ఆదిలాబాద్టౌన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండల కేంద్రానికి చెందిన లింగన్న–రుకుంబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. 2011లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఒక కుమారుడు వాగులో మునిగి చనిపోయాడు. మరో కుమారుడు కోలాపురి నవీన్ (27) జిల్లా కేంద్రంలోని ఓ ఆర్థోపెడిక్ వైద్యుడి వద్ద పనిచేస్తున్నాడు. కై లాస్నగర్లోని గెజిటెడ్ ఉద్యోగుల సంఘ భవనంలో మరో మిత్రుడితో కలిసి అక్కడే ఉంటున్నాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు తన స్నేహితుడితో కలిసి స్వగ్రామం సిరికొండకు వెళ్లాడు. ఓటు వేసిన అనంతరం స్నేహితుడు అక్కడే ఉండిపోగా నవీన్ జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చాడు. మంగళవారం ఉదయం మరో స్నేహితుడు గెజిటెడ్ సంఘ భవనానికి టిఫిన్ చేసేందుకు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ ఉండడంతో పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తోడుగా ఉంటారనుకున్న కుమారులు కానరాని లోకాలకు వెళ్లడంతో వారు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
Published Wed, May 15 2024 9:30 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- బాపట్ల బీచ్లో హైదరాబాదీల గల్లంతు
- ఎలాన్ మస్క్కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్.. ఇండియాకు రావాలంటూ ట్వీట్
- Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
- సింగపూర్లో భారత సంతతి వ్యక్తి మృతి
- India vs China: టగ్ ఆఫ్ వార్లో భారత బలగాల గెలుపు
- పార్టీనా?.. కోడలు పిల్లనా?.. సంకటంలో శిబు సోరెన్?
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- కర్నూలులో వజ్రాల వేట
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
Advertisement