సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యానికి మరింత భరోసానిచ్చేలా సీఎం జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ, విశాఖపట్నంలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ప్రభుత్వానికి పంపింది. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్లో పిల్లల కోసం నిలోఫర్ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఆ ఆస్పత్రి సేవలను కోల్పోయింది. దీంతో పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి.
అయితే గత టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పిల్లలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించింది. ఈ ఆస్పత్రి ప్రస్తుతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. అంతేకాకుండా అలిపిరి వద్ద రూ.450 కోట్లతో పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని టీటీడీ సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నారు.
ఆ తరహాలోనే విశాఖ, విజయవాడల్లోనూ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో 500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి ఏర్పాటుకు డీఎంఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో చోట ఆస్పత్రి భవనాల నిర్మాణం, ఇతర సివిల్ పనుల కోసం రూ.180 కోట్ల మేర ఖర్చు అవనున్నట్టు ఏపీఎంఎస్ఐడీసీ అంచనా వేసింది. అధునాతన వైద్య పరికరాల కోసం ఇంకా అదనంగా ఖర్చు పెట్టనున్నారు. గుండె, కిడ్నీ, మెదడు, కాలెయ సంబంధిత జబ్బులతో పాటు, చిన్న పిల్లల్లో క్యాన్సర్కు, ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందించేలా 17 స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలతో ఈ రెండు ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి.
సీఎం జగన్ ఆదేశాల మేరకు..
ప్రభుత్వ రంగంలోనే చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందుబాటులోకి తేవాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో విశాఖ, విజయవాడల్లో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రజలకు మేలు చేకూరుతుంది. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాం.
– డాక్టర్ నరసింహం, డీఎంఈ
చిన్నారుల ఆరోగ్యానికి రక్ష
Published Mon, Nov 6 2023 5:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement