క్లుప్తంగా
దొంగ ఓట్లు వేశారని ఫిర్యాదు
ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ మాజీ సర్పంచ్ సునీత–లింబాజీ దంపతులు రెండు చోట్ల ఓట్లు వేశారని మంగళవారం గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మేడంపల్లి పోలింగ్ కేంద్రంతో పాటు సుర్జాపూర్ పోలింగ్ కేంద్రంలో వేర్వేరుగా దొంగ ఓట్లు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సంబంధిత సెక్టోరల్ అధికారికి సైతం పోలింగ్ ముగియకముందే ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన సర్పంచ్ దంపతులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దయానంద్, మేడంపల్లి మాజీ సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్నాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, మాజీ ఉపసర్పంచ్లు జంగిలి శంకర్, మంగ్లారపు సత్యనారాయణ, నాయకులు సంతోష్, మల్లేశ్, దేవోజీ, రవి, లక్ష్మణ్, శివ్లాల్, ప్రశాంత్, రంజిత్, సురేందర్, విలాస్, వినేశ్, గణేశ్, నరేశ్ పాల్గొన్నారు. ఆటో బోల్తా..
ముగ్గురికి గాయాలుబెజ్జూర్: ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలంలోని కృష్ణపెళ్లి గ్రామానికి చెందిన ఆటో మంగళవారం మహారాష్ట్ర నుంచి ప్రయాణికులతో బెజ్జూర్కు వస్తుండగా కోయపల్లి–నాగపెళ్లి గ్రామాల మధ్య అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న ఎలుకపెల్లి గ్రామానికి చెందిన గోలేటి జానాబాయికి తీవ్రంగా సోనా బాల, హరీష్బాలకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ ఆస్పత్రికి తరలించారు.