కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సోమవారం కుటుంబసభ్యులతో కలసి సమాచార హక్కు చట్టం కమిషనర్ చెన్నారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ మున్వర్ తదితరులు పాల్గొన్నారు.
రేగాటిపల్లిలో
‘జగనన్న ఆరోగ్య సురక్ష’
ధర్మవరం రూరల్: మండలంలోని రేగాటిపల్లిలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సెల్వియా సల్మాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎల్ఏటీఓ తిప్పయ్య, మెడికల్ ఆఫీసర్ పుష్పలత, చిన్న పిల్లల వైద్య నిపుణులు వెంకటేశ్వర్లు, ఈఎన్టీ స్పెషలిస్టు నివేదిత, ఆప్తలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప, సూపర్వైజర్లు రాజశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.