-
కూటమితో కాంగ్రెస్ కుమ్మక్కు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ అయింది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిల నియామకం పొందినప్పటినుంచి అందరికీ అనుమానం ఉండేది. దాన్ని రుజువు చేస్తూ కాంగ్రెస్ అడుగులు పడుతున్నాయి. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చడమే ఏకైక ఎజెండాగా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. సంప్రదాయ ఓట్లకు గండి కొట్టాలనే ఎత్తుగడను అవలంబిస్తోంది. అందులో భాగంగా ముస్లిం మైనారిటీల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ కూడా సహకరిస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రాహుల్గాంధీ బహిరంగసభ టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి ఎస్టేట్స్లో నిర్వహించడం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. 👉 జిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పారీ్టలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తున్నారు. అనేక ఎన్నికలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యరి్థగా ఎస్బీ అంజద్బాషా విజయం సాధించారు. ఈమారు విజయాన్ని అడ్డుకోవాలని టీడీపీ విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకు కాంగ్రెస్ సహకారం తీసుకుంది. ఓవైపు టీడీపీ విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపింది. గణనీయమైన మద్దతుగా ఉన్న ముస్లిం మైనార్టీ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఎత్తుగడలు వేశారు. వైఎస్సార్సీపీ నేత అఫ్జల్ఖాన్ను రాత్రికి రాత్రే కాంగ్రెస్పార్టీ అభ్యరి్థగా ఎంపిక చేశారు. ముస్లిం మైనారీ్టల్లో పఠాన్ సామాజిక వర్గీయుల మద్దతు దక్కించుకోవాలనే దురుద్దేశం అందులో దాగి ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ముస్లిం మైనార్టీ ఓటర్లలో చీలికలు తీసుకువస్తే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించారు. వెనుకబాటు తనంలో ఉన్న ముస్లింల జీవితాల్లో సామాజిక మార్పు వచ్చింది. తద్వారా వైఎస్ కుటుంబానికి ముస్లింలు అండగా ఉంటున్నారు. వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆ వర్గం ఓట్లలో చీలికలు తీసుకువచ్చేందుకు టీడీపీ ప్రణాళికలు అమలు చేసింది. తద్వారా టీడీపీ అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే చర్యలకు పూనుకుంది. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాలలో ఇదే పంథాను కాంగ్రెస్ ఎంచుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డైరెక్షన్లో కాంగ్రెస్పార్టీ యాక్షన్ చేస్తోంది. రహస్య ఎజెండా మేరకు ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ వైఎస్సార్సీపీ సంప్రదాయ ఓట్లకు గండి కొట్టే ఎత్తుగడలు వేస్తున్నారని విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు.టీడీపీ–కాంగ్రెస్ మధ్య పరస్పర సహకారం కాంగ్రెస్ పారీ్టకి తెలుగుదేశం పార్టీ సైతం బాహాటంగా సహకరిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అసంబద్ధ వ్యాఖ్యలు చేయవద్దని, విచారణ కోర్టులో ఉన్న నేపథ్యంలో ఇష్టానుసారం మాట్లాడవద్దని జిల్లా కోర్టు భావించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను వెకేట్ చేయాలంటూ షరి్మల, సునీతలతోపాటు పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి కూడా హైకోర్టును ఆశ్రయించారు. తదపరి జిల్లా కోర్టుకు తప్పుడు ఫిర్యాదు చేయడంతో ముగ్గురికి రూ.10వేలు చొప్పున రూ.30వేలు జరిమానా కూడా జిల్లా కోర్టు విధించింది. అది అటుంచితే ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు అనేకం ఉన్నా, కమలాపురం తెలుగుదేశం పార్టీ నేత పుత్తా నరసింహారెడ్డి స్థలంలో రాహుల్గాంధీ బహిరంగ సభ నిర్వహించడం గమనార్హం. ఇడుపులపాయ సందర్శన ఎన్నికల ఎత్తుగడే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దివంగతులై దాదాపు 15ఏళ్లు కావస్తోంది. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్సార్ పాత్ర అప్పట్లో అత్యంత కీలకం. అలాంటి వ్యక్తి అర్థంతరంగా మృతి చెందితే, ఇడుపులపాయ ఘాట్కు సోనియాగాంధీ కుటుంబం రాలేదు. 15 సంవత్సరాల తర్వాత రాహుల్గాంధీ రావడం విశేషం. ఈ పర్యటన కేవలం ఎన్నికల ప్రచార ఎత్తుగడగా స్పష్టమవుతోంది. వైఎస్సార్ ఘాట్లో రాహుల్గాంధీ పట్టుమని 10 నిమిషాలున్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 600 మంది మృతి చెందారు. వారి మృతికి చిహ్నంగా ఘాట్లో స్థూపాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ స్థూపాన్ని కూడా సందర్శించేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
AP Elections 2024 Polling: పులివెందులకు సీఎం జగన్
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి స్వస్థలం పులివెందులకు చేరుకుంటారు. రేపు.. సోమవారం ఉదయం పులివెందుల భాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్ 90,543ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.క్లిక్ చేయండి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 -
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజంపేట: కొత్తగా అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి ముచ్చటగా మూడోసారి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజనకు కారకుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డి బీజేపీ అభ్యరి్థగా ఈయనపై పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి పీవీ మిథున్రెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన విజయావకాశాలు తదితర అంశాలపై ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. మీరు రాజంపేట స్థానం నుంచి ఎన్నోసారి పోటీ చేస్తున్నారు. మీ బలం ఏమిటి? మిధున్రెడ్డి : రాజంపేట నుంచి మూడోసారి పోటీ చేస్తున్నాను. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్కు అండగా ఉంటా. పిలిస్తే పలుకుతా..చెబితే చేస్తాను. రెండుసార్లు రాజంపేట లోక్సభ ప్రజలు ఆశీర్వదించారు. మూడోసారి ఆశీర్వదిస్తే లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తాను. ప్రజల అండదండలతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నాను. మీ ప్రత్యరి్థ, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డికి, మీకు ఉన్న తేడా ఏమిటి మిధున్రెడ్డి: నేను లోకల్ లీడర్, కిరణ్కుమార్రెడ్డి గెస్ట్ పొలిటిíÙయన్. వస్తాడు. పనిచేసుకుంటాడు. హైదరాబాదుకు వెళ్లిపోతాడు. ఇది లోక్సభ పరిధిలోని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ సూట్కేసుతో హైదరాబాదుకు పంపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. మీకున్న బలం ఏమిటి? ఏ విధంగా ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావిస్తున్నారు మిధున్రెడ్డి: నాకున్న బలం ప్రజలు. జగనన్న ఆశయాలతో ముందుకెళుతున్నాను. ఈ ఎన్నికల్లో ఓటర్లు సంక్షేమం, అభివృద్ధినే చూస్తారు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే. జగనన్న ఎన్నికల సభలకు జ నం బ్రహ్మరథం పట్టారు. అందుకే కూటమిలో ఓటమి గుబులు పట్టుకుంది. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏ విధంగా అభివృద్ధి చేశారు. వచ్చే టర్మ్లో ఏం చేయనున్నారు మిధున్రెడ్డి: రూ.2400 కోట్లతో వాటర్గ్రిడ్స్ పూర్తి చేశాము. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తున్నాము. కడప–రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాను. రాయచోటి, పుంగనూరు, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాము. అన్ని నియోజకవర్గాలలో ఆ ప్రాంత పరిస్ధితులను బట్టి అభివృద్ధి చేస్తున్నాం. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. తప్పకుండా దేవుడు, ప్రజల ఆశీస్సులతో నా సంకల్పం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేశారు మిధున్రెడ్డి: ప్రదానంగా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో నూతన రన్నింగ్రూం మంజూరుకు కృషి చేశాను. బడ్జెట్లో కూడా ప్రకటించారు. రైల్వే పూర్వవైభవం కోసం ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయాలని లోక్సభలో కూడా ప్రస్తావించాను. ఎప్పటికప్పుడు నందలూరు రైల్వే అభివృద్ధి కోసం రైల్వేమంత్రి, రైల్వేబోర్డుకు వినతులు ఇస్తూనే ఉన్నాము. ఎన్నడూ లేని విధంగా ముంబై–రేణిగుంట రైలుమార్గంలోని రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న రైల్వే ప్రాంతాల్లో గేట్ల సమస్య లేకుండా ఆర్యూబీ(రోడ్ అండర్ బ్రిడ్జి)ల మంజూరుకు కృషి చేశాము. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాజంపేట, పీలేరు రైల్వేస్టేషన్లను అమృత్లో ఎంపికకు కృషి చేశాను. అలాగే కరోనా ముందు ఏ వి«ధంగా హాలి్టంగ్ సౌకర్యం ఉండేదో అదే విధంగా ఉండేలా రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాను. జిల్లాకు సంబంధించిన అంశంపై చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేవేనా మిధున్రెడ్డి: చంద్రబాబు రాజంపేటకు వస్తే ఒక మాట..రాయచోటికి వెళితే మరొక మాట, మదనపల్లెలో ఉంటే ఇంకో మాట ఇలా జనం చెవిలో పువ్వులు పెడతారు. అవి సాధ్యం కావని ప్రజలకు తెలుసు. బాబు మాటలను నమ్మే పరిస్థితిలో రాజంపేట జనం లేరు. ఊసరవెల్లి రాజకీయాలకు రాజంపేట ప్రజలు చెల్లుచీటి పలుకుతారు. మేము వచ్చే టర్మ్లో అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయిస్తాము. 18వ మెడికల్ కాలేజి రాజంపేటలో ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. రాజంపేట వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యరి్ధగా విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి మిధున్రెడ్డి: కచ్చితంగా జగనన్న సంక్షేమం, అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బీసీల ఆశీర్వాదాలు నాకు పుçష్కలంగా ఉన్నాయి. ముస్లిం మైనారీ్టలకు సీఎం వైఎస్ జగన్ అంటే అభిమానం, ఆతీ్మయత ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం పేదల పక్షాన నిలుస్తుందని అన్నమయ్య, చిత్తూరు జిల్లా వాసులందరికి తెలుసు. ఏ అవసరం ఉన్నా..నేనున్నా అంటూ ముందుకొచ్చే కుటుంబం ఏది అంటే పెద్దిరెడ్డి కుటుంబమే. దైవబలం, ప్రజాబలంతో అఖండ విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. -
ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దాం..
ఈ మంచిని కొనసాగిద్దాం..మీ బిడ్డ ఐదేళ్ల పాలనలో కేలండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకాన్ని అందిస్తామో మీకు ముందుగానే చెప్పాడు. రైతుభరోసా, అమ్మఒడి, చేయూత.. ఇలా ఫలానా పథకాన్ని ఫలానా నెలలో ఇస్తామని చెప్పి ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లలో మీ అందరికీ మేలు చేశాడు. ప్రతి ఇంటికి మంచి చేశాడు.మన ఇంటికి జరుగుతున్న ఈ మంచిని పొరపాటున చంద్రబాబు ప్రలోభాలతో మోసపోయి పోగొట్టుకోవద్దని ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నా. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో మీరంతా చూశారు – సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: మీ జగన్కు మీరు వేసే ఓటు.. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. మీ అందరికీ మంచి చేస్తూ, సంతోషాలను పంచుతూ 130 సార్లు బటన్లు నొక్కి రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా మీ చేతికే అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గత ఐదేళ్లుగా చేసినమంచిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. నిర్ణయాత్మక ఎన్నికలివి..మరో 36గంటల్లో ఎన్నికల సమరం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. ఆయన్ను నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకి అర్థం ఇదే. గత 59 నెలలుగా మీ బిడ్డ ఎప్పుడూ చూడని విధంగా పాలనలో మార్పులు తెచ్చాడు. 130సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాడు. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి మంచి చేసిన ప్రభుత్వాలు ఉన్నాయా? 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా ఇచ్చాడు.నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే 1.35 లక్షల మంది మన సచివాలయాల్లోనే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి విశ్వసనీయతను చాటుకున్నాం. గడప గడపకూ మన మేనిఫెస్టోను పంపించి మీరే టిక్ పెట్టాలని అక్కచెల్లెమ్మలను కోరాం. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను మచ్చుకు కొన్ని గడగడా చెబుతా.విద్యా విప్లవాలు..నాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లతో పాటు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజుల చెల్లింపు, అంతర్జాతీయ యూనివర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్షిప్ లాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కచెల్లెమ్మలకు అండగా..అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వారి పేరిటే 31లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు, రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను గతంలో ఎప్పుడైనా చూశారా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా? వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, టెస్టులు చేసి మందులు కూడా ఇచ్చేలా ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాలను గతంలో చూశారా?గ్రామ స్వరాజ్యం..ఏ గ్రామాన్ని చూసినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు, ప్రతి 60 – 70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం మహిళా పోలీసులు, ఆపదలో ఆదుకునే దిశ యాప్ లాంటివి మీ బిడ్డ పాలనలో సాకారం చేశాడు. మళ్లీ ఇంటికే అన్నీ రావాలంటే..పేదల తలరాతలు మారాలంటే ఫ్యాను గుర్తుకే ఓటేయాలి. వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్లీ నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆసుపత్రులు మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి.2014 బాబు విఫల హామీలు» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ 3సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా?» ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో ఎవరికై నా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. »అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.దీవించండి..నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.కొల్లేరు మిగులు భూముల పంపిణీ..!కొల్లేరు సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను ఇచ్చిన మాట ప్రకారం జయమంగళ వెంకటరమణ అన్నను ఎమ్మెల్సీగా చేశా. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైంది. రిపోర్టు కూడా సిద్ధమైన వెంటనే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తాం. మీ బిడ్డే మీ దగ్గరకు వచ్చి ఆ పంపిణీ కార్యక్రమం చేస్తాడు. -
శిల్పా రవిని గెలిపించండి
బొమ్మలసత్రం: నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి శనివారం నంద్యాల వచ్చారు. ఆయనకు పట్టణ శివారులోని ఆటోనగర్ వద్ద అభిమానులు భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. నంద్యాలలోని శిల్పా రవి నివాసానికి చేరుకుని వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులకు చాలాసేపు అభివాదం చేశారు. శిల్పా రవి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. ‘శిల్పా రవి నాకు మంచి మిత్రుడు. ఇన్నేళ్ల మా ఇద్దరి స్నేహంలో నన్ను ఎన్నికల ప్రచారం కోసం రావాలని ఏనాడూ రవి కోరలేదు. నేనే శిల్పా రవి కోసం ఏమైనా చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. రవి మంచి మనసు, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యమే నన్ను ఇంత దూరం వచ్చేలా చేసింది. నా మనసుకు నచ్చిన స్నేహితులు ఏ ఫీల్డ్లో ఉన్నా వారి అభివృద్ధిని కోరుకుంటాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. శిల్పా రవి మంచి మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ శిల్పా రవికి ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను...’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి మాట్లాడుతూ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తనను గుర్తుంచుకుని అల్లు అర్జున్ ఇంతదూరం రావడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్, శిల్పా రవిపై కేసు నమోదు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని అల్లు అర్జున్, శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిలపై పోలీసులు కేసు నమోదుచేశారు. శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిని కలిసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి శనివారం నంద్యాలకు వచ్చారు. ఆయన వస్తున్నాడని తెలిసి ప్రజలు భారీ సంఖ్యలో ఎమ్యెల్యే శిల్పా రవి నివాసం వద్దకు తరలివచ్చారు. జనం గూమికూడేందుకు అనుమతి తీసుకోలేదని ఎమ్యెల్యే శిల్పా రవి, అల్లు అర్జున్పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి నంద్యాల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. -
ఢిల్లీ అండతో.. అడ్డుకుంటున్నారు: సీఎం జగన్
లాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్లపై ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మొన్ననే విశాఖలోని రుషికొండలో భూములు కొన్నాడు. దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్లిద్దరినీ అడుగుతున్నా. భూములు కొన్నప్పుడు మీకు ఒరిజనల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా? లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా? రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న 9 లక్షల మందికి మనం ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే.. జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని, వాళ్ల భూములను జగన్ కొట్టేస్తున్నాడంటూ దారుణంగా దుష్ప్రచారాలు చేస్తున్న వీళ్లంతా అసలు మనుషులేనా?– చిలకలూరిపేట, పిఠాపురం సభల్లో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వివిధ పథకాలతో నేరుగా లబ్ధి చేకూరుస్తూ మీ బిడ్డ బటన్లు నొక్కిన డబ్బులు అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు అందకుండా చంద్రబాబు కూటమి ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి దుర్మార్గంగా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రజల గొంతు నొక్కేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ప్రజలకు మంచి చేసేందుకు మీ బిడ్డ బటన్లు నొక్కుతూనే ఉన్నాడని, ఇప్పటికి 130 సార్లు బటన్లు నొక్కాడని గుర్తు చేశారు. అలాంటి రొటీన్గా జరుగుతున్న కార్యక్రమాన్ని 57 నెలలకే అడ్డుకుని గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ‘రెండు నెలల క్రితం వరకు నేరుగా ఇంటివద్దకే వచ్చి అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చేవారు. ఆ పెన్షన్ వల్ల ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందోనని కుట్రపూరితంగా వలంటీర్లను అవ్వాతాతల ఇంటికి వెళ్లకుండా అడ్డుకుని వారి ఉసురు పోసుకుంటున్నారు. ఏ ప్రభుత్వాన్నైనా 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటిది మన ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతు పట్టుకుని పిసికే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్ము అందకుండా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి అడ్డుకుంటున్నారు. ఈ డబ్బులు ఎన్నికలు అయిపోయాక ఇస్తారట! పోలింగ్ ముగిసిన మర్నాడు 14వ తారీఖున ఇస్తారట! ఇది కుట్ర కాదా? అయినా ఫర్వాలేదు. నాకు కావాల్సింది నా అక్కచెల్లెమ్మల మొహాల్లో సంతోషం. వారి పిల్లల చదువులకు మంచి జరగడం నాకు కావాలి. నాకు కావాల్సింది రైతన్నల మొహాల్లో సంతోషం. నాకు కావాల్సింది ఇదే! వాళ్లు నొక్కుతున్నది మీ బిడ్డ గొంతు కాదు.. నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లల గొంతులనే. జగన్ ఎలాంటివాడో నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు ఐదేళ్లుగా ఏటా చూస్తూనే ఉన్నారు. మీ బిడ్డ తప్పు చేయలేదు. మీ జగన్ మీ కోసం బటన్లు నొక్కాడు. ఇవి ఎన్నికల కోసం నొక్కిన బటన్లు కావు’ అని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని స్పష్టం చేశారు. పెత్తందార్లతో జరుగుతున్న ఈ యుద్ధంలో మీ జగన్ పేదల పక్షాల పోరాడుతున్నాడని గుర్తు చేశారు. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైందని, మీ బిడ్డ ప్రభుత్వం మళ్లీ రాగానే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్ సెంటర్, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ 59 నెలలుగా అందిన పథకాలు, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించేందుకు ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పైశాచిక ఆనందం..ఈ మధ్య అత్యంత హేయంగా జరుగుతున్న కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది. ఢిల్లీ నుంచి వాళ్లకున్న రికమండేషన్లు, అధికారంతో మొన్నటి వరకూ అవ్వాతాతలకు ఇంటికొచ్చి ఇచ్చిన పెన్షన్లను దారుణంగా ఆపించారు. ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అగచాట్లు పడుతుంటే చంద్రబాబుకు, ఆయన కూటమికి ఎంత శాడిస్టిక్ ప్లెజర్ (పైశాచిక ఆనందం)? ఈ కుట్రలు ఇంకా కొనసాగిస్తూ మీ బిడ్డ 60 నెలల పాలన పూర్తి కాక ముందే 57 నెలలకే గొంతు నొక్కుతున్నారు.గీతమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తా..నాకు అక్క లాంటి వంగా గీతమ్మను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించండి. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తానని మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తున్నాడు. మీ కోసం, మీ అభివృద్ధి కోసం పంపిస్తా. మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కను గెలిపించండి. నా పక్కనే డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా. కూటమి ప్రలోభాలకు మోసపోవద్దని మీ అందరినీ సవినయంగా కోరుతున్నా. జరుగుతున్న మంచి కొనసాగేలా మీ బిడ్డ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి.దత్తపుత్రుడికి ఎందుకు ఓటేయకూడదంటే..పిఠాపురంలో పోటీ చేస్తున్న ఈ దత్తపుత్రుడికి ఎందుకు ఓటు వేయకూడదో కూడా చెబుతా. 2014లో ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ కలసి ఉన్నప్పుడు.. గద్దెనెక్కాక బాబు హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే ఆయనకు ఆ కత్తి అందించిన వీళ్లకు భాగస్వామ్యం లేదా? ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి మేనిఫెస్టో ఇచ్చాడు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పారదర్శకంగా పథకాలను అందిస్తుంటే ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతోంది. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఏకంగా రూ.1.05 లక్షల కోట్లు ఏటా ఇస్తానని నమ్మబలుకుతున్నాడు. అది సాధ్యం కాదని ఆ కూటమికీ తెలుసు. తెలిసి తెలిసీ అదే చంద్రబాబుకు మళ్లీ కత్తి అందించి రైతన్నలను పొడవండి.. పిల్లలను పొడవండి.. అక్కచెల్లెమ్మలను పొడవండి.. అవ్వాతాతలను పొడవండంటున్నాడంటే ఈ మనిషి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి.కార్లు మార్చినట్టుగా..ఐదేళ్లకొకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ పెద్దమనిషిని అక్కచెల్లెమ్మలు ఎవరైనా నమ్ముతారా? ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారీ, నాలుగోసారీ అంటే అది అలవాటు కాదా? ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మయినా కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి తమకు సాయం చేయమని అడగగలరా? అసలు ఈ పెద్ద మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఉంటాడా? ఆ మధ్య జలుబు చేస్తే అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక, భీమవరం అయిపోయాయి. ఇప్పుడు పిఠాపురం వంతు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. -
మీ ఓటు దేనికి?
సీఎం జగన్ వ్యక్తిత్వంసీఎం వైఎస్ జగన్ నిజాలే మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. చేయగలిగిందే చెప్పడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దాన్ని నిలబెట్టు కోవడం కోసం ఎందాకైనా పోరాటం చేయడం.. జనంతో మమేకమవడం సీఎం జగన్ విధానం. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. ప్రైవేటు జీవితం అంటూ సీఎం జగన్కు లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే విధానం. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ వార్త విని తాళలేక గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాం«దీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలపాటు జైల్లో అక్రమంగా నిర్బంధించినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేశారు.ప్రతిపక్ష నేతగా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో 14 నెలలపాటు ప్రజల్లోనే గడిపారు. అధికారంలోకి వచ్చాక.. రోజువారీ పరిపాలన.. సమీక్షలు, ప్రజలతో మమేకమవడం.. మిగిలిన సమయం కుటుంబంతో గడపడం సీఎం దినచర్య. కుటుంబ రాజకీయాలకు సీఎం జగన్ వ్యతిరేకం. వీటి వల్ల అనవసరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది సీఎం జగన్ నిశి్చతాభిప్రాయం.చంద్రబాబు వ్యక్తిత్వంమచ్చుకైనా నిజాన్ని చెప్పకపోవడం.. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా నిజం చేయవచ్చునన్నది చంద్రబాబు విధానం. సెల్ ఫోన్ను నేనే కనిపెట్టా.. కంప్యూటర్ను నేనే తెచ్చా.. హైదరాబాద్ను నేనే కట్టా.. అంటూ బీరాలు పలకడమే అందుకు నిదర్శనం. ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడం.. ఎనీ్టఆర్కు వెన్నుపోటు పొడవడంలో సహకరించిన కుటుంబ సభ్యులు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారితోపాటు ఎవరినైనా నమ్మించి నట్టేట ముంచడం చంద్రబాబు నైజం.వారసత్వ రాజకీయాలకు.. కుటుంబ రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు. సర్పంచుగా కూడా గెలవని తన కుమారుడు నారా లోకేశ్ను 2017లో ఏకంగా మంత్రిని చేసి.. నాలుగు కీలక శాఖలను కట్టబెట్టారు. వియ్యంకుడు బాలకృష్ణను హిందూపురం శాసనసభ స్థానం.. లోకేశ్ తోడల్లుడు భరత్ను విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించారు. సీఎం జగన్ఓదార్పు యాత్ర నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర వరకు నిత్యం జనంతో మమేకమవుతూ వచ్చిన వైఎస్ జగన్.. ప్రజా సమస్యలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించారు. విద్య, వైద్యం కోసం అధిక శాతం కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవడం వల్ల రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని పసిగట్టారు. అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించి మెరుగైన సమాజాన్ని నిరి్మంచడమే లక్ష్యంగా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపొందించుకున్న ప్రణాళికలను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులను పేదలకు పంచి పెడుతున్నారని పెత్తందార్లు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. సీఎం జగన్ ప్రారంభించిన ప్రతి పథకానికి ఒక లక్ష్యం ఉంది. ఆర్థిక వేత్తలంతా ఇదే సరైన విధానమని ప్రశంసిస్తున్నారు. విద్యారంగం⇒ ప్రజాసంకల్ప పాదయాత్రలో పేదరికంతో పిల్లలను చదివించలేని తల్లిదండ్రుల పరిస్థితిని గమనించారు. ప్రతి ఇంట్లో ప్రతి అబ్బాయి.. అమ్మాయి ఉన్నత చదువులు చదివితే.. ఉద్యోగాలు, ఉపాధి పొందుతారని, అప్పుడు ఆ కుటుంబం పేదరికాన్ని అధిగమిస్తుందని భావించారు. మీ పిల్లలను బడికి పంపితే చాలు అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. కార్పొరేట్ స్థాయికి దీటుగా అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్ మీడియం భోదనను, సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. ⇒ నాణ్యమైన పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న భోజనం, చిక్కీని అందించేందుకు గోరుముద్ద పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల తెరిచిన రోజే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్స్లను విద్యా కానుక కింద పిల్లలకు అందిస్తున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. తద్వారా పిల్లలను పాఠశాలలకు పంపడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సగటు నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2018 నాటికి 84.48 శాతం ఉంటే.. ఇప్పుడు వంద శాతానికి చేరుకుంది. అంటే.. బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండాలన్న లక్ష్యం సాధించారు. పిల్లల చదువుల కోసం సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడుతున్న ప్రముఖ సంఘ సంస్కర్త, నోబెల్ శాంతిపురష్కార గ్రహీత, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి దేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించారు. ⇒ అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు పోటీ పడేలా చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్.. ఐబీ (ఇంటర్నేషనల్ బకలారియేట్) సిలబస్ను 2025 జూన్ నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్లో మన విద్యార్థులు రాస్తారు. ఆ తర్వాత ఉన్నత విద్యను ఐబీ సిలబస్లోనే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి యూనివర్సిటీల ద్వారా ఆన్లైన్ విధానంలో అభ్యసించనున్నారు. ఆ సరి్టఫికెట్లతో బయటకొచ్చిన మన విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కట్టడం ఖాయం. ⇒ ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్న సీఎం జగన్.. బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ వంటి ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నారు. వసతి, భోజన ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూశారు. బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు నైపుణ్యాలను పెంచుతూ శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా గరిష్టంగా 1.80 లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఎవరు విజనరీ?వైద్య రంగం ⇒ ఇంట్లో ఒకరికి జబ్బు చేస్తే.. చికిత్స కోసం చేసిన అప్పులు తడిసి మోపెడై ఇబ్బందులు పడుతున్న లక్షలాది కుటుంబాలను పాదయాత్రలో గుర్తించిన జగన్.. అధికారంలోకి వచ్చాక నిర్జీవమైన ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఆరోగ్యశ్రీలో చికిత్స విధానాలను 1,059 నుంచి 3,257కి పెంచారు. రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చుల పరిమితిని పెంచారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద నెలకు గరిష్టంగా రూ.5 వేలను సహాయంగా అందిస్తూ జీవనోపాధులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తద్వారా ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ⇒ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీ ఉండడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుని.. 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఆవిష్కరణే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ⇒ బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి.. చికిత్సలు అందిస్తున్నారు. తద్వారా ప్రజలు గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్ వంటి ఇతర పెద్ద జబ్బుల బారిన పడకుండా నియంత్రిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ చొప్పున.. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. మూడేళ్ల వ్యవధిలోనే కొత్తగా 17 కాలేజ్లను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా రాజంపేటలో మరో కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఐదు కాలేజీలు గతేడాది ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలు ప్రారంభించనున్నారు. వ్యవసాయ రంగం ⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. పాదయాత్రలో రైతులు పడుతున్న వెతలను కళ్లారా చూసిన వైఎస్ జగన్.. పంట పండినా, ఎండినా కర్షకులకు నష్టం లేకుండా చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు) వ్యవస్థను తీసుకొచ్చారు. ⇒నకిలీలకు తావులేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతు ముంగిటకు అందించారు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రైతు భరోసా కింద ప్రతి ఏటా పెట్టుబడి సహాయం అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత పంటల బీమా, తొమ్మిది గంటలపాటు పగటిపూటే ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందించి దన్నుగా నిలబడటం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా చేశారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 16 శాతం ఉంటే.. రాష్ట్ర వ్యవసాయ రంగం వాటా 36 శాతంపైనే (దేశంలో రెండో స్థానం) ఉండటమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను ఐక్యరాజ్య సమితి, నీతి ఆయోగ్, నాబార్డు, ప్రపంచ బ్యాంకు ప్రశంసించాయి. పారిశ్రామిక రంగం ⇒ పాదయాత్రలో ఉద్యోగం, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న యువత కష్టాలను తెలుసుకున్న వైఎస్ జగన్.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించి, నిరుద్యోగాన్ని తగ్గించాలని నిర్ణయించారు. అధికారం చేపట్టాక విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య చిన్నతరహా పరిశ్రమలు)లకు ప్రోత్సాహకాలు ఇచ్చి, చేయిపట్టి నడిపించారు. దాంతో 2018–19 నాటికి రాష్ట్రంలో 1.9 లక్షలు ఉన్న ఎంఎస్ఎంఈలు ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకున్నాయి. ⇒ పారదర్శక పారిశ్రామిక విధానం వల్ల టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీ, భజంకా, భంగర్, సింఘ్వీ, మిట్టల్ వంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పోటీలు పడుతున్నాయి. ఐదేళ్లలో రూ.3,02,085 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. టీడీపీ సర్కార్ హయాంలో కేవలం రూ.59,970 కోట్ల పెట్టుబడులే రావడం గమనార్హం. ఎంఎస్ఎంఈలు, భారీ పరిశ్రమల వల్ల కొత్తగా 15.88 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలో పీఎఫ్ ఖాతాల సంఖ్య 2018–19 నాటికి 44.85 లక్షలు ఉంటే.. 2022–23 నాటికి 60.73 లక్షలకు పెరగడమే అందుకు నిదర్శనం. ⇒ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేయడం కోసం సీఎం జగన్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కొత్తగా నాలుగు పోర్టులు (మూలపేట, కాకినాడ గేట్వే, మచిలీపట్నం, రామాయపట్నం), పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లను నిరి్మస్తున్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు (వైజాగ్–చెన్నై, చైన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు), పది ఇండస్ట్రియల్ నోడ్స్ను నిర్మిస్తున్నారు. అప్పుడే రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండోసోల్ పరిశ్రమల ఉత్పత్తులను ప్రారంభించడం గమనార్హం. సేవా రంగం ⇒ హైదరాబాద్, బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పోటీ పడే నగరం రాష్ట్రంలో లేకపోయినా ఇన్ఫోసిస్, రాండ్స్టాడ్, అదానీ డేటా సెంటర్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ పరిశ్రమలను సీఎం జగన్ రాష్ట్రానికి రప్పించారు. ఐటీ పరిశ్రమల వల్ల 59 నెలల్లో రాష్ట్రంలో 47,908 మందికి ఉద్యోగాలు వచ్చాయి. విశాఖపట్నంలో రూ.పది వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు భారీ ఎత్తున విశాఖపట్నంకు ఐటీ పరిశ్రమలతోపాటు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక హోటల్స్ వంటివి వస్తాయి. తద్వారా సేవా రంగం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏలేరు భూ కుంభకోణం నుంచి ఐఎంజీ భారత్ కుంభకోణం వరకు అనేక స్కాంలకు పాల్పడ్డారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చంద్రబాబును ఎల్లో మీడియా విజనరీగా చిత్రీకరిస్తూ వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు విభజన తర్వాత తానో విజనరీ అంటూ ఊదరగొడుతూ వస్తున్నారు. రామోజీరావుకు చెందిన ఈటీవీకి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తానో విజనరీనని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అమరావతిలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు సెంట్రల్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించానని చంద్రబాబు చెప్పడంతో మీడియా ప్రతినిధి నిర్ఘాంతపోయారు. విద్యా రంగం 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు వివిధ వేదికలపై మాట్లాడుతూ విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించారు. నారాయణ వంటి ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డగోలు ఫీజులతో దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు విజన్. ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెడితే.. తెలుగు మీడియంలోనే బోధన సాగాలని అడ్డుకునే దుస్సాహసం చేసిన విజనరీ చంద్రబాబు. ఫీజు ఎంతైనా కేవలం రూ.35 వేల రీయింబర్స్ మాత్రమే చేస్తామంటూ చంద్రబాబు షరతులు విధించడంతో.. వేలాది మంది విద్యార్థులు మిగతా ఫీజు చెల్లించలేక ఉన్నత చదువులు మానేశారు. వైద్య రంగం మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరించడంతో పేదలు తల్లడిల్లిపోయారు. వైద్యం కోసం లక్షలకు లక్షలు అప్పులు చేసిన లక్షలాది కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడేలా చేసిన విజనరీ చంద్రబాబు. పారిశ్రామిక రంగం రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా తీరం మన బలం.. 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానంటూ బీరాలు పలికారు. కానీ.. ఐదేళ్లలో కనీసం ఒక్క పోర్టు కడతామనిగానీ.. ఒక ఫిషింగ్ హార్బరైనా నిర్మిద్దామనిగానీ ఆలోచన చేయని విజనరీ చంద్రబాబు. సేవా రంగం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్ధనరెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. కానీ.. హైటెక్ సిటీని తానే నిర్మించినట్లు చంద్రబాబు ఇప్పటికీ అబద్ధాలు వల్లె వేస్తుంటారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దినట్లు బీరాలు పలుకుతుంటారు. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి 2003–04 నాటికి ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే. కానీ.. మహానేత వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత ఐటీ ఎగుమతులు ఏటా సుమారు రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి. అంటే వైఎస్సార్ హయాంలో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలు వస్తే.. వైఎస్సార్ ఐదేళ్ల పాలనలో ఏకంగా 1,400కు పైగా కంపెనీలు రావడం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే.. వైఎస్సార్ హయాంలో 2,85,000 దాటింది. విభజన తర్వాత రాష్ట్రంలో 2014–19 మధ్య ఐటీ పరిశ్రమల వల్ల వచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 27,643 మాత్రమే. విశ్వసనీయత సీఎం జగన్ ⇒ ‘రాజకీయ నాయకుడు విశ్వసనీయత కోల్పోతే.. రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేయడం? ఎవరి కోసం? దేనికోసం?’ అంటారు సీఎం జగన్. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫొటో.. ప్రతి పేదవాడి గుండెల్లో తాను బతికి ఉండాలన్నదే సీఎం జగన్ సిద్ధాంతం. అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం సీఎం జగన్ నైజం. ⇒ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సందర్భంలో.. వైఎస్సార్సీపీ నేతలు, శ్రేయోభిలాషులు పలువురు రూ.50 వేల వరకు రుణ మాఫీ ప్రకటించాలని వైఎస్ జగన్పై ఒత్తిడి తెచ్చారు. ఆచరణ సాధ్యం కాని హామీని తాను ఇవ్వలేనని అప్పట్లో వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన అలవికాని హామీల వల్ల కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైఎస్ జగన్ అప్పట్లో అధికారంలోకి రాలేకపోయారు. ⇒ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఇది సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడానికి దారితీసింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అమలు చేయదగిన హామీలతోనే ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. చంద్రబాబు ⇒ మోసమే ఆస్తిగా.. వెన్నుపోటే పెట్టుబడిగా రాజకీయాల్లో ఎదిగిన నేత చంద్రబాబు. ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక 1999 ఎన్నికల్లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్లు నిరి్మస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాజ్పేయిపై వీచిన సానుభూతి పవనాల్లో అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ⇒ విభజన నేపథ్యంలో చంద్రబాబు 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి వంటి 650 హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన ఘనత ఈ పెద్దమనిíÙదే. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోవడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అంటే మోసం చేస్తాడనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నైతిక విలువలు సీఎం జగన్: నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నది సీఎం జగన్ విధానం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ మరణవార్త విని గుండెలు పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్ జగన్ అప్పట్లో మాట ఇచ్చారు. ఓదార్పు యాత్ర చేపట్టడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, మహానేత వైఎస్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ను వీడి వైఎస్సార్సీపీని స్థాపించారు. వైఎస్సార్సీపీలో చేరాలంటే.. ఎవరైనా ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాలని షరతు విధించారు. అదే విధానానికి కట్టుబడ్డారు. చంద్రబాబు: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిందే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి. ఓటుకు నోటును అలవాటు చేసి రాజకీయాలను ఫక్తు వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదే. దేశంలో తొలి సారిగా 1996 లోక్సభ ఎన్నికల్లో ఓటుకు నోటును ఎరగా వేసి.. ఆ తర్వాత అలవాటు చేసిన చరిత్ర బాబుది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి.. వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకు 23 మంది ఎమ్మె ల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే కాకుండా, ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కేసులో కోట్ల కట్టలు, ఆడియో వీడియో టేపులతో తెలంగాణ ప్రభుత్వానికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయివచ్చి ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో తల దాచుకున్నారు. అంతెందుకు ఆర్నె ల్ల క్రితం శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటుకు కోట్లను ఎరవేశారు. నిబద్ధత.. సీఎం జగన్ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన (ఏవోబీ) వై.రామవరం మండలం చాపరాయిలో 2017 జూన్ 30న విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్ 2017 జూలై 1న పోలీసులు వారిస్తున్నా వినకుండా అటవీ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1750 మీటర్ల ఎత్తులో ఉన్న చాపరాయికి వెళ్లారు. విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు కన్ను మూయడానికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. తాను అధికారంలోకి వస్తే.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతోపాటు ఖాళీలను భర్తీ చేశారు. స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఒక మెడికల్ కాలేజ్ని నిరి్మస్తున్నారు. సీఎం జగన్ నిబద్ధతకు ఇదో తార్కాణం మాత్రమే. చంద్రబాబు గోదావరి పుష్కరాల ప్రారంపోత్సవం రోజున అంటే 2015 జూలై 14న రాజమహేంద్రవరంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో స్నానాలు చేసేందుకు ఒకేసారి భక్తులను వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం పాలయ్యారు. కనీసం ఈ దుర్ఘటనపై చంద్రబాబు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. మీ ప్రచార పిచ్చితో 29 మందిని బలిగొన్నారు కదా.. అని చంద్రబాబును మీడియా ప్రశి్నస్తే.. కుంభమేళాలో చచ్చిపోవడం లేదా.. గోదావరి పుష్కరాల్లోనే చచ్చిపోయారా? గోరంతలు కొండంతలు చేస్తారా? అంటూ రంకెలేయడం విస్మయానికి గురిచేసింది. ప్రచారపిచ్చితో 2022 డిసెంబర్ 29న కందుకూరులో ఇరుకుసందులో చంద్రబాబు సభ నిర్వహించడం వల్ల తొక్కిసలాటలో 9 మంది మరణించారు. అయినా సరే ఆ సభను నిర్వహించడం ద్వారా ప్రజల పట్ల తనకు ఎంత నిబద్ధత ఉందో చంద్రబాబు చాటి చెప్పుకున్నారు. సంస్కర్త (రిఫార్మర్) సీఎం జగన్విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్.. పాలనలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ.. జిల్లాలను పునర్ వ్యవస్థీకరించడం ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో నేరుగా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. మరో అడుగు ముందుకేసి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. పాలనా సంస్కరణల ద్వారా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించారని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఇంజనీరింగ్ పనుల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి.. చంద్రబాబు నిర్జీవంగా మార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చి, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7,500 కోట్లు ఆదా చేశారు. చంద్రబాబు సంస్కరణ అంటే చంద్రబాబు దృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం.. ఉద్యోగులను రోడ్డున పడేయడం.. వాటిని అత్తెసరు ధరకే బినామీలకు కట్టబెట్టడం. ఉమ్మడి రాష్ట్రంలో 1999–2004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నిజాం షుగర్స్, ఆల్విన్, హెచ్ఎంటీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి.. వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. వాటి ఆస్తులను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకున్నారు. 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు సగటున 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.20 వేల కోట్లకుపైగా నష్టం చేసిన చంద్రబాబు.. వాటిని కాంట్రాక్టర్లతో కలిసి దోచుకున్నారు. రూ.16 వేల కోట్లకుపైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. సామాజిక సాధికారత సీఎం జగన్సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్ దేశానికే రోల్ మోడల్గా నిలిచారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అంటూ అక్కున చేర్చుకునే సీఎం జగన్.. మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు (70 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఉంటే.. నాలుగు పదవులు ఆ వర్గాల వారికే ఇచ్చారు. శాసనసభ స్పీకర్గా బీసీ.. శాసనమండలి చైర్మన్గా ఎస్సీ, డిప్యూటీ చైర్ పర్సన్గా మైనార్టీ మహిళకు అకాశం ఇచ్చారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా సింహ భాగం ఆ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో అధిక శాతం పదవులు వారికే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు, మహిళలకు నామినేషన్ పనుల్లో, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పట్టం కట్టారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చితే.. అందులో అధిక భాగం వాటా ఆ వర్గాలకే దక్కింది. రాజకీయ, ఆర్థిక సాధికారతతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి, 175 శాసనసభ, 25 లోక్సభ వెరసి 200 స్థానాల్లో వంద స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారినే బరిలోకి దించారు. చంద్రబాబు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ ఎస్సీలను.. తోకలు కత్తరిస్తా, తాటతీస్తా, జడ్జీలుగా పనికి రారంటూ బీసీలను.. దేశ ద్రోహం కేసులు బనాయించి ముస్లింలను.. కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలను అపహాస్యం చేసిన చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఆ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు.. ఒక్కరినంటే ఒక్క బీసీనిగానీ, ఎస్సీనిగానీ, ఎస్టీనిగానీ, మైనారీ్టనిగానీ రాజ్యసభకు పంపలేదు. చివరకు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ వర్గాలకే టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం చేసి సామాజిక విద్రోహానికి పాల్పడ్డారు. ఆర్థికవేత్త సీఎం జగన్సీఎం జగన్ అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2019 మే 30కి ప్రభుత్వ ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిలాయి. చంద్రబాబు దోపిడీతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టిన సీఎం వైఎస్ జగన్.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టించారు. పేదల ఖాతాల్లో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న పేదలు జీవనోపాధిని మెరుగుపరుచు కోవడంతో పేదరికం తగ్గింది. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గింది. రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,51,173 ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2022–23 నాటికి రూ.2,19,518కి పెరిగింది. కేంద్రం జీడీపీలో రాష్ట వాటా చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 4.82 శాతానికి పెరిగింది. చంద్రబాబు హయాంలో అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 21.87 శాతం ఉంటే.. ఇప్పుడు 12.13 శాతానికి తగ్గింది. సంపద సృష్టించిందీ సీఎం జగనే. చంద్రబాబు హయాం (2014–19)లో మూల ధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. కోవిడ్ ఆర్థిక సంక్షోభంలో ప్రజల ఖాతాలకు నగుదు జమ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలు ఆకలితో అలమటించకుండా ఆదుకున్నారు. చంద్రబాబు ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదివానని, తానో ఆర్థికవేత్తనని, సంపద సృష్టించానని చంద్రబాబు బీరాలు పలుకుతారు. ఇందులో చదువొక్కటే నిజం.. మిగతావన్నీ అసత్యాలే. ఎడాపెడా అధిక వడ్డీలకు రుణాలు చేయడం.. వాటిని అస్మదీయులతో కలిసి దోచుకోవడం, పంచుకోవడం.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే చంద్రబాబు ఆర్థిక విధానం. పరిపాలన దక్షత సీఎం జగన్విభజిత రాష్ట్రాన్ని 2014–19 మధ్య చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి ఛిన్నాభిన్నం చేశారు. కుంగి కుదేలైన రాష్ట్రాన్ని సీఎం జగన్ తన పరిపాలన దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపారు. 2020 ఫిబ్రవరి నుంచి 2022 జనవరి వరకు కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని గజగజ వణికించింది. ఈ మహమ్మారి విజృంభించినప్పుడే.. దానితో సహజీవనం చేయాల్సిందేనని.. ట్రేస్.. టెస్ట్.. ట్రీట్మెంట్ మినహా మరో మార్గం లేదని సీఎం జగన్ ప్రకటించారు. దీన్ని చంద్రబాబు సహా ఆయన ఎల్లో గ్యాంగ్ అప్పట్లో అపహాస్యం చేసింది. సీఎం జగన్.. వైద్యారోగ్య శాఖను సమర్థవంతంగా పని చేయించడం ద్వారా కరోనా మహమ్మారిని గట్టిగా ఎదుర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల ప్రాణాలను రక్షించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు ఆపకుండా.. పేదల ఖాతాల్లో నిధులు జమ చేశారు. దాంతో కోట్లాది మంది ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండాపోయింది. పరిపాలన దక్షతతో కరోనాను సీఎం జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్ ప్రశంసించాయి. చంద్రబాబు హుద్హుద్ తుఫాన్ 2014 అక్టోబర్ 12న విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయి.. ఆకలి కేకలతో ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. తుఫాన్ తగ్గిన వెంటనే విశాఖపట్నంకు చేరుకున్న అప్పటి సీఎం చంద్రబాబు.. ప్రచార పిచ్చితో రంపం పట్టుకుని చెట్లను తొలగిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తూ.. సహాయక చర్యలు చేపట్టకుండా ఆటంకం కలిగించారు. బాధితులను ఆదుకోకుండానే హుద్హుద్ తుఫాన్ను జయించినట్లు ప్రగల్భాలు పలికారు. ప్రతిపక్షంలోకి మారాక 2020 మార్చిలో తాను అధికారంలో ఉంటే కరోనా మహమ్మారి వచ్చేదా.. అంటూ బీరాలు పలకడంతో ప్రజలు నిర్ఘాంతపోయారు. – సాక్షి అమరావతి -
జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు
-
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
-
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు. -
చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సైలెంట్ వేవ్ ఉందని.. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందన్నారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని.. వరుస ఓటముల తర్వాత తనపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి.. తానను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అవినీతి సామ్రాట్ చంద్రబాబు. నారావారిపల్లెలో రెండు ఎకరాల భూమి బాబుకు ఉంది. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?. ఇది అవినీతి కాదా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్, నాపై తరచూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబులాగా మేము అవినీతి పరులం కాదు. పుంగనూరు, అంగళ్లు ఘటనలకు సూత్రధారి చంద్రబాబు. ఆయన ప్రభుత్వంలోని టీడీపీనేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. పోలీసులను తీవ్రంగా కొట్టారు.’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరించారు. దాడులు చేయించింది చంద్రబాబు నిందలు మాపై పంపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
ఏలూరు, సాక్షి: చంద్రబాబు ప్రలోభాలకు గురి కావొద్దని.. మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా.. ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ జగన్ను మళ్లీ ఆశీర్వాదించాలని కోరారాయన. కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార భేరిలో ఆయన మాట్లాడుతూ..కైకలూరు సిద్ధమా?.. ఇంతటి ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా అందరి ముఖంలో చిక్కటి చిరునవ్వు కనిపిస్తోంది. మీ అందరి ప్రేమానురాగాలు, మీ అందరి ఆప్యాయతల నడుమ.. ఇక్కడకు వచ్చిన నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. అక్కచెల్లెమ్మల కోసం మీ బిడ్డ జగన్ వివిధ పథకాల కోసం 130 సార్లు బటన్ నొక్కాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఏదేళ్లు ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సులు.. మాండేటరీ ఇంటర్న్షిప్.. ఈ చదువుల విప్లవాలు గతంలో ఏనాడైనా జరిగాయా?అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా.. వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా?గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. అవ్వాతాతలకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. ఇంటికే పెన్షన్ వచ్చిందా?. ఇంటికే రేషన్ వచ్చిందా.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరిగింది. మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. రైతన్నలకు ఉచిత పంటలబీమా. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ. రైతన్నలకు పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నల చేయి పట్టుకుని నడిపించే గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ.. గతంలో ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా.. అండగా.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్పాత్ల ఉన్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునేవాళ్లు, ఫుట్పాత పక్కన ఇడ్లీలువేసుకునేవాళ్లు.. వారి కోసం ఈరోజు జగనన్న తోడు. రజకులకు, బ్రహ్మణులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇన్ని పథకాలు ఏనాడైనా ఉన్నాయా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. మొట్టమొదటిసారిగా ఆరోగ్యరక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఉచితంగా రూ.25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ అయ్యాక రెస్ట్ పీరియడ్లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. పేదవాడి కోసం ఇంటి వద్దకే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయా?.గ్రామంలో అయినా 600 సేవలు అందిస్తూ కనిపిస్తున్న సచివాలయం. అదే గ్రామంలో వలంటీర్ వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ ఓ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల కోసం.. వాళ్ల రక్షణ కోసం గ్రామంలోనే మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల కోసం ఫోన్లోనే దిశ యాప్. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా పోలీసులు వచ్చి ‘‘చెల్లెమ్మా ఏం జరిగింది?’’ అని అడుగుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారా? ఆలోచన చేయండి.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి.. మూడుసార్లు సీఎం చేశానంటాడు. మరి పేదవాళ్లకు ఒక్కటంటే ఒక్కటైనా మంచి గుర్తుకొస్తుందా?.(లేదు.. అనే సమాధానం వచ్చింది). చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం కూడా గుర్తుకు రాదు. ఏ మంచి గుర్తుకు రాలేదు. ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. మోసాలు.ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. సంతకం పెట్టిన ఈ ఫాంప్లెట్ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. 2014 ప్రజలు నమ్మి చంద్రబాబుకి ఓటేశారు. ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించిన వాటిల్లో ఒక్కటైనా చేశారా?.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు ఈ పెద్దమనిషి చంద్రబాబు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు.. మాఫీ అయ్యాయా?. రెండో హామీ.. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయైనా మాఫీ అయ్యాయా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ వేస్తామన్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? ఒక్కరి అకౌంట్లో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా? అని అడుగుతున్నా.అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నారు? చేశారా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు? చేశారా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. చేశారా? కైకలూరులో ఏమైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? దాన్నీ అమ్మేశారు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..మళ్లీ ఇదే ముగ్గురూ.. ఇదే కూటమి.. ఇదే చంద్రబాబు.. సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు అంట.. నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు ప్రలోభాలను నమ్మొద్దు. ఐదేళ్లు మీ అందరికి క్యాలెండర్ఇచ్చి.. ఏ నెలలో ఏం చేస్తాం అనేది.. ఏ నెలలో చేయూత, అమ్మ ఒడి అని ప్రతీ నెలా.. క్రమం తప్పకుండా చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి. చంద్రబాబు ప్రలోభాలతో మోసపోకండి. జరుగుతున్న మంచిని పొగొట్టుకోకండి.వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.కొల్లూరు సమస్య పరిష్కారం కావాలన్నా.. మీ బిడ్డ సీఎం కావాలి. చెప్పిన మాట ప్రకారం సర్వే జరుగుతోంది. సర్వేకు సంబంధించిన రిపోర్టు పూర్తికాగానే.. అదనపు భూమిని పంచుతాం. అదీ బిడ్డ జగన్ చేతుల మీదుగానే జరుగుతుంది.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్.. చెల్లి మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. బీజేపీ ఎక్కడ ఉండాలి.. సింక్లోనే ఉండాలి. కాదు.. చెరువులో ఉండాలి.వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎన్ఆర్(దూలం నాగేశ్వరరావు) , కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలమలశెట్టి సునీల్ గెలిపించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. -
కైకలూరులో సీఎం జగన్ కాన్వాయ్ ర్యాలీ కిక్కిరిసిన జనం
-
నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం
-
చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోవొద్దు: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారని.. అధికారంలోకి వచ్చాక మాయలు, మోసాలే ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. .. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ముఖ్యహామీలంటూ ప్రతి ఇంటికీ పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?చంద్రబాబు విఫల హామీలుమొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. రూ.25 వేల కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?..ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నారు , చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూరుకు మించి అభివృద్ధి అన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు?.. జరిగిందా? మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అక్కా నమ్ముతారా? అన్నా నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటున్నారు? ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా?.. ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరీ.. ఏ నెలలో అమ్మ ఒడి, చేయూత అని ఫలానా నెలలో ఫలానా ఇస్తామని చెప్పి మరీ మేలు చేశాడు. పొరపాటును చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి.. ఇంటికి జరుగుతున్న మంచిని పొగొట్టుకోవద్దు.వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్లను గెలిపించాలని సీఎం జగన్ చిలకలూరిపేట ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. సెల్ఫీతో సీఎం జగన్ సందడిచిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కైకలూరు బయల్దేరిన సమయంలో కొందరు అభిమానులు సీఎం జగన్తో సెల్ఫీ కోరారు. తన ప్రచార రథం దిగి కిందకు వచ్చిన ఆయన.. వాళ్లతో సరదాగా సెల్ఫీ దిగారు. ఆపై అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగింది. -
Allu Arjun Nandyal Photos: అస్సలు తగ్గేదే లే.. నంద్యాలలో శిల్పాతో పుష్పరాజ్ (ఫొటోలు)
-
బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్ కాపీలిచ్చారా?: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: లంచాలు,అవినీతి లేని పాలనతో పథకాలు కొనసాగాలన్నా, ఇంటింటి అభివృద్ధి జరగాలన్నా.. జగన్కు ఓటేయాలని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపుతో పాటు మోసపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.చిలకలూరిపేట సిద్ధమా?.. దేవుడి దయతో ఇవాళ వాతావరణం చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా, తోడుగా ఉంటున్న నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.జరగనున్నాయి ఎన్నికల సమరం. బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది గతంలో జరిగాయా?గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా నిర్వచనమిస్తూ.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, పౌర సేవలు. పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. గతంలో ఎప్పుడైనా జరిగిందా?, మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. మొదటిసారిగా రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్పాత్ల మీద శ్రమజీవులను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా?. ఇవాళ వాళ్లకు ఓ తోడు.. బ్రహ్మణులకు, రజకులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. ఏకంగా రూ. 25 లక్షలకు విస్తరించిన ఆరోగ్యశ్రీ. రెస్ట్ పీరియడ్లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతంగా పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా చెల్లెమ్మా ఏం జరిగింది అని అడుగుతున్న పరిస్థితి. లంచాలు, అవినీతి లేని పాలన.. నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనివి...మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల్లో జరిగినవి.. నిజమా? కాదా? అని అడుగుతున్నాను.కుట్రలు గమనించాలిజరగబోయేది రెండు కులాల మధ్య యుద్ధం కాదు. రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉన్నారు. జరుగుతున్న కుట్రలు గమనించాలి. రెండు నెలల కింద దాకా అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే వచ్చేది. అలాంటిది.. ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందో అని పెన్షన్ ఆపేసి.. ఆ అవ్వాతాతల ఉసురు తగిలించుకున్నారు.ఏ ప్రభుత్వమైన 60 నెలల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ, 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును ఆ అక్కాచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎన్నికలయ్యాక ఇస్తారట. 14వ తేదీ ఇస్తారట. ఇది కుట్ర కాదా?. అయినా ఫర్వాలేదు. కారణం ఏంటంటే.. నాకు కావాల్సింది.. నా అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం. వాళ్ల పిల్లల చదువులు, రైతన్నల ముఖంలో సంతోషం.అలాగే.. ల్యాండ్ టైటిలింగ్యాక్ట్, రిజిస్ట్రేషన్ల మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ విశాఖలో, దత్తపుత్రుడు(పవన్ కల్యాణ్ను ఉద్దేశించి..) ఏపీలో భూములు కొన్నారు. మరి వారికి ఒరిజినల్ ఇచ్చారా?.. మరి జిరాక్స్లు ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏపీలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ, చంద్రబాబు దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో గమనించాలి అని సీఎం జగన్ కోరారు. -
సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మే 13 సోమవారం రోజున ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై ఉంది. అయిదేళ్ల పాలనతో తనదైన ముద్ర వేసిన సీఎం జగన్మీద పచ్చ మీడియా ఎందుకింతగా ఏడుస్తోంది? దానికి కారణాలు విశ్లేషించి రాసిన పది కీలక అంశాలు ఇవి..1. చదువుల మాఫియా: బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ, చైతన్యలకు అప్పజెప్పాడు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా ఆయనకు శత్రువులే. ఐబీ సెలబస్ లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో.. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే కోపం రాదా వాళ్లకు?2. ఆరోగ్య మాఫియా: బాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టలేదు. ఒక్క ప్రభుత్వ వైద్యశాల పెట్టలేదు. మరి ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్న కొంత మందికి, అలాగే తన వర్గం వాళ్లు నడుపుతున్న కార్పొరేట్ ఆసుపత్రులకు వీటి వల్ల నష్టం కదా. అందుకే ఆ వర్గానికి సీఎం జగన్ శత్రువే మరి. ఒకేసారి రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్లు కట్టాడు కదా. ముందుగానే రోగాలబారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం కోసం ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అని మొదలుపెడితే కుల మాఫియా వ్యాపారాలు ఏం కావాలి?. 16 హెల్త్ హబ్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడితే మా ఆదాయాలు ఏం కావాలి?. పేదవాడు అయినా ధనవంతుడు అయినా రోగాలు రావాలి ఆసుపత్రికి రావాలి మేము దోపిడీ చెయ్యాలి. మరి పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా ప్రభుత్వంలోనే కల్పిస్తే కోపం రాదా వాళ్లకు?3. వ్యవసాయం మాఫియా: కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వాళ్ళను సీఎం జగన్ అడ్డుకున్నాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. అన్ని అక్కడే వాళ్లకు తక్కువ ధరకు ఇస్తున్నాడు. పంటకు మద్ధతు ధర ఇచ్చి కొంటున్నాడు. రైతు నష్టపోకుండా చూస్తున్నాడు. కష్టకాలంలో బీమా ఇచ్చి ఆదుకుంటున్నాడు. ఇన్నాళ్లు దళారి పాత్రలో రైతులను, సామాన్యులను దోచుకున్న బాబు గ్యాంగ్కు జగన్ శత్రువే కదా.4. అమరావతి మాఫియా: పేదల భూములు, రైతుల భూములు తక్కువ ధరకే కొట్టేసిన బాబు ఆయన బినామీలకు సీఎం జగన్ శత్రువే. మేము ఆ రాజధాని పేరు చెప్పి లక్షల కోట్లు సంపాదించాలి అని ప్లాన్ చేస్తే అది జరగకుండా చేశాడు. మరి మాకు కడుపు మండదా అని గగ్గోలు పెడుతున్నారు.5. పెత్తందారీ అసూయ ద్వేషం: అవును అందరినీ సమానంగా చూస్తున్నాడు జగన్. అదే బాబు గారి పాలనలో అయితే మా వర్గం పెత్తనం నడిచేది. ఈ రోజు పేదవాడు కూడా బాగుపడ్డాడు. మరి మా పనులు చేసేది ఎవరు. మేము వాళ్ళు ఒక్కటేనా? వాళ్ళ పిల్లలు అంత చక్కగా మంచి డ్రెస్ వేసుకొని స్కూల్కి పోతున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు, వాళ్లకు పథకాల ద్వారా డబ్బు వస్తుంది. మరి ఇలా అయితే మా కంటే వాళ్ళు కూడా అన్నిట్లో బాగుపడతారు కదా. కాబట్టి మాకు శత్రువు జగనే6. మీడియా మాఫియా: బాబు లాగా జగన్ డబ్బులు ఇచ్చి మీడియా పెద్దలను మేపలేడు కదా. బాబు అంటే మీడియా డార్లింగ్ అని పేరు. కాబట్టి మేము రోజు విషం కక్కుతాం. మాకు నీ వల్ల ఏం డబ్బు రాదు కదా. కాబట్టి మాకు శత్రువునే అంటున్నారు ఎల్లో గ్యాంగ్.7. పారిశ్రామిక వేత్తలు: సీఎం జగన్ ఏం చేశాడు? దేశ, విదేశాల నుంచి వ్యాపార వాణిజ్య దిగ్గజాలను ఏపీకి ఆహ్వానించాడు. లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాడు. పెద్ద పెద్ద కంపనీలు ఇక్కడికి వస్తే మేం చేసే ఏకపక్ష వ్యాపారాలు ఎలా జరగాలి అన్నది వాళ్ల ఆవేదన. అందుకే కంపెనీలు రాలేదు, ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాది పోతోంది అని విషప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు, జనాలకు శత్రువునే.8. బంధువులు: సొంత కుటుంబంలో వున్న వ్యక్తులకు కూడా జగన్ శత్రువు అయ్యాడని పచ్చపత్రికలు రాస్తున్నాయి. ఎందుకు.. కడపలో ఎవరిని అడిగినా చెబుతారు. అధికారం అడ్డుపెట్టుకుని దోపిడీ చెయ్యాలి అన్న బాబు సిద్ధాంతానికి జగన్ వ్యతిరేకం. బంధువు అయినా నేను ఒప్పుకోను అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అన్యాయం జరగనివ్వను అంటాడు. అందుకే జగన్ అంటే కడుపుమంట.9. ప్రతిపక్షాలు:ప్రతి పక్షం వాళ్ళను సీఎం జగన్ ఘోరంగా దెబ్బ కొట్టాడు. ఎన్నికల్లో కొలుకోకుండా చేశాడు. అంత ఓటమి వాళ్ళ జీవితంలో చూడలేదు. కాబట్టి వాళ్లకు శత్రువునే.10. అధికార యంత్రాంగం: ఆయనతో పని చేస్తున్న కొందరు అధికారులకు ఈ పాలన నచ్చడం లేదు. ఎందుకు అంటే బాబు హయాంలో విపరీతమైన దోపిడీ వుండేది, లంచాలు వుండేవి. జగన్ వచ్చాక, గ్రామ సచివాలయం, వాలంటర్ వ్యవస్థ పెట్టాక, లంచాలు లేవు. డీబీటీ చేస్తున్నాడు. మా పెత్తనం లేకుండా పోయింది. పేదలకు అన్ని ఎవరిని అడగకుండానే వస్తున్నాయి. ఇది నా తోటి మిత్రులు నాతో స్వయానా అన్నారు. అప్పట్లో లక్షల రూపాయలు నెలకు వచ్చేవి అని. ఇప్పుడు ఆస్కారం లేదు అని ఏడుపు. -
నువ్వా నన్ను విమర్శిస్తావ్.. దేవినేని ఉమాకు అబ్బయ్య చౌదరి కౌంటర్
-
టీడీపీ మేనిఫెస్టోని మోదీయే నమ్మడం లేదు..
-
నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సమన్వయం కొరవడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి తోడు తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థి రాసలీలల వ్యవహారం సోషల్ మీడియాలో బట్టబయలవడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. జరుగుతున్న పరిణామాలన్నీ రానున్న ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంకేతాలుగా ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతోంది. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. విజయవాడ లోక్సభ అభ్యర్థి కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి, ఇద్దరూ కలిసి కనీసం ప్రచారంలో కూడా పాల్గొనటం లేదు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఓటర్లకు డబ్బు పంపకాలలో సైతం గద్దె రామ్మోహనరావు, ఎంపీ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోకుండా సొంత మనుషులతోనే పంపకాలు చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన బొప్పన భవకుమార్ సైతం గద్దె వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో ఆయన్ను దూరంగా పెట్టడంతో కినుక వహించారు. గద్దె వ్యవహారం నచ్చక ఆయన అలకబూనారు. దీంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లు సైతం గద్దె రామ్మోహన్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు ప్రచారంతోపాటు, డబ్బు పంపిణీ కార్యక్రమాల్లో సైతం దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. నానాటికీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతుండటంతో, కొంతమంది నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ఈ పరిణామాలన్నీ ఓటమికి సంకేతాలుగా సూచిస్తున్నాయని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని, ఓటమి ఖాయం అనే భావనకు టీడీపీ వర్గాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాసలీలల రామ్మోహన్!గద్దె అసంతృప్తి సెగలు తాకకుండా... విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు గద్దె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్నారు. మాయ మాటలతో ప్రతిసారీ ఎన్నికల్లో మభ్యపెట్టడం, దుష్ప్రచారం చేసి నెట్టుకొస్తున్నాడనే భావన నియోజకవర్గ ఓటర్లలో వ్యక్తం అవుతోంది. దీనికితోడు తాజాగా గద్దె గలీజు బాగోతం బట్టబయలైంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఆయన రాసలీలల వ్యవహారం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి రావటం విజయవాడలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈయన నిజస్వరూపం తెలిసి తూర్పు నియోజకవర్గ ప్రజలు ఛీకొడుతున్నారు. దీనికితోడు టీడీపీ ప్రభుత్వ హయంలో కాల్మనీ వేధింపుల కేసుల్లో నిందితులు కూడా ఈయన అండతోనే అలా వ్యవహరించారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు పట్టించుకోలేదని, ఇన్నాళ్లకు గద్దె పాపాలు పండాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురి చేసి, దాడి చేయడంతో అతనిపై పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఇప్పుడు ఏకంగా గద్దె రామ్మోహనరావు వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇలా పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. వీరిరువురు విడివిడిగా ప్రచారం చేసుకొంటున్నారు. గద్దె రామ్మోహనరావు ఎంపీ అభ్యరి్థకి సహకరించటం లేదు. గత రెండేళ్లు నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా తానే ఖర్చు భరించానని, తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి గద్దె పట్టించుకోకపోవడంతో ఆయన తీరుపై ఎంపీ అభ్యర్థి కారాలు మిరియాలు నూరుతున్నారు. మొత్తం మీద తూర్పు నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయం అనే సంకేతాలను ఇస్తున్నాయి. రాసలీలల రామ్మోహన్! -
కుప్పంలో టీడీపీ గూండాయిజం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు. -
ఏపీలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
-
జనసేన ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన గెలుపు నాదే
-
పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్
గుంటూరు, సాక్షి: లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. కానీ, రియల్లైఫ్లో పవన్కు ఆ పంచ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుచిచూపించన్నారా?. ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆఖరు తేదీ కాగా.. వైఎస్సార్సీపీ తరఫున చివరి ప్రచార సభను పిఠాపురంతోనే ముగించబోతున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.ఒకవైపు ఓట్ల కోసం కూటమి నేతల పరుగులు.. మరోవైపు 59 నెలల పాలన, జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచ్లతో సాగిన సీఎం జగన్ ప్రసంగాలు.. అన్నీ.. అన్నీ.. ఇవాళ్టి సాయంత్రంతో బంద్ కానున్నాయి. ఆ వెంటనే ఏపీలో సైలెంట్ పీరియడ్ మొదలుకానుంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం సీఎం జగన్ దూకుడుతో.. ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయన్నది వాస్తవం. ఇక సంక్షేమ పాలనతో దేశ రాజకీయాల్లోనే ట్రెండ్ సెట్టర్గా మారిన సీఎం జగన్.. ప్రచారంలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్. ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే ‘సిద్ధం’ చేస్తూ వచ్చిన ఆయన.. 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆఖరికి ప్రచార సభలతో జనంలోకి వెళ్లి.. అపూర్వ స్పందన దక్కించుకున్నారు. ప్రచార వేదికలపై ర్యాంప్ వాక్.. ఏ రాజకీయ నాయకుడి నుంచైనా ఊహించగలమా?. ఈ చర్యతో తన ప్రత్యేకతను చాటుకోవడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులు, పచ్చ మీడియా ఎంతగా విషం చిమ్మిన ప్రజలకు ఎప్పుడూ తాను దగ్గరేనని చాటి చెప్పారు. తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలుపెట్టి.. తనకు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుని నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ మరి ఏపీ ప్రజలకు వివరించారాయన.బాబుకి ఓటేస్తే.. చంద్రముఖి నిద్రలేచి లక లక అంటూ ప్రజల రక్తం తాగుతుందిబాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేజగన్కు ఓటేస్తే పథకాల కొసాగింపు.. ఇంటింటా అభివృద్ధిఅదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాల ముగింపు, మళ్లీ మోసపోవడమేమంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులు, బడుల మొదలు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్ని వర్గాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ.. డీబీటీ ద్వారా బటన్నొక్కి నేరుగా 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో వివరిస్తూ వచ్చారు. ‘‘మీ ఇంట మంచి జరిగితేనే నాకు అండగా ఉండాలని.. ఆలోచనతో ఓటు వేయాలి’’ అని కోరిన ఏకైక నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని, పేదల మీద జగన్కు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండబోదని, పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకుని.. వాళ్ల ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని చెరిపేసి.. పవిత్రంగా భావిస్తూ 99 శాతం హామీల్ని అమలు చేయడం, ఇప్పుడూ ఆ మేనిఫెస్టోను ఇంటింటికి పంపించి ఆశీర్వదించడమని అడగడం.. అదే మేనిఫెస్టోతో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది పూస గుచ్చినట్లు వివరించారాయన. సంక్షేమం కొనసాగాలన్నా.. వలంటీర్లు పెన్షన్లు అందించాలన్నా.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. 175 సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా.. తగ్గేదేలే అంటూ ఎన్నికల కార్యాచరణ అమలు చేశారాయన.విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార భేరిలో దుమ్ము రేపిన సీఎం జగన్.. చివరి 12రోజుల్లో 34 సభల్లో పాల్గొని వైఎస్సార్సీపీ కేడర్లో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా.. కూటమి పార్టీల్లోని కీలక నేతల నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం గమనార్హం. అదే సమయంలో ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావించకుండానే సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్ చివరి మూడు ప్రచార సభలపై ఆసక్తి నెలకొంది. తొలుత చిలకలూరిపేట, కైకలూరు, ఆపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురంలో జరగబోయే ప్రచార సభతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఆ ఆఖరి ప్రచార సభలో సీఎం జగన్ ఎలాంటి పంచులు పేలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్తో యూస్ ఉండదట!
కేకేఆర్ ఆల్రౌండర్కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
RCB vs DC: మరో కీలక మ్యాచ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement