హైర్‌ బస్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

హైర్‌ బస్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Published Tue, Apr 23 2024 8:45 AM

మాట్లాడుతున్న ఎస్‌.విలాస్‌
 - Sakshi

ఎదులాపురం: హైర్‌ బస్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని యూనియన్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన హైర్‌ బస్‌ డ్రైవర్స్‌ అండ్‌ క్లీనర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సమస్యలపై పోరాడిన పలువురిని విధుల్లోకి తీసుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఇందులో యూనియన్‌ నాయకులు సిర్ర దేవేందర్‌, సాయికుమార్‌, మంజూర్‌, ప్రీతంరెడ్డి, సతీష్‌, అబీబ్‌, అబ్బు, నర్సింగ్‌, నారాయణ, సతీశ్‌, గంగాధర్‌, అనిల్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement