ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి

Published Fri, Apr 19 2024 1:50 AM

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న డీఈవో - Sakshi

జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలి డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వెల్గొండ జెడ్పీహెచ్‌ఎస్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదుకు హెచ్‌ఎంలు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేసి విద్యార్థుల అభివృద్ధికి ప్రయత్నిస్తే ప్రభుత్వ పాఠశాలలో నమోదులు పెరుగుతాయని పేర్కొన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ఆనందరావు, వెల్గొండ హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, దశరథరెడ్డి, శ్రీనివాస్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

డీఈవో జగన్మోహన్‌రెడ్డి

Advertisement
Advertisement