-
ఒకరి వెంట మరొకరు..
సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జులు డీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రెబల్గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెప్పారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్ అభ్యర్థి -
వాయిస్ కాల్స్ ప్రచారం
● గెలుపు కోసం ప్రధాన పార్టీల కొత్తదారి కెరమెరి(ఆసిఫాబాద్): ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో కొత్తదారులు ఎంచుకుంటున్నారు. ఎండల తీవ్రతకు పూర్తిస్థాయిలో ఓటర్లను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో మొబైల్ ఫోన్ల ద్వారా వాయిస్ కాల్స్ చేయిస్తున్నారు. రికార్డు వాయిస్తో తమనే గెలిపించాలని ఓటు అభ్యర్థిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాల్లో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. చాలా వరకు గిరిజన గ్రామాలు కావడంతో ప్రయాణం అంత సులువు కాదు. దీంతో అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎండలకు తిరగలేక.. ఉమ్మడి జిల్లాలో కొద్దిరోజులు పగడి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్న విషయం తెలిసిందే. మంగళవారం మాత్రమే వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయమే ఉపాధిహామీ పనులకు ప్రజలు వెళ్తుండటంతో నాయకులు కూలీలను నేరుగా కలిసి ఓటు వేయాలని కోరుతున్నారు. మళ్లీ ఎక్కువగా సాయంత్రం 5 గంటల తర్వాతే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆన్లైన్, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను చేరుకునేందుకు వాయిస్ కాల్ ప్రచారాన్ని ఎంచుకున్నారు. అయితే ప్రతిరోజూ వివిధ పార్టీల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
కేసీఆర్తోనే అభివృద్ధి
● బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్కౌటాల(సిర్పూర్): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాలలోని జగదాంబ గార్డెన్లో బుధవారం కౌటాల, సిర్పూర్(టి) మండలాల బీఆర్ఎస్ బూత్స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఐదేళ్లలో బీజేపీ ఎంపీ జిల్లాకు ఏం అభివృద్ధి చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. మత రాజకీయాలు చేసే ఆ పార్టీకి ఓటు వేయవద్దన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల సభ్యత్వం లేని వారికి అభ్యర్థులుగా టికెట్ ఇచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను రద్దు చేస్తుందని ఆరోపించారు. ధైర్యం లేని వాళ్లు పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లిపోయారని, పార్టీలో ఉన్న కార్యకర్తలతోనే బీఆర్ఎస్ను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం బీఎస్పీ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువవా కప్పి ఆహ్వానించారు. బెజ్జూర్ జెడ్పీటీసీ పుష్పలత, మాజీ జెడ్పీటీసీ తిరుపతి, నాయకులు నక్క శంకర్, ఉమా మహేశ్, పత్రు, రవి, శంకర్, నాందేవ్, గో వింద్రావు, శంకరయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు. వారంటీ లేని హామీలతో మోసం పెంచికల్పేట్: వారంటీ లేని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క రైతులకు పెట్టుబడి సాయం, రుణమాఫీ అమలు చేయడంలో విఫలమైందన్నారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ కేవలం మతం పేరుతో ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో నాయకులు బిట్టి శ్రీనివాస్, తిరుపతి, కృష్ణ, శంకర్గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
● టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ● జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశంఆసిఫాబాద్అర్బన్: దేశంలో రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్లో బుధవారం టీజేఎస్, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. పార్లమెంట్ ఎన్నికలు కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపై నిలిపిందన్నారు. ప్రస్తుతం దేశంలో అసమానతలు పెరిగాయన్నారు. పదేళ్ల క్రితం రూ.లక్ష కోట్ల ఆస్తితో ఉన్న అదానీ ప్రస్తుతం రూ.ఏడున్నర లక్షల కోట్లకు పెరిగితే.. రైతు పరిస్థితి మాత్రం అలాగే ఉందని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవస్థను బతికించేందుకు ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయం దండగా అని, పట్టణాల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేయడం నయం పరిస్థితికి దిగజార్చి నట్లు విమర్శించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమికి ఓటు వేయాల్సిన అవసరం ఉందని వక్తలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, టీజేఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాబన్న, నాయకులు రూప్నార్ రమేశ్, దినకర్, కార్తీక్, చిరంజీవి, మాలశ్రీ, సోయం చిన్నయ్య, ధర్మూ, చాంద్పాషా, శ్యాం, ఆసిఫ్, అసద్, వసంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్దెర హామీలతో మోసం చేస్తున్న కాంగ్రెస్’
రెబ్బెన(ఆసిఫాబాద్): ఆరు గ్యారంటీలను అ మలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దెర హామీలతో ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. మండలంలోని జక్కులపెల్లి, కొమురవెళ్లి, నారాయణపూర్, రాజారాం, నంబాల, పులికుంట, రోళ్లపాడు, తక్కళ్లపల్లి గ్రామాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయకుండా దేవుళ్ల మీద ఒట్లు వేస్తోందని, కేంద్రంలోని బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందన్నారు. ఇలాంటి పార్టీలు ప్రజలకు ఏం న్యాయం చేస్తాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాక అప్పుడు రైతుభరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్కుమార్, వైస్ చైర్మన్ మహేశ్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వనజ, నాయకులు రాజేశ్వర్రావు, అహల్యాదేవి, అన్నపూర్ణ అరుణ, ఆనంద్ పాల్గొన్నారు. ఓటు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ వేడి స్వల్పంగా తగ్గుతుంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. జోరుగా హోం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆసిఫాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు హోం ఓటింగ్ను వినియోగించుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 127 మంది హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా బుధవారం నాటికి 122 మంది వినియోగించుకున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 29 మందికి 29 మంది ఓటు వేశారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు బుధవారంతో ముగిసినప్పటికీ ఈ నెల 10 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం 2,420 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 2,039 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 1,415 మంది దరఖాస్తు చేసుకోగా 1,246 మంది ఓటు వేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పోస్టల్ బ్యాలెట్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జాతీయ చేనేత అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం ఆసిఫాబాద్అర్బన్: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద సంత్ కబీర్ జాతీయ చేనేత అవార్డు కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి దుస్తుల ఎగుమతి శాఖ సంచాలకులు అలుగు వర్షిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత డిజైన్ డెవలప్మెంట్, ఎన్హెచ్డీపీ కింద చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ రంగంలో గుర్తింపు కోసం కార్మికులు, డిజైనర్లు, విక్రయదారుల నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నేత విభాగంలో మూడంచెల ఎంపిక ప్రక్రియ(జోనల్, హెడ్క్వార్టర్, జాతీయ స్థాయి ఎంపిక కమిటీ) ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ, మార్గదర్శకాలు, ఇతర వివరాల కోసం https://handlooms. nic.in ను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా హైదరాబాద్లోని వీ వర్ సర్వీస్ సెంటర్లో సమర్పించాలని కోరారు. -
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
దహెగాం(సిర్పూర్): వానాకాలం సీజన్ సమీపిస్తున్నందున ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంతోపాటు ఐనం, బీబ్రా, ఒడ్డుగూడ, చినరాస్పెల్లి గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను బుధవారం తనిఖీ చేశారు. యూరియా స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే యూరియా అధిక ధరలకు విక్రయించినా లైసెన్సు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం లగ్గాం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తేమ శాతం 17 కంటే మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఏవో వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. -
దూకుడుగా ప్రచారం!
● ఇంటింటికీ తిరుగుతూ.. పని ప్రదేశాల్లో ఓటర్లను కలుస్తూ ● అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్న ప్రధాన పార్టీల నేతలు ● ఆన్లైన్ ప్రచారంతో హోరెత్తిస్తున్న వైనంఆసిఫాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు దూకుడు పెంచాయి. ఆ పార్టీల ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుండగా.. ఎలాగైనా ఎంపీ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రస్ యత్నిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆసిఫాబాద్లో జనజాతర పేరిట నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన సీఎం రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా ఇన్చార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మరో వైపు కాగజ్నగర్లోని ఎస్పీఎం మైదానంలో నిర్వహించిన సభకు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరై ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చేరికలతో కాంగ్రెస్లో జోష్ జిల్లాకు చెందిన వరుసగా కాంగ్రెస్లో చేరుతుండటంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలవకున్నా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్సీ పురాణం సత్తీశ్తోపాటు మాజీ ఏఎంసీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, మైనార్టీ నాయకులు అబ్దుల్లా, గోపాల్నాయక్ తదితరులు హస్తం గూటికి చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు ఆధ్వర్యంలో వీరు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్లో చేరడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఉపాధిహామీ పని ప్రదేశాల్లోనూ ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గడపగడపకూ బీజేపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్కు దీటుగా బీజేపీ క్షేత్రస్థాయిలో వేగం పెంచింది. గతంలో జిల్లాలో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్ సోదరులతోపాటు వారి అనుచరుల చేరికతో ఆ పార్టీకి బలం పెరిగింది. గతంలో ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించిన అరిగెల సోదరులు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. మరోవైపు ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేసింది. అక్కడ పాల్వాయి హరీశ్బాబు పార్టీ విస్తరణకు కీలకంగా మారారు. ఇటీవల కాగజ్నగర్ సభలోనూ స్థానిక అంశాలను ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సక్కు గెలుపునకు పావులు జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండె విఠల్ బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు ఎత్తుకున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపునకు పావులు కదుపుతున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ బలమైన క్యాడర్ ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో కోవ లక్ష్మి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్న సక్కు గెలుపు కోసం తీవ్రంగా పాటుపడుతున్నారు. అయితే ఇటీవల కీలక నేతలు పార్టీని వీడటం మైనస్గా మారింది. ప్రచారంలో భాగంగా జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప పార్టీని వీడటంతో క్యాడర్ను ముందుకు నడిపించే బాధ్యతను ఎమ్మెల్సీ దండె విఠల్ తీసుకున్నారు. పెంచికల్పేట్, కౌటాల, దహెగాం, బెజ్జూర్ మండలాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఆత్రం సక్కుతో కలిసి వరుస సభలు నిర్వహిస్తున్నారు. -
గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు
ఆసిఫాబాద్రూరల్/రెబ్బెన: ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి, బూర్గుడ, కొమ్ముగూడ, గొల్లగూడ, ఈదులవాడ, సింగరపేట్, చిర్రకుంట, ఖైర్గాం, రెబ్బెన మండలంలోని నంబాల, చిలుకమర్రిగూడ, రాజారాం, కొమురవెళ్లి, కిష్టాపూర్, ఎడవెల్లి, కై రిగాం, నక్కలగూడ, పుంజుమేరగూడ, నంబాల గ్రామాల్లో అకాల వర్షం వరి పంటకు నష్టం చేకూరింది. రెబ్బెన మండలంలో సుమారు 50 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే పులికుంట, నంబాల, ధర్మారం, గోలేటి ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మరో 15 రోజుల్లో వరి కోతలు పూర్తవుతాయని అనుకున్న సమయంలో పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టంపై సర్వే చేపట్టి ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మండలం యూనిట్గా కాకుండా గ్రామాన్ని యూనిట్గా తీసుకుని సర్వే చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
బీజేపీ బైక్ ర్యాలీ
ఆసిఫాబాద్రూరల్: ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్కు మద్దతుగా బుధవారం ఆసిఫాబాద్ మండలం బూర్గుడ నుంచి జిల్లా కేంద్రం వరకు బీజేపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధానిగా మోదీకి మరో అవకాశం ఇవ్వాలని జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఎంపీపీ మల్లికార్జున్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు విశాల్, నాయకులు శ్రీను, నగేశ్, శ్రీధర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యూస్రీల్
‘పది’ తర్వాత విస్తృత అవకాశాలు కౌటాల/కాగజ్నగర్రూరల్: పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులకు విస్తృతమైన విద్యావకాశాలు ఉంటాయని కాగజ్నగర్ జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ చక్రపాణి అన్నారు. కాగజ్నగర్లోని ఉచిత పాలి టెక్నిక్ కోచింగ్ సెంటర్ను బుధవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ అవకాశాలు కల్పిస్తుందన్నారు. పాలిటెక్నిక్తో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా నిలవాలని సూచించారు. కోఆర్డినేటర్ కటుకం మధుకర్, మామిడాల శ్రీశైలం, శ్యాంసుందర్, కమలాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
● జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతిపెంచికల్పేట్: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హ క్కుల జోలికొస్తే ఊరుకునేది లేదని జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆదివాసీ, దళిత సంఘాల నా యకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం, గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర భుత్వాలు ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయన్నారు. ఆదివా సీల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఐటీడీఏలను నిర్వీర్యం చేయడంతో పాటు ఆదివాసీలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కున్నాయని ఆరోపించారు. ఆదివాసీలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు వారిని అడవుల నుంచి తరిమికొట్టేలా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్ పక్షాన నిలబడి ఆదివాసీ సమాజం, రిజర్వేషన్లపైన వ్యాఖ్య లు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలని వినతి పత్రం అందజేశారు. లహాన్రాజ్, కడాల నారా యణ, రాంటెంకి సురేష్, పెద్దు సుధాకర్, సిడాం తిరుపతి, భక్తు రాంచందర్, భుజంగరావు, శంకర్, అశోక్, రాజన్న, భాస్కర్ పాల్గొన్నారు. -
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బాల్య వివాహాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు సామాజిక సమస్య అని, సమాజ చైతన్యంతోనే నిర్మూలించవచ్చన్నారు. జిల్లాలో అనుసంబంధ శాఖలన్నీ సమన్వయంతో పని చేయడం ద్వారా బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి బాల్య వివాహల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో తుకారాం, బాలల సంక్షేమ సమితి చైర్మన్ వెంకటస్వామి, డీఈవో అశోక్, డీపీవో సురేష్బాబు, బాలల సంక్షేమ సమితి సభ్యులు దశరథ్, సమీర్ ఉల్లాఖాన్, ఐకేపీ ఏపీడీ రామకృష్ణ, కార్మికశాఖ కమిషనర్ మాజర్ ఉన్నిసాభేగం, డీసీపీవో మహేష్, బాలరక్ష భవన్ సిబ్బంది, జిల్లా మహిళా సాధికారిత సిబ్బంది, సఖీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
కౌటాల: బీఆర్ఎస్తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 14 ఏళ్ల పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్క శంకర్, నాగపూరే బండు, చారి గోవింద్రావు, మంగేశ్, శంకర్, నాందేవ్, తదితరులు పాల్గొన్నారు. -
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఆదిలాబాద్ జిల్లాలో..● అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ బీఆర్ఎస్ అభ్యర్థి రామన్నపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయనే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని అధిష్టానం ఆలోచించినప్పటికీ చేరికల విషయంలో కాంగ్రెస్ అసమ్మతి నాయకులు సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలకు భంగపాటు ఎదురైంది. అయినప్పటికీ తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం చేస్తామని వారు ప్రకటించారు. ఇక బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి మాదిరి ఓట్లను గడించాలని ఎమ్మెల్యే శంకర్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే. ● బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై గెలుపొందారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనే నియోజకవర్గ ఇన్చార్జీగా కొనసాగుతున్నారు. కాగా బీఆర్ఎస్కు చెందిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డాక్టర్ వన్నెల అశోక్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మంచి మెజార్టీ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో..● నిర్మల్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం మాజీ మంత్రి ఐకే రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా హస్తం గూటికి చేరారు. కాగా బీజేపీలోకి జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్ దంపతులు చేరారు. బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రభావం ఈ నియోజకవర్గంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దీంతో ఆయన ప్రచారంలో వేగం పెంచారు. ● ముధోల్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ ముథోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్కు ప్రతిష్టాత్మకంగా మారింది. తన ప్రత్యర్థులంతా కాంగ్రెస్లో కలవడంతో ఇప్పుడు ఆయన ఈ ఎన్నికలను సవాలుగా తీసుకోవాల్సిన పరిస్థితి. ● ఖానాపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు బీఆర్ఎస్ అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్పై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పైడిపల్లి రవీందర్రావు ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. కాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఏకై క నియోజకవర్గం ఇదే. దీంతో ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మంచి మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యే బొజ్జుపై ఉంది.సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ గెలుపు ఒక లెక్క అయితే.. తమ నియోజకవర్గంలో అభ్యర్థికి అత్యధిక ఓట్లు సాధించడం మరో లెక్క. ఎమ్మెల్యేలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఆదరించినట్టే ఇప్పుడు తమ పార్టీకి వెన్నంటి నిలుస్తారా.. లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆలోచన చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో చేరికలు పెరిగాయి. ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్నాయక్పై గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా మార్పులు చేర్పులు జరగలేదు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సక్కుకు ఇక్కడినుంచి మంచి మెజార్టీ కల్పించిన పక్షంలో అది ఉపయుక్తంగా ఉంటుందనేది పార్టీ భావన. ఈ నేపథ్యంలో కోవ లక్ష్మి మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిర్పూర్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోనప్ప కాంగ్రెస్ లో చేరగా ఇక్కడ ఆ పార్టీ పటిష్టమైంది. బీఆర్ఎస్ మరో నేత అరిగెల నాగేశ్వర్రావు కూడా హస్తం గూటికి చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే హరీష్బాబు పార్టీ అభ్యర్థి నగేశ్కు మంచి మెజార్టీ సాధించేందుకు గట్టిగా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
గర్భిణులూ జెర జాగ్రత్త..
● చల్లని ప్రదేశాల్లోనే ఉండాలి ● ఎండ తీవ్రతతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ● ఆరోగ్య సంరక్షణ, శరీర ఉష్ణోగ్రతలపై అవగాహన ఉండాలి ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో గైనిక్ వైద్యనిపుణురాలు దీపిక ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. సాధారణ వ్యక్తులే ఎండలను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్య సంరక్షణతో పాటు శరీర ఉష్ణోగ్రతలపై అవగాహన ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్కు గురవుతారు. కాబోయే తల్లులు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఈ సమయంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గైనిక్ వైద్యనిపుణులు డాక్టర్ దీపిక ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. సాక్షి: వేసవిలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైద్యురాలు: శరీరం నిర్దలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. కొబ్బరిబోండాలు, నిమ్మరసంలో ఉప్పు, చక్కెర వేసుకుని తాగాలి. ఉమ్మనీరు తగ్గిపోయే వరకు సమస్యలు ఎదురు కాకుండా ఎక్కువ మోతాదులో నీరు తాగుతుండాలి. బయటకు వెళ్లడం మంచిది కాదు. ఎండ తీవ్రతతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సాక్షి: ఎలాంటి ఆహారం తీసుకోవాలి?వైద్యురాలు: కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన సలాడ్లు, పండ్లు తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ శరీరాన్ని బలపరుస్తాయి. కీరదోస, పుచ్చకాయలు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఫుడ్స్, ఐరన్ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి. కూల్డ్రింక్స్, బయటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మసాలా దినుసులు, నూనె పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. సాక్షి: ససన్స్టోక్ అంటే ఏమిటి?వైద్యురాలు: సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. అంతకంటే కొంచెం పెరిగినా జ్వరం వచ్చినట్లు. ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్ హీట్ పెరిగితే సన్స్ట్రోక్ (వడదెబ్బ) తగిలినట్లు లెక్క. గర్భిణులు, బాలింతలు, పిల్లలు వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించాలి. సాక్షి: ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిది?వైద్యురాలు: తెలుపు లేదా పాస్టెల్ షేడ్స్లో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. గర్భధారణ సమయంలో బిగుతుగా ఉండే బట్టలు ధరించడం వలన చర్మంపై ఎక్కువ చెమట, తేమను కలిగిస్తుంది. శరీరానికి మరింత వేడి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సమయంలో శరీరానికి సరిపోయే కాటన్ దుస్తులే ధరించాలి. సాక్షి: బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?వైద్యురాలు: గర్భిణులు, బాలింతలు చల్లని ప్రదేశంలోనే ఉండాలి. ఫ్యాన్ తక్కువ వేగంతో తిరిగేలా చర్యలు తీసుకోవాలి. వేగం అధికమైతే వేడి గాలి మరింత తగిలి పసి బిడ్డలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. పుట్టిన పిల్లలు ఎండ తీవ్రతకు ఏడిస్తే తల్లి పాలనే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి ఆహారం ఇవ్వకూడదు. సాక్షి: రక్తహీనత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?వైద్యురాలు: గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు ఆకుకూరలతో పాటు పోషక విలువలు ఉండే కూరగాయలను తీసుకోవాలి. దీంతో ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకోవడంతో పాటు పాప కూడా ఆరోగ్యవంతంగా జన్మిస్తుంది. -
వడగండ్ల వాన
కన్నుమూస్తివా బసవా.. కాడి మోసేదెవరురా ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/కౌటాల/పెంచికల్పేట్/దహెగాం/చింతలమానెపల్లి/రెబ్బెన: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్నగర్, కెరమెరి, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్, లింగాపూర్తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలు ఎట్టకేలకు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్షపు నీటితో డ్రైయినేజీలు నిండిపోవడంతో రోడ్లపై నీరు ప్రవహించింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన టేలాలు, దుకాణాల సముదాయాల్లో వర్షపు నీరు చొరబడడంతో ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. రెబ్బెన మండలం కై రిగూడ పంచాయతీ పరిధిలోని గొల్లగూడలో విద్యుత్ స్తంభంతో పాటు మినీ ట్రాన్స్ఫార్మర్ కిందపడి దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో రైతులు సాగు చేసుకున్న మొక్కజొన్న, జొన్న, వరిపంటలు నేలవాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కాపాడుకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ● పిడుగు పాటుకు ఎద్దు మృతి ● కన్నీటి పర్యంతమైన రైతు కుటుంబం కౌటాల: ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న వేళ కాడెద్దు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అలుపెరగకుండా అరక నడిచే తమ బసవడు అనుకోని ఘటనతో బలికావడంతో ‘కన్నుమూస్తివా బసవా.. కాడి మోసేదెవరురా’ అంటూ ఆ రైతు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం కౌటాల మండలంలోని నాగేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మోర్లె దస్రు గతేడాది రూ.1.20 లక్షలు అప్పుచేసి రెండు ఎద్దులు కొనుగోలు చేశాడు. మంగళవారం ఉదయమే గ్రామ శివారులో మేతకు వదిలాడు. ఎద్దులు మేత మేస్తుండగా మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ఓ ఎద్దుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఒకే ఎద్దుతో వ్యవసాయం చేసేది ఎలా అని రైతు కుటుంబం ఆవేదన చెందుతోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. నేలకొరిగిన పంటలు స్తంభించిన జనజీవనం -
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీ య పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రె కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీ లోకేశ్వర్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ సిగ్మెంట్లలో జరుగనున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, పొరపాట్లు లేకుండా ప్రశాంతం వాతావరణంలో పోలింగ్ జరిగేలా పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు సహకరించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు హోం ఓ టింగ్ ద్వారా అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇందుకు 150 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 151 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఫ్యాన్లు, ర్యాంపులు, మూత్రశాలల ఏర్పాట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 6 వరకు 1,934 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 4,56,309 మంది ఓటర్లకు గానూ ఇప్పటి వరకు 4,24,356 మందికి బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటరు స్లిప్పులు అందించామన్నారు. నియోజకవర్గాల వారిగా మహిళలకు 5, దివ్యాంగులకు 1, యువత కోసం 1, మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల నాయబ్ తహసీల్దార్ జితేందర్, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రె -
న్యూస్రీల్
నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఆసిఫాబాద్అర్బన్: ప్రజాస్వామ్య పరిరక్షణకు నేడు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ జనసమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి బాబన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. సమావేశానికి ముఖ్య అతిథిగా టీజేఎ స్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి ప్ర జాస్వామికవాదులు, ప్రజా సంఘాల నేతలు, అభ్యుదయవాదులు అధికసంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని కోరారు. ‘బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం’ ఆసిఫాబాద్అర్బన్: బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రేగుంట మహేష్ అన్నారు. మంగళవారం మండలంలోని బాబాపూర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ఎన్నిల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగానికి రక్షణ కవచం నరేంద్రమోదీ అని, రిజర్వేషన్లు కాపాడుతున్న పార్టీ బీజేపీ అని అన్నారు. మాదిగలకు వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తున్న రేవంత్రెడ్డికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఇరిగినాల సురేష్, ఇగురపు శ్రీకాంత్, సిద్దార్థ, లింగయ్య, లక్ష్మి, కమల, పోషక్క పాల్గొన్నారు. ‘అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా’జన్నారం: దేశాభివృద్ధి, నరేంద్రమోదీని మూ డోసారి ప్రధాని చేయడం కోసం ఆదరించి త నను గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని ఆదిలాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి గెడం నగేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాథోద్ రమేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. పొనకల్ వారసంతలో ప్రచారం చేసి ప్ర జలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మా ట్లాడుతూ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఓటర్ల ను కలిసి బీజేపీ ఓట్లు పడేలా కృషి చేయాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు పూర్తయ్యే వరకు కష్టపడాలని కోరారు. మధుసూదన్రావు, శంకరయ్య పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలి ఆసిఫాబాద్: లోకసభ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉ ద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ వెంకటేశ్ దోత్రే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 3 నుండి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని, జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంతో పాటు కాగజ్నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలేటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం చివరి రోజు కావడంతో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. -
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు మంచిర్యాలటౌన్: శ్రీరాంపూర్లోని సాందీపని హైస్కూల్లో 2004–05 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివిన విద్యార్థులు ఆదివారం మంచిర్యాలలోని ఓ ఫంక్షన్హాల్లో కలుసుకున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్మశాంతికి మౌనం పాటించారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పి తమ ఉన్నతికి కారణమైన గురువులను సన్మానించారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా గడిపారు.రామకృష్ణాపూర్: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో 2005–06 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆదివారం గద్దెరాగిడి భీమా గార్డెన్స్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ చిన్ననాటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. -
నిప్పుల కొలిమి..
పాటించాల్సిన జాగ్రత్తలు ● ఉదయం 9 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే పిల్లలను ఆడుకునేందుకు బయటకు వెళ్లనివ్వాలి. ● వేసవిలో కాటన్ దుస్తులు ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. ● వడదెబ్బకు గురైతే తలనొప్పి, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అత్యవసరం అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ● ఎండలో తిరిగితే ముక్కు నుంచి రక్తం కారుతుంది. ● వేడి వల్ల చెమట శరీరం నుంచి వెల్లడంతో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలెవల్స్ తగ్గుతాయి. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, ఎలక్ట్రోపౌడర్ లేదా ఉప్పు, చక్కర కలిపిన నీటిని బాగా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ● వేసవిలో నిల్వ పదార్థాలను తినకపోవడమే మంచిది. ● అతిగా వేడి ఉన్న సమయంలో వాకింగ్, వ్యాయామం చేయక పోవడం మంచిది. ● ఏసీలో ఉండి నేరుగా ఎండలోకి వెళ్లడం, ఎండ నుంచి నేరుగా ఏసీలోకి వెళ్లడం చేయవద్దు. ● మాంసాహారం, జంక్ఫుడ్, ఫ్రై చేసిన కూరలు, కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలి. షుగర్, బీపీ ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిర్యాలఅగ్రికల్చర్:జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. నిప్పుల వాన కురిపిస్తున్నాడు. దీంతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోహిణి కార్తెకు ముందే రోళ్లు పగిలేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవుతుండడంతో జనం పిట్టల్లా రాలుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ముగ్గురు వడదెబ్బతో మృతి చెందారు. గత నెల 28న జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన మేడిశెట్టి మహేష్, 29న భీమిని మండలం చిన్నగుడిపేటకు చెందిన ఉపాధి కూలీ బాల నాగయ్య, ఈ నెల 1న జిల్లా కేంద్రంలో వృద్ధుడు బదావతి హటియా వడదెబ్బతో మృతి చెందారు. రెడ్ అలర్ట్ 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలతో జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించారు. అన్ని మండలాల్లో 45 డిగ్రీలకు చేరుకున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత ప్రమాదకరమని, ఇప్పడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వారం రోజుల్లో ముగ్గురు మృతి చెందగా మరో 30 మంది వరకు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు. ప్రయాణాలు చేసేటప్పుడు... ● వాహనాలపై వెళ్లాల్సి వస్తే తల, ముక్కు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్ లేదా కర్చీఫ్ కట్టుకోవాలి. కళ్లకు చలువ అద్దాలు పెట్టుకోవాలి. గొడుగు, టోపి వెంట తీసుకెళ్తే మేలు. ● ఎండకు తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తాగవద్దు. ● త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ● తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటిని తాగాలి. ● వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. ● నుదుటిపై తడిగుడ్డ వేసి తుడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. ● గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి. ● నీరు ఎక్కువగా తాగించాలి. ● ముఖ్యంగా చికెన్, మటన్, బిర్యానీ, ఆయిల్ ఫుడ్, మసాల, ఫ్రై వంటివి తీసుకోరాదు. వడదెబ్బ తగిలే ముందు... ● వడదెబ్బ తగిలే ముందు వ్యక్తి శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతాం. అందులో ముఖ్యమైనవి. ● అధికంగా చెమటపట్టి కాళ్లు, చేతులు వణుకుతాయి. ● కళ్లు మసకబారడం, కండరాళ్లు నొప్పి రావడం జరుగుతుంది. పారిశ్రామిక జిల్లాపై భానుడి నిప్పుల వాన 47 డిగ్రీలకు వరకు ఉష్ణోగ్రతల నమోదు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఎండకు తోడు వడగాలులు వారంలో వడదెబ్బతో ముగ్గురు మృతి జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు లక్షణాలు.. మనిషిలో నీటి శాతం, శరీరంలోని లవణాల సంఖ్య తగ్గిపోయి గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ప్రధానంగా 60 ఏళ్లు దాటిన వారు దీని బారిన పడుతారు. తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పి ఉంటుంది. చర్మం పొడిబారడంతో నీరసంగా ఉంటుంది. పసుపు పచ్చరంగులో చిక్కటి మూత్రం రావడంతో పాటు మంటగా అనిపించడం సొమ్మసిల్లి పడిపోతారు. మాటలు తడబడుతాయి. -
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య శ్రీరాంపూర్: సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్లో యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఆదాయ పన్ను మాఫీకి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇంకా ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనే హామీ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు తాము మద్దతిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, కార్మికులు కాంగ్రెస్ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, యూనియన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, రేగుంట చంద్రశేఖర్, మోత్కూరు కొమురయ్య, జోగుల మల్లయ్య, చంద్రమోహన్, అప్రోజ్ ఖాన్, మారుపల్లి సారయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
● టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాతమంచిర్యాల: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ భవన్లో శ్రీప్రమాదంలో ప్రజాస్వామ్యం–పార్లమెంటు ఎన్నికల్లో మన కర్తవ్యంశ్రీఅనే అంశపై ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా నిరంతర దాడి చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదమేనన్నారు. కులం, మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతుందని, మనమంతా ఐక్యంగా ఉండి బీజేపీ చర్యలను తిప్పికొట్టాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించినట్లే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాబన్న, నాయకులు రాంచంద్రారెడ్డి, బచ్చలి ప్రవీ ణ్కుమార్, గోనెల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు మునీర్, కాంగ్రెస్ నాయకులు కే.రవి, శ్యాంసుందర్ రెడ్డి, జైపాల్సింగ్, దేవి సత్యం పాల్గొన్నారు. -
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్పూల్కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్లక్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్పూల్లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్కుమార్ -
ప్రశాంతంగా నీట్
● పరీక్షకు 1354 మంది హాజరు.. ● 30 మంది గైర్హాజరు మంచిర్యాలఅర్బన్:వైద్య కళాశాల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరిగిన పరీక్ష కోసం జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,384 మంది విద్యార్థులకు 1,354 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. ప్రతీ సెంటర్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. 1: 30 తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. పిల్లల వెంట వచ్చిన తల్లిదండ్రులు కేంద్రాల వద్ద ఎండవేడిమి తట్టుకోలేక కనపడిన చెట్టునీడన సేదతీరారు. నీట్ ప్రశాంతంగా ముగిసిందని సిటీ కో–ఆర్డినేటర్ రేషమ్మ.ఏఎస్ తెలిపారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- నేను అతడికి బిగ్ ఫ్యాన్.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement