-
తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తాం
● ఫుడ్ అండ్ సివిల్ సప్లై కమిషనర్ డీఎస్.చౌహాన్జగిత్యాల: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని ఫుడ్అండ్ సివిల్ సప్లై కమిషనర్ డీఎస్.చౌహాన్ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ యాస్మిన్బాషా, రైస్మిల్లర్స్, ధాన్యం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఆయన బుధవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది రానీయొద్దని ఆదేశించారు. ధాన్యం డబ్బులను వెంటవెంటనే ఖాతాల్లో జమ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు రాంబాబు, సివిల్సప్లై మేనేజర్ అభిషేక్సింగ్, డీఆర్డీఏ పీడీ సంపత్రావు ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిమల్యాల: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, అకాలవర్షాలతో తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామని, రైతుల ఆందోళన చెందవద్దని చౌహన్ అన్నారు. మండలంలోని రామన్నపేటలోని ఐకేపీ, మల్యాలలోని ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. హమాలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ధాన్యం విక్రయించిన రైతులకు ఫోన్ చేసి డబ్బులు జమయ్యాయా తెలుసుకున్నారు. కొంతమంది రైతులు రైస్మిల్లర్లు కోత పెడుతున్నారని, సకాలంలో లారీలు రావడంలేదని కమి షనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ మాట్లాడుతూ.. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయించాలని, లారీల కొరత లేకుండా చూ స్తామని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు కోత పెట్టకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశా రు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఏపీఎం రాజయ్య, సీసీ గంగరాజం ఉన్నారు. -
పోస్టల్బ్యాలెట్ గడువు పెంపు
జగిత్యాల: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా పోస్టల్బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఈనెల 10వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ నేటితో గడువు ముగిసినప్పటికీ ఎన్నికల సంఘం మరో రెండు రోజులు గడువు పొడిగించిందని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనజగిత్యాలక్రైం: పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ట్రైనింగ్ అడిషనల్ ఎస్పీ శివంఉపాధ్యాయ బుధవారం పరిశీలించారు. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై మన్మథరావు ఉన్నారు. విభజన హామీలు విస్మరించిన బీజేపీమెట్పల్లి: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. పట్టణంలో బుధవారం నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకొస్తే విభజన హామీలు అమలవుతాయని, అందుకే టీజేఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. టీజేఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జిలు జువ్వాడి నర్సింగరావు, కంతి మోహన్రెడ్డి, నాయకులు చుక్క గంగారెడ్డి, అల్లూరి మహేందర్రెడ్డి, పసునూరి శ్రీనివాస్ తదితరులున్నారు. -
కాంగ్రెస్తో దేశం విచ్ఛిన్నమే..
కోరుట్ల: మోదీ కలియుగ రాముడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. బుధవారం కోరుట్లలోని కార్గిల్ చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని అభివర్ణించారు. స్వాతంత్య్ర సమయంలో కాంగ్రెస్ నాయకులు దేశవిచ్ఛిన్నానికి కారకులయ్యారని, ఇప్పుడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో పీఎఫ్ఐ, సిమిలు కాంగ్రెస్కు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో ఆలోచించాలని కోరారు. కోరుట్లలో ఓ ముస్లిం చనిపోతే వైద్యులపై పెట్రోల్ పోసి తగులబెట్టే ప్రయత్నం ఎంతవరకు సమంజసమన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ జాడ ఉండదన్నారు. బీడీ కార్మికులకు 500 పడకల ఆసుపత్రి, చెరుకు ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, ఓబీసీ మోర్చా నాయకులు రుద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తులం బంగారం ఎక్కడ..? జగిత్యాల: కాంగ్రెస్ ఇచ్చిన ఆరుగ్యారంటీలను గాలికే వదిలేసిందని అర్వింద్ అన్నారు. బుధవారం అన్నపూర్ణ థియేటర్ సమీపంలో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. తులం బంగారం ఎక్కడ..? రూ.500 బోనస్ వచ్చిందా..? రైతుభరోసా వచ్చిందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అబద్దపు మాటలు నమ్మవద్దన్నారు. హిందువులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పీఎఫ్ఐకి అడ్డగా జగిత్యాల మారిందన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి పాల్గొన్నారు. మోదీకి అవకాశం ఇవ్వండి సారంగాపూర్: ప్రధానిగా మోదీకి మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. మండలంలోని రంగపేటలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. పార్టీ ఎంపీ అభ్యర్థి అర్వింద్కు ఓటు వేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్కుమార్ ఉన్నారు. -
కమలదళంలో హుషారు
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ కాషా యమయమైంది. అడుగడుగునా పోలీసుల తని ఖీలు.. కమలదళం కవాతులతో మారుమోగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం వేములవాడకు రాగా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలంతా చేరుకున్నారు. ముందుగా రాజన్నను దర్శించుకున్న మోదీ నేరుగా.. బహిరంగసభ వేదికపైకి వచ్చారు. తన ప్రసంగంతో కాషాయదళంలో హుషారు నింపారు. సమరోత్సాహంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ముగ్గురికి ఓటేస్తే తనకు వేసినట్లేనని చెప్పారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు వేదిక ప్రాంగణం మోదీ.. మోదీ.. అనే నినా దాలతో మారుమోగింది. పొద్దుపొద్దుగళ్ల ఇంత జన ప్రవాహమా.. ఉదయం 10 గంటలకే బహిరంగసభకు భారీగా జనం తరలివచ్చారు. సరిగ్గా 10.30 గంటలకు సభ ప్రాంగణానికి మోదీ చేరుకుని.. జనసందోహాన్ని చూసి చలించిపోయారు. హెలికాప్టర్లో నుంచి జనప్రవాహాన్ని చూసిన మోదీ.. ఈ విషయాన్ని వేదికపై నుంచి ప్రస్తావించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం ముందే ఖాయమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అతి కష్టం మీద నిలబెట్టగా.. ఓటమి ఖాయమైందన్నారు. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైందన్నారు. ఆరడుగుల బుల్లెట్ కావాలా? దొంగల ముఠానేత కావాలా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ కాంగ్రెస్పై పంచ్ల వర్షం కురిపించారు. కాశీ నుంచి దక్షిణకాశీకి వచ్చిన తొలి ప్రధాని నరేంద్రమోదీని కాశీవిశ్వేశ్వరుని ప్రతిరూపంగా అభివర్ణించారు. ఆరడుగుల బుల్లెట్ మోదీ కావాలా? దొంగలముఠా బ్యాచ్ నేత రాహుల్ కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. ‘పక్కా లోకల్ మోదీ, మేడ్ ఇన్ భారత్ బీజేపీ... నాన్లోకల్ సోనియాగాంధీ, మేడ్ ఇన్ బ్రిటీష్ పార్టీ కాంగ్రెస్..’ ఎవరి పక్షాన నిలుస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. 370 ఆర్డికల్ను రద్దు చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను అమలు చేసిన జగమొండి మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించిన జగమొండి మోదీ.. అని పేర్కొన్నారు. హిందువుల 500 ఏళ్ల కల అయోధ్య రామమందిరానికి ప్రాణప్రతిష్ఠ చేసిన జగమొండి అన్నారు. కరోనా వ్యాక్సిన్ అందించి 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు. మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6వేల కోట్లకుపైగా వెచ్చించి తెరిపించిన విషయాన్ని గుర్తుచేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. బీజేపీని గెలి పిస్తే హైవేలు, ఇంటర్నెట్, రైల్వేలు, ఎయిర్వేస్లతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. గాడిదగుడ్డు చూపుతున్నారు.. ఆరు గ్యారంటీలను అడిగితే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు గాడిదగుడ్డు చూపిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వలేదు, రూ.2లక్షల రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. మోదీ ఏ పని చేపట్టినా వాళ్ల అమ్మ ఆశీస్సులు తీసుకుని బయటకొస్తారని.. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి మనమంతా మోదీ పక్షాన ఉంటూ మూడోసారి ప్రధానిని చేసుకుందామని పిలుపునిచ్చారు. తన ప్రసంగంతో ఉత్సాహం నింపిన ప్రధాని మోదీ రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధాని పోలీస్ వలయంలో ఆధ్యాత్మిక క్షేత్రం జనహోరుతో మారుమోగిన శైవక్షేత్ర పరిసరాలు బహిరంగ సభకు భారీగా జనం -
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
మల్లాపూర్: బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం మండలంలోని ముత్యంపేట, రాఘవపేట, మొగిలిపేట, వేంపల్లిలో పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ప్రచారం చేశారు. పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, పాలన చేతకాక కాంగ్రెస్ నాశనం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పుడు ఎంపీగా బరిలో ఉన్నారని మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ ఒక్క పనీ చేయలేదన్నారు. జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కాటిపెల్లి సరోజన, వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, ఎంపీటీసీ ఓస సత్తెమ్మ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మొద్దు జగిత్యాలరూరల్: కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దని జెడ్పీచైర్పర్సన్ దావ వసంత అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో బాజిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు నక్కల రవీందర్రెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. ఆరుగ్యారంటీల్లో కాంగ్రెస్ విఫలం రాయికల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీల్లో విఫలమైందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమా ర్ అన్నారు. బుధవారం మండలంలోని కిష్టంపేట, సింగరావుపేట, రాయికల్లో బాజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ సంధ్యారాణి, పార్టీ మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, ముఖీద్ పాల్గొన్నారు. బీఆర్ఎస్తోనే ముస్లింలకు మేలు కోరుట్ల: బీఆర్ఎస్ హయాంలోనే ముస్లింలకు అనే క పథకాలు అమలు చేశారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా అన్నారు. బుధవారం కోరుట్లలో బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. షాదీ ఖానా లకు నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, వైస్ ఎంపీపీ చీటి స్వరూపరాణి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్, మైనార్టీ నాయకులు ఫయీం, కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ, సజ్జు, పేర్ల సత్యం, గందం గంగాధర్ పాల్గొన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ను పాతరేయాలి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు -
మిగిలింది మూడు రోజులే..
● ప్రజాక్షేత్రంలోనే అభ్యర్థులు ● హోరెత్తిస్తున్న ప్రచారం ● నిత్యం సమావేశాలతో బిజీ ● పొద్దంతా ప్రచారం.. రాత్రి కార్నర్ మీటింగ్స్జగిత్యాల: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. గడువు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ నిత్యం సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పటికే చుట్టి వచ్చారు. అయినా మరోసారి ఓటర్లను కలిసేందుకు నిత్యం తిరుగుతున్నారు. ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం గ్రామాలు, పట్టణాల్లో ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే రాత్రి సమయాల్లో మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడళ్లలో కార్నర్ మీటింగ్లు పెడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వారివారి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా పలుసార్లు ప్రచారం నిర్వహించారు. సమయం దగ్గరపడిన కొద్దీ అభ్యర్థులందరూ ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన నిజామాబాద్లోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిది జగిత్యాల అయినా కొన్ని రోజులుగా నిజామాబాద్లోనే ఉంటున్నారు. ప్రతిరోజూ అన్ని నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అర్వింద్, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ది నిజామాబాద్ కావడంతో వారు కూడా అక్కడే ఉంటూ ప్రచారంలో మునిగితేలుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకూ ప్రచారం.. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వ రకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను కలు స్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికీ వె ళ్లి తమకు మ ద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో వారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు, తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ప్రచారం చేపడుతున్నారు. ప్రతీ నిమిషం ప్రజల్లోనే గడుపుతూ ప్రజా క్షేత్రంలో ఉంటూ రాత్రిలకే ఇంటికి వెళ్తున్నారు. ఉదయం బయటకు వెళ్లిన అభ్యర్థులు భోజనం, టిఫిన్స్ సైతం కార్యకర్తలు, నాయకుల ఇంటి వద్దనే చేస్తున్నారు. హోరెత్తుతున్న మైకులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైకులతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు వివిధ వాహనాలను ఏర్పాటు చేసుకుని డీజే మోతలతో వివిధ రకాల పాటలను ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో తిరుగుతూ ప్రజలకు పాటల ద్వారా వివరిస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాలను అందిస్తున్నారు. నిద్రాహారాలు మానుకుని.. ప్రచార సమయం సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ప్రతి నిమిషం విలువైంది కావడంతో నేతలు ఓట్లు ఎలా రాబట్టుకోవాలో ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. నిద్రాహారాలు మానుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గ్రామాల్లో ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. రాత్రి ఏడు గంటల నుంచి 10గంటల వరకు పట్టణాల్లో కార్నర్ మీటింగ్లు పెట్టి తాము చేసిన పనులను వివరిస్తున్నారు. -
ఘనంగా భరణి నక్షత్ర వేడుకలు
ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహాస్వామి ఆలయంలోని యమధర్మరాజుకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, ముత్యాలశర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం హారతి, మంత్రపుష్పం గావించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ సూపరింటెండెంట్ కిరణ్, సిబ్బంది తదితరులున్నారు. ఆసుపత్రిపై దాడి సరికాదుజగిత్యాల: కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై హత్యాయత్నం చేయడంతోపాటు ఆస్పత్రిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఐఎంఏ అధ్యక్షుడు సురేశ్కుమార్ అన్నారు. ఐఎంఏ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రి ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేసిన డాక్టర్ శ్రావణ్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. వైద్యులు ఎప్పుడూ రోగుల బాగుకోసమే పనిచేస్తారని, వారిపై దాడిచేయడం, భయబ్రాంతులకు గురిచేయడం ద్వా రా మనోధైర్యం కోల్పోయే అవకాశముందని పేర్కొన్నారు. ఆయన వెంట ఐఎంఏ కార్యదర్శి అజయ్రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్ ఉన్నారు. టమాట మొక్కలపై షేడ్నెట్జగిత్యాలఅగ్రికల్చర్: ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కూరగాయల మొక్కలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. రానున్న సీజన్లో టమాటకు ధర ఉంటుందని భావిస్తున్న రైతులు ఆ పంటను సాగు చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి మొక్కలను రక్షించుకునేందుకు షేడ్నెట్ను పందిరిలాగా కాకుండా తక్కువ ఎత్తులోనే వేసి పంటను కాపాడుకుంటున్నారు. అడవులను కాపాడటం అందరి బాధ్యతరాయికల్: అడవులను కాపాడటం అందరి బాధ్యత అని డీఎఫ్వో వెంకటేశ్వర్రావు అన్నారు. మండలంలోని అల్లీపూర్లోగల అటవీ క్షేత్రాన్ని బుధవారం సందర్శించారు. ఉపాధి కూలీలతో మాట్లాడుతూ అటవీ ప్రాంతంతో ఇంకుడుగుంతలు తీయడం వల్ల వన్యప్రాణుల దాహార్తి తీరుతుందని, వర్షకాలంలో నీరు భూమిలోకి ఇంకి గ్రౌండ్వాటర్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటవీ సంపదతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ప్రజలు తమ ఇళ్ల ఆవరణలో పండ్లమొక్కలు పెంచుకోవాలని కోరారు. అటవీ సంపదను అక్రమంగా తరలిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ఆర్వో ప్రణీత్కౌర్, డెప్యూటీ ఎఫ్ఆర్వో రవికుమార్, ఎఫ్బీవో నరేశ్ ఉన్నారు. డిప్లొమా ప్రవేశాలకు టెస్ట్జగిత్యాల: భారత యువత క్రీడా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పరిధిలోని లక్ష్మీబాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గాల్వియర్లో 2024–25 అకాడమిక్ ఇయర్లో డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రవేశాలకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రవికుమార్ తెలిపారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు, ఇతర వివరాలకు www.i ni pe.ed u.i n వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
విద్యుత్లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ సూచించారు. గతనెల 18 నుంచి ఈనెల 6 వరకు జిల్లాకేంద్రంలో 451మంది విద్యుత్ సిబ్బందికి బ్యాచ్ల వారీగా అంతర్గత శిక్షణ అందించారు. ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన చోట సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలో లోడ్ పెరిగే అవకాశం ఉన్నందున చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున లైన్ల మరమ్మతు పనులు చేసుకోవాలని సూచించారు. శిక్షణ ఇచ్చిన టెక్నికల్ డీఈ గంగారాం, మెట్పల్లి ఏడీఈ మనోహర్, లైన్ ఇన్స్పెక్టర్ రాజమల్లును సన్మానించారు. టెక్నికల్ ఏడీఈ నగేశ్కుమార్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అందించండి
● నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్రెడ్డిసారంగాపూర్: ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డులను ఓటరుకు అందించాలని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్రెడ్డి అన్నారు. సోమవారం బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిప్పల్ల గంగరాజం తన అనుచరులతో కాంగ్రెస్లో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరి, నాయకులు ఆడెపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
● కలెక్టర్ యాస్మిన్ బాషా జగిత్యాల: లోక్సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరూ ఓటు వేసేలా చూడాలని అధికారులను ఆదేశించా రు. ఇప్పటివరకు 1430మంది ఓటర్లు దరఖాస్తు చే సుకున్నారని, 660మంది మాత్రమే పోస్టల్ బ్యాలె ట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం జరి గిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వంమేడిపల్లి: కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మోత్కురావుపేట, రాజలింగంపేట్, పసునూరు, గోవిందారం, దేశాయిపేట, ఈదుల లింగంపేట, మాన్నెగూడం, కమ్మరిపేట, వెంకట్రావుపేట, రాగోజీపేట, ఒడ్యాడ్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాజేందర్రావుకు మద్దతుగా ప్రచారం చేశారు. పలువురు పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నా రు. పార్టీ మండల అధ్యక్షుడు నరేశ్ రెడ్డి, రమేశ్రెడ్డి, చేపూరి నాగరాజు, మార్గం నర్సరెడ్డి, సాయిని గంగారెడ్డి, మాదం వి నోద్, రేండ్ల మధు, భర్కం రాజశేఖర్ పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం కోసం బీజేపీని ఓడించాలి
కోరుట్ల: దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కొనసాగాలంటే బీజేపీని ఓడించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి మద్దతుగా కోరుట్లలో పర్యటించారు. పట్టణంలోని జువ్వాడి భవన్లో మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, సీఎంలను ఐటీ, ఈడీ దాడులతో జైలుపాలు చేస్తోందని విమర్శించారు. దేశాన్ని మతోన్మాదం వైపు నడిపించిన వ్యక్తికి భారతరత్న బిరుదును ఇంటికెళ్లి ఇవ్వడం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దేశంలో సబ్కా సాత్, సబ్కా వికాస్ ఎక్కడుందో మోదీ చెప్పాలన్నా రు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ తిరుమల గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
● 7 నుంచి 11 తేదీ వరకు తేలికపాటి వర్షాలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: మాడు పగిలే ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగి త్యాల, సిరిసిల్ల జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలిమల్లాపూర్: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఎన్సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి సమియొద్దీన్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్యాధికారులు, ఏఏన్ఎం, ఆశ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తలనొప్పి, తల తిప్పడం, తీవ్రమైన జ్వరం, మత్తునిద్ర, కలవరింతలు, అపస్మారక స్థితికి వెళితే వడదెబ్బ బారినపడినట్లు భావించాలన్నారు. ఎండలో బయటకు వెళ్లినపుడు టవల్ చుట్టుకోవాలని సూచించారు. ఎన్సీడీ కో–ఆర్డినేటర్ బీ.మురళీధర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సుమన్, సీహెచ్వో రామ్మోహన్, హెల్త్ సూపర్వైజర్ ఇందిర, శ్రీనివాస్, స్టాఫ్నర్స్ సుమలత, ఎంఎల్హెచ్పీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహనమల్యాల: విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు కృషి చేయాలని డీఈ రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా మల్యాల, గొల్లపల్లి సబ్ డివిజన్ల పరిధిలోని విద్యుత్ సిబ్బందికి విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోతే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, రైతులు వేయొద్దని పేర్కొన్నారు. ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి కూలీలను ఆదుకుంటాంధర్మపురి: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలను ఆదుకుంటామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేట, నేరెల్లలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా సోమవారం ప్రచారం చేశారు. బీజేపీ మతం, దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడగడం ఏమిటని ప్రశ్నించారు. కొప్పుల ఈశ్వర్ పదేళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు. మహిళల సంక్షేమమే ప్రధాని ధ్యేయంజగిత్యాలరూరల్: మహిళల సంక్షేమమే ప్రధాని ధ్యేయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. రాయికల్ మండలం సింగరావుపేట, అయోధ్య, రాజనగర్ గ్రామాల్లో సోమవారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ దేశరక్షణకు కృషి చేస్తున్నారన్నారు. దేశరక్షణ కోసం ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అన్నవేని వేణు, ఉపాధ్యక్షుడు పసుపునూరి శ్రీనివాస్, నాయకులు ఏనుగు రవి, ధర్మరాజు, జితేందర్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పోలీసులు సిద్ధం
జగిత్యాలక్రైం: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. నగదు, ఇతర సామగ్రి తరలకుండా పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను చెక్పోస్టుల్లో ఆపి తనిఖీలు చేపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కోడ్ అమలులో ఉండటంతో చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని అణువణునా తనిఖీ చేయడంతోపాటు, పోలీసులు, ఎన్నికల ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. జిల్లాలో 9 సరిహద్దు చెక్పోస్టులు జిల్లా సరిహద్దుల్లో 9 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మెట్పల్లి శివారులోని గండి హనుమాన్ దేవాలయం వద్ద, రాయికల్ మండలం బోర్నపల్లి బ్రిడ్జి వద్ద, మల్లాపూర్ మండలం ఒబులాపూర్ బ్రిడ్జి వద్ద, బీర్పూర్ మండలం కమ్మునూర్ వద్ద, ధర్మపురి మండలం రాయపట్నం వద్ద, కొడిమ్యాల మండలం దొంగలమర్రి వద్ద, కథలాపూర్ మండలం కలికోట, ఇబ్రహీంపట్నం మండలంతోపాటు, మరోచోట చెక్పోస్టులు ఉన్నాయి. నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి జిల్లాలో పోలీసు శాఖ నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. రూ.50 వేలకు మించి తీసుకెళ్తే పట్టుకుని సీజ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్సెల్కు అప్పగిస్తున్నారు. బాధితులు తగిన ఆధారాలు చూపి నగదు తీసుకెళ్తున్నారు. మద్యం రవాణాపై దృష్టి మద్యం రవాణాపైనా పోలీసులు దృష్టి సారించారు. నిబంధనల మేరకు ఒక వ్యక్తి వద్ద ఆరు బాటిళ్లకంటే ఎక్కువగా ఉంటే సీజ్ చేస్తున్నారు. పోలీసులు మద్యం విక్రయ కేంద్రాల సమీపంలోనే మఫ్టీలో ఉంటూ ఎక్కువ మద్యం తరలిస్తున్న సమయంలో పట్టుకుని సీజ్ చేయడంతోపాటు, రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో తొమ్మిది చెక్పోస్టుల ఏర్పాటు వాహనాల తనిఖీలు ముమ్మరం -
ప్రాణాలు పోసే వైద్యులపై దాడులా..?
కోరుట్ల: ప్రాణాలు పోసే వైద్యులపై దాడులు ఎలా చేస్తారని, అకారణంగా దాడికి పాల్పడిన వారిపై చ ర్యలు తీసుకోవాలని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి వై ద్యులు సోమవారం నిరసనకు దిగారు. కోరుట్ల ప్ర భుత్వ ఆసుపత్రిలో నజీబూర్ రహమాన్ (48) ఆది వారం మృతి చెందిన విషయం తెల్సిందే. మృతుడి బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టి ఓ వైద్యుడిపై దాడికి య త్నించారు. దాడిని నిరసిస్తూ స్టేట్ హెచ్ఆర్డీఏ కౌ న్సిల్, కోరుట్ల ఐఎంఏ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధ రించి నిరసన చేపట్టారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐఎంఏ కోరుట్ల అధ్యక్షుడు డాక్టర్ రేగొండ రాజేశ్ మాట్లాడుతూ డాక్టర్ శ్రవన్పై దాడి చేయటాన్ని ఖండించా రు. రేపటిలోగా నిందితులను అరెస్టు చేయాలని, లే కుంటే చలో కోరుట్లకు పిలుపునిస్తామని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయాలంటేనే భయంగా ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్ రాజ్కుమార్, టీజీడీఏ జనరల్ సెక్రటరి రవి ప్రవీణ్ రెడ్డి, వైద్యులు విశాల్, జగదీశ్వర్, రవికిరణ్, దిలీప్ రావు, టీజీజీడీఏ వైద్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన డీఎంహెచ్వో ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సోమవారం పరిశీలించారు. వ్యక్తి మృతి,దాడి వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత దాడి ఘటనను డీఎంహెచ్ఓకు వివరించారు. నిందితులను అరెస్టు చేయాలి ఆసుపత్రి ఎదుట హెచ్ఆర్డీఏ, ఐఎంఏ వైద్యుల నిరసన -
కలిసికట్టుగా పనిచేయండి
జగిత్యాల: ‘కష్టపడి పనిచేయండి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మనదే. అధైర్యపడొద్దు. ఐక్యంగా ముందుకెళ్లి విజయం సాధిద్దాం..’ అని జిల్లా ప్రజాప్రతినిధులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బస్సుయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి రోడ్షో నిర్వహించిన ఆయన జగిత్యాలలోనే బస చేశారు. సోమవారం ఉదయం స్థానిక నాయకులతో బిజీబిజీగా గడిపారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్లు సూచించారు. అధైర్యపడొద్దని నాయకులతో పేర్కొన్నట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, నిరంతరం పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. కేసీఆర్ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీమంత్రి రాజేశంగౌడ్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, తుల ఉమ పాల్గొన్నారు. కేసీఆర్కు మోహన్రావుపేట, కోరుట్లలో ఘన స్వాగతం కోరుట్ల/కోరుట్ల రూరల్: మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొనేందుకు జగిత్యాల నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన బస్సు కోరుట్ల పట్టణం మీదుగా సాగింది. ఈ సందర్భంగా మోహన్రావుపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బస్సుయాత్రకు గుమ్మడికాయ కొట్టి కోరుట్లకు ఆహ్వానించారు. పట్టణంలోని జాతీయ రహదారి వెంబడి బీఆర్ఎస్ శ్రేణులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్కు పూలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, ఎంపీపీ తోట నారాయణ, జెడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు అన్నం అని ల్, దారిశెట్టి రాజేశ్, సీనియర్ నాయకుడు చీటి వెంకట్రావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సింగగిల్విండో చైర్మన్లు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మేడిపల్లి మండలంలో నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం తెలిపారు. గెలుపు మనదే నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం జగిత్యాలలో మాజీ సీఎం బిజీబిజీబస్సుయాత్ర కలిసొచ్చేనా..? నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సుయాత్రతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సోమవారం కేసీఆర్ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కలిసి పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, విజయం తమదేనని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రతిఒక్కరూ పట్టు సాధించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే రైతుబంధు, రైతుబీమా, విద్యుత్ సరఫరా అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వ కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. రోజంతా జగిత్యాలలోనే మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలోనే రోజంతా నాయకులతో బిజీబిజీగా గడిపారు. రాత్రి బస్సుయాత్ర ముగించుకున్న అనంతరం ఎమ్మెల్సీ రమణ స్వగృహంలో బస చేశారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో కేసీఆర్ గురువు, ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య స్వగృహానికి వెళ్లి ఆయనతో 20 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి కొద్దిసేపు ఎమ్మెల్సీ రమణ ఇంట్లో విశ్రాంతి తీసుకుని కోరుట్ల మీదుగా నిజామాబాద్కు తిరుగు పయనమయ్యారు. -
అంతా నకిలీమయం
జిల్లా కేంద్రంలోని టవర్సర్కిల్, బైపాస్ రోడ్లలో నిర్వహిస్తున్న శానిటరీ దుకాణాల్లో నకిలీ పైపులు గుర్తించారు. ఆశీర్వాద్ బ్రాండెడ్ కంపెనీకి చెందిన పైపులను అదే పేరుతో నకిలీవి విక్రయించగా.. ఒరిజినల్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల తనిఖీలు నిర్వహించి నకిలీవిగా గుర్తించారు. ఆ రెండు షాపులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గతంలో జిల్లాలో ఓ సూపర్ మార్కెట్లో ఓ బ్రాండెడ్ కంపెనీకి చెందిన నకిలీ చాయ్పత్తి అమ్ముతున్నారని కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించగా.. అవి నకిలీవని తేలింది. జగిత్యాల: ప్రస్తుత హైటెక్ యుగంలో తినే వాటిలోనే అంతా కల్తీ జరుగుతుండగా.. తాజాగా ప్రతి వస్తువు నకిలీవే ఉంటున్నాయి. ముఖ్యంగా తినే వస్తువులైన బియ్యం, పప్పు, ఉప్పు, నూనెల్లో అత్యధికంగా కల్తీ జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఇవేకాకుండా ఇంటి నిర్మాణానికి వాడే పైపులు, సాధారణంగా వినియోగించే ఫెవిక్విక్లు, పెన్సిళ్లు, శానిటరీకి సంబంధించిన వస్తువులు మార్కెట్లో నకిలీవి విరివిగా అమ్ముతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా నకిలీ వస్తువులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. శానిటరీ, కిరాణం, సూపర్ మార్కెట్లు, షాపుల్లో ఇవి అత్యధికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. శానిటరీ షాపుల్లో విక్రయిస్తున్న పైపులు, కరెంట్ పైపులు, ఇతరత్రా వస్తువులన్నీ నకిలీవి అంటగడుతున్నారు. గతంలో టవర్ సర్కిల్లో ఓ హోల్సేల్ షాపులో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన చాయిపత్తి ప్యాకెట్లు సైతం విక్రయించగా.. ఆ కంపెనీకి చెందినవారు గుర్తించి పోలీసులకు పట్టించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఓ శానిటరీ షాపుతోపాటు ఎలక్ట్రికల్ షాపుల్లో నకిలీవి అమ్ముతున్నారని గుర్తించిన ఒరిజినల్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇవి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ లాంటి బ్రాండ్లతోనే వీటిని సైతం ముద్రించి అలాగే విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. శానిటేషన్, ఎలక్ట్రికల్ వస్తువులే ఎక్కువ.. జిల్లా కేంద్రంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారికి శానిటరీ, ఎలక్ట్రికల్ వస్తువులు ఖచ్చితంగా అవసరముంటాయి. కొనుగోలు చేసుకునే యజమానులు నకిలీ ఏవో, అసలివి ఏవో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ కంపెనీకి చెందిన పైపులు, ఎంసిల్స్ నకిలీవి పట్టుబడ్డాయి. దీంతో ఆందోళన చెందుతున్నారు. డిస్కౌంట్ల పేరుతో ఆఫర్లు చూపుతూ కొందరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తూ నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. దీంతో మన్నిక లేనివి కావడంతో కొద్దికాలమే నిలువ ఉండి చెడిపోయే అవకాశాలున్నాయి. నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు ఎక్కువగా పైపులైన్ నిర్మాణం, కరెంట్ వైరింగ్ అండర్ గ్రౌండ్లో వేస్తుంటారు. ఒకసారి అండర్ గ్రౌండ్లో పైపులు వేశామంటే.. మళ్లీ తీయలేని పరిస్థితి ఉంటుంది. ఇవి మన్నిక లేనివి కావడంతో తొందరగా చెడిపోయి మళ్లీ ఇల్లు గోడలను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకొని నిఘా పెంచాలని కోరుతున్నారు. సంబంధిత ఒరిజినల్ కంపెనీలు నిర్వాహకులు సైతం తమ వాటితో పోలిన వస్తువులను విక్రయిస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రతీది గమనించి కంపెనీవా కాదా అని తెలుసుకొని కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. తినుబండారాలకు సంబంధించినవి అనారోగ్యంపాలుజేస్తే, నకిలీ వస్తువులేమో నూతనంగా నిర్మించే ఇళ్లకు ముప్పు తెస్తున్నాయి. ఏదేమైనా నాణ్యత లేని ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మోసపోతున్న జనం కనిపించని అధికారుల తనిఖీలు -
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో మాజీ సీఎం కేసీఆర్ బస్సును ఆపి ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు. కాగా మరికాసేపట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ బస్సు యాత్ర చేరుకోనుంది. నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. మంగళవారం కామారెడ్డి లో పర్యటించనున్నారు. జగిత్యాలలో కేసీఆర్ బస్సును తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులుఎన్నికల అధికారులకు సహకరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/y19WeT2S7D— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024 -
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
● కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిమల్లాపూర్: ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ బూత్ లెవల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రైతుల సంక్షేమానిక అహర్నిశలు పనిచేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి వచ్చే ఏడాది డిసెంబర్లోగా చెరుకు క్రషింగ్ జరిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో బాండ్పేపర్లతో రైతులను మభ్యపెట్టి గెలిచిన అర్వింద్ నయా పైసా పనిచేయలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ పచ్చిఅబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు కల్వకుంట్ల సుజిత్రావు, వాకిటి సత్యంరెడ్డి, ఎలాల జలపతిరెడ్డి, రుత్త నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆరుగురు కౌన్సిలర్లు ఆదివారం కాంగ్రెస్లో చేరగా వారికి జీవన్రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. యూనిఫాం సివిల్కోడ్, ఎన్ఆర్సీ, 370ఆర్టికల్పై పార్టీ విధానమే తన విధానమన్నారు. బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి, నాయకులు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ముంజాల రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు మేలు
పూడికతీత మట్టి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువుగా పని చేస్తుంది. ఉపాధిహామీ పథకంలో చెరువుల్లో కూలీలతో పూడికతీత పనులు చేయిస్తున్నారు. చెరువుల నుంచి మట్టిని తీసుకెళ్లి వ్యవసాయ భూముల్లో పోయడంతో ఎరువుల భారం తగ్గుతుంది. రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. పంట భూముల్లో మట్టిని పోయడంతో అంతా చదునుగా మారుతుంది.– కొండ ఆంజనేయులు, రైతు, భూషణరావుపేట ట్రాక్టర్ ఖర్చులు భరించాలి ఉపాధిహామీ కూలీలు చెరువుల్లోని మట్టిని తీసి ట్రాక్టర్లలో పోస్తున్నారు. ఆ మట్టిని ట్రాక్టర్లలో తీసుకెళ్లడానికి రైతులే ఖర్చు భరించాలని ప్రభుత్వం అంటోంది. రైతు సంక్షేమం ఆలోచించి ట్రాక్టర్ ఖర్చులు ప్రభుత్వం చెల్లించాలి. ఆర్థికంగా ఉన్న రైతులు తీసుకెళ్తున్నారు. పేద రైతులకు చెరువుల మట్టి అందని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. – ఆకుల నర్సయ్య, రైతు, సిరికొండ వినియోగించుకోవాలి జిల్లాలో 118 చెరువుల్లో ఉపాధిహామీ పథకంలో పూడికతీత పనులు చేయిస్తున్నాం. మట్టిని కూలీలతో తవ్వించి ట్రాక్టర్లో పోయిస్తాం. కూలీలకు వేసవిలో పని కల్పించినట్లయింది. మట్టిని ఉచితంగానే ఇస్తాంకానీ ట్రాక్టర్లో తీసుకెళ్లేందుకు ఖర్చును రైతులే భరించాలి. పూడికతీత మట్టి పంట పొలాలకు మేలు చేస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు ట్రాక్టర్లో మట్టిని తీసుకెళ్లి వినియోగించుకోవాలి. – సంపత్రావు, డీఆర్డీవో, జగిత్యాల -
అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్ జడ్జి పూజలు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారిని ఆదివారం జిల్లా అడిషనల్ జడ్జి నారాయణ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆయన గోత్రనామాలపై ప్రత్యేక మంత్రాలు చదివి, అనంతరం తీర్థప్రసాదాలు ఆశీర్వచనం అందించారు. మోహన్రావుపేటలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి చాయ్పే చర్చకోరుట్ల రూరల్: మండలంలోని మోహన్రావుపేటలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం చాయ్పే చర్చ నిర్వహించారు. గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద ఆగి చాయ్ తాగుతూ యువకులతో మాట్లాడారు. స్థానిక సమస్యలు, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లపై అడిగి తెలుసుకున్నారు. గోవర్ధన్ వెంట మాజీ ఎంపీటీసి దుంపెట రమేశ్, బీఆర్ఎస్ నాయకుడు బండ మల్లేశ్ యాదవ్, తదితరులున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనకథలాపూర్(వేములవాడ): కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని, వాటి ఆధారంగా దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని పోసానిపేట, దుంపేట, దూలూర్, బొమ్మెన, తక్కళ్లపెల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ డీసీసీ కార్యదర్శి చెదలు సత్యనారాయణ, మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు ఎండీ అజీమ్, పులి హరిప్రసాద్, కారపు గంగాధర్, అల్లూరి దేవా రెడ్డి, రాజారెడ్డి, జీవన్రెడ్డి, కల్లెడ గంగాధర్, గడ్డం చిన్నారెడ్డి, వంగ మహేశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు అండగా నిలవాలి మెట్పల్లి: లోక్సభ ఎన్నికల్లో కుల సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆది శ్రీనివాస్ కోరారు. ఆదివారం మున్నూరు కాపుల సమావేశం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నాయకులు కొమొరెడ్డి కరం, విజయ్అజాద్, పట్టణాధ్యక్షుడు జెట్టి లింగం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలిపెగడపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్.. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్, బతికపల్లిలో గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ప్రజల ను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్కు మరో సారి ఓటేస్తే నీళ్లు, కరెంటు రాదని ఎద్దెవా చేశా రు. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల గొంతుకనై పార్లమెంట్లో స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరించారు. తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ శోభ, పార్టీ రాష్ట్ర నాయకుడు రమణారావు, పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, ఎంపీటీసీ రవి, మాజీ సర్పంచి అంజ మ్మ, మల్లేశం, గంగాధర్, షకీల్, తిరుపతి, వెంకటేశం, రవి, రాజశేఖర్, శ్రీరాములు పాల్గొన్నారు. -
పడిపోతున్న భూగర్భ జలాలు
● ఏప్రిల్లో 5.70 మీటర్లకు పడిపోయిన జలాలు ● ఒక్క నెలలోనే 0.30మీటర్లు పడిపోయిన వైనంజగిత్యాలఅగ్రికల్చర్: భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే జిల్లాలో నీటి మట్టం 0.30మీటర్లు పడిపోవడంతో.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మే నెలలో నీటి మట్టం మరెంతగా పడిపోయే అవకాశముందోననే ఆందోళన మొదలైంది. ఇప్పటికే పట్టణాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందించే పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీల్లో పెరుగుతున్న నీటి వినియోగం జగిత్యాలతోపాటు కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలున్నాయి. ఈ పట్టణ ప్రాంతాల్లో నీటి వినియోగం రోజురోజుకు పెరిగిపోయి భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత నెలలో 7.42మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. నీటి మట్టం 0.27మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 7.69మీటర్లకు చేరుకుంది. కోరుట్లలో గత నెలలో 9.37మీటర్లున్న నీటి మట్టం 1.07మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 10.44మీటర్లకు చేరుకుంది. మెట్పల్లిలో గత నెలలో 5.08మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా.. 0.15మీటర్లు పడిపోయి 5.23మీటర్లకు చేరుకుంది. రాయికల్ మున్సిపాలిటీలో గత నెలలో 3.08మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. 0.12మీటర్లు పడిపోయి ప్రస్తుతం 3.20మీటర్లకు చేరుకుంది. ధర్మపురి మున్సిపాలిటీలో గత నెలలో 7.51మీటర్ల లోతులో భూగర్భ జలముండగా.. ప్రస్తుతం 0.66మీటర్లు పడిపోయి 8.17 మీటర్లకు చేరుకుంది. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో పడిపోతున్న నీటి మట్టం జిల్లాలో నాన్ ఆయకట్టు ప్రాంతాలుగా ముద్రపడ్డ(సాగునీరందని) మల్యాల, మెడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింతగా పడిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో పంటలకు సాగునీరును ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో గత నెలలో 6.67మీటర్ల లోతులో నీరుండగా.. నీటి మట్టం 0.25మీటర్లు పడిపోయి ప్రస్తుతం 6.92మీటర్లకు చేరుకుంది. కొడిమ్యాల మండలంలో గత నెలలో 10.70మీటర్లు ఉండగా.. 0.41మీటర్లు పడిపోయి ప్రస్తుతం 11.11మీటర్లకు భూగర్భ జలం చేరుకుంది. కథలాపూర్ మండలంలో 3.01మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.75మీటర్లకు పడిపోయి 3.76మీటర్లుకు చేరుకుంది. మేడిపల్లి మండలంలో 3.23మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం 0.23మీటర్లు పడిపోయి ప్రస్తుతం 3.46మీటర్లకు చేరుకుంది. ఒక్క నెలలోనే.. జిల్లాలో ఒక్క నెలలోనే నీటి మట్టం సగటున 0.30మీటర్లకు పడిపోయింది. మార్చి నెలలో 5.40మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏప్రిల్ నెల చివరి నాటికి 0.30మీటర్లు పడిపోయి ప్రస్తుతం 5.70మీటర్లకు చేరుకుంది. గతేడాది ఏప్రిల్ నెలతో పోల్చితే 0.44మీటర్లు తగ్గింది. జిల్లాలో ఏప్రిల్ చివరి నాటికి కథలాపూర్ మండలంలో అతి తక్కువగా 2.80మీటర్ల లోతులో నీరు ఉండగా.. అత్యధికంగా కొడిమ్యాల మండలంలో 11.11మీటర్ల లోతులో నీరు ఉండటం గమనార్హం. రోజురోజుకూ తగ్గుతున్నాయి భారీ ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. వర్షాలు కురిస్తే గాని భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం నెలకొంది. మే నెలలో మరింతగా భూగర్భ జల నీటి మట్టం పడిపోనుంది. – నర్సింహులు, జిల్లా భూగర్భజల వనరుల శాఖాధికారి, జగిత్యాల -
చెరువు మట్టి.. చేలకు పుష్టి
● ఉపాధి పథకంలో 118 చెరువుల్లో పూడికతీతలు ● కూలీలకు లభిస్తున్న పని.. రైతులకు మేలు ● పంట పొలాలకు తీసుకెళ్తున్న రైతులుకథలాపూర్(వేములవాడ): ఉపాధి హామీ పథకం కూలీలకే కాదు.. రైతులకూ మేలు చేస్తోంది. పంటల సాగులో అడ్డగోలుగా రసాయనిక ఎరువులు వినియోగం పెరిగి భూసారం క్షీణిస్తోంది. భవిష్యత్తులో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం ఉంది. అనుకున్న దిగుబడి రాకపోగా.. పెట్టుబడి పెరిగి రైతులు ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలో రైతులు సేంద్రియ ఎరువుల ప్రాధాన్యాన్ని గుర్తించి చెరువుల్లోని మట్టిని తమ పంట పొలాలకు తరలించుకుంటున్నారు. చెరువుల్లో పూడికతీత పనులను ఉపాధిహామీ పథకంలో కూలీలతో చేయిస్తున్నారు. కూలీలు తీసిన మట్టిని రైతులు ట్రాక్టర్లలో పంట పొలాలకు తీసుకెళ్తున్నారు. పొలాలు విలువైన పోషకాలతో కూడి సారవంతమవుతున్నాయి. ఈ మట్టిని పొలాల్లో వేసుకోవడంతో.. సేంద్రియ ఎరువుగా పని చేసి భూసారం పెరిగి పంటల దిగుబడి పెరుగుతోంది. అంతేకాకుండా రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో రైతులకు ఖర్చు తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 118 చెరువుల్లో పూడికతీత పనులు జిల్లాలో 20 మండలాలుండగా.. 380 గ్రామాలున్నాయి. జిల్లాలో 1,39,822 మంది ఉపాధిహామీ కూలీలున్నారు. వేసవిలో వ్యవసాయ, ఇతర పనులు లేకపోవడంతో.. కూలీలు ఉపాధి పనులకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సుమారు 54వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకం పనులకు హాజరవుతున్నారు. ఈ వేసవిలో 118 చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఆయా చెరువుల్లో ఉపాధిహామీ పథకంలో కూలీలతో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఉపాధి పథకంలో పని చేస్తున్న కూలీలు చెరువుల్లోని మట్టిని తీసి ట్రాక్టర్లో పోస్తుండగా.. రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లో మట్టిని పంట పొలాలకు తీసుకెళ్తున్నారు. గతంలో చెరువులోని మట్టిని ప్రభుత్వమే ఉచితంగా ట్రాక్టర్లో సరఫరా చేసేదని రైతులంటున్నారు. చెరువు మట్టితో ప్రయోజనాలు చెరువు మట్టితో పంట పొలాలు సారవంతమవుతాయి. పోటాషియం, జింక్, నత్రజని, భాస్వరం, బోరాన్ వంటి పోషకాలు పెరుగుతాయి. పంటలో తేమ శాతం పెరగడంతో నీటి వినియోగం తగ్గుతుంది. చెరువు మట్టి వేసుకున్న పంట భూముల్లో క్రిమిసంహారక మందుల వాడకం ఎకరానికి రూ.3వేల నుంచి రూ.4వేల పెట్టుబడి తగ్గుతుందని అధికారులు తెలిపారు. -
మహిళా సిబ్బందికి వెసులుబాటు
● ఈసారి స్థానిక సెగ్మెంట్లలో విధులు ● ఉద్యోగినులకు తప్పనున్న తిప్పలుకోరుట్ల: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా సిబ్బందికి జంబ్లింగ్ తిప్పలు తప్పాయి. తమ సొంత నియోజకవర్గాల్లో ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తే కొన్నిసార్లు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో జంబ్లింగ్ పద్ధతిన ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల కేటాయింపు ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో పోలింగ్ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులు సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో మహిళా ఉద్యోగులు నానా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఎండలు ముదిరిన పరిస్థితుల్లో మహిళా సిబ్బందికి జంబ్లింగ్ పద్ధతిని తొలగించి స్థానిక నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించే అవకాశం కల్పించారు. తప్పిన తిప్పలు ప్రతిసారి ఎన్నికల్లో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురికి చెందిన సిబ్బందిని జంబ్లింగ్ పద్ధతిన తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో విధులు కేటాయించేవారు. దీంతో కోరుట్ల సెగ్మెంట్ చివరలో ఉన్న ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ఉద్యోగులు సుమారు 80–100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి, జగిత్యాల మండలాల్లోని గ్రామాల్లో పోలింగ్ విధులు నిర్వహించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లి ఎలాంటి వసతులు లేకున్నా విధులు నిర్వహించేందుకు మహిళా సిబ్బంది నానా తంటాలు పడేవారు. కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేక నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఈసారి ఎండలు మండిపోతుండటంతో మళ్లీ ఎప్పటిలాగే ఇతర సెగ్మెంట్లలో విధులు నిర్వహించాల్సి వస్తే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆందోళన చెందిన మహిళా సిబ్బందికి ఎన్నికల అధికారుల నిర్ణయంతో ఊరట దక్కింది. దక్కిన ఊరట ఈసారి ఎన్నికల కోసం వారంక్రితం ఎన్నికల సిబ్బందికి సెగ్మెంట్ల వారీగా విధులు కేటాయించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవో, ఇద్దరు పోలింగ్ క్లర్క్తోపాటు రిజర్వ్ సిబ్బంది కింద జగిత్యాల సెగ్మెంట్లో 1,150 మంది పోలింగ్ సిబ్బంది, కోరుట్ల సెగ్మెంట్లో 1,290 మంది ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించారు. వీరిలో జగిత్యాల సెగ్మెంట్లో సుమారు 450 మహిళా సిబ్బంది, కోరుట్లలో మరో 380మహిళా సిబ్బంది ఉన్నారు. వీరికి సెగ్మెంట్లను మార్చుతూ విధులు కేటాయించే జంబ్లింగ్ పద్ధతికి మినహాయింపును ఇచ్చి స్థానిక సెగ్మెంట్లల్లో విధుల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో చాలామంది మహిళా సిబ్బందికి వెసులుబాటు దక్కింది. ఈ విషయాన్ని కోరుట్ల తహసీల్దార్ కిషన్ ధ్రువీకరించారు. పోలింగ్ శిక్షణ కార్యక్రమం ఇప్పటికే రెండు విడతలు ముగియగా.. త్వరలో గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లవారీగా విధుల కేటాయంపు ఉంటుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. -
పోస్టల్ బ్యాలెట్ షురూ
జగిత్యాల: లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండో విడత ఎన్నికల శిక్షణ పూర్తి కావడంతో ఈనెల 7వ తేదీ వరకు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారు. మొదటి విడత ఎన్నికల శిక్షణలో పోస్టల్ బ్యాలెట్పై అవగాహన కల్పించారు. అనంతరం ఫారం 12 దరఖాస్తులను అందించగా పోస్టల్ ఓట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో నోడల్ అధికారులుంటారు. ఏమైనా ఇబ్బందులు, సందేహాలున్నా వారు నివృత్తి చేస్తారు. దరఖాస్తు ఫారంలో తెలిపిన వివరాల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తారు. శనివారం ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్బ్యాలెట్ ఓటు హక్కును అదనపు కలెక్టర్ దివాకర వినియోగించుకున్నారు. -
అబద్ధాల కాంగ్రెస్కు పరాభవం తప్పదు
● బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కథలాపూర్(వేములవాడ): అబద్ధపు హామీతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం తప్పదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపెల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతకు గురైన కాంగ్రెస్ ప్రపంచ రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. మత రాజకీయాలు చేస్తూ ఎంపీ బండి సంజయ్ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జెడ్పీటీసీ నాగం భూమయ్య, వైస్ ఎంపీపీ కిరణ్రావు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భీమారంలో ప్రచారం.. మేడిపల్లి: మేడిపల్లి, భీమారం మండలాల్లోని పోరుమల్ల, కట్లకుంట, కొండపూర్, మన్నేగూడెం గ్రామాల్లో వినోద్కుమార్ పర్యటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కరీంనగర్కు చేసిందేమీలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హరిచరన్రావు, సత్తిరెడ్డి, అజిత్రావు, అంగడి ఆనంద్ ఆదిరెడ్డి పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement