ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

Published Wed, May 15 2024 9:30 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండల కేంద్రానికి చెందిన లింగన్న–రుకుంబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. 2011లో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఒక కుమారుడు వాగులో మునిగి చనిపోయాడు. మరో కుమారుడు కోలాపురి నవీన్‌ (27) జిల్లా కేంద్రంలోని ఓ ఆర్థోపెడిక్‌ వైద్యుడి వద్ద పనిచేస్తున్నాడు. కై లాస్‌నగర్‌లోని గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో మరో మిత్రుడితో కలిసి అక్కడే ఉంటున్నాడు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు తన స్నేహితుడితో కలిసి స్వగ్రామం సిరికొండకు వెళ్లాడు. ఓటు వేసిన అనంతరం స్నేహితుడు అక్కడే ఉండిపోగా నవీన్‌ జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చాడు. మంగళవారం ఉదయం మరో స్నేహితుడు గెజిటెడ్‌ సంఘ భవనానికి టిఫిన్‌ చేసేందుకు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడంతో పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తోడుగా ఉంటారనుకున్న కుమారులు కానరాని లోకాలకు వెళ్లడంతో వారు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 
Advertisement
 
Advertisement