2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు | Sakshi
Sakshi News home page

Suvendu Adhikari: 2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు

Published Sun, Sep 5 2021 6:14 AM

BJP Leader Suvendu Adhikari summoned by CID - Sakshi

కోల్‌కతా: పశి్చమబెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సువేందుకు బాడీగార్డుగా పని చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుభభ్రత చక్రవర్తి మరణానికి సంబంధించిన కేసులో ఆయనకు సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని భవాని భనవ్‌ సీఐడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పింది.

2018లో బాడీగార్డు చక్రవర్తి మరణించారు. తుపాకీతో తనకు తానే కాల్చుకొని మరణించినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భర్త కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా చక్రవర్తి భార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేసు సీఐడీ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఐడీ సమన్లు జారీ చేసింది.
(చదవండి: వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ)

  

 
Advertisement
 
Advertisement