‘మోదీ సారథ్యంలోనే దేశ అభివృద్ధి’ | Sakshi
Sakshi News home page

‘మోదీ సారథ్యంలోనే దేశ అభివృద్ధి’

Published Sat, Apr 20 2024 1:30 AM

-

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధి స్తోందని, ప్రగతిపథంలో దైసుకెళ్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు అన్నారు. పట్టణంలో శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో నిర్వహించారు. 24వ వార్డులో ప్రచారం నిర్వహించారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అనే నినాదంతో మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పదేళ్లు దేశానికి అవి నీతి రహిత పాలన అందించారని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్‌, సీనియర్‌ నాయకులు ఒడిశెల శ్రీనివాస్‌, ద్యేవరశెట్టి గణేశ్‌, అనంతుల అభిలాష్‌, కిశోర్‌, శరత్‌, వంశీ, అన్వేష్‌, శివకుమార్‌, అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారంలో బీజేపీ నాయకులు

Advertisement
Advertisement