రామారెడ్డి: అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మంజారైన పనులను జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పోసానిపేట ప్రాథమిక పాఠశాల, రామారెడ్డి ప్రాథమిక, బాలికల పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. పాఠశాలల్లో అవసరమైన చిన్నచిన్న మరమ్మతులు వెంటనే చేపట్టాలని, తాగునీరు, టాయిలెట్స్ వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ సుష్మారెడ్డి, ఏఈ ఆనందం, ఎంఈవో యోసెఫ్, పాఠశాల హెచ్ఎంలు ఆనంద్, దేవ్లా, సీఆర్పీ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
ఆరెపల్లిలో..
రాజంపేట: ఆరెపల్లి, ఆరెపల్లి తండాల్లోని స్కూళ్లను కలెక్టర్ సందర్శించారు. ఆమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డీఈ, ఏఈలకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రామస్వామి, హెచ్ఎంలు గంగామోహన్, రమేష్, డీఈ ఆనందం తదితరులు పాల్గొన్నారు.