-
అప్పటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మనే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ సారథిగా తనను తప్పించడంతో బ్యాటింగ్పైన దృష్టి పెట్టిన హిట్మ్యాన్... వరల్డ్కప్ నాటికి పూర్తి ఫామ్లోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి 156 పరుగులు చేశాడు హిట్మ్యాన్. తాజాగా ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో తనదైన షాట్లతో అలరించి ముంబై విజయంలో తానూ భాగమయ్యాడు. From @Jaspritbumrah93's brilliance to that dominating chase! 👌 👌 A quick recap to sum up @mipaltan's 2️⃣nd win on the bounce at Wankhede Stadium 🎥 🔽 #TATAIPL | #MIvRCB pic.twitter.com/A8sroBjcm0 — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఇదిలా ఉంటే.. 36 రోహిత్ శర్మకు వయసు పైబడుతున్న దృష్ట్యా అతడిని టీమిండియా సారథిగానూ తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు బలంగా వినిపిస్తుండగా.. టెస్టులకు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్ను చేస్తే బాగుంంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, బీసీసీఐ మాత్రం టీ20 ప్రపంచకప్-2024లోనూ రోహిత్ శర్మనే టీమిండియాను ముందుకు నడిపిస్తాడని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రిటెర్మెంట్పై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఇప్పటి వరకు నేను రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించనేలేదు. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చెప్పలేం కదా! ఇప్పటికీ నేను బాగానే ఆడుతున్నాను. మరికొన్నేళ్ల పాటు ఆడగలననే అనుకుంటున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వరల్డ్కప్ గెలవాలనుకుంటున్నాను. ఇంకా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్ కూడా ముందు ఉంది. టీమిండియా గెలుస్తుందనే అనుకుంటున్నా’’ అని ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. చదవండి: T20 WC: సెలక్టర్లూ.. అతడిపై ఓ కన్నేసి ఉంచండి: టీమిండియా దిగ్గజం 2027 world cup is locked my man gives signal 😭❤️#RohitSharma𓃵 pic.twitter.com/Aqs2T1xJcz — Rameshh (@RameshSuriyaa__) April 12, 2024 ఈ క్రమంలో జూన్ 5 ఐర్లాండ్తో మ్యాచ్తో టీమిండియా ఈ మెగా టోర్నీలో తన ప్రయాణం ఆరంభించనుంది. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్కప్-2023 ఆడిన భారత జట్టు ఒక్క ఈవెంట్లోనూ చాంపియన్గా నిలవలేకపోయింది. కాగా రోహిత్ శర్మ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 2027 వరల్డ్కప్ వరకు కూడా హిట్మ్యానే కెప్టెన్గా ఉంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు. -
Ind vs Aus 2024: పెర్త్లో తొలి టెస్టు!
మెల్బోర్న్: టెస్టు ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న భారత జట్టు ఈ ఏడాది చివర్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో పోటీపడనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. నవంబర్లో మొదలయ్యే ఈ సిరీస్లో ఐదు టెస్టుల వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రెండు మేటి జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం రెండో టెస్టు అడిలైడ్లో... మూడో టెస్టు బ్రిస్బేన్లో... నాలుగో టెస్టు మెల్బోర్న్లో... చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరగనున్నాయి. అడిలైడ్లో జరిగే రెండో టెస్టు డే–నైట్గా జరుగుతుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించనుంది. -
WTC 2023-25: ఆసీస్కు 4.. టీమిండియాకు 5
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ రెండో టెస్ట్ అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్కు చేరే జట్లపై క్లారిటీ వచ్చింది. డబ్యూటీసీ ఫైనల్స్ రేసులో మొత్తం తొమ్మిది జట్లు ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరడం దాదాపుగా ఖరారైపోయింది. Australia jumps to the second spot in the World Test Championship 2023-25 points table after their victory against New Zealand in the second Test. pic.twitter.com/9xN3aCeAb9 — CricTracker (@Cricketracker) March 11, 2024 ప్రస్తుత సైకిల్లో ఆస్ట్రేలియా ఏడులో నాలుగు, భారత్ పదిలో ఐదు మ్యాచ్లు గెలిస్తే ఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగతా జట్లలో సౌతాఫ్రికా ఎనిమిదిలో ఏడు.. న్యూజిలాండ్ ఎనిమిదిలో ఆరు.. పాకిస్తాన్ తొమ్మిదిలో ఏడు.. వెస్టిండీస్ తొమ్మిదిలో ఏడు.. ఇంగ్లండ్ 12కు 12.. బంగ్లాదేశ్ పదిలో ఏడు... శ్రీలంక 11లో ఎనిమిది మ్యాచ్లు గెలిస్తే డబ్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. మిగతా జట్లతో పోలిస్తే.. భారత్, ఆసీస్లకు ఫైనల్కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆసీస్ తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో ఐదు భారత్తో (స్వదేశంలో).. రెండు శ్రీలంకతో షెడ్యూలై ఉన్నాయి. Current cutoff for wtc final Probably india and austrailia will play final #WTC25 pic.twitter.com/vqRGjIUHxp — ICT FAN💙💙(MODI'S FAMILY) (@SAHURAGHAV26) March 11, 2024 భారత్.. రెండు బంగ్లాదేశ్తో (స్వదేశంలో).. మూడు న్యూజిలాండ్తో (స్వదేశంలో).. ఐదు ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. వీటిలో టీమిండియా సగం మ్యాచ్లు గెలిచినా టీమిండియా సునాయాసంగా ఫైనల్కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. వెస్టిండీస్తో రెండు, బంగ్లాదేశ్తో రెండు, శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్తో రెండు (స్వదేశంలో) మ్యాచ్లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్.. శ్రీలంకతో రెండు, భారత్తో మూడు, ఇంగ్లండ్తో మూడు (స్వదేశంలో) పాకిస్తాన్.. బంగ్లాదేశ్తో రెండు (స్వదేశంలో), ఇంగ్లండ్తో మూడు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, వెస్టిండీస్తో రెండు వెస్టిండీస్.. ఇంగ్లండ్తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), బంగ్లాదేశ్తో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్తో రెండు ఇంగ్లండ్.. వెస్టిండీస్తో మూడు (స్వదేశంలో), శ్రీలంకతో మూడు (స్వదేశంలో), పాకిస్తాన్తో మూడు, న్యూజిలాండ్తో మూడు బంగ్లాదేశ్.. శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్తో రెండు, భారత్తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), వెస్టిండీస్తో రెండు శ్రీలంక.. బంగ్లాదేశ్తో రెండు, ఇంగ్లండ్తో రెండు, న్యూజిలాండ్తో రెండు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో రెండు (స్వదేశంలో) -
న్యూజిలాండ్పై సూపర్ విక్టరీ.. రెండో స్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో పర్యాటక ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. డబ్యూటీసీలో ప్రస్తుతం ఆసీస్ విజయాల శాతం 62.51గా ఉంది. ప్రస్తుత డబ్యూటీసీ సైకిల్లో ఆసీస్ 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో 90 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ప్రస్తుత డబ్లూటీసీ సైకిల్లో 50 శాతం విజయాలతో 36 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఐదో టెస్ట్లో ఇంగ్లండ్పై విజయంతో టీమిండియా తమ విజయాల శాతాన్ని మరింత మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత బంగ్లాదేశ్ (50 శాతం విజయాలు), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), సౌతాఫ్రికా (25), ఇంగ్లండ్ (17.5) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, మిచెల్ మార్ష్ (80), అలెక్స్ క్యారీ (98 నాటౌట్), పాట్ కమిన్స్ (32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడటంతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ను 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి కొరల్లో చిక్కుకున్న ఆసీస్ను ఈ ముగ్గురు కలిసి విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 162, సెకెండ్ ఇన్నింగ్స్లో 372 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
శతక్కొట్టిన రోహిత్.. డబ్ల్యూటీసీ చరిత్రలో ఒకే ఒక మొనగాడు!
Rohit Sharma trumps Babar Azam, levels Steve Smith: ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. ధర్మశాల మ్యాచ్లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. The Rohit Rumble Show in Dharamshala🏔️🏟️ Another well-deserved Test 💯for #TeamIndia's maverick skipper 🙌#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/A686RXXgCm — JioCinema (@JioCinema) March 8, 2024 కాగా రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 12వ శతకం కాగా.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 48వ సెంచరీ కావడం విశేషం. సొంతగడ్డపై ఇంగ్లండ్పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు ఇప్పటికే 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మొదలైన నామమాత్రపు ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ ఐదు(5/72.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51), రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దెబ్బకు 218 పరుగులకే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా తొలిరోజే బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ అర్ధ శతకాలు బాది శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్ కూడా రాణించాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 52, శుబ్మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా నిలిచారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ శతకం పూర్తి చేసుకోగా.. శుబ్మన్ గిల్ సైతం సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా రెండో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 264/1 స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ కంటే ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒకే ఒక భారత ఆటగాడు.. బాబర్ ఆజంను వెనక్కినెట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సెంచరీల వీరులు జో రూట్(ఇంగ్లండ్)- 13 మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా)- 11 కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 10 రోహిత్ శర్మ(ఇండియా)- 9 బాబర్ ఆజం(పాకిస్తాన్)- 8 చదవండి: #Mohammed Shami: మహ్మద్ షమీ సంచలన నిర్ణయం.. క్రికెట్ గుడ్బై!? రాజకీయాల్లోకి ఎంట్రీ?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement