క్లుప్తంగా | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Mon, Apr 8 2024 1:10 AM

-

కత్తితో బెదిరించి.. డబ్బులు కాజేసి

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మ్యాదరివాడ మ్యాక్స్‌భవన్‌ వద్ద బస్సు దిగి వెళ్తున్న వ్యక్తిని కత్తితో బెదిరించి డబ్బులు కాజేసిన ఘటన జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు రాంనగర్‌కు చెందిన బొగ్గు మల్లేశ్‌ ఈ నెల 6న లక్సెట్టిపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా మ్యాక్స్‌ భవన్‌ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోలోంచి ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. కొంతదూరం తీసుకెళ్లి కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.6 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసి నిందితులకోసం గాలిస్తున్నామని సీఐ భన్సీలాల్‌ తెలిపారు.

హత్యాయత్నం కేసులో దంపతుల రిమాండ్‌

కౌటాల: హత్యాయత్నం కేసులో దంపతులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మధుకర్‌ తెలిపారు. ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. మార్చి 27న కౌటాల మండలంలోని బాలేపల్లికి చెందిన కోబ్రాగడే దీప్‌చంద్‌పై అదే గ్రామానికి చెందిన జాడి బాలు, జాడి ప్రియాంక గొడ్డలితో దాడిచేసి గాయపరిచారు. బాధితుడి సోదరి కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించమన్నారు.

Advertisement
Advertisement