రోడ్డు ప్రమాదానికి గురైన పాక్ స్టార్ క్రికెట‌ర్లు.. | Pakistan Cricketers Bismah Maroof And Ghulam Fatima Injured In Road Accident, More Details Inside - Sakshi
Sakshi News home page

Pakistan Players Road Accident: రోడ్డు ప్రమాదానికి గురైన పాక్ స్టార్ క్రికెట‌ర్లు..

Published Sat, Apr 6 2024 5:46 PM

Pakistan Cricketers Injured in Road Accident - Sakshi

స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో వైట్ బాల్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్ మ‌హిళ జ‌ట్టుకు ఊహించని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమాలు కారు ప్ర‌మాదానికి గుర‌య్యారు.  కరాచీలోని  పీసీబీ ట్రైనింగ్ క్యాంప్‌న‌కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో వారిద్ద‌రి స్వల్ప గాయాయ్యాయి. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీక‌రించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించామని, తదుపరి చికిత్స నిమిత్తం వారిని బోర్డు వైద్య బృందం సంరక్షణలో ఉంచామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాల‌ను పీసీబీ వెల్ల‌డించలేదు. కాగా  ఏప్రిల్ 18న వెస్టిండీస్‌తో  ప్రారంభమయ్యే వ‌న్డే సిరీస్‌కు ఎంపిక చేసిన పాక్ ప్రిలిమ‌న‌రీ జ‌ట్టులో  బిస్మా మరూఫ్, గులాం ఫాతిమా భాగంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రూ పీసీబీ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో చెమటోడ్చుతున్నారు.

అయితే స‌రిగ్గా సిరీస్ ప్రారంభానికి రెండు వారాల ముందు స్టార్ క్రికెట‌ర్లు గాయప‌డ‌టం నిజంగా పాకిస్తాన్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల‌లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు విండీస్‌తో పాక్ ఆడ‌నుంది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement