వైఎస్సార్‌సీపీలో భారీగా కొనసాగుతున్న చేరికలు  | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో భారీగా కొనసాగుతున్న చేరికలు 

Published Mon, Apr 8 2024 4:03 AM

TDP leader in West Godavari District joins YSRCP - Sakshi

తణుకు అర్బన్‌/నరసాపురం రూరల్‌/భీమవరం/పాలకొల్లు అర్బన్‌: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌సీపీలో ఆదివారం చేరారు. అత్తిలి గోగులమ్మ పేటలో టీడీపీ, జనసేన పార్టీల మద్దతుదారులైన 30 కుటుంబాలు మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరాయి. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జనసేన, టీడీపీల నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ చీఫ్‌ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. భీమవరం 39వ వార్డుకు చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

పాలకొల్లు మండలం చింతపర్రులో వైఎస్సార్‌సీపీ నేత పెన్మెత్స రామరాజు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షుడు దిద్దే సత్యనారాయణ, అతని అనుచరులు 100 మందికి పైగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. రాజమహేంద్రవరంలోని బర్మా కాలనీకి చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎంపీ మార్గాని భరత్‌ సమక్షంలో, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం హుకుంపేట వరలక్ష్మీ కాలనీకి చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు మంత్రి చెల్లుబోయిన సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement
Advertisement