చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు

Published Wed, May 8 2024 4:35 AM

చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు

పొదిలి: చంద్రబాబు బూటకపు హామీలను నమ్మొద్దని వైఎస్సార్‌ సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని ఆముదాలపల్లి, తీగదుర్తిపాడు, రాములవీడు, రామాపురం, సూదనగుంట గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. పెట్టుబడి సాయం, సున్నా వడ్డీకే రుణాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, రైతు భరోసా వంటి పథకాలు రైతులకు అండగా ఉన్నాయన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ పేరుతో టీడీపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతుకై నా యాక్టు వల్ల అన్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయడం తప్ప జగనన్నకు మరో ఆలోచన ఉండదన్నారు. 2014లో కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేశాడన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితిలే పెట్టుబడిగా, పేదల సేవలో తరిస్తున్న అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శులు జి.చెన్నారెడ్డి. జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, బ్రహ్మాకొండారెడ్డి, నలబోలు వెంకటరెడ్డి, గోపిరెడ్డి మాలకొండారెడ్డి, మద్దిరాల నరసింహారెడ్డి, సర్పంచ్‌లు ఎస్‌.శ్రీనివాసరావు, కసిరెడ్డి కోటిరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, కొత్తపులి అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ పొన్నపాటి శ్రీనివాసరెడ్డి, యేటి ప్రసాద్‌, ఇనగనూరి చెన్నారెడ్డి, ఎద్దు నగేష్‌, కసిరెడ్డి రమణారెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ మార్కాపురం

అభ్యర్థి అన్నా రాంబాబు

Advertisement

తప్పక చదవండి

Advertisement