అమరావతి: మండల కేంద్రమైన అమరావతి టీడీపీ కార్యాలయం ముందు మంగళవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుండి అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు భారతీయ జనతాపార్టీలో చేరారు. మంగళవారం కూటమిలో పార్టీ నాయకుడైన మేకల హనుమంతరావు ఇంటికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్ది భాష్యం ప్రవీణ్ వెళ్లి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపధ్యంలో అమరావతి గోపాల్నగర్లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 150 మంది వచ్చి స్థానిక టీడీపీ ఎన్నికల కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మండల స్థాయి నాయకులు ఎంత సర్ధి చెప్పినా వారు వినలేదు. తాము గత ఐదు సంవత్సరాల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించామని, అర్దికంగా కూడా నష్టపోయి కేసులు పెట్టించుకున్నామని వారు వాపోయారు. తమపై కేసులు పెట్టి అరెస్టులకు తాళలేక ఊరు వదిలి వెళ్లామని, మా బాధలు ఇలా ఉంటే మీరు వెళ్ళి కలవటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్యకర్తలు బిగ్గరగా కేకలు వేశారు.
టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా
Published Wed, May 8 2024 8:35 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement