సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదు | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదు

Published Wed, May 8 2024 10:15 AM

సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదు

బన్సీలాల్‌పేట్‌: సికింద్రాబాద్‌ ఎంపీగా నియోజకవర్గాన్ని పట్టించుకోని బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని, రాజకీయ నిలకడలేని కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌లను ప్రజలు ఓడించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్‌లు కోరారు. బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ భోలక్‌పూర్‌, న్యూబోయిగూడ, ఐడీహెచ్‌ కాలనీ, గొల్లకొమురయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో మంగళవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జీలు, నాలా విస్తరణ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించి సికింద్రాబాద్‌కు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల నగర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. నగరంలో కరెంట్‌ కోతలు, నీటి సరఫరా, ఇతరత్రా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు.

దానం నాగేందర్‌కు రాజకీయ నిలకడ లేదు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు, ఎమ్మెల్యే తలసాని

Advertisement
Advertisement