టారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా మజ్లిస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ, ప్రజల ఆశీస్సులతో రాజాసింగ్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారని అన్నారు. అధికార దురి్వనియోగం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా గోషామహల్లో ధర్మం, జాతీయ భావజాలమే గెలిచింద ని పేర్కొన్నారు. సోమవారం గోషామహల్లో రాజా సింగ్ నివాసానికి వెళ్లిన కిషన్రెడ్డి ఆయనను అభినందించారు. తప్పుడు ప్రచారాలతో అనేక శక్తులు పన్ని న కుట్రలను ఎదుర్కొని బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్ను గెలిపించిన గోషామహల్ ప్రజలకు, ఆయన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్నరోజుల్లో పార్టీ మరింత విస్తరణకు రాజాసింగ్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని కిషన్రెడ్డి తెలిపారు. -
17 మంది రాజస్తాన్ మంత్రుల ఓటమి
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుగాలులకు పలువురు మంత్రులు ఓటమి దిశలో కొట్టుకుపోయారు. రాజస్తాన్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి అయిన గోవింద్ రామ్ మేఘ్వాల్ సహా 17 మంది మంత్రులు ఓటమిని చవిచూశారు. ఓడిన మంత్రుల్లో రమేశ్ చంద్ మీనా, షాలే మొహమ్మద్, భన్వర్ సింగ్ భటి, శకుంతలా రావత్, విశ్వేంద్ర సింగ్, ఉదయ్లాల్ అంజనా, బీడీ కల్లా, జహిదా ఖాన్, ప్రతాప్సింగ్ కచరియావాస్, భజన్లాల్ జాతవ్, మమతా భూపేశ్, పర్సాదీ లాల్ మీనా, సుఖ్రామ్ విష్ణోయ్, రామ్లాల్ జాట్, ప్రమోద్ జైన్ భయ్యా, రాజేంద్ర యాదవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు సలహాదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు సన్యమ్ లోధా, రాజ్కుమార్ శర్మ, బాబులాల్ నగార్, దానిష్ అబ్రార్సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య సైతం విజయం సాధించలేకపోయారు. ముఖ్యమంత్రి గెహ్లోత్ 25 మంది మంత్రులతో కలిసి ఈసారి తమ గెలుపు అదృష్టాన్ని పరీక్షించుకోగా కొద్దిమంది మాత్రమే గెలుపు తలుపు తట్టారు. సర్దార్పుర స్థానంలో గెహ్లోత్ గెలిచారు. నలుగురు బీజేపీ ఎంపీల గెలుపు బీజేపీ ఏడుగురు ఎంపీలను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. వీరిలో నలుగురు విజయం సాధించారు. విద్యాధర్ నగర్ బీజేపీ మహిళా ఎంపీ దియా కుమారీ, ఝోట్వారా ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్, తిజారా ఎంపీ బాబా బాలక్ నాథ్, రాజ్యసభ సభ్యుడు కిరోడిలాల్ మీనాలు గెలిచారు. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్ను కలసి రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్భవన్కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
Madhya Pradesh: చౌహాన్ చరిష్మా.. బీజేపీ ఘన విజయానికి కారణాలివే..
మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తన అత్యుత్తమ రాజకీయ విజయాలలో ఒకటిగా నమోదు చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిన విజయంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లో బీజేపీ రికార్డు విజయానికి దోహదం చేసిన ఐదు కీలక అంశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిపై పట్టు ఆటుపోట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రారంభంలోనే అర్థం చేసుకుంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో తీవ్రమైన గ్రౌండ్ వర్క్ చేశారు. కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలు ఎన్నికలలో పోటీ చేశారు. 'లాడ్లీ బహ్నా' పథకం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా 'లడ్లీ బహనా' పథకం చుట్టూ బీజేపీ తన ప్రచారాన్ని నడిపించింది. మధ్యప్రదేశ్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే 'లాడ్లీ బెహనా' పథకాన్ని ప్రారంభించిన బీజేపీ మహిళా కార్డు అధికార పార్టీకి బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. సామాన్యులకు అందుబాటులో చౌహాన్ సామాన్యులకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్కు పేరుంది. ఆయన్ను ఇక్కడి ప్రజలు 'మామా'గా పిలుచుకుంటారు. బీజేపీ సంస్థాగత బలం బీజేపీ సంస్థాగత బలం, దాని హిందుత్వ కార్డు, ప్రధానమంత్రి అభివృద్ధి మంత్రం, ప్రచారంలో జాతీయ అహంకారం గురించి మాట్లాడటం బీజేపీకి బాగా పనిచేసినట్లు కనిపించింది. ప్రభావవంతమైన పోల్ వ్యూహం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భోపాల్లో మోదీ ప్రారంభించిన ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ ప్రచారం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు
ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్సీట్పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు. అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు. గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్కు దక్కుతుంది? అడి అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్యాదవ్ కార్పొరేటర్గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్లో 2014లో గోపాల్పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జగదీశ్వర్గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్అలీ, మాజిద్ హుస్సేన్లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో తెలంగాణనే నంబర్వన్గా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలిశర్మ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ విక్రయాలు పెంచడం మినహా మరేమీ చేయలేదని విమర్శించారు. కనీసం మహిళల సంక్షేమం కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. శుక్రవారం ఆమె గాందీభవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ మోడల్ విఫలమయిందని చెప్పిన డోలి శర్మ, కర్ణాటకలో మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. ఛత్తీస్గఢ్లో కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఇచి్చన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. తెలంగాణలో పార్టీ మహిళలకు మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలనిచ్చిందని, ఈ పథకాల పట్ల మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, ఈ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి మహిళలు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికారంలోకి వచి్చన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
సఫారీ... రికార్డుల సవారీ
న్యూఢిల్లీ: ప్రపంచకప్ తొలి మూడు మ్యాచ్లలో అంతంతమాత్రం ప్రదర్శనతో నిరాశ చెందిన అభిమానులకు నాలుగో మ్యాచ్ అసలైన వినోదాన్ని అందించింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య ఫిరోజ్షా కోట్లా స్టేడియంలో జరిగిన పోరు కొత్త రికార్డులకు వేదికగా నిలిచింది. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయిన దక్షిణాఫ్రికా అసాధారణ స్కోరు సాధిస్తే... ఓటమి ఎదురైనా పూర్తిగా చేతులెత్తేయకుండా లంక కూడా ఆఖరి వరకు పోరాడింది. చివరకు 102 పరుగుల తేడాతో విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్లు) శతకాలతో చెలరేగారు. అనంతరం శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడారు. 428/5 వరల్డ్ కప్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్గా వన్డేల్లో 9వ అత్యధిక స్కోరు. 1 ప్రపంచకప్లో ఒక ఇన్నింగ్స్లో ముగ్గురు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఓవరాల్గా వన్డేల్లో ఇది నాలుగో సారి. ఇందులో మూడు దక్షిణాఫ్రికావే. 49 బంతులు మార్క్రమ్ ప్రపంచకప్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి గతంలో కెవిన్ ఓబ్రైన్ (50 బంతులు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. -
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్, రెండు ఎంపీపీ, మూడు వైస్ ఎంపీపీ స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్గా వైఎస్సార్సీపీకి చెందిన 43వ వార్డు మెంబర్ సీహెచ్ వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్గా వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన ఒకటో వార్డు మెంబర్ పాకాలపాటి కృష్ణ ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, లింగాల ఎంపీపీగా అలవాలపాటి రమాదేవి (వైఎస్సార్సీపీ), తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలాధ్యక్షుడిగా జి.వెంకటరామిరెడ్డి (వైఎస్సార్సీపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గాలి శ్రీనివాసులు (వైఎస్సార్సీపీ), రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి (వైఎస్సార్సీపీ), అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండల ఉపాధ్యక్షుడిగా బొలిశెట్టి గోవిందరావు (వైఎస్సార్సీపీ)లు ఎన్నికైనట్టు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండలంలో పార్టీ రహితంగా జరిగిన కోఆప్షన్ సభ్యుని ఎన్నికలో సయ్యద్ మునాఫ్ గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. 170 గ్రామాల్లో ఉప సర్పంచి ఎన్నిక పూర్తి.. రాష్ట్ర వ్యాప్తంగా 186 గ్రామాల్లో ఉప సర్పంచి పదవులకుగాను సోమవారం 170 గ్రామాల్లో ఎన్నిక పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. 11 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడగా.. మరో చోట స్థానిక వార్డు మెంబర్ చనిపోయిన కారణంగాను, ఇంకో నాలుగు గ్రామ పంచాయతీల్లో కోరం లేక తాత్కాలికంగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిపడినట్టు అధికారులు వివరించారు. వాయిదా పడిన 11 గ్రామాల్లో మంగళవారం మరో విడత ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఓటమి ఒప్పుకున్నకేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండింటిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం సిట్టింగులకు సీట్లివ్వాలన్న తన సవాల్ను స్వీకరించకుండా కొందరిని మార్చారని అన్నారు. సోమవారం గాందీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీలను అవమానించడమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్పిన మాటలు నిజమయ్యాయని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ జాబితా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, మూడింట రెండొంతుల మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత బరిలో ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమే. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతుంది. అసలు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి..’అని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలోనే స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 12.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరగగా, ఆ సమయంలో లిక్కర్ షాపుల డ్రా తీశారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని అన్నారు. రుణమాపీలో రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయే తేడా అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దానివల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందని రేవంత్ చెప్పారు. రూ.75 ఉన్న పింఛన్ను రూ.200కు పెంచింది కాంగ్రెస్సేనన్నారు. ‘50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? చింతమడకలో బడి కట్టింది, ముఖ్యమంత్రి ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్సే. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..’అని స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రూ.4 వేల పెన్షన్ ఇస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రగతి భవన్ గోడలమీద రాసుకోవాలని సవాల్ విసిరారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా, తర్వాత పది రోజులకు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసి పారేశారని ధ్వజమెత్తారు. మోసానికి గురైన కమ్యూనిస్టులు కేసీఆర్పై తిరుగుబాటు చేయాలని అన్నారు. పార్టీ లో చేరికలు బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు సోమవారం గాందీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
తాడిపత్రిలో వైఎస్సార్సీపీ హవా.. జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
నితీష్ కుమార్కు ఊరట.. కుల గణనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కార్యక్రమాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గతంలో పలు పిటీషన్లు నమోదయ్యాయి. వీటిని కొట్టివేస్తూ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. బిహార్లో కుల గణన మొదటి సర్వే జనవరి 7 నుంచి 21 వరకు జరిగింది. రెండో దఫాలో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ కార్యక్రమంపై మే 4నే హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. కుల గణన చేపట్టాలని గత ఏడాది జూన్ 21నే రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని నిర్మించడానికి ఆయన ప్రధాన వ్యక్తిగా నిలిచారు. ఎన్డీయే కూటమికి దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఇండియా అనే కూటమిని నిర్మించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
గెలుపు.. గమనం.. మలుపు
గెలవాలి అని మనం దృఢంగా నిర్ణయించుకోవాలి; మనం మనస్పూర్తిగా గెలుపును కోరుకోవాలి; మనం గెలిచేందుకు త్రికరణ శుద్ధిగా పూనుకోవాలి; మనం గెలవాలి. మనకు మనుగడ ఉంది అని అంటే అది గెలుస్తూ ఉండేందుకే అని తెలుసుకోవాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత వ్యతిరేకత పైనపడినా మనం గెలవాలి అని నిలవాలి; మనం గెలుస్తూ మెరుస్తూ ఉండాలి. ‘యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మా వివృణుతే తనూమ్ స్వామ్’ అని కఠోపనిషత్ చెబుతోంది. అంటే అతడి చేత ఏదైతే కోరుకోబడి అడగబడిందో దానివల్ల అతడు పొందబడతాడు; అతడికి ఆ ఆత్మ తన సహజ ప్రకృతిని తెరుస్తుంది అని అర్థం. ఈ సత్యాన్నే తెలియజేస్తూ ‘అడుగుడీ మీకియ్యబడును; వెదకుడీ మీకు దొరకును; తట్టుడీ మీకు తియ్యబడును’ అని చెప్పింది మత్తయి సువార్త. మనం గెలుపును కోరుకుని ప్రయత్నిస్తే మనకు గెలుపు తన తలుపును తెరుస్తుంది. మనం గెలుపును పొందాలనుకుని ఉద్యుక్తులం ఐతే మనం గెలుపు చేత పొందబడతాం. మనం ఉన్న ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం. కానీ మనలో ఎవరూ అభిమన్యుడు కారాదు. ప్రతివ్యక్తీ అర్జునుడే అవాలి; అర్జునుడి తీరే మనకు ఆదర్శం కావాలి; మనకు మార్గదర్శకం కావాలి. తాను ఏ స్థితిలో ఉన్నా, శాపవశాత్తు తన స్థితే మారి తాను పేడిగా మారిపోయినా అర్జునుడు గెలుపునే కోరుకుని, గెలిచేందుకు పూనుకుని గెలుపు తలుపును తట్టాడు. గెలుపు తలుపు తెరుచుకోబడి ఆ గెలుపుచేత పొందబడ్డాడు; అర్జునుడు విజయుడుగా పేరుపొందాడు. గెలుపు అనేది లక్ష్యమా? కాదు, కాదు. గెలుపు లక్ష్యంగా కాదు మనకు లక్షణంగా ఉండాలి. మనుగడ ఉన్నంతవరకూ మనం గెలుపు కోసమే, గెలుపుతోనే రోజుల్ని గడుపుతూ ఉండాలి. రోజు అనేది రావడమే ఒక గెలుపు. అదిగో ఆ రోజు రావడమే మనకు ప్రేరణ. రోజులాగా మనుగడ ఆసాంతమూ మనకు గెలుపు అనేది వస్తూనే ఉండాలి. రోజు ఒకసారి మాత్రమే వచ్చేదే ఐతే కాల గమనమూ, ప్రపంచ గమనమూ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అలా జరిగితే కాలానికి, ప్రపంచానికి గమనమే ఉండదు కదా? రోజు అనేది వస్తూ ఉండడమే గమనం జరుగుతోంది అన్నదానికి ఋజువు. మనకు గెలుపు వస్తూ ఉండడమే మనుగడ గమనాన్ని నిర్ధారణ చేస్తుంది. పొందే ప్రతి గెలుపు మనిషికి ఒక మలుపు. మలుపులు తిరుగుతూ పయనం సాగాలి. గెలుపులతో సాగడమే మనుగడకు సార్థకత. మనుగడ అన్నది ఒక సాగే తీగ అయితే ఆ తీగకు గెలుపుల పూలు పూస్తూ ఉండాలి. మనుగడ గెలుపుల పూలు పూచే ఒక వల్లరి కావాలి లేదా మనుగడ గెలుపుల పుష్పగుచ్ఛం కావాలి. గెలుపుల పూల పరిమళానికి ఆకృతిగా మనిషి మంచి మాటకెక్కాలి. ‘గెలుపును పొందాలని తలపోద్దాం; గెలుపును పొందుదాం. గెలుస్తూ ఉన్నవాళ్లమై తల ఎత్తుకుని మనుగడ చేద్దాం; మన తలలకు విలువను పొదువుకుందాం. గెలుపు మనకు అభిరుచి కావాలి; గెలుపును మనం చవి చూస్తూ ఉండాలి; మనం మనుగడకు చవిని చేకూర్చుకోవాలి‘. 100% – నేను గెలిచాను. 90% – నేను గెలుస్తాను. 80% – నేను గెలవగలను. 70% – నేను గెలవగలను అని అనుకుంటున్నాను. 60% – నేను గెలవగలనేమో. 50% – నేను గెలవచ్చేమో అని అనుకుంటున్నాను. 40% – ఏది గెలుపు? 30% – నాకు గెలవాలని ఉంది. 20% – ఎలా గెలవాలో నాకు తెలియదు. 10% – నేను గెలవలేను. 0% – నేను గెలవను. ఇది గెలుపునకు నిచ్చెన. మనిషి ఈ నిచ్చెనను ఎక్కాలి; తప్పకుండా ఈ నిచ్చెనను ఎక్కి తనను తాను మనిషిని అని నిరూపించుకోవాలి. – రోచిష్మాన్ -
వెస్టిండీస్ పై ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం
-
‘స్థానిక’ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థల్లో గురువారం జరిగిన పలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. ఒక మండలాధ్యక్ష పదవికి, మూడు మండల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికార వైఎస్సార్సీపీకి చెందిన మాడపాటి విజయలక్ష్మి (26వ వార్డు కార్పొరేటర్), సీలం భారతీనాగకుసుమ (మూడోవార్డు) ఈ పదవుల్ని గెల్చుకున్నారు. పెడన మున్సిపాలిటీ చైర్పర్సన్గా వైఎస్సార్సీపీకి చెందిన కటకం నాగకుమారి (ఏడోవార్డు కౌన్సిలర్) గెలుపొందారు. మాచర్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా మాచర్ల ఏసోబు (18వ వార్డు) ఎన్నికయ్యారు. ధర్మవరం మున్సిపాలిటీ వైస్ చైర్మన్లుగా వేముల జయరామిరెడ్డి (రెండోవార్డు), షేక్ షంసద్ బేగం (38వ వార్డు) గెలుపొందారు. 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు మండల ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో రామకుప్పం (చిత్తూరు జిల్లా) మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, విజయాపురం (చిత్తూరు), రాయదుర్గం (అనంతపురం) మండలాల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) మండలాధ్యక్షులుగా, పెదకడబూరు (కర్నూలు), గాలివీడు (అన్నమయ్య), రాపూరు (నెల్లూరు), పార్వతీపురం (పార్వతీపురం మన్యం) మండల ఉపాధ్యక్షులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు (చిత్తూరు), రాజంపేట (అన్నమయ్య), బి.మఠం (వైఎస్సార్) మండలాల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. -
రాసి పెట్టుకోండి.. బీజేపీ ఓడిపోతుంది..
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు అంతేగాని ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే వారు తిప్పికొడతారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అదొక్కటే మార్గం.. ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప బీజేపీ చేయగలిగింది ఏమీ లేదు. వారు కర్ణాటకలో కూడా అదే తంత్రాన్ని ప్రయోగించారు. కానీ అక్కడ వారి ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. నిన్న అక్కడ జరిగిందే రేపు ఇక్కడ కూడా జరుగుతుంది. వారు గెలవడానికి మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప మరో మార్గాన్ని ఎంచుకుంటారని నేననుకోవడంలేదు. రెచ్చగొట్టడమే తెలుసు.. ప్రచారానికి ప్రధాన మంత్రి మోదీ వచ్చినా అమిత్ షా వచ్చినా వాళ్ళు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు. దాని వలన వారికి ఒరిగే ప్రయోజనమేమీ ఉండదు. కర్ణాటక ఎన్నికల సమయంలో వారు బజరంగ్ బలి నినాదాలు చేశారు. అయినా కూడా అక్కడ వారి పాచిక పారలేదు. అది చాలా పెద్ద తప్పు. నేరం కూడాను. ఈ విషయాన్ని నేనప్పుడే ప్రస్తావించి ప్రధాన మంత్రి ప్రచారాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ కు కూడా విజ్ఞప్తి చేశాను. ప్రజలకు అన్నీ తెలుసు.. రేపు ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో కూడా వారు ఇదే తరహా ప్రచారానికి తెరతీసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అది వారి నైజం. కానీ ఇక్కడి ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితి లేదు. గడిచిన ఐదేళ్ళలో ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఆడబిడ్డల సంక్షేమం,విద్య, వైద్యం, మంచినీటి సదుపాయాలకు పెద్దపీట వేస్తూ మేము అవలంబించిన విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. ఇది సమయం కాదు.. తనకూ సచిన్ పైలట్ కు మధ్య విభేదాల గురించి ప్రస్తావించగా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి ముఖ్య నేతల సమక్షంలో మేము మాట్లాడుకున్నాం. అది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. దాని గురించి ఇప్పుడు మాట్లాడి అనవసర వివాదాలకు తావివ్వకూడదని అనుకుంటున్నానని తెలివిగా మాట దాటవేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?
Pagination
ఓటు ఎలా వేయాలో తెలుసా..?
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కాల యముళ్లు
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
భారత్ దౌత్యం సక్సెస్.. ఇరాన్ చెర నుంచి ఐదుగురు రిలీజ్
Priyanka Kholgade: స్టైలిష్ లుక్లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు
మేతకొచ్చాడు.. మరో నేత!
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఓటు ఎలా వేయాలో తెలుసా..?
Advertisement