సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి జిల్లా స్థాయి పదవులు దక్కాయి. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఈ ఉత్తర్వులు వెలువరించింది. జిల్లా పార్టీ కమిటీ సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర నియమితులయ్యారు.
మైనార్టీ కమిటీ
మైనార్టీ విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ఎండీ హమీద్బాషా, జనరల్ సెక్రటరీగా ఎస్కే ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీగా ఎస్కే అబ్దుల్ రహీం నియమితులయ్యారు.
వైద్య విభాగం
వైద్య విభాగం కమిటీ జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ అనుసూరి పద్మలత (రాజమహేంద్రవరం సిటీ), ఉపాధ్యక్షులుగా బండేల రాజశేఖర్ (కొవ్వూరు), ఎస్.వెంకటేష్ (రాజానగరం), జనరల్ సెక్రటరీలుగా బల్లా శ్రీనివాసరావు(రాజమహేంద్రవరం సిటీ), పి.దేవానందం (రాజమహేంద్రవరం రూరల్), ఎస్కే ఇమామ్ (రాజమండ్రి రూరల్), సూరిశెట్టి భాస్కర్ (రాజానగరం), పంద్రాకుల వీర వెంకట సత్యనారాయణ (కొవ్వూరు), రేలంగి మారుతీ శివ భాస్కర్ (నిడదవోలు), పి.చిన్ని (జగ్గంపేట), సుందరపల్లి సుధాకర్ (రాజానగరం) నియమితులయ్యారు.సెక్రటరీలుగా డీవీ కాలాబత్తుల రాజశేఖర్ (రాజమహేంద్రవరం సిటీ), కోరుపోలు నాని (రాజానగరం), తూము రవి (రాజానగరం), సూరంపూడి రవిప్రసాద్ (కొవ్వూరు), కండేటి వెంకట సూర్యాంగ సత్యనారాయణమూర్తి (కొవ్వూరు), పేరూరి ధనశంకరం (నిడదవోలు), పోతుల సత్య వరప్రసాద్ (నిడదవోలు), జాయింట్ సెక్రటరీలుగా డాక్టర్ కట్రో రేఖ (రాజమహేంద్రవరం సిటీ), డాక్టర్ షాకీర్ అబ్బాస్ (రాజమహేంద్రవరం సిటీ), డాకే శ్రీనివాసరావు (రాజమహేంద్రవరం రూరల్), ఎంవీవీ.సత్యనారాయణ (రాజమహేంద్రవరం రూరల్), వీవీ నర్సయ్య (రాజానగరం), గల్లా అచ్యుత్ (రాజానగరం), కొల్లూరి దేవీనాగ విశ్వతేజ (నిడదవోలు), ఎంవీఎస్ సూర్యనారాయణ (నిడదవోలు)ను నియమించారు.