టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా

Published Wed, May 8 2024 8:35 AM

-

అమరావతి: మండల కేంద్రమైన అమరావతి టీడీపీ కార్యాలయం ముందు మంగళవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ నుండి అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు భారతీయ జనతాపార్టీలో చేరారు. మంగళవారం కూటమిలో పార్టీ నాయకుడైన మేకల హనుమంతరావు ఇంటికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్ది భాష్యం ప్రవీణ్‌ వెళ్లి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపధ్యంలో అమరావతి గోపాల్‌నగర్‌లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 150 మంది వచ్చి స్థానిక టీడీపీ ఎన్నికల కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మండల స్థాయి నాయకులు ఎంత సర్ధి చెప్పినా వారు వినలేదు. తాము గత ఐదు సంవత్సరాల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించామని, అర్దికంగా కూడా నష్టపోయి కేసులు పెట్టించుకున్నామని వారు వాపోయారు. తమపై కేసులు పెట్టి అరెస్టులకు తాళలేక ఊరు వదిలి వెళ్లామని, మా బాధలు ఇలా ఉంటే మీరు వెళ్ళి కలవటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్యకర్తలు బిగ్గరగా కేకలు వేశారు.

Advertisement
Advertisement