నవీపేట: పిడుగుపాటు కారణంగా మండలంలోని మోకాన్పల్లిలో ఆవు మృతి చెందింది. మిర్యాల ఒడ్డెన్నకు చెందిన ఆవు సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందిందని, దాని విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
మోతెలో విద్యుత్షాక్తో..
వేల్పూర్: మండలంలోని మోతెలో విద్యుత్షాక్తో ఆవు మృతి చెందింది. ఉరడి నవీన్ అనే రైతుకు చెందిన సోమవారం ఆవు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో మేతమేస్తుండగా షాక్ తగిలి మృతి చెందిందని మండల పశువైద్యాధికారి సంతోష్రెడ్డి తెలిపారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ. 40వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపాడు.
రోడు ్డప్రమాదంలో
పీఆర్ ఏఈకి గాయాలు
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పీఆర్ ఏఈ పిచ్చయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. నాగిరెడ్డిపేట కార్యాలయంలో విధులను ముగించుకుని మెదక్కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో పిచ్చయ్యకు తీవ్రగాయాలయ్యాయన్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో..
ఎడపల్లి (బోధన్): మండలంలోని అలీసాగర్ లిఫ్ట్ ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు స్కూటీపై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానికులు నిజామాబాద్కు తరలించారు.