నగదు పట్టివేత | Sakshi
Sakshi News home page

నగదు పట్టివేత

Published Mon, Apr 8 2024 1:10 AM

పట్టుకున్న నగదుతో ఎస్సై, సిబ్బంది  - Sakshi

సిర్పూర్‌(టి): ఎన్నికల నేపథ్యంలో మండలంలోని వెంకట్రావ్‌పేట్‌ చౌరస్తా వద్ద ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1,89, 000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై డీకొండ రమేశ్‌ తెలిపారు. లోకిని గణేశ్‌ అనే వ్యక్తి మహారాష్ట్ర నుండి పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేట్‌ గ్రామానికి ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తూ పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. నగదు స్వాధీనం చేసుకుని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌కు అప్పగించారు.

వాంకిడి: మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.60 వేల నగదు పట్టుబడినట్లు ఎస్సై సాగర్‌ తెలిపారు. జెండాగూడకు చెందిన జాడి అశోక్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగదును సీజ్‌ చేసి ఎస్‌ఎస్‌టీ టీంకు అప్పగించారు.

Advertisement
Advertisement