మోదీ పథకాలతో నిరుపేదలకు లబ్ధి | Sakshi
Sakshi News home page

మోదీ పథకాలతో నిరుపేదలకు లబ్ధి

Published Fri, Apr 19 2024 1:50 AM

బీర్‌పూర్‌లో మాట్లాడుతున్న బోగ శ్రావణి - Sakshi

సారంగాపూర్‌: ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలతోనే నిరుపేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. బీర్‌పూర్‌ మండలంలోని బీర్‌పూర్‌, నర్సింహులపల్లె, తుంగూర్‌లో మహిళలతో కలిసి శక్తివందన్‌ కార్యక్రమం పేరిట ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌, కిసాన్‌ సన్మాన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో మధ్యతరగతి, పేదవర్గాలకు లాభం జరుగుతుందన్నారు. నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెచ్చిన ధర్మపురి అర్వింద్‌ను గెలిపించుకోవాలని సూచించారు. ఆమె వెంట బీర్‌పూర్‌ జెడ్పీటీసీ పాత పద్మ, మాజీ సర్పంచ్‌ గర్షకుర్తి శిల్ప, నాయకులు ఆడెపు నర్సయ్య, బూట్ల మార్కండేయ, బసవరాజుల సంతోష్‌, బోరే నగేష్‌, ఉయ్యాల స్వామి, ఆడెపు వెంకటేష్‌; ఆడెపు వినయ్‌, మెరుగు గంగాధర్‌, పెడాల గంగన్న ప్రతాప్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement